hostel students
-
ఏయూలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన
విశాఖ విద్య: హాస్టల్లో నీరు తాగలేకపోతున్నామని, భోజనం తినలేకపోతున్నామంటూ ఆంధ్ర యూనివర్సిటీలోని(Andhra University) పరిశోధక విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీఎంసీ బాలయోగి రీసెర్చ్ హాస్టల్ ముందు బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు. వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపల్ రామరాజుకు సూచించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడారు.తాగు నీరు పరిశుభ్రంగా ఉండటంలేదని, మెనూ ప్రకారం కాకుండా, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా సప్లై చేసే కూరగాయలతోనే వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ముందురోజు సాయంత్రం ఉడకబెట్టిన దుంపలు, కూరగాయలనే మరుసటి రోజు పెడుతున్నారని, ఆ భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయం చీఫ్ వార్డెన్కు చెప్పినా పట్టించుకోలేదని, స్కాలర్స్తో సమావేశం పెట్టమని కోరినా స్పందించలేదని తెలిపారు. దీంతో చీఫ్ వార్డెన్ విజయ్బాబును తొలగిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. రామరాజుకు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.సోమవారం రీసెర్చ్ స్కాలర్స్తో సమావేశం నిర్వహించాలని రామరాజుకు సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు సతమతం ఇటీవలే ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ హాస్టల్ విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ ముందు బైఠాయించారు. దీంతో వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నట్లు అర్ధమవుతోంది.స్కాలర్షిప్లివ్వని కూటమి సర్కారు.. హాస్టళ్లలో విద్యార్థుల నుంచే వసూళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక స్కాలర్షిప్లు కూడా రాలేదు. డబ్బులు చెల్లించిన వారికే వర్సిటీ హాస్టళ్లలో భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. సైన్సు హాస్టల్లో ఇటీవల మూడు కంప్యూటర్లు కొనుగోలు చేయగా, ఆ డబ్బు కూడా విద్యార్థుల నుంచే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవటంతో ప్రైవేటు హాస్టళ్ల మాదిరే, డబ్బులు పోగు చేసి అన్నీ తామే సమకూర్చుకోవాల్సి వస్తోందని, చివరకు వంట చేసే వారికిచ్చే జీతాలు కూడా తమ వద్దే వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్ ప్రొవైడర్కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎఫ్ఆర్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ సంక్షేమ అధికారి (హెచ్డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్ల్లో అప్లోడ్ చేస్తారు.తద్వారా యాప్ ఉన్న మొబైల్ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్ సమయం తర్వాత ఎఫ్ఆర్ఎస్లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. -
దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.... ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
జీతాల కోసం హైడ్రామా..
తెయూ(డిచ్పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్ హాస్టల్స్ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్లో అల్పాహారం చేయలేదు. చీఫ్ వార్డెన్ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు పీఆర్వో జమీల్కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యకు ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ క్యాంపస్కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు. దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్ ఎన్ఎల్శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. చాంబర్ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్కు వెళ్లారు. తమకు కనీసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారితో ఫోన్లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. -
AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్ చార్జీల పెంపు!
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్ గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్ జవహర్రెడ్డి జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి.. 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు -
మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్చార్జీలు, స్కాలర్షిప్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదేశాడు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది. ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ) -
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్ను సందర్శించి వార్డెన్ మల్లేశ్తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
ఒకే హాస్టల్లో 229 మందికి కరోనా
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్ తాలూకా దేగావ్లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 229 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ శణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్ చేసి, కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నారు. మహారాష్ట్రలో బుధవారం 8,807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6,218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. అలసత్వం వద్దు.. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు. వివరణ ఇవ్వండి.. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడం, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రం లేఖలు రాసింది. నెగెటివ్గా తేలితేనే ఢిల్లీలోకి సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగటివ్ ధ్రువపత్రం చూపించాల్సిందే. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగెటివ్గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15 మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టీ–పీసీఆర్ టెస్టు చేయించుకున్నట్లు, కరోనా నెగెటివ్గా తేలినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. -
ఫుడ్ పాయిజన్తో 67మందికి అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
వర్ష'మా'.. క్షమించు..!
సాక్షి, ఒంగోలు: మారుతున్న నవీన ప్రపంచంలో రోజురోజుకూ మనావ సంబంధాలు మంటగలుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులో ఉన్న 11వ అడ్డరోడ్డులో ఏసీబీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎనభైఏళ్ల వృద్ధురాలిని ఓ ఆటోవాలా రోడ్డుపక్కన నెట్టివేసి అదృశ్యమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సమయంలో జోరున వర్షం కురుస్తుండడంతో వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. ఔదార్యం చూపి.. ఈ రోడ్డుకు సమీపంలోనే దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం ఉంది. ఈ నేపథ్యంలో వర్షం తగ్గిన తరువాత హాస్టల్ వార్డెన్ సి.హెచ్.సరితాదేవి ఈ విషయాన్ని గమనించింది. వెంటనే హాస్టల్ విద్యార్థినులు రత్నదీపిక, భారతితో కలిసి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమె దయనీయ పరిస్థితికి చలించిపోయారు. ఒక నైటీని ఆమెకు వేశారు. అయినా ఆమె చలికి తట్టుకోలేకపోవడంతో ఒక చలికోటును కప్పారు. అప్పటికీ ఆమె గడగడలాడిపోతుండడంతో దుప్పటి తీసుకువచ్చి కప్పారు. 80 ఏళ్ల వయస్సులో ఆమెను ఎలా నిర్దయగా వదిలేశారంటూ ఆవేదన చెంది.. సామాజిక కార్యకర్త, పారాలీగల్ వలంటీర్, హెల్ప్ సంస్థ ప్రతినిధి బి.వి సాగర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో అతను వెంటనే అక్కడకు వెళ్లి విచారించాగా.. ఏదో మూట పడేస్తున్నారనుకున్నామని, ముసలామెని గుర్తించలేకపోయామంటూ ఓ పశువుల కాపరి తెలిపాడు. ముందుగా విద్యార్థినుల సాయంతో వృద్ధురాలికి అల్పాహారం తినిపించి అక్కడ నుంచి పలు వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు యత్నించగా తన పని తాను చేసుకోలేదంటూ ఆమెను చేర్చుకొనేందుకు నిర్వాహకులు వెనుకాడారు. చివరకు కరణం బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కసుకుర్తి కోటమ్మ మాత్రం ఆమెను అక్కున చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది. వృద్ధురాలి వివరాలను రాబట్టేందుకు చేసిన యత్నం ఫలించలేదు. మగ పిల్లలు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఇద్దరు అని, ఆడపిల్లలు ఎంతమంది అంటే ఒక్కరు అంటూ వేళ్లు చూపింది. రాత్రికి కోలుకున్నా మాట్లాడలేకపోతోంది. జోరువానలో ఆమెను నిర్దయగా కుటుంబ సభ్యులు ఆటోవాలా సాయంతో గెంటేశారా లేక ఆటో ఎక్కిన ఆమెను ఆటోవాలా దారి మళ్లించి ఆమె వద్ద ఉన్న వస్తువులు కాజేసి నిర్మానుష్యంగా ఉన్న రహదారిలో వదిలేసి పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ప్రగతికి ‘హాయ్’
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు) : వసతి గృహ విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన హెల్త్, అకడమిక్ అండ్ ఐటెంటిటీ (హాయ్) కార్డుల అమలుకు బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ విధానం గతంలో ఉండేది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెనకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లాలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ అడుగు లేసింది. విద్యార్థి పూర్తి సమాచారం హాయ్కార్డు చూడగానే విద్యార్థి విద్య, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి 3వ తరగతిలో హాస్టల్లో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరచాలి. మొదటి పేజీలోనే విద్యార్థి వ్యక్తిగత సమాచారం పూరించాలి. పేరు, బాలుడు/బాలిక, స్వస్థలం, చిరునామా, కాంటాక్ట్ నంబర్, కులం, ఆధార్ నంబర్, సంక్షేమ శాఖలో విద్యార్థి యూనిక్ నంబర్, గుర్తింపు చిహ్నాలు ఎంటర్ చేసి తండ్రి/సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరో వైపు వసతి గృహ సంక్షేమ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో విద్యార్థి, ఎత్తు, బరువు, రక్తం గ్రూపు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లే దాకా కార్డులో అన్ని వివరాలు పొందుపరుస్తూ వస్తారు. హాయ్ కార్డులను వార్డెన్లే నిర్వహించాల్సి ఉంటుంది. వారిదే పూర్తి బాధ్యత ఇప్పటికే ముద్రణ జరుగుతుడంటతో...మరి కొద్ది రోజుల్లోనే కార్డులు సరఫరా చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంబంధిత వివరాలు... విద్యార్థి త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక పరీక్షల్లో సాధించే మార్కుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకోసం కార్డులో ప్రత్యేక పట్టిక రూపొందించారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులూ నమోదు చేస్తారు. సాధించిన మార్కులు, గరిష్టం, శాతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య వివరాలు... మరోవైపు ప్రతినెలా హాస్టళ్లలను వైద్యాధికారులు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఉన్నా ఇప్పటికి దాకా అమలైన దాఖాలాలు లేవు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కచ్చితంగా వైద్యాధికారులు ప్రతినెలా వెళ్లాల్సిందే. వారు వెళ్లి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య ఇబ్బందులను గుర్తిస్తే హాయ్కార్డులో పొందుపరచాలి. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి... ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల హాయ్కార్డులను వార్డెన్ తల్లిదండ్రులకు చూపిస్తారు. వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు, ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకుని అవగాహన కల్పించే వీలుంటుంది. ఇది ట్యూటర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇచ్చే వీలుంటుంది. అలాగే ఎవరైనా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసిన సంధర్బంలో కార్డులను పరిశీలించి పిల్లల ప్రగతిని అంచనా వేసే వీలుంటుంది. పక్కగా అమలు చేస్తాం హాయ్ కార్డుల విధానాన్ని పక్కగా అమలు చేస్తాం. విద్యార్థుల చదువుతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇందులో నమోదు చేస్తాం. వీటి నిర్వహణ బాధ్యత హెచ్డబ్ల్యూఓలు తీసుకోవాలి. కార్డుల ముద్రణ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్డులను విద్యార్థులకు సరఫరా చేస్తాం. – డి.కల్పన, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు. వందల మంది బాధితులు.. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్గాని, వైస్చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది. నాసిరకంగా అల్పాహారం.. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. మెస్లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఆహారాన్ని పరిశీలించిన వీసీ విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి
కర్ణాటక, రాయచూరు రూరల్: ఇంటిలో ఉన్న కన్నపిల్లల దుస్తులు శుభ్రం చేయాలంటే తలనొప్పిగా మారుతున్న నేటి రోజుల్లో జెడ్పీ సీఈఓ కవితా మన్నికేరి స్వయంగా రంగంలోకి దిగి పిల్లలకు దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించిన ఘటన యాదగిరి జిల్లా లింగేరి మొరార్జి దేశాయి వసతి పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె పాఠశాలను సందర్శించిన సమయంలో చిన్న పిల్లలు బట్టలు శుభ్రం చేసుకోవడానికి పడుతు న్న కష్టాలను చూడలేక ఆమే స్వతహాగా పిల్లలకు దుస్తులను ఎలా పిండుకోవాలో చూపించారు. అనంతరం విద్యార్థులు హాస్టల్లో ఏవిధంగా చదువుకుంటున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. -
చలికి గజగజ...
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఉంటాయి. వాస్తవానికి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయో ఆ పై వాడికే ఎరుక. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ హాస్టళ్లలోఉండే విద్యార్థులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సాక్షి, గుంటూరు: ప్రభుత్వ వసతి గృహాలు ఎక్కడ చూసినా విరిగిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు వెక్కిరిస్తుంటాయి. శీతాకాలంలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ ముడుచుకు పడుకోవాల్సిందే. ఓ పక్క తుపాను వచ్చి ఎన్నడూ లేని విధంగా భయంకరంగా చలిగాలులు వేస్తుంటే ప్రభుత్వం ఇంతవరకు వసతిగృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా నాణ్యత లేని వైనం, మరికొన్ని చోట్లా విద్యార్థులందరికీ సరిపడా దుప్పట్లు సరఫరా చేయని పరిస్థితి. జిల్లాలో 76 ఎస్సీ, 88 బీసీ, 33 ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ వసతి గృహాలకు సరైన భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాలకులు, అ«ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని వేమూరు, వినుకొండ, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలి, రేపల్లె సహా వివిధ నియోజకవర్గాల్లోని వసతి గృహాలు పశువులు ఉండే బందులదొడ్లను తలపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు అధికారులు, అమాత్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పు లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చలికి వణకాల్సిందే... వాతావరణంలో వస్తున్న మార్పులతో రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దైన్యంగా మారింది. వసతి గృహాల్లో గదులకు సరిగా తలుపులు, కిటికీలు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతూ కిటికీలకు దుస్తులను అడ్డం పెట్టుకుని గడపాల్సివస్తోంది. డిసెంబర్ నెల సగం దాటినా నేటికి జిల్లా వ్యాప్తంగా వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో దుప్పట్లు పంపిణీ కాలేదని తెలుస్తోంది. మరుగుదొడ్లు అంతంత మాత్రమే... జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 100–150 వరకు విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో ఒకటి రెండు మరుగుదొడ్లు ఉంటే, మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల ఉన్నా సరైన నిర్వహణకు నోచుకోని దుస్థితి. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలికల వసతి గృహాల్లో సైతం ఇదే పరిస్థితులు నెలకొనడంతో ఆరుబయటకు కాలకృత్యాలకు వెళ్లడానికి విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఎలాగోలా ఉన్నా వర్షాలు పడిన రోజు మాత్రం మరుగుదొడ్లు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలోని పలు బాలికల వసతి గృహాల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలావరకు ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీవాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు చేసినా అంతే... జిల్లాలోని వసతి గృహాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినా వసతి గృహాల నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి గురుకులాల్లో సిబ్బంది కొరత ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపారు. అయినా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభేరి సభలు అంటూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు విద్యార్థులకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. జిల్లాలో వసతి గృహాల దుస్థితి, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చాం అయినా ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించాలి.–భగవాన్దాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
నిధులు కరువు.. లేదు అరువు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు సంకటంలో పడ్డాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 776 పాఠశాల వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాలల్లో తీసుకుంటారు. ఈ క్రమంలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనంతోపాటు పాలు, చిరుతిళ్లకు సంబంధించిన బిల్లులను సదరు హాస్టల్ వార్డెన్కు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 82కోట్లు బకాయిలు బీసీ సంక్షేమ హాస్టళ్లలో బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా నిధులివ్వలేదు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని హాస్టళ్లకు నిధులిచ్చినప్ప టికీ వాటిని గతేడాది బకాయిల తాలూకు బిల్లులుగా చెల్లించినట్లు వసతిగృహ సంక్షేమాధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం బీసీ హాస్టళ్లకు సంబంధించి రూ.82 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా మెస్ చార్జీలకు సం బంధించినవే ఉన్నాయి. ఇవిగాకుండా వసతిగృహ నిర్వ హణ కేటగిరీలోనూ బకాయిలు భారీగానే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలతోపాటు హాస్టల్ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు సైతం ఆర్నెల్లుగా అందలేదు. మెస్ చార్జీలతో పాటు ఇతర బిల్లులేవీ రాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులకు ఇబ్బం దులు తీవ్రమయ్యాయి. వరుసగా 5నెలల బిల్లులు రాకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ భారమవుతోంది. విద్యార్థులకు క్రమం తప్పకుండా స్నాక్స్, భోజనం ఇచ్చేందుకు కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొసు ్తన్నారు. 5 నెలలుగా సరుకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు కూరగాయల కొనుగోలుపైనా ఇదే ప్రభావం పడింది. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోందని రం గారెడ్డి జిల్లాకు చెందిన ఓ వసతి గృహ సంక్షేమాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గత పది నెలలుగా కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ల పేరుతో ప్రత్యేకంగా కాస్మెటిక్ కిట్లు ఇస్తామని అధి కారులు ప్రకటిం చినప్పటికీ, అవి కేవలం గురుకులాలకు మాత్రమే పరిమితమయ్యాయని, హాస్టల్ విద్యార్థులకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వసతిగృహ నిర్వహణ నిధులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులను కలిసి వినతులు సమర్పిం చినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. -
కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజి వద్ద ఉద్రిక్తత
-
ముగ్గురు హాస్టల్ విద్యార్థుల ఆచూకీ లభ్యం
చోడవరం: మూడు రోజు ల కిందట గోవాడ హాస్టల్ నుంచి అదృశ్యమైన ము గ్గురు విద్యార్థులు తిరుప తి రైల్వేస్టేషన్లో దొరికిన ట్టు గురువారం సమాచా రం రావడంతో వారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చోడవరం మండలం గోవాడ బాలుర బీసీ హాస్టల్లో చీడికాడ మండలం కోనాం పరిసర గ్రా మాలకు చెందిన నంబారు గోవింద, గంటా కొండలరావు, విస్సారపు గణేష్ చదువుతున్నారు. వీరు ముగ్గురు ఈనెల 10న హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదృశ్యమైన విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృత ప్ర చారం కూడా చేశారు. వీరి కోసం బంధువులు, పోలీసులు గాలిస్తుండగా చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఒక యువకుడు ఫోన్ చేయడంతో వారి కో సం తమ బంధువులను పంపినట్టు, పిల్లలు క్షేమంగా దొరికినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. విద్యార్థులు దొరికిన విషయాన్ని ఆ యువకుడు తనతో ఉన్న ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ లో పెట్టడంతో తల్లిదండ్రులు, హాస్టల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆపదలో బాల్యంపై విజి‘లెన్స్’!
శ్రీకాకుళం, కవిటి: విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం తీరు అందుకు భిన్నంగా ఉంది. సర్కార్ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ జరగడం లేదు. దీంతో చాలామంది పిల్లలు రోగాలబారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను వివరిస్తూ ఈ నెల 7వ తేదీన ఆపదలో బాల్యం శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై తనిఖీలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగాన్ని ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఎస్పీ టి.హరికృష్ణ ఆదేశాలతో ఐదు బృందాలు కవిటి మండలం మాణిక్యపురం, కుసుంపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సోంపేట మండలం మామిడిపల్లి కేజీబీవీ, కంచిలి మండలం జాడుపుడిలోని కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలల్లో రాష్ట్రీయ బాలస్వాస్ధ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) (గతంలో దీనినే జవహర్బాల ఆరోగ్యరక్ష కార్యక్రమంగా పిలిచేవారు) అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఇంతవరకు వైద్యులు ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ ఎలా ఉంది అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పథకం నిర్వహణలో పలు లోపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. 8 మంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు తీరుపై తనిఖీ బృందాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నాయి. ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించిన మృతి చెందిన విద్యార్థుల గురించి వారి కుటుంబసభ్యులు, పాఠశాలల సిబ్బందితో విచారణ సిబ్బంది మాట్లాడారు. విద్యార్థుల మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో కూడిన పోషకాహారం అందిస్తున్నారా? ఆహారం వండేటప్పుడు పరిశుభ్రతకు ఏమేరకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరుగుదొడ్ల నిర్వహణ ఉందా లేదా చూశారు. వాస్తవ గణాంకా లతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. దీన్ని విజిలెన్స్ ఎస్పీ టి.హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్టు అధికారులు తెలి పారు. విచారణలో విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణ డీఎస్పీ ప్రసాదరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సీహెచ్ సూర్యత్రినాథరావు, డీసీటీవో తారకరామారావు, ఆర్. విద్యాసాగర్, టి.సామ్యూల్రాజు, కె కృష్ణారావు, రవికాంత్ ఉన్నారు. -
హాస్టల్ ట్యూటర్లకు జీతాలేవి?
కందుకూరు రూరల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని వసతులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే.. ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్లను నియమించి ఉదయం, సాయంత్రం వేళ తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పగా చెబుతున్న పాలకులు.. ఆ ట్యూటర్లకు సక్రమంగా వేతనం ఇవ్వాలన్న విషయాన్ని గాలికొదిలేశారు. సాంఘిక సంక్షేమశాఖ బాలుర, బాలికల వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 67 వసతి గృహాల్లో ఉండగా.. వీరి కోసం 268 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం వేళల్లో వసతి గృహాలకు వెళ్లి విద్యాబోధన చేస్తుంటారు. దీంతోపాటు స్టడీ అవర్లు కూడా నిర్వహిస్తారు. ఇందుకుగాను వీరికి నెలకు రూ.1,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. గత 24 నెలలుగా 268 మందికి జీతాలు మంజూరు చేయలేదు. సుమారు రూ.96.48 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా సాంఘిక సంక్షేమశాఖాధికారులు కేవలం రూ.22 లక్షలేనని చెబుతుండటం గమనార్హం. నెలల తరబడి ట్యూటర్లు వేతనం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అదిగో.. ఇదిగో.. అంటూ ఆశ చూపుతూ కాలం గడిపేస్తున్నారు. ♦ రెండేళ్లుగా వేతనం రాకపోవడంతో జిల్లాలో కొందరు ట్యూటర్లు మానేస్తున్నారు. కందుకూరు ఎస్సీ బాలుర వసతి గృహం–2లో ట్యూటర్లకు జీతం ఇవ్వకపోవడం వల్ల మానేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని హాస్టళ్లలో ట్యూటర్లు కూడా వసతి గృహాలకు వెళ్లడం మానేస్తుండగా.. ఇంకొందరు మాత్రం జీతం రాలేదన్న ఆవేదనతో తరగతులు చెప్పడం లేదు. పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ట్యూటర్లు సక్రమంగా వసతి గృహాలకు రాక.. స్టడీ అవర్లు నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గితే చర్యలు తప్పవని వార్డెన్లను హెచ్చరిస్తుండటంతో వార్డెన్లకు భయం పట్టుకుంది. ట్యూట ర్లకు నచ్చజెప్పి పిలిచినా.. జీతం లేకుండా ఏం పని చేస్తామని ప్రశ్నిస్తున్నారని వార్డెన్లు చెబుతున్నారు. ♦ ‘‘అసలే నిరుద్యోగులం.. చాలీచాలని వేతనం అయినా ఉదయం, సాయంత్రం వచ్చి విద్యాబోధన చేస్తున్నాం. అయినా సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా పని చేయాలి. ఇల్లు గడవాలి కదా’’ అని ట్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ట్యూటర్లకు సకాలంలో జీతం ఇచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 24 నెలలుగా జీతం ఇవ్వలేదు కందుకూరు బాలికల వసతి గృహం–1లో హిందీ ట్యూటర్గా పని చేస్తున్నా. 24 నెలలుగా జీతం అందలేదు. నాలుగు చోట్ల ట్యూషన్లు చెప్పుకుని జీవనం సాగిస్తున్నాం. రెండు సంవత్సరాలుగా జీతం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా వేతన బకాయిలు అందించాలని కోరుతున్నాం. – ఎస్డీ రఫీ, హిందీ ట్యూటర్ పేద విద్యార్థులపై ప్రభుత్వ చిన్నచూపు వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పదో తరగతి ట్యూటర్లకు 24 నెలలుగా వేతన బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం. దీని కారణంగా కొన్ని వసతి గృహాల్లో ట్యూటర్లు మానేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ట్యూటర్లు లేకపోతే విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. ప్రభుత్వం స్పందించి జీతం వెంటనే విడుదల చేయాలి. – ఎస్.ఓబుల్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి -
హాస్టల్ విద్యార్థులకూ కేసీఆర్ కిట్లు
ఇల్లెందు: ఇప్పటి వరకు బాలింతలు, పసి పిల్లలకే కేసీఆర్ కిట్లు అందజేశారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల విద్యాలయాల విద్యార్థులకు కూడా కిట్లు అందజేస్తున్నారు. అయితే ఈ రెండు కిట్లకు ఏమాత్రం పొంతన లేదు. విద్యార్థులకు కాస్మొటిక్స్ను కేసీఆర్ కిట్ రూపంలో అందజేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒక కిట్ చొప్పున అందజేస్తారు. బాలికలకు అందజేసే కిట్లలో సబ్బులు, షాంపూలు, పౌడర్, క్రీమ్, కొబ్బరినూనె, రబ్బర్ బ్యాండ్లు, మస్కిటో కాయిల్స్, టూత్పేస్టు, బొట్టుబిల్లలు, లిక్విడ్, దువ్వెన ఉంటాయి. బాలురకు ఇచ్చే కిట్లలో సబ్బులు, దువ్వెన, కొబ్బరి నూనె ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 20, 600 మంది విద్యార్థులుండగా ఇందులో 12, 200 మంది బాలికలు, 8, 400 మంది బాలురు ఉన్నారు. చెన్నెంగులగడ్డ, రొంపేడులో పంపిణీ... ఇల్లెందు మండలంలోని చెన్నెంగులగడ్డ, రొంపేడు పాఠశాలల్లో శనివారం ఐటీడీఏ డీడీ సీహెచ్ రామ్మూర్తి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ నెలాఖరు నాటికి ప్రతి విద్యార్థికి అందజేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటూ చదువుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో చెన్నెంగులగడ్డ, రొంపేడు, ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాలల హెచ్ఎం, వార్డెన్లు సోమశేఖర్.హరాజ్య, సునిత, వెంకన్న, రూపాదేవి, రాకం శ్యామ్బాబు, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు దుప్పట్ల ‘వసతి’
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: దుప్పట్లు లేక సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. చలికాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు, బెడ్షీట్లు, కాస్మోటిక్ చార్జీలు అందని వైనాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘వణుకుతున్న వసతి’శీర్షికతో ఈనెల 17న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టల్ విద్యార్థులకు ముందస్తుగా రగ్గులు, కార్పెట్ల (జంపఖానా)లను పంపిణీ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపక్రమించింది. దుప్పట్ల పంపిణీకి చర్యల్ని మరింత వేగిరం చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 686 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 58 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. చలికాలాన్ని తట్టుకునే విధంగా నాణ్యమైన రగ్గులు, కార్పెట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ.. టెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 విలువైన రగ్గు, కార్పెట్ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన స్టాకును రెండు రోజుల క్రితం టెస్కో ప్రతినిధులు ఎస్సీ అభివృద్ధి శాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ నిమిత్తం అధికారులు జిల్లాలకు తరలించారు. స్టాక్ను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంక్షేమాధికారులను ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ఆదేశించారు. శుక్రవారం నాటికి జిల్లా కేంద్రాలకు దుప్పట్లు చేరుకోగా.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పరిధిలో శుక్రవారం రాత్రే పంపిణీ చేశారు. -
జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా ♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు ♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు. పెరుగుతున్న మలేరియా బాధితులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు. గతేడాది కంటే ఎక్కువే... కురుపాం సీహెచ్సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి. ఒకే ల్యాబ్ టెక్నీషియన్తో రోగుల అవస్థలు కురుపాం సీహెచ్సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు. కానరాని నివారణ చర్యలు మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. -
రోడ్డున పడ్డ బీసీ హాస్టల్ విద్యార్థులు
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతిగృహం విద్యార్థులు రోడ్డును పడ్డారు. విషయంలోకి వెళ్తే జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ ఓప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల అగ్రిమెంట్ సమయం ముగియడంతో ఖాళీచేయమని భవనం యజమాని పలు సార్లు విజ్ఙప్తి చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో భవనం యజమాని మంగళవారం ఉదయం భవనంలోని విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులను బయట పడేశారు. భవన యజమాని ఆదేశాలమేరకు హాస్టల్ వాచ్మన్, వంటమనిషి హాస్టల్లోని వస్తువులను బయట పడేయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. విద్యార్థులు విషయాన్ని సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు తెలియజేశారు. అయితే హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. -
జైల్లో ఖైదీలకంటే హీనమా?: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: జైల్లో ఖైదీలకు నెలకు 3 వేల రూపాయలు భోజనం కోసం మంజూరు చేస్తుండగా, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు 1050 రూపాయలు మెస్ఛార్జీలుగా ఇస్తున్నారు. జైల్లో ఖైదీలకిచ్చే ప్రాధాన్యత విధ్యార్థులకు ఇవ్వరా?.. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు రోజుకు రూ.35 వంతున పూటకు 10.67 రూపాయలతో భోజనం సాధ్యమేనా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విధ్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, మెస్ఛార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కానుకగా ఉద్యోగ, కార్మిక వర్గాలకు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ఛార్జీలు పెంచక పోవడం శోచనీయమన్నారు. బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, రాంకోటి, కుల్కచర్ల శ్రీనివాస్, రామలింగం, నర్సింహ్మగౌడ్, వేముల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓను ఘెరావ్ చేసిన హాస్టల్ విద్యార్థినులు
అమలాపురం: స్థానిక వడ్డి గూడెంలో సరైన వసతులు లేని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ భవనంలోకి నాలుగు హాస్టళ్లకు చెందిన దాదాపు 600 మంది విద్యార్ధినులను తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు, కోనసీమ దళిత నాయకులు స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది దాదాపు హౌస్ అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ, ఇ¯ŒSఛార్జి ఆర్డీఓ అనూరాధను హాస్టల్ విద్యార్థినులు ఘెరావ్ చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఆర్డీఓ కార్యాలయ ముట్టడి కొనసాగింది. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాక జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఇక్కడ వచ్చి ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడే ప్రకటించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దాంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డీడీ శోభారాణి కాకినాడ నుంచి అమలాపురానికి వచ్చారు. ఆమెను కూడా విద్యార్ధినులు, దళిత నాయకులు ఘెరావ్ చేశారు. ఆమె ఫో¯ŒSలో జిల్లా కలెక్టర్తో చర్చించారు. ఈ విద్యాసంవత్సరానికి పాత హాస్టళ్లలోనే విద్యార్థినులను ఉంచుతామని కలెక్టర్ అనుమతితో ఆమె ప్రకటించటంతో ఆందోళనకు తెరపడింది. ఇప్పటికే కొత్త హాస్టల్కు పాత హాస్టళ్లనుంచి తరలించిన బియ్యం తదితర సామగ్రిని తిరిగి పాత హాస్టళ్లకు తరలించేలా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ సమస్యకు తెరపడింది. కోనసీమ దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్బాబు, పెయ్యల శ్రీనివాసరావు, జంగా బాబూరావు, దేవరపల్లి శాంతికుమార్, మెండు రమేష్బాబు, ఉండ్రు వెంకటేష్, కాట్రు చంద్రమోహన్, బొంతు బాలరాజు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి పాల్గొన్నారు. -
హాస్టల్లో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
తమిళనాడులోని విలుపురంలో ప్రభుత్వ ఎయిడెడ్ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. సర్వశిక్షాభియాన్ పథకం కింద తిరుకోవిలూర్ గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్న ఉండు ఉరైవిడిపల్లి స్కూల్లో ఆ పిల్లలు చదువుతున్నారు. అక్కడ దాదాపు 92 మంది పిల్లలు ఉంటారు. అయ్యనార్ (8) అనే విద్యార్థి టాయిలెట్ల వద్ద మరణించి పడి ఉండగా మిగిలిన విద్యార్థులు చూశారు. అతడి మృదదేహాన్ని ఆస్పత్రికి తరలించేలోపే.. అతడి అక్క సుబ్బులక్ష్మి (11) కూడా కుప్పకూలిపోయింది. అతడితో పాటు మరో విద్యార్థి రాజదురై (11) కూడా కుప్పకూలాడు. ఏం జరిగిందో అర్థం కాని అధికారులు.. వెంటనే ఆస్పత్రికి తరలించినా, వాళ్లలో రాజదురై మరణించాడు. సుబ్బులక్ష్మి మాత్రం కొన్ని గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది. ఇలా ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఎందుకు మరణించారో అధికారులకు అర్థం కావట్లేదు. ప్రత్యేక వైద్య బృందాన్ని హాస్టల్కు పంపి, అక్కడున్న పిల్లలందరికీ వైద్యపరీక్షలు చేయించారు. అయితే, హాస్టల్లో కనీసం పారిశుధ్య సదుపాయాలు కూడా సరిగా లేవని, పిల్లలకు రక్షిత మంచినీరు కూడా అందడం లేదని వీఏఓ నేతృత్వంలోని బృందం తేల్చింది. పోలీసులు స్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. -
ఉల్లిపాయలకు బదులు క్యాబేజీ
మెను సక్రమంగా అమలు చేస్తారంటే.. అదీ లేదు. సరైన కూరలు పెట్టరు. సాంబారు నీళ్లలా ఉంటోంది. ఉల్లిపాయలకు బుదులు క్యాబేజీలను వంటల్లో వినియోగిస్తున్నారు. సరైన సౌకర్యాలూ కల్పించడం లేదు.. ఇదీ బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థునుల ఆవేదన. వారి సమస్యలు ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో, కడుపుమంది రోడ్డెక్కారు. మంగళవారం జాతీయ రహదారిపై ఆశ్రమ పాఠశాల ఎదురుగానే రాస్తారోకో చేపట్టారు. ఆయా సమస్యలతో పాటు అధికారులపై పలు ఆరోపణలు చేశారు. జీరో అకౌంట్ కోసం తమ వద్ద రూ.200 చొప్పున వసూలు చేశారని, స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా కూడా సరిగ్గా ఆవిష్కరించలేదని ఆరోపించారు. మెను సక్రమంగా అమలుకాక అస్వస్థతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం అర్జున్ వీరికి మద్దతు పలికారు. – బొడ్డుగూడెం(చింతూరు) -
నీటికోసం హాస్టల్ విద్యార్థుల పాట్లు
కుల్కచర్ల: మండల కేంద్రంలోని గిరిజన వసతిగృహంలో నీళ్లు లేక విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేవగానే కాలకృత్యాలకు, స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లు అవసరం. హాస్టల్లోని బోరు ఎండిపోయినా వార్డెన్ పట్టంచుకోవడం లేదు. దీంతో ఉదయం లేవగానే విద్యార్థులు బకెట్ పట్టుకుని ఎక్కడ బోర్వెల్లో నీరు కనిపిస్తే అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ క్యూలైన్లో నిలబడి బకెట్తో నీళ్లు తెచ్చుకుంటున్నారు. కుల్కచర్ల గిరిజన వసతిగృహంలో 4 నుంచి 10 వ తరగతి వరకు 300 మంది విద్యార్ధులు ఉండి చదువుకుంటున్నారు. వసతిగృహంలో నీళ్లు లేకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రతిరోజు చేతిపంపు దగ్గర నీటికోసం ఆ హాస్టల్ విద్యార్థులే కనిపిస్తున్నారు. చాలామంది విద్యార్ధులు వారానికోసారి ఇంటికి వెళ్లి ఒకేసారి దస్తులు శుభ్రం చేసుకొని వస్తున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహంలో నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఖాళీ కంచాలతో నిరసన
మచిలీటపట్నం(చిలకలపూడి) : తమకు కడుపునిండా అన్నం పెట్టాలని కోరుతూ వసతిగృహాల విద్యార్థులు ఖాళీ కంచాలతో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన కార్యక్రమం జరిగింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.నూర్మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 199, రెండో దశలో 272 వసతిగృహాలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఇందుకోసం జీవో నంబరు 89 జారీ చేసిందని చెప్పారు. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో నంబరు 89ను వెంటనే రద్దు చేయాలని, వసతిగృహాలు మూసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలన్నారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఎస్ఐఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రవీణ్, ఎం.మహేష్, నాయకులు ఎన్.సోమేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు, కె.రామకృష్ణ, ఎం.అనిల్, సీహెచ్ సుమన్, వసతిగృహాల విద్యార్థులు పాల్గొన్నారు. -
నీళ్ల సాంబారే!
మండిపోతున్న నిత్యావసర సరకుల ధరలు కూరగాయలు, పప్పులకు దూరం హాస్టల్ విద్యార్థులకు అందని పోషకాహారం మార్కెట్లో కూరగాయలు, పప్పుల ధరలు మండిపోతుండడంతో పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు చప్పిడి మొతుకులే పెడుతున్నారు. ధరలు తగ్గితేనేగానీ కూరగాయలతో వంట చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థులకు నీళ్ల సాంబారే దక్కుతోంది. ఫలితంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందటం లేదు. నర్సీపట్నం : హాస్టళ్లలో విద్యార్థుల భోజనంపై ధరల ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో 48 ఎస్సీ వసతిగృహాల్లో 3,261, బీసీకి చెందిన 68 వసతిగృహాల్లో 6 వేల మంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలు 3,174, ప్రాథమికోన్నత 374, ఉన్నత పాఠశాలులు 509 ఉన్నాయి. ఈ బడుల్లో 6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వెచ్చిస్తున్నాయి. మధ్యాహ్నం పూట ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం బడులు తెరిచి వారం రోజులు అవుతోంది. ఈ వారం రోజుల్లో నీళ్ల సాంబారు, చప్పిడి మెతుకులతో సరిపెడుతున్నారు. ధరలు ఆదుపులో లేకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. పప్పుల ధరలూ అలాగే ఉన్నాయని, ఇక వారంలో రెండు రోజులు సాంబారు ఎలా సాధ్యమంటున్నారు. భయపెడుతున్న ధరలు పెరిగిన నిత్యావసర ధరలు మధ్యాహ్న భోజన నిర్వాహకులను భయపెడుతున్నాయి. వందల రూపాయలు వెచ్చిస్తున్నా భోజనం పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కూరగాయలతో పాటు పప్పుల ధరలు ఆదుపులో లేకపోవడంతో నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. కందిపప్పు కిలో రూ.188 పలుకుతోంది. పెసరపప్పు ధరలు అలాగే ఉన్నాయి. చింతపండు, మిరపకాయల ధరలు పేలుతున్నాయి. ఇవి కాకుండా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పచ్చిమిర్చి రూ.50 కాగా టమాటా ధర కిలో రూ.80 పలుకుతోంది. వంకాయలు కిలో రూ.40, బీరకాయలు కిలో రూ.60, బెండ కిలో రూ.40 పలుకుతున్నాయి. వసతిగృహాలు, బడుల్లో నిత్యం వాడే కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో వీటి ప్రభావం విద్యార్థుల పౌష్టికాహారంపై పడుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెనూకు బయట మార్కెట్లో ధరలకు పొంతన లేకపోవడంతో వసతిగృహాల సంక్షేమాధికారులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిత్యావసరాలను కొనుగోలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. అరకొర నిత్యావసరాలు, కూరగాయలతో సరిపెడుతున్నారు. దీంతో పోషకాహారం అందక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ కష్టం నిత్యావసర సరుకులకు ప్రభుత్వం ఇస్తున్న ధరలకు, బయట మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. కేజీ కంది పప్పుకు ప్రభుత్వం రూ.140 ఇస్తుంది. బయట మార్కెట్లో రూ.188, కిలో టమోటా రూ.100 వరకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారంలో క్వాలిటీ తగ్గుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ధరలతో మార్కెట్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేని పరిస్థితి. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి మార్కెట్ ధరలకు అనుగుణంగా రేట్లు పెంచితేనే నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి అవకాశం ఉంటుంది. -ఎం.అప్పారావు, హాస్టల్ సంక్షేమ అధికారి, ఆనందనిలయం, పెదబొడ్డేపల్లి -
కామాటి దుశ్చర్య
♦ పాలమాకులలో హాస్టల్ విద్యార్థులపై దాడి ♦ తలకు గాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ♦ కులం పేరుతో దూషించాడని విద్యార్థుల ఆరోపణ నంగునూరు: ఓ హాస్టల్ విద్యార్థులపై కామాటి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పాలమాకులలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించడమే కాకుండా పలువురిపై గరిట, కర్రతో దాడి చేయడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం... నారాయణఖేడ్ మండలానికి చెందిన విద్యార్థులు పాలమాకుల ఎస్సీ హాస్టల్లో ఉండి స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థులు కొందరు ఒకచోట చేరి మాట్లాడుకుంటుండగా కామాటి లక్ష్మణ్ వారిని దూషించాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించగా కులం పేరుతోపాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో కామాటికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరింత ఆగ్రహానికి లోనైన కామాటి పదోతరగతి విద్యార్థి వి.శ్రీనును గరిటతో కొట్టడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న ఆర్.బాలజీ షర్ట్ చిరగడంతోపాటు జయపాల్, శ్రీకాంత్, ప్రకాశ్లపై కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధిత విద్యార్థులు రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ కొమురయ్య హాస్టల్కు వెళ్లి విచారించగా కామాటి లక్ష్మణ్ విద్యార్థులపై దాడి చేసినట్టు తోటి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పదోతరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి కులం పేరుతో దూషించిన కామాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏయూలో తాళాల బాగోతం!
రూ.20 లక్షలకు పైగా దుర్వినియోగం!! పాత తాళం కప్పలకు కొత్త వసూళ్లు ఆందోళనలో హాస్టల్ విద్యార్థులు విశాఖపట్నం: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాళం కప్పల బాగోతం కలకలం రేపుతోంది. తమ నుంచి యాజమాన్యం రూ.లక్షలు దోచుకుంటోందంటూ విద్యార్థి వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాత తాళాలను అంటగడుతూ కొత్త వాటి ధరలను ఏటా వసూలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర యూనివర్సిటీలో ఏటా వివిధ హాస్టళ్లలో 2600 మందికి పైగా అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రవేశ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి తాళం కప్పల నిమిత్తం రూ.150 వసూలు చేసేవారు. ఇలా ఒక్కో హాస్టల్ గదిలో ఇద్దరు ముగ్గురు, లేడీస్ హాస్టళ్లలో ఐదుగురు చొప్పున ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గదికి రూ.300-750 వరకు వసూలవుతుంది. ఆ సొమ్ముతో వారికి కొత్త తాళం కప్పలు ఇవ్వాలి. కానీ అలాకాకుండా అంతకు ముందు వాడిన వాటినే రొటేషన్లో వీరికిస్తున్నారు. లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ గరల్స్, బాయ్స్ హాస్టళ్లల్లో కొంతమందికి పాత తాళం కప్పలు కూడా ఇవ్వడం లేదని దీంతో తామే వాటిని కొంటున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ సొమ్మును వారి నుంచి వసూలు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం 2010 నుంచి కొనసాగుతూ వస్తోంది. దీనిపై కొంతమంది హాస్టల్ విద్యార్థులు కొన్నాళ్ల క్రితం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లగా రూ.150ను 100కు తగ్గించారు. దీంతో 2015 నుంచి రూ.100లు వసూలు చేస్తున్నారు. 2010 నుంచి వసూళ్ల లెక్కలను పరిశీలిస్తే.. మహారాణిపేట లేడీస్ హాస్టల్లో ఏటా 650 మంది కొత్తగా చేరుతుంటారు. వీరి నుంచి ఈ నాలుగేళ్లలో రూ.3.90 లక్షలు, 2015-16కి రూ.65 వేలు వెరసి రూ.4.55 లక్షలు వసూలు చేశారు. అలాగే ఆర్ట్స్, కామర్స్ హాస్టల్ విద్యార్థులు 761 మంది నుంచి రూ.5.30 లక్షలు, సైన్స్ హాస్టల్లో 400 మంది నుంచి రూ.2.80 లక్షలు బాయ్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు 800 మంది నుంచి సుమారు రూ.5.60 లక్షలు, గరల్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో 425 మంది నుంచి రూ.3 లక్షలు వెరసి సుమారు రూ.21 లక్షల వరకూ తాళం కప్పల సొమ్ము కింద ఏయూ యాజమాన్యం వసూలు చేసినట్టు అంచనా. వాస్తవానికి ఒక తాళం కప్ప ఖరీదు గరిష్టంగా రూ.150లకు మించదు. అది రెండు మూడేళ్ల వరకూ పనికొస్తుంది. అయినా ఏటా విద్యార్థినీ విద్యార్థుల నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు. తాళం కప్పల కొనుగోలు నిమిత్తం వసూలు చేసిన ఈ సొమ్ము దానికి వినియోగించ కుండా దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సరైన లెక్కాపత్రం లేదని సమాచారం. ఇన్నాళ్లూ సాగిన తాళాల వ్యవహారం ఇటీవల విద్యార్థుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. లోపాలను సరిచేస్తాం.. హాస్టల్ విద్యార్థులు ఏయూ యాజమాన్యానికి మెస్ బిల్లులు రూ.82 లక్షలు బకాయి పడ్డారు. ఇందులో రూ.22 లక్షలు చెల్లించగా ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నారు. బకాయిలుంటే హాస్టళ్లు నడపడం కష్టం. అందువల్ల తాళం కప్పల సొమ్మును హాస్టళ్ల నిర్వహణకు వెచ్చిస్తున్నారేమో? ఒకవేళ దుర్వినియోగం చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి లోపాలను సరిచేస్తాం. - వి. ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ -
'సన్న సీఎంని కాబట్టి.. సన్నబియ్యం ఇస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. తాను 'సన్న ముఖ్యమంత్రిని కాబట్టి.. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నా' అంటూ నవ్వులు పూయించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్న విషయం పీడీఎస్యూ వాళ్లకు తెలియదా? అని నవ్వుతూ చురుకలు అంటించారు. చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలకారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 24 మండలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ. లక్ష 25వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
ఆర్ట్స్ కళాశాల హాస్టల్లో ఏం జరిగింది?
* రాళ్లతో భవనంపైకి దాడి చేసిన దుండగులు * సుమారు 20 గదుల అద్దాలు ధ్వంసం * భయాందోళనకు గురైన విద్యార్థులు * పలువురు విద్యార్థులకు గాయాలు అనంతపురం ఎడ్యుకేషన్ : అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు.. గదుల్లో కొందరు విద్యార్థులు చదువుకుంటున్నారు.. మరి కొందరు నిద్రిస్తున్నారు. ఉన్నట్టుండి గదుల్లోకి రాళ్ల వర్షం. అద్దాలు ముక్కలు ముక్కలవుతున్నాయి. మరోవైపు కొందరు కర్రలతో వీరంగం సృష్టిస్తున్నారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదుతున్నారు. కిటికీల అద్వాలు ధ్వసం చేస్తున్నారు. గట్టి కేకలు వేస్తున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక విద్యార్థులు బిత్తరపోయారు. నిద్రిస్తున్న వారు ఉలిక్కిపడి లేచి వణికిపోవడం వారి వంతయ్యింది. నిమిషాల్లో అక్కడ భయానక వాతావరణం నెలకొని చల్లారిపోయింది. ఇదీ మంగళవారం ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటన. ఆప్రాంతమంతా భయానక పరిస్థితి: ఆర్ట్స్ కళాశాల హాస్టల్లో సుమారు 15-20 మంది బయట నుంచి వచ్చిన యువకులు వీరంగం సృష్టించారు. రావడం రావడంతోనే కర్రలు చేతబూని హల్చల్ చేశారు. కేకలు వేస్తూ లోపలికి ప్రవేశించారు. కొందరు విద్యార్థులను చితకబాదారు. గదుల కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. నిమిషాల్లో ఇదంతా ముగించుకొని బయటకు వచ్చారు. బయట నుంచి గదుల్లోకి రాళ్ల వర్షం కురిపించారు. అద్దాలు పగిలి కొందరికి, రాళ్లు తగిలి కొందరికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితి నెలకొంది. రోడ్డుపై అటుగా వెళ్లేవారు కూడా దుండగుల చేష్టలను చూసి బిత్తరపోయారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపు దుండగులు పరారయ్యారు. సీసీ కెమరాల్లో నిక్షిప్తం.. దుండగులు దాడి చేసిన దృశ్యాలు హాస్టల్ సీసీ కెమరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు వారిని గుర్తించే వేటలో పడ్డారు. వసతిగృహం ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన సమయంలో కర్రలు పట్టుకున్న యువకుల ఫొటోలు కెమెరాల్లో గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పాత గొడవలే కారణమా? ఇటీవల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బయటి యువకులతో గొడవపడ్డారు. ఈ గొడవ పర్యావసనమే తాజా దాడి జరిగింది. గతంలో జరిగిన గొడవకు ప్రతీకారంగా యువకులు వచ్చి నానా హంగామా చేశారు. ఇదే విషయాన్ని కొందరు విద్యార్థులకు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కఠిన చర్యలు తప్పవు .. హాస్టల్ విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప దాడులు చేస్తే ఎలా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. - జబీవుల్లా, డిప్యూటీ వార్డెన్ -
కునారిల్లుతున్న హాస్టళ్లు
♦ నాసిరకం సన్నబియ్యం.. మౌలిక వసతులు కరువు ♦ రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లపై సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి దళారుల చీడ అంటుకుంది. ‘సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉంటోంది. మిల్లర్లు, పంపిణీదారులు ఫైన్ క్వాలిటీకి బదులు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది..’ అని ఇటీవల హాస్టళ్లలో సర్వే నిర్వహించిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఎత్తి చూపింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంటోందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని... మండలం యూనిట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి సమీకృత (ఇంటిగ్రేటేడ్) హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విద్యా సంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా చాలా హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది. ఇటీవలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక విభాగం కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) ఆధ్వర్యంలో సర్వే చేయించింది. రాష్ట్రంలోని మొత్తం 1,394 హాస్టళ్లు, సగం రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం, కొత్తగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మౌలిక సదుపాయాల పరిస్థితిని సీఎస్డీ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఇటీవలే ముఖ్యమంత్రికి కేసీఆర్కు సమర్పించింది. ఆ నివేదికలో ప్రణాళికా విభాగం ప్రస్తావించిన పలు కీలకమైన అంశాలు.. ► హాస్టళ్ల నిర్వహణ సాఫీగా జరిగేందుకు మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి ఇంటిగ్రేటేడ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని 41 శాతం హాస్టళ్లలో 70 మందికి మించి విద్యార్థులు లేరు. ► 2011లో నిర్ణయించిన డైట్ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఏడాదికోసారి డైట్ చార్జీలను సవరించాలి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలు కొంత మెరుగ్గా ఉన్నా... పెరిగిన ధరల దృష్ట్యా మరికొంత పెంచాల్సిన అవసరముంది. ► ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్ భవనాలు అధ్వానంగా ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ► విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు కొన్ని హాస్టళ్లలో అమర్చిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. హాస్టళ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు తక్కువగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేయటం లేదు. ► అత్యధిక హాస్టళ్లలో టాయిలెట్లు, పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామపంచాయతీ లేదా ఇతర సిబ్బందితో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. ► హాస్టల్ వార్డెన్లు, ఉన్నత పాఠశాలల్లోని హెడ్మాస్టర్లకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరించేందుకు చర్యలు చేపట్టాలి. దాంతో హాస్టల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ► బీసీ హాస్టళ్లలో పదో తరగతి వారికి బోధించే ట్యూటర్లకు ఇచ్చే వేతనాన్ని ఎస్సీ హాస్టళ్లలో ఇస్తున్న స్థాయికి పెంచాలి. ఎనిమిదో తరగతి ► హాస్టళ్లన్నిటా దాదాపు 20 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని అన్ని హాస్టళ్లకు విస్తరించాలి. హాజరు విధానం సంక్లిష్టంగా ఉండకుండా సరళం చేయాలి. ► చాలా హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారికి రెండు మూడు హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణపై ప్రభావం కనబడుతోంది. -
బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు
- ప్రిన్సిపాల్పై ఎమ్మెల్యే ఆగ్రహం - సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశం పుల్కల్ : పిల్లలకు పురుగుల అన్నం పెట్టి చంపుతారా..మీకు జీతాలు ఇవ్వడంలేదా.. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సింగూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై మండిపడ్డారు.మిషన్ కలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ స్పీకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో రాత్రి బస చేశారు. అందులో భాగంగానే అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సింగూర్ గురుకుల పాఠశాలలో బసచేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణపై మండిపడ్డారు. అసలు హాస్టల్లో పిల్లలు ఇలాగే ఉంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలల కన్వీనర్ కొండల్రావును హాస్టల్ వద్దకు పిలిపించి వాస్తవ పరిస్థితిని వివరించారు. -
వాన వస్తే కారుతోంది..
♦ నీటిని ఎత్తివేసేందుకు అవస్థపడుతున్నాం.. ♦ భోజనం సరిగా లేదు ♦ మంత్రి వద్ద వాపోయిన హాస్టల్ విద్యార్థినులు ♦ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం అనంతపురం అర్బన్ : ‘భోజనం బాగుండడం లేదు.. వాన వస్తే హాస్టల్ కారుతోంది, ఆ నీటిని ఎత్తివేసేందుకు అవస్థలు పడుతున్నాం.. భవనంలో 300 మంది ఉంటున్నాం.. టాయ్లెట్లు లేవు..’ అని స్థానిక అరవిందనగర్లోని ఎస్సీ బాలిక హాస్టల్-2 విద్యార్థినులు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత వద్ద వాపోయారు. మంత్రి ఆదివారం హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తమ సమస్యలను ఆమెకు వివరించారు. హాస్టల్ నిర్వహణ సరిగ్గాలేకపోవడంపై ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థినులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. వారిని మీ సొంత పిల్లల్లా చూసుకోవాలి. వారిని ఇబ్బంది పెడుతున్నట్లు నా దృష్టికి వస్తే చర్చలు తప్పవు’ అని అన్నారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూసుకుంటారా..? వీళ్లు అమ్మనాన్నలను వదిలేసి ఇక్కడి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్లను మీ పిల్లల్లా చూసుకోవాల్సింది పోయి పట్టించుకోరా..? భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదంట. ఇలాగైతే మీ అందరిపైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంత మంది పిల్లలకు ఈ చిన్న భవనం సరిపోదు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వేరొక మంచి భవనంలో మార్పించే ఏర్పాటు చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
పడకేసిన ‘బస’..!
ఇందూరు : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 147 సంక్షేమ వసతిగృహాలున్నాయి. ఈ హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించేందుకు గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు సంవత్సరాల క్రితం నాటి కలెక్టర్ వరప్రసాద్ రాత్రుల్లో బస కార్యక్రమం పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మూడేళ్ల పాటు సజావుగానే సాగిన ఈ కార్యక్రమం ఇటీవల పడకేసింది. గతంలో ఉన్నతాధికారులు వసతిగృహాల్లో బస చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేవారు. వారితో కలిసి భోజనం చేసి మౌలిక వసతులను స్వయంగా పరిశీలించేవారు. అదే విధంగా స్పెషల్ అధికారులకు ప్రత్యేక ప్రొఫార్మా ఇచ్చి వసతిగృహంలో ఉన్న సౌకర్యాలేంటి...? లేనివి ఏంటి...? వార్డెన్ ఉంటున్నాడా..? విద్యార్థుల హాజరు శాతం, ఆ రోజుకు సంబంధించిన మెనూ అమలు చేశారా...? తదితర విషయాలను నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్కు అందజేసేవారు. దాని ఆధారంగా వసతి గృహల్లో ఉన్న మౌలిక వసతులు కల్పించేవారు. పనితీరు బాగాలేని వార్డెన్లపై చర్యలు సైతం తీసుకున్నారు. అరుుతే ప్రస్తుతం వసతి గృహాల్లో బస కార్యక్రమాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. హాస్టల్ విద్యార్థులకు సరిపడా దుప్పట్లు, కార్పెట్లు అందాయా లేదో తెలియని పరిస్థితి ఉంది. మరో వైపు కొన్ని వసతి గృహల్లో తాగునీరు, హాస్టల్ భవనాలకు కిటికీలు, తలుపులు సరిగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దోమతెరలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. వార్డెన్లు స్థానికంగా ఉండాలని కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆదేశాలు జారీ చేసినా.. ఏ ఒక్కరు కూడా స్థానికంగా ఉండి వసతి గృహల్లో బసచేయడం లేదు. దీంతో హాస్టళ్లలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. నెలకు రెండు సార్లు వసతిగృహాలను తనిఖీ చేయాల్సిన సహాయ సంక్షేమాధికారులు మామూళ్లకు అవాటుపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తప్పని సరిగా తనిఖీ చేయాల్సి వస్తే నామమాత్రంగా చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తనిఖీలకు వెళుతున్నట్లు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించడంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాల్సెంటర్ రావడంతో తగ్గిన ప్రత్యక్ష పర్యవేక్షణ... కాల్ సెంటర్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వసతిగృహాల్లోని ల్యాండ్ నంబర్కు ఫోన్ చేసి రోజు వారీ వివరాలను కాల్ సెంటర్ సిబ్బంది తెలుసుకుంటున్నారు. దీంతో ప్రత్యక్ష పర్యవేక్షణ, తనిఖీలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే వసతిగృహాల్లో బస చేయాల్సిన పాలకులు, ప్రజాప్రతినిధులు కూడా ఆ ఉసే ఎత్తడం లేదు. ఇలా మూడు, నాలుగు సంవత్సరాలుగా వస్తున్న బస కార్యక్రమం ఆనవారుుతీ తప్పుతోంది. ఇకనైనా హాస్టల్ బసను కొనసాగిస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
ఎలా తినాలి?
సాక్షి, కడప : సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గొప్ప లు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం హస్టల్ విద్యార్థులకు నాసిరకంగా ఉన్న చౌక బియ్యంతో వండిన అన్నం అందిస్తున్నారు. ఈ అన్నం తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాణ్యమైన సన్న బియ్యంతో (జిలకర మసూరి) హాస్టల్ విద్యార్థులకు ఆహారం అందిస్తామని టీడీపీ సర్కారు ప్రకటించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికే లెక్కలేనన్ని హమీలిచ్చి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్రబాబు సర్కారు.. సన్న బియ్యం ఊసెత్తక పోవడం చూస్తుంటే దాటవేట ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లతో పాటు జిల్లాలోని హస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు సన్న బియ్యంతో తయారు చేసిన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 143 ఎస్సీ హాస్టళ్లు, 60 బీసీ హాస్టళ్లు, 10 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో సమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంతోనే వంట వండుతున్నారు. రేషన్ బియ్యం కూడా ఒక్కో నెల ఒక్కో క్వాలిటీతో వస్తాయి. బాగోలేని బియ్యాన్నే హాస్టళ్లకు తరలిస్తున్నారు. ఇలాంటి బియ్యంతో వండిన అన్నం తినలేక చాలా మంది విద్యార్థులు పస్తులుంటూ రోగాలు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇళ్లకు పారిపోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని వార్డెన్లు కోరుతున్నారు. -
విద్యార్థులపై లాఠీచార్జ్
పురుగులన్నం పెడుతున్నారంటూ ఆందోళన చేసినందుకే.. భాగ్యనగర్కాలనీ: బొద్దింకలు చచ్చిన తాగునీరు, పురుగులతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారని శ్రీచైతన్య కళాశాలకు చెందిన హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాంపేటలోని శ్రీచైతన్య కళాశాలలో శుక్రవారం రాత్రి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు బాసటగా నిలిచాయి. ఫీజుల వసూలు చేయడంలో జలగల్లా వ్యవహరిస్తూ కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. కూకట్పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మోయిజ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని సరైన భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించిన యాజమాన్యం తీరుని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రవీణ్గౌడ్, విష్ణు, కిషోర్, పూర్ణ, రాజు, శివ, ఈశ్వర్, సురేశ్ మాదిగ, దుర్గా, మూర్తి పాల్గొన్నారు. -
పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం
సందర్భం సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో ఉండే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతోంది. ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నంకు నిర్వచనమైన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసే పనికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల ఆకలి తీర్చే సంక్షేమ హాస్టల్ కంచం లో సన్నబియ్యం బువ్వతో తెల్లగా మెరిసిపోతుంది. ఉద్య మకారుడు కేసీఆర్ పాలకుడైనందునే తెలంగాణ ప్రభుత్వం తల్లి కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అం దించే పనికి సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకం అమ్మ చేతి వంటగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది తొలి మెట్టుగా భావించాలి. కాలం కళ్ల ముందు కర్పూరంలా కరిగిపో తుంటే కళ్లలో వొత్తులేసుకుని మార్పుల కోసం తెలంగాణ ఎదు రుచూసింది. ఎదురుచూసిన చూపులకు విజయాలు కనిపిస్తే అంతకంటే కావాల్సిందే ముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మారాలని, ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు వసతులను పెంచాలని విద్యార్థి సంఘాల న్నీ ముక్తకంఠంతో నినదిస్తూనే వస్తున్నాయి. కొన్ని వందల వేల విజ్ఞప్తులు, ధర్నాలు, పికెటింగ్లు, ప్రదర్శన లు, బంద్లు అనివార్యంగా జరుగుతూనే ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగు పడాల ని సుదీర్ఘకాలం విడువని పోరాటంగా ఎందరెందరో కృష్ణయ్యలు పోరాడుతూనే ఉన్నారు. కొన్ని సమస్యలను సాధించుకోవటం కూడా జరిగింది. పాలకులు సంక్షేమ హాస్టల్స్ అంటే సవతి పిల్లలుగానే చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే భౌగోళిక హద్దులు ఏర్పడ తాయి తప్పితే, మార్పులు ఏం జరుగుతాయని ఉద్యమకాలంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందని, ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించిన వారికి సమాధానంగా అనేక మార్పులు జరుగుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. పురుగు లన్నం, చారు, వసతులు సరిగాలేని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుని ఎదిగివచ్చిన వ్యక్తి చేతికి ఆర్థిక శాఖ పగ్గాలనివ్వటమే గాకుండా, సన్నబియ్యంతో అన్నం వండిపెట్టే పనిని ఈటెల రాజేందర్కు ఇవ్వటం తో కేసీఆర్ నూతన చరిత్రకు ద్వారాలు తెరిచినట్ల యింది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో సమాజంలో విసిరేసినట్లుగా మిగిలిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతుంది. లేకుంటే అంత తొందరగా పేద హాస్టల్ పిల్లల కంచాల లోకి సన్నబియ్యం వచ్చేనా అని ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సి ఉంది. ముక్కిపోయిన బియ్యం, ముతక బియ్యం, రేషన్ బియ్యం హాస్టల్స్కు పంపి చేతులు దులుపేసుకునే దుస్థితికి చరమగీతం పాడటం జరిగింది. కేసీఆర్ ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ ఎన్నికల ప్రణాళికల నుంచి ఆచరణ ప్రణాళికలుగా మారటం తెలంగాణకు శుభపరిణామంగా మారుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అమ్మ ఒడిగా మారినప్పుడే ప్రభుత్వాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ దేశానికి మానవ వనరులను అందించే భావి భారతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చా రు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నరక కూపాలుగా మార్చివేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో తొలిగా బాగు చేసుకోవాల్సింది ప్రభుత్వ బడిని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. పేద వర్గాల పిల్లలకు ప్రమాణాలు గల విద్యను అందించేం దుకు మా ప్రభుత్వం నడుం కట్టిందని చెప్పడానికి తొలిమెట్టుగా హాస్టళ్ల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే పేద పిల్లల కంచాలలోకి సన్న బియ్యం అందించే పని ఎంతో ఉన్నతమైనది. మధ్యా హ్న భోజన పథకం విజయవంతం కావాలంటే అమ్మ పెట్టే అన్నం ముద్దగా పిల్లలకు కడుపునిండా శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. ఈ పిల్లలకు పెట్టే ప్రతిపైసా ఖర్చు రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఈ దేశ భవిష్యత్కు వెలకట్టలేని పెట్టుబడిగా మారుతుంది. పీ.వీ.నర్సింహారావు విద్యాశాఖా మంత్రిగా ఉన్న ప్పుడు ఏర్పరచిన సర్వేల్ లాంటి గురుకుల పాఠశాలలే ఆ తర్వాత దేశం మొత్తానికి నవోదయ స్కూల్స్గా రూపుదాల్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన మండలానికి ఒక గురుకుల పాఠశాల అన్నది సఫలీకృతమైతే దేశానికి ఈ విధానం ఆదర్శవంతంగా నిలుస్తుంది. గురుకుల విద్యావ్యవస్థ విజయవంతంగా నిలబ డేందుకు తీసుకున్న తొలి నిర్ణయంగా హాస్టళ్లకు సన్న బియ్యం అమలు కార్యక్రమంగా చూడవచ్చును. సాంఘి క సంక్షేమ హాస్టళ్లను మరింత విస్తృతపర్చాల్సి ఉంది. పేద పిల్లలకు అన్ని వసతులు అందించే విధంగా మొత్తం పాలనా యంత్రాంగం పని చేయాలి. పేద పిల్లలకు నాసిరకమైన తిండిపెడితే, వారికి వచ్చే నిధుల ను మింగే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. పేద వర్గాల పిల్లలకు మంచి వసతులు, వారికి మేలైన విద్యనందిస్తే అది దేశానికి తిరుగులేని బలం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చలికి వణుకుతున్న విద్యార్థికి కప్పుకునే దుప్పటి కావాలి. కంచంలో మెరిసే తెల్లటి అన్నంగా ప్రభుత్వం కనిపించాలి. హాస్టళ్లల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తుడిచివేసే చేతులుగా ప్రభుత్వం మారాలి. నెత్తికి నూనెలేని చింపిరి జుట్లకు చల్లదనాన్నిచ్చే కొబ్బరినూనెగా మారాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నుంచి వచ్చిన పిల్లలే నవలోకాలు వికసింపజేస్తారు. కొత్త శకానికి ఈ సంక్షేమ హాస్టళ్లే ప్రాణం పోయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను శక్తివంతం చే స్తే అక్కడి నుంచి వచ్చిన పిల్లలు దేశాన్ని అన్నిరంగాల్లో సర్వసమర్థంగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు సన్నబియ్యం అందించే ఈ పథకాన్ని విజయవంతం చేసే పనిలో మొత్తం పాలనా యంత్రాంగం సఫలీకృతం కావాలి. పేద పిల్లల నోటికాడ కూడును కూడా సొమ్ము చేసుకునే అవినీతిపరులను జైలుకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 90599 67525) -
అర్హులందరికీ ఆహార భద్రత
గజ్వేల్: అర్హులందరికీ ‘ఆహార భద్రత’ కార్డులను అందిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పలు కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పీఎన్ఆర్ గార్డెన్స్లో ‘ఆహార భద్రత’పథకం కింద లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ‘ఆహార భద్రత’ పథకంపై పచ్చ పార్టీ నాయకులు కార్డులను తొలగిస్తున్నరంటూ చేస్తున్న దుష్పప్రచారం నమ్మవద్దని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే వారు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని టీడీపీ నాయకులనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులపై 20కిలోల బియ్యం సీలింగ్ను ఎత్తేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తనలాగే నాణ్యమైన భోజనం తినాలనే సంకల్పంతో సీఎం సన్న బియ్యం అందిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించగలిగితే వారు చదువులో రాణించే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ తహశీల్దార్ బాల్రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు బోస్, నరేందర్రావు, సంతోషిణి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, బెండ మధు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని నెలకొన్న సమస్యలన్నింటినీ 15 రోజుల్లో పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి రావెల మాట్లాడుతూ ... రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల తనిఖీల్లో భాగంగా హాస్టళ్లకు వెళ్లినప్పుడు వార్డెన్స్ ఉంటున్నారని... దీంతో ఏ విద్యార్థి సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. హాస్టల్ విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయడం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు తమ సమస్యను ఫోన్ చేసి ఏకరువు పెడుతున్నారని రావెల పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అలాగే పత్తికొండ ఎస్సీ హాస్టల్లో బాత్రూమ్లు లేవని, తాగునీటి వసతి, వంటగదులు లేవని విద్యార్థి జ్యోత్స్య ఫిర్యాదు చేసిందని రావెల తెలిపారు. అలాగే యూనిఫామ్ రెండు జతలే ఇచ్చారని మరో విద్యార్థి ఫిర్యాదు చేసిందని చెప్పారు. హాస్టల్ అసలు బాగోలేదని రేకుల షెడ్డులో ఉంచడం వల్ల వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని బ్రహ్మదేవి హాస్టల్ విద్యార్థి ఫిర్యాదు చేసిందని రావెల వివరించారు. -
హాస్టల్లో కామ పిశాచులు
సాక్షి, ఏలూరు / బుట్టాయిగూడెం : అమాయక బాలికలపై కామపిశాచులు విరుచుకుపడ్డారు. బుట్టాయగూడెం హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయూన్ని సంక్షేమ శాఖ అధికారులు కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డికి ఫిర్యాదు చేయడంతో విచారణ . వివరాల్లోకి వెళితే.. బుట్టాయగూడెం మండలంలోని ఓ హాస్టల్లో దాదాపు 60 మంది బాలికలు ఉన్నారు. హాస్టల్లో ఓ కాంట్రాక్టు ఉద్యోగినికి డబ్బు ఆశ చూపించి కొందరు వ్యక్తులు బాలికలపై అకృత్యానికి ఒడిగట్టారు. ఈ విషయూన్ని బయటపెట్టి అల్లరి చేస్తామని కొందర్ని బెదిరించారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీటీసీ డీఎస్పీ కె.సరిత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.ధర్మేంద్రను విచారణాధికారులుగా నియమించారు. సోమ, మంగళ వారా ల్లో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు స్థానిక యువకులను, అసాం ఘిక కార్యకలాపాలకు సహకరించిందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్యామలను అరెస్ట్ చేశారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రఘురామ్రెడ్డి మంగళవా రం హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై ఉమెన్ ట్రాఫికింగ్, బలవంతం, ఫోక్స్ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాలికలను వైద్య పరీ క్షల కోసం ఏలూరు తరలించారు. వారిని ఎస్పీ పరామర్శించారు. వెలుగు చూసిందిలా హాస్టల్లోని విద్యార్థినులు ప్రతిరోజు తమకు కావలసి వస్తువులు కొనుగోలు చేసేందుకు సెంటర్లోని షాపులకు వెళుతుంటారు. ఆదివారం సాయంత్రం ఈ విషయం మేట్రిన్ జ్ఙానకుమారికి తెలియంతో వారిని మందలిం చారు. అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్యామలకు బయటి వ్యక్తుల నుంచి ఫోన్కాల్ వచ్చింది. ఒకసారి మాట్లాడి పెట్టేసినా మళ్లీ ఫోన్ రావడంతో మేట్రిన్ ఆ ఫోన్ తీసుకుని మాట్లాడారు. గతంలో తాను మందలించిన యువకుడి గొంతు కావడంతో వార్డెన్కు అనుమానం వచ్చింది. విద్యార్థినులను ఆరా తీయగా, కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో శ్యామల సహకారంతో హాస్టల్లోకి వస్తున్నారని వెల్లడించారు. దీంతో సోమవారం జిల్లా అధికారులకు మేట్రిన్ ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. మేట్రిన్ సస్పెన్షన్ మేట్రిన్ జ్ఞానకుమారి జంగారెడ్డిగూడెం హాస్టల్లో పనిచేస్తూ ఈ హాస్టల్కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అప్పుడప్పుడూ రావటంతో పర్యవేక్షణ కరువైంది. నైట్వాచర్ శ్యామల ప్రతిరోజు విద్యార్థుల్ని తీసుకుని కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అదే ఈ దారుణానికి దారి తీసిం ది. ఇదిలావుండగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసినట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.శోభారాణి చెప్పారు. వివరణ కోరిన బాలల హక్కుల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ను వివరణ కోరింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలికలకు రక్ష ణ కల్పించాలని కమిషన్ ఆదేశించిం దని కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్, రహీముద్దీన్ తెలిపారు. కఠినంగా శిక్షించండి : మంత్రి ఏలూరు (ఆర్ఆర్ పేట) : సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత జిల్లా ఎస్పీని ఆదేశించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సుజాత ఈ విషయమై కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వసతి గృహంలోని ఘటన సభ్యసమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉందని, సంక్షేమ హాస్టల్స్ను దేవాలయాలుగా భావించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహించడం దారుణమని ఆమె పేర్కొన్నారు.దోషులు ఎవరైనా చర్యలు తీవ్రంగా ఉండాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. -
అన్నం కోసం అల్లాడిపోతున్నాం
అంట్లు తోమిస్తున్నారు మెనూ అమలు చేయడంలేదు కన్నీళ్లెట్టుకున్న హాస్టల్ విద్యార్థులు సిబ్బందిపై డీడీ ఆగ్రహం అవనిగడ్డ : ‘‘చదువుకునేందుకు వచ్చిన మాతో అంట్లు తోమిస్తున్నారు.. కడుపునిండా అన్నం పెట్టడం లేదు... మెనూ అమలు చేసిన పాపానపోలేదు’’ ఇదీ స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం-1 విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఎంపీపీ బండె నాగవెంకట కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి) వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలపై విచారణ నిర్వహించేందుకు సోమవారం రాత్రి డీడీ మధుసూదనరావు వసతి గృహానికి వచ్చారు. విద్యార్థులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రాగిమాల్ట్ సక్రమంగా ఇవ్వడం లేదని, స్నాక్స్కింద ఇచ్చే బిస్కెట్ప్యాకెట్ను ముగ్గురికి పంచుతున్నారని, అన్నం సరిగా ఉడకడం లేదని, బాత్రూమ్లు సక్రమంగా లేవని, వసతి గృహంలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదని కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. దీనిపై ఆగ్రహించిన డీడీ మధుసూదనరావు కమాటీ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో అంటులు తోమించడమేంటి, మెనూ సక్రమంగా అమలు చేయనందుకు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం నుంచి ఒంట్లో బాగోని కారణంగా పిల్లలతో ఈ పనులు చేయిస్తున్నానని సమాధానం ఇవ్వగా... మాతో రోజూ ఇదే పని చేయించుకుంటున్నారని విద్యార్థులు డీడీకి వివరించారు. వారిపేర్లు డీడీ నమోదు చేసుకున్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులు తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సాయంత్రం 5.30గంటల సమయంలో ప్రైవేటుకు వెళ్లేముందు అన్నం పెడుతున్నారని, రాత్రి 10గంటల సమయంలో తిరిగి వస్తామని, అప్పుడు ఆకలివేస్తున్నా హాస్టల్లో తినేందుకు ఏమీ పెట్టడం లేదని డీడీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటుకు వెళ్లేముందు స్నాక్స్, రాగిమాల్ట్ ఇవ్వాలని, విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టాలని డీడీ ఆదేశాలు జారీచేశారు. వసతి గృహాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విచారణలో ఏఎస్డబ్ల్యువో జీ అశోక్కుమార్ పాల్గొన్నారు. -
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : రక్షణగా ఉండాల్సిన హాస్టల్ యజమానే .... యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వనస్థలిపురం బీఎన్ రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన 5 మంది యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా యువతుల ఫిర్యాదుతో నరేష్....హాస్టల్ బోర్డు పీకేశాడు. -
మెనూలో కోత
ఇందూరు, న్యూస్లైన్: వసతిగృహ విద్యార్థులకు పౌష్టికాహారంలో కోత పడనుంది. ప్రస్తుతం అమలవుతున్న మెనూలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నానాటికీ పె రుగుతున్న ధరల కారణంగా పౌష్టికాహారంలో కోతలు విధించడానికి సంక్షేమాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పాటికే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందటం లేదనుకుంటే ఇటు పౌష్టికాహారానికీ తూట్లు పొడుస్తున్నారు. వారంలో ఒక కోడి గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొత్త మెనూను తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం ఫైలును పంపించారు. కలెక్టర్ సంతకం చేసిన వెంటనే కోతలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త మెనూ సం క్రాంతి తరువాత అమలు చేసే అవకాశం ఉందని సంక్షేమాధికారులు పే ర్కొంటున్నారు. కాగా వసతి గృహాలకు గుడ్లు, పప్పులు, నూనెలు ఇతర నిత్యవసరాలను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు, వార్డెన్లు చేతు లెత్తేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం, గుడ్డు రేటు రూ.5కు ఎగబాకడం, సిలిండర్ ధర కొత్త సంవత్సరంలో రూ.1400లకు చేరువ కావడంతో వసతి గృహ విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడంతో పౌష్టికాహారంలో కోతలు విధించాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లు ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పొట్టగొట్టడం న్యాయమేనా..? పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా ప్రభుత్వం 9 డిసెంబర్ 2012నకొత్త మెనూను అమలు చేయాలని జీఓ జారీ చేసింది. ప్రతి విద్యార్థికి ప్రతి రోజు ఒక గుడ్డు, అరటి పండుతో పాటు పాలు అందించాలని సూచించి అదనంగా నిధులు కేటాయించింది. దీనిని జిల్లా సంక్షేమాధికారులు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆరు నెలలుగా అన్ని రకాల వస్తువులపై ధరలు పెరగడంతో సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగొలా నెట్టుకుంటూ వచ్చిన వార్డెన్లకు ఇప్పుడు సాధ్యం కావడంలేదు. అయితే ధరలు ఎంత పెరిగినా విద్యార్థులకు అందించాల్సిన ఆహారంలో కోతలు విధించడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అవసరం అయితే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులను తెప్పించాలే గానీ విద్యార్థులకు పౌష్టికాహారం దూరం చేయడం సరికాదంటున్నారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం 120 వరకు ఉన్నాయి. సూమారు 10 వేల నుంచి 12 వేల మంది విద్యార్థుల వరకు ఉంటున్నారు. వీరికి కొత్త మెనూ ప్రకారం వారానికి ఆరు రోజులకు బదులు ఐదు రోజులు గుడ్డును అందించనున్నారు. అరటి పండును వారానికి ఆరు రోజుల బదులు నాలుగు రోజులు ఇవ్వనున్నారు. ఇలా ప్రతి విద్యార్థి నెలకు నాలుగు గుడ్లు, 8 అరటి పండ్లను కోత విధించనున్నారు. ఇవే కాకుండా మరి కొన్ని కూడా కోతలు విధించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్దే తుది నిర్ణయం... -ఖాలేబ్, సాంఘిక సంక్షేమ శాఖ,జాయింట్ డెరైక్టర్ వసతిగృహ విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోతలు విధిస్తున్నామనే విషయం వాస్తవమే. అయితే అధికారులందరం కలిసి వారానికి ఒక గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని నిర్ణయించాం. ఈ విషయంలో కలెక్టరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్, కూరగాయల ధరల పెరుగుదల కారణంగా ఇలా కోతలు విధించడం తప్పడంలేదు. -
ప్రభుత్వ హాస్టళ్లలో భయంకరమైన పరిస్థితులు
పై ఫొటోలో ఆరుబయట స్నానం చేస్తున్నది ఎర్రగుంట్ల బీసీ హాస్టలు విద్యార్థి. ఇక్కడ 50మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మరుగుదొడ్లు, స్నానపుగదులు లేవు. దీంతో అందరూ మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే..బయటే స్నానం చేయాల్సిందే. కనీసం కుళాయి సౌకర్యం కూడా లేదు. ఉన్న ఒక్క చేతిపంపు సాయంతో విద్యార్థులంతా స్నానం చేయాలి. ఈ హాస్టలు అద్దె భవనంలో ఉంది. దోమలు విపరీతంగా పెరగడం, ఒక్క దోమతెర కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడుతున్నారు. పైగా వార్డెను రాత్రి బసచేయడం లేదు. క్రింది ఫొటోలో ఇరుకుగదిలో కూర్చున్న అమ్మాయిలంతా ముద్దనూరు బీసీ బాలికల హాస్టలు విద్యార్థినులు. ఈ హాస్టలు అద్దె భవనంలో నడుస్తోంది. నిజానికి ఈ భవనంలో కూర్చున్నా 40మందే పడతారు. అలాంటిది రోజూ 73మంది అక్కడ నిద్రిస్తున్నారంటే వారు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఇట్టే తెలుస్తుంది. మరో దారుణమైన విషయమేంటంటే వీరందరికీ ఒక్క లెట్రిన్, ఒకే బాత్రూం ఉంది. ఇక్కడ రాత్రి వేళల్లో వార్డెన్ ఉండటం లేదు. సాక్షి, కడప : జిల్లాలోని హాస్టళ్లలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క చోట ఒకే లెట్రిన్ ఉంటే...ఇంకొన్ని చోట్ల కుళాయిల సౌకర్యం లేదు..మరికొన్ని చోట్ల తలుపులు..కిటికీలు లేవు. ఎక్కడా దోమతెరలు లేవు. ఆర్థిక స్థోమత లేక చదువుకుందామనే ఆశతో హాస్టళ్లను ఆశ్రయిస్తున్న విద్యార్థులు...అందులో రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ అపరిశుభ్రత మధ్య ప్రతి హాస్టలులో రోజూ 5-10మంది జ్వరాలు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కడప నగరంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో తలుపులు లేవు. ట్రంకుపెట్టెలు అడ్డుపెట్టుకుని నిద్రిస్తున్నారు.మ అలాగే కిటికీలకు తలుపులు లేవు. వర్షాకాలం కావడంతో విష పురుగులు వస్తే పెద్ద ప్రమాదమే జరిగే పరిస్థితి. ఉప్పలూరుతో పాటు ముద్దనూరులోని మూడు ఎస్సీ హాస్టళ్లలో కూడా మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. తాగునీటి వ సతి కూడా చాలా హాస్టళ్లలో లేదు. దీంతో భోజనానికి కూడా అపరిశుభ్రమైన నీటిని వినియోగిస్తున్నారు. విద్యార్థులు నీళ్లు తాగలేక భోజనం తర్వాత బయటకు వెళ్లి చుట్టుపక్కల వారి ఇళ్లలో అడిగి తాగడం, లేదంటే పల్లెల్లోని వీధికుళాయిల నీటిని తాగుతున్నారు. ఏ హాస్టలులోనూ దోమ తెరలు లేవు. దీంతో దోమకాటుకు విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. చాలాచోట్ల కప్పుకునేందుకు దుప్పట్లు లేవు. ఇటీవల బెడ్షీట్లు మాత్రమే ఇచ్చారు. దుప్పట్లు ఇవ్వలేదు. భోజనం అధ్వానం: హాస్టళ్లలో రోజువారీ మెనూను దాదాపు ఏ హాస్టలూ పాటించడం లేదు. ఇదేంటని అడిగితే రోజూ పెడుతున్నామని, సరుకులు అయిపోవడంతో ఈ రోజు మెనూ ప్రకారం భోజనాలు లేవని ఒకరంటే... ఇంకొంతమంది రోజూ ఇలాగే ఉంటుందని బాహాటంగానే అంగీకరిస్తున్నారు. దీంతో పోషకాహారం లేక విద్యార్థుల్లో రక్తహీనత సమస్య కూడా ఎక్కువగా ఉంది. గతేడాది జవహర్ బాల ఆరోగ్యరక్ష ద్వారా విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తే రక్త హీనతతో బాధపడే వారిలో అధిక శాతం మంది హాస్టలు విద్యార్థులు ఉన్నారు. అలాగే ఏ హాస్టలులోనూ వార్డెన్లు రాత్రివేళల్లో నిద్రించడం లేదు. కనీసం బాలికల హాస్టలులో కూడా ఉండటం లేదు. కేవలం వాచ్మన్ మాత్రమే ఉంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే...రాత్రి వేళల్లో ఉండాల్సిన పనిలేదంటున్నారు. హాజరుపట్టిలో ఎక్కువ.. హాస్టళ్లలో తక్కువ: జిల్లాలోని దాదాపు అన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యకూ, హాజరుపట్టిలోని లెక్కకు పొంతనే లేదు. హాజరుపట్టిలో కంటే దాదాపు 40 శాతం తక్కువగా ఉన్నారు. ఇదేంటని అడిగితే ‘ఇది మామూలే సార్.. అన్ని హాస్టళ్లలోనూ ఉండేదే.. అంటూ తాపీగా సమాధానం చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 750-850 రూపాయలు ఇస్తోంది. (3-7తరగతులు:750, 8-10తరగతులకు 850) ఈ డబ్బుతో మెనూను అమలు చేయడం అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో వార్డెన్లు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి వచ్చిన డబ్బును స్వాహా చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలు ఉన్నాయి... తీర్చుతాం: సీఎస్ఏ ప్రసాద్, జేడీ, సాంఘిక సంక్షేమశాఖ ‘సాక్షి’ విజిట్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వాస్తవాలే. కూరగాయల ధరలు పెరగడం వల్ల మెనూను పాటించడం లేదు. అందుకే మళ్లీ టెండర్లు వేస్తున్నాం. 15 రోజుల్లో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. మరుగుదొడ్లు, కిటికీలు, తలుపులు కూడా చాలావాటిలో లేవు. వీటి మరమ్మతుల కోసం 4కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. దోమతెరలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు లేవు. ఎవరైనా దాతలు ఇస్తే స్వీకరిస్తాం.