Chandrababu Naidu Tests Covid 19 Positive, He Is Under Home Quarantine - Sakshi
Sakshi News home page

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్‌

Published Tue, Jan 18 2022 10:05 AM | Last Updated on Tue, Jan 18 2022 11:04 AM

TDP President N Chandrababu Naidu Tests Covid19 Positive - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. కొడుకు నారా లోకేష్‌కు కరోనా సోకిన కొద్ది గంటల్లోనే చంద్రబాబుకూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంగళవారం ఉదయం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా టెస్టులో స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కాగా చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయితే.. ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు. 
చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement