ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు | There are huge opportunities for AP in pharma and electronics | Sakshi
Sakshi News home page

ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు

Published Sun, Mar 5 2023 4:35 AM | Last Updated on Sun, Mar 5 2023 4:35 AM

There are huge opportunities for AP in  pharma and electronics - Sakshi

(విశాఖపట్నంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను అమలు చే­స్తోం­దని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రా­నిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరా­లు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు.

శనివారం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూల­తల దృష్ట్యా మెరైన్‌ ఉత్పత్తులు, ఔషధాలు, ఎల­క్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా­యన్నారు.  రా­ష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తో­డ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టు­బ­డులను ఆక­ర్షించడంలో, మౌలిక సదుపా­యాల కల్ప­నలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడు­తున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు.

2014లో 45 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్‌ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్‌ ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగు­పర్చు­కుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్‌ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్‌ల (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement