చంద్రబాబుకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు  | Election Commission Issued Notices To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు 

Published Tue, Mar 19 2024 5:40 AM | Last Updated on Tue, Mar 19 2024 12:27 PM

Election Commission Issued Notices To Chandrababu Naidu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై టీడీపీ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు 

24 గంటల్లో వాటిని తొలగించాలని సీఈవో ఆదేశాలు 

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటీసు­లు జారీ చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ టీడీపీ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ తదితర సామాజిక మా­ధ్య­మాల ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వంపై దాడిచేస్తోందని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ను కించపరిచేలా టీడీపీ సోషల్‌ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. సోషల్‌ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉ­న్నా­యని సీఈవో స్పష్టం చేశారు. సీఈవోకు ఫిర్యా­దు చేసిన వారిలో లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఎమ్మె­ల్యే మద్దాళి గిరి, వైఎస్సార్‌సీపీ అధికార ప్ర­తి­నిధి ఎ.నారాయణమూర్తి, పార్టీ న్యాయవిభా­గం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement