-
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది. -
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్గా పరిగణిస్తారు. -
గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు..
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో గత నెల (ఏప్రిల్) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
కేవైసీతోనే.. ఫండ్స్లో పెట్టుబడులు
మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? గతంలో ఎప్పుడో కేవైసీ (నో యువర్ కస్టమర్) చేసి ఉన్నారా..? అయితే ఒక్కసారి మీరు మీ కేవైసీ స్థితిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారు మరో విడత కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన తరుణం వచి్చంది. ఇందుకు విధించిన ఏప్రిల్ 1 గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్న పథకాలు కాకుండా.. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం కేవైసీని అప్డేట్ చేసుకోవడమే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి తిరిగి కేవైసీ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. కొంత మంది ఇన్వెస్టర్లు మినహా చాలా మందిలో దీనిపై స్పష్టత లేదు. కేవైసీ చేసేందుకు ప్రయత్నించకపోవడం, ఏ డాక్యుమెంట్లు కావాలో అవగాహన లేకపోవడమే ఈ అయోమయానికి కారణమని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్టర్ సర్వీసెస్ హెడ్ అబ్దుల్లా చౌదరి అంటున్నారు. మ్యూచు వల్ ఫండ్స్ సంస్థల వెబ్సైట్ నుంచే ఆన్లైన్లో సులభంగా కేవైసీని మరోసారి చేసుకోవచ్చని తెలిపారు. చెక్ చేసుకోవాల్సిందే.. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తిరిగి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అంటే లేదన్నదే సమాధానం. అసలు ఎవరు కేవైసీ ప్రక్రియను తిరిగి నిర్వహించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఆన్లైన్లో తమ కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకుంటే కానీ తెలియదు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సీవీఎల్ను కేవైసీ కోసం ఉపయోగిస్తుంటారు. కనుక సీవీఎల్కేఆర్ఏ డాట్ కామ్ సైట్కు వెళ్లాలి. లేదంటే ఎన్డీఎంఎల్ కేఆర్ఏ, క్యామ్స్ (సీఏఎంఎస్) కేఆర్ఏ లేదా కార్వీ కేఆర్ఏ ద్వారా తమ కేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. సీవీఎల్కేఆర్ఏ పోర్టల్కు వెళ్లి పైన కనిపించే మెనూ ఆప్షన్లలో కేవైసీ ఇంక్వైరీ సెలక్ట్ చేసుకోవాలి.తర్వాత వచ్చే విండోలో పాన్ నంబర్ నమోదు చేయాలి. ఐ యామ్ హ్యూమన్ పక్కన ఉన్న బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ స్థితి అక్కడ కనిపిస్తుంది. కేవైసీ వ్యాలిడేటెడ్.. అని ఉంటే తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం మీరు అప్పటికే సమర్పించిన కేవైసీ ఆధార్ ఆధారితమైనది. మొబైల్, ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉన్నట్టు. కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. మళ్లీ కేవైసీ అవసరం లేదు. కేవైసీ రిజిస్టర్డ్.. అని ఉంటే మీరు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ (ఓవీడీ) ఆధారంగా కేవైసీ చేసినట్టు. అంటే ఆ సమయంలో ఆధార్ ధ్రువీకరణ చేయలేదు. మొబైల్, ఈ మెయిల్ ధ్రువీరణ చేసినట్టు. అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, ఇప్పటి వరకు పెట్టుబడులు లేని కొత్త సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఆన్ హోల్డ్.. మొదట సమర్పించిన కేవైసీ ఓవీడీ ఆధారితం కాదని దీనర్థం. లేదంటే ఈ మెయిల్, మొబైల్ నంబర్ మనుగడలో లేవని అర్థం. ఈ స్థితి చూపిస్తుంటే, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణకు అనుమతి లేదని తెలుసుకోవాలి. వీరు తాజాగా కేవైసీ సమర్పించాలి. రిజెక్టెడ్ ఆన్ హోల్డ్ 10–15 రోజుల పాటు ఉన్న తర్వాత రిజెక్టెడ్గా మారుతుంది. వీరు కూడా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు నిర్వహించలేరు. అంటే తాజాగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పటికే ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకోలేరు. తాజాగా కేవైసీ సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ కేవైసీ వ్యాలిడేటెడ్ అనే స్థితి ఉన్న వారు మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా తాజా కేవైసీ సమర్పించడం మంచిది. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ అయితే.. పాన్ నంబర్ నమోదు చేసి, క్యాపెచా కోడ్ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో మీరు చేయాల్సినది ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ వద్ద కేవైసీ నమోదు చేయని వారు ఇక్కడ కేవైసీ చేయడానికి వీలు పడదు. అదే సీవీఎల్–కేఆర్ఏలో అయితే మీ వివరాలు సమర్పించిన అనంతరం.. కేవైసీ ఎక్కడ నమోదై ఉన్నది కూడా చూపిస్తుంది.అంటే సీవీఎల్ కేఆర్ఏ/ఎన్డీఎంఎల్ కేఆర్ఏ/డాటెక్స్ కేఆర్ఏ/క్యామ్స్ కేఆర్ఏ/ కార్వీ కేఆర్ఏ వీటిల్లో ఎక్కడ నమోదైతే కేవైసీ స్టేటస్ కాలమ్లో అక్కడ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ఎక్కడ నమోదై ఉందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదంటే మీ పెట్టుబడులు కలిగిన ఫండ్ హౌస్ (ఏఎంసీ) పోర్టల్కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ లేదా సెబీ నమోదిత ఆర్టీఏ (రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్) హెల్ప్లైన్కు కాల్ చేయవచ్చు. కేవైసీ అప్డేట్కేవైసీ స్థితి తెలుసుకున్న తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్సైట్కు అయినా వెళ్లి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీని సమర్పించొచ్చు. ఇలా ఒకసారి కేవైసీ అప్డేట్ అయితే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడుల్లోనూ అదే ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, సంస్థ పోర్టల్కు వెళ్లి తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.ప్రొఫైల్ సెక్షన్లో కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ‘రిజిస్టర్డ్’ లేదా ‘ఆన్హోల్డ్’ చూపిస్తుంటే ఎం–ఆధార్ లేదా డిజిలాకర్ ఖాతా నుంచి ఈ–ఆధార్ సమర్పించొచ్చు. దీంతో యూఐడీఏఐ ద్వారా వచ్చే ఓటీపీని సమర్పించిన అనంతరం కేవైసీ వ్యాలిడేట్ అవుతుంది. కేవైసీ రిజిస్టర్డ్ అనే స్థితితో ఉన్న వారు మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, తాజాగా కేవైసీ సమర్పించేంత వరకు సాధ్యపడదు. అప్పటి వరకు పెట్టుబడులు లేని మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. అప్పుడు ఆయా సంస్థ కేవైసీని పరిశీలిస్తుంది. వ్యాలిడేటెడ్ అని ఉంటేనే వారు ఆమోదిస్తారు. రిజిస్టర్డ్ అని ఉంటే మాత్రం కేవైసీ సమర్పించాలి. నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీ సమర్పించే వారు ఆధార్ కాపీపై క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దాన్ని సిస్టమ్ రీడ్ చేయలేదు. అలాంటప్పుడు అది వ్యాలిడేట్ కాదు. ఎప్పుడో ఆధార్ తీసుకున్న వారి డాక్యుమెంట్పై క్యూఆర్ కోడ్ మసకగా మారుతుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఎన్ఆర్ఐల పరిస్థితి?భారతీయులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) కేవైసీ అంత సులభం కాదు. ఇతర దేశాల్లో నివసిస్తూ, భారత మొబైల్ నంబర్ కలిగి లేని వారు.. ఆధార్ ఆధారిత ఓటీపీ స్వీకరణ, నమోదు చేయలేరు. దీంతో ఎన్ఆర్ఐల కేవైసీ స్థితి ‘రిజిస్టర్డ్’గానే కొనసాగొచ్చు. దీంతో అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇకమీదటా పెట్టుబడులను ఎన్ఆర్ఐలు కొనసాగించుకోవచ్చు. ఎన్ఆర్ఐలు భారత్లో జారీ అయిన మొబైల్ నంబర్ కలిగి ఉంటే, ఆన్లైన్లో ఆధార్ ఆధారితంగా కేవైసీని సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదంటే వీరు కొత్త సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ అధికారికంగా చెల్లుబాటయ్యే ఇతర డాక్యుమెంట్ల సాయంతో కేవైసీ సమర్పించడమే మార్గం. తిరిగి కేవైసీ.. ఏ డాక్యుమెంట్?అధికారికంగా చెల్లుబాటయ్యే ఏ డాక్యుమెంట్ (ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డ్) సాయంతో తిరిగి కేవైసీ చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ సాయంతో కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడమే అత్యుత్తమం. ఇతర డాక్యుమెంట్తో కేవైసీ చేస్తే కనుక, కొత్త మ్యూచువల్ ఫండ్ సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేవైసీ సమర్పించాల్సి వస్తుంది. అదే ఆధార్తో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. -
‘కోతల’ రాతలు ఇంకెన్నాళ్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అనంతపురానికి మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. హైపర్లూప్ టెక్నాలజీతో గంటలో అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవచ్చు. దుబాయ్కు చెందిన బీఆర్షెట్టి అమరావతిలో నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది... ‘ఇవన్నీ గ్రాఫిక్స్ రా’ అని ప్రజలు ఎప్పుడో తేల్చేసినా ఆయన కూలీ రామోజీ మాత్రం ఆ మాయాజాలం నుంచి బయటకు రావడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో విదేశీ పెట్టుబడులు వాస్తవ రూపంలో కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టేసుకుని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంటూ కొయ్ రాజా కొయ్ శీర్షికతో ఓ పుచ్చు కథనాన్ని ప్రచురించారు. కోవిడ్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్కు చెందిన యకహోమా టైర్స్ అచ్యుపుతాపురం సెజ్లో సుమారు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. యూరప్కు చెందిన పెట్రేగ్యాస్ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ టెర్మినల్ వారం రోజుల క్రితమే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్కు చెందిన డైకిన్ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్ను తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది. టోరే ఫార్మా అక్కడే రూ.1,000 కోట్ల పెట్టుబడులను వాస్తవరూపంలో తెచ్చింది. క్యాడ్బరీస్ చాక్లెట్స్ మాండలీజ్ రూ.1,600 కోట్లతో భారీగా విస్తరిస్తోంది. అదిదాస్ బ్రాండ్తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ హిల్టాప్ సెజ్ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దావోస్లో పాలకూర పప్పు.. వాస్తవాలు ఇలా కళ్లకు కనబడుతుంటే.. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్ ఔట్రీచ్లు ఏర్పాటు చేసింది కానీ ఏం సాధించలేదంటూ ఈనాడు రాసేసింది. గత ప్రభుత్వంలో దావోస్ వెళ్లిన చంద్రబాబు పాలకూర పప్పు... బెండకాయ వేపుడు ప్రసంగం ఇప్పటికీ అంతర్జాతీయంగా కామెడీ పీస్గా ఉంది. ఈ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడ వనరులు అవకాశాలను వివరిస్తూ వార్తలు రాయాల్సింది పోయి.. నీచ రాజకీయాల బాబు కోసం స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా విషపురాతలు రాయడం తగునా? అని యువత ప్రశ్నిస్తోంది. -
ఎంఎఫ్ ఆస్తులు రూ. 53.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం! సిప్ దన్ను క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. 2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ఈక్విటీకే ఓటు గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది. -
మార్చిలో ఎంఎఫ్లు డీలా
న్యూఢిల్లీ: గత నెల(మార్చి) ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు నీరసించాయి. జనవరితో పోలిస్తే 16 శాతం క్షీణించి రూ. 22,633 కోట్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ ఆధారిత పథకాలకు ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్ల పెట్టుబడులు లభించాయి. అయితే వరుసగా 37వ నెలలోనూ ఈక్విటీ ఎంఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) మార్చి గణాంకాలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం థిమాటిక్ ఫండ్స్, కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్ఎఫ్వోలు) ఇందుకు సహకరించాయి. ప్రధానంగా సిప్ నెలవారీ పెట్టుబడులు మార్చిలో రూ. 19,270 కోట్లకు చేరడం మద్దతిచి్చంది. ఫిబ్రవరిలో ఇవి రూ. 19,187 కోట్లుగా నమోదయ్యాయి. మార్చిలో హైబ్రిడ్ ఫండ్స్ రూ. 5,584 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇక మార్చితో ముగిసిన గతేడాది(2023–24) అంతక్రితం ఏడాదితో పోలిస్తే సిప్ పెట్టుబడులు 28 శాతం వృద్ధితో రూ. 2 లక్షల కోట్లను తాకాయి. రుణ పథకాల నుంచి అత్యధికంగా రూ. 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. మార్చిలో మొత్తం ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఇందుకు ముందస్తు పన్ను చెల్లింపులు, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువలకు చేరడం కారణమయ్యాయి. ఇక ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల విలువ(ఏయూఎం) ఫిబ్రవరిలో నమోదైన రూ. 54.54 లక్షల కోట్ల నుంచి మార్చికల్లా రూ. 53.4 లక్షల కోట్లకు వెనకడుగు వేసింది. -
రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా దాగుందన్నది స్పష్టమైంది. రామోజీ దేశద్రోహం అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్గా ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం. జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, మార్గదర్శి చిట్ఫండ్స్లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్ అనే ఇంగ్లిష్ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. 1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. ఆ సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్ఫండ్స్లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్ఫండ్స్లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది. -
ఇన్వి ట్స్లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీ సంపద పెరగటానికి కారణం ఇదే..
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ ఎంపీగా మళ్ళీ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. నామినేషన్తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అప్పు సుమారు రూ.49.7 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్లలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో తన సంపద గత ఐదేళ్లలో 28 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అఫిడవిట్లో పేర్కొన్న విధంగా ఈయన ఐటీసీ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వంటి బ్లూచిప్లతో సహా 25 స్టాక్స్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలలో కూడా రాహుల్ గాంధీ పెట్టుబడి పెట్టారు. ఇవి ఇటీవలి భారీ ర్యాలీని చూశాయి. 2019లో రాహుల్ గాంధీకి ఎలాంటి స్టాక్స్ లేవని ఆ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తరువాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. 2024 మార్చి 15 నాటికి ఆయన స్టాక్స్ పోర్ట్ఫోలియో విలువ రూ. 4.33 కోట్లు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో రాహుల్ గాంధీ ఆస్తులు 2019 కంటే 2024లో ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అక్కడ రాహుల్ గాంధీ ఇన్వెస్టింగ్.. వంద నుంచి వెయ్యి రెట్ల లాభాలు! -
Fact Check: వినాశకాలే.. విపరీత రాతలే!
తప్పుడు రాతల పూనకంలో రామోజీ ఊగిపోతున్నారు. కరోనా సమయంలో దేశమంతా విపత్కర స్థితిలో ఉంటే, ఆ సమయంలోనూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయి. ఈ సంగతి రామోజీకి తెలుసో లేదో మరి. తెలిసినా నిజాలు రాస్తే ఆయన రామోజీ ఎందుకవుతారు? నిజాలు చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలవుతుందనే శాపముందని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చమత్కరించేవారు. రామోజీకీ బహుశా అలాంటి శాపమే ఉన్నట్లుంది. సీఎంగా జగన్ చొరవ, పట్టుదల, కృషి వల్లనే రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల పత్రికలు కోడై కూస్తున్నాయి. అవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయి. టాటాలు, అంబానీ, అదానీలు ఉత్సాహభరితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్నా, దానికి రామోజీ అబద్ధాల పరదాలు కడుతున్నారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో వేగంగా దూసుకువెళుతోంది. టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల దిన పత్రికలు ప్రముఖంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. అయినా రామోజీ అనే రాష్ట్ర వినాశకారి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘జగన్ అనే నేను ఒక వినాశకారి’ శీర్షికతో ఒక సిగ్గుమాలిన కథనాన్ని వండి వార్చారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను జగన్ ఆకర్షించారు. ఈ ఐదేళ్లలో 130 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి వచ్చినా రామోజీ రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయంటూ దిగజారుడు రాతలు రాసిపారేశారు. ఒక పక్క పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రా>మికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తున్నా , పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటూ రాయడం ఒక్క రామోజీకే చెల్లుతుంది. జీఎస్డీపీలో పరిశ్రమల వాటా పెరగడం, ప్రజల తలసరి ఆదాయం పెరగడమే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం. 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి అది 23.36 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే మన రాష్ట్రంలో రూ.26,931కు పెరిగింది. 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 10.59 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లకు చేరడం ద్వారా ఆరో స్థానానికి ఎగబాకింది. ఇలా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తుంటే పరిశ్రమలపై పగ అంటూ ఈనాడు వంకరరాతలు రాసింది. అమర్రాజా తరలిపోయిందని తప్పుడు ప్రచారం వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూపు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ ఇక్కడా విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. రామోజీకి చెందిన మార్గదర్శి గ్రూపు కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మా గ్రూపు వెళ్లిపోయిందని రాయగలవా రామోజీ...?తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయాల్లోకి రావడం వల్ల కేంద్ర ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారే కాని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిందని చెప్పలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజా వెళ్లిపోయిందంటూ కుందేళ్లు, కొరివి దెయ్యాలు..రాక్షసులు అంటూ రామోజీ చందమామ కథలు రాస్తున్నారు. అక్క చెల్లెమ్మలకు ఉపాధి గత ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు అంటూ కేవలం మాటలకే పరిమితమయింది...దీనికి భిన్నంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికోసం అహరహం జగన్ శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం వాస్తవ పెట్టుబడులను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. దీనికి తార్కాణమే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్. రూ. సుమారు రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా పులివెందులలో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా పలు అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు అక్కడ తయారవుతున్నాయి. రామోజీ వీటి గురించి ఒక్క మాటా రాయరు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒప్పందం కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ గురించి పదేపదే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విషపూరిత కథనాలను అల్లుతారు. గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన వారు భూకేటాయింపుల్లో భారీగా లంచాలను అడగటంతో జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. జాకీ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వాస్తవ రూపంలోకి తీసుకురాలేకపోయిందన్న విషయాన్ని చెప్పకుండా ఆ బురదను ఈ ప్రభుత్వానికి అంటగట్టే విధంగా దిక్కుమాలిన రాతలతో పత్రికను నింపేస్తున్నారు. విశాఖ సమీపంలోని అచ్యుతాపురం వద్ద జపాన్కు చెందిన యకహోమా టైర్స్ కంపెనీలో స్థానిక మహిళలు రూ.22,000 పైగా జీతంతో పనిచేస్తున్నారు అంటూ రెండు రోజుల క్రితం ఈనాడు వసుంధర పేజీలో ‘‘ ఆ చక్రాలను నడిపించేది వాళ్లే’’ అంటూ రాసిన కథనమే అక్క చెల్లెమ్మలకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉపాధి లభిస్తోందో చెప్పడానికి ప్రబల సాక్ష్యం. -
AP: ఎలక్ట్రానిక్స్ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఓవైపు భారీ ఎత్తున పెట్టుబడులు, మరోవైపు యువతకు ఉద్యోగాల వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగం రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. అంతేకాకుండా మరో రూ.15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్సీఆప్టెక్స్ వంటి అనేక దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతోపాటు భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 మే నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవం రూపంలోకి రావడంతో ఏకంగా 36,205 మందికి ఉపాధి లభించింది. మరో 55,140 మందికి ఉపాధి గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, సెల్ఫోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను స్వాగతించింది. అంతేకాకుండా వీటికి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. శ్రీసిటీలో భారీగా తయారీ యూనిట్లు కాగా దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారవుతుండటం విశేషం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసేలా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. కొప్పర్తి ఈఎంసీతో మరో 28,250 మందికి ఉపాధి ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకుపైనే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాకుండా రూ.749 కోట్లతో కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్లైన్లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
విదేశీ ఈటీఎఫ్లో పెట్టుబడులొద్దు
ముంబై: విదేశీ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడులను అనుమతించవద్దంటూ సెబీ తాజాగా దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫి)ను ఆదేశించింది. ఏప్రిల్ 1నుంచి తాజా ఆదేశాలు అమలుకానున్నాయి. కాగా.. ఎంఎఫ్లు విదేశీ సెక్యూరిటీల(షేర్లు)లో 7 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు సెబీ అనుమతిస్తుంది. అయితే 2022 జనవరిలోనే గరిష్ట పరిమితికి చేరడంతో విదేశీ సెక్యూరిటీలలో ఎంఎఫ్ పెట్టుబడులకు ఇప్పటికే సెబీ చెక్ పెట్టింది. ఈ బాటలో ప్రస్తుతం విదేశీ ఈటీఎఫ్లో పెట్టుబడులకు నో చెప్పింది. వెరసి ఇన్వెస్టర్ల నుంచి విదేశీ ఈటీఎఫ్ల కోసం పెట్టుబడులను అనుమతించవద్దంటూ ఎంఎఫ్లను ఆదేశించింది. దేశీయంగా 77 ఎంఎఫ్ పథకాలు విదేశీ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాగా.. విదేశీ మార్కెట్లు దిద్దుబాటుకు లోనుకావడంతో ఎంఎఫ్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ క్షీణించే అవకాశముంది. దీంతో ఆమేర పెట్టుబడులకు సెబీ 2023లో అనుమతించింది. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
ప్రపంచంలో అత్యుత్తమంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్ను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడింగ్ పేరుతో రూ.20లక్షలు స్వాహా
హిమాయత్నగర్: ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఓ లింక్ వచి్చంది. ఆన్లైన్ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో ట్రేడింగ్ అకౌంట్ను తెరిచాడు. మొదటగా సైబర్ కేటుగాళ్లు చెప్పిన విధంగా రూ.50,000 డిపాజిట్ చేశాడు. నకిలీ ట్రేడింగ్ ఖాతాలో లాభాలు వచి్చనట్లు చూపించారు. అది నమ్మిన బాధితుడు బల్క్ ట్రేడింగ్లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. 30 రోజులు స్టాక్స్ కలిగి ఉంటే, మంచి లాభాలు వస్తాయని మరోసారి నమ్మించారు. 30 రోజుల అనంతరం బాధితుడు లాభాలు కలిపి మొత్తం రూ.79 లక్షలు చూపించారు. ఆ డబ్బును విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేయడంతో సాధ్యం కాలేదు.విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని, కమీషన్ ఇతర చార్జీల పేరుతో మరింత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు. అప్పటికే బాధితుడు మొత్తం రూ.20,75,000 పంపిచడంతో ఇంకా డబ్బు పంపిచడం వీలుకాదని తేల్చిచెప్పడంతో కేటుగాళ్లు బాధితుడి ట్రేడింగ్ ఖాతాను కూడా బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి. ‘‘స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు. రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు. 3 ఐపీఓలు రూ.1,325 కోట్లు ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి. -
పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా సహకారం అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు సంపద, ఉద్యోగాల సృష్టికర్తలని కొనియాడారు. పెట్టుబడులను ఆహ్వనించడంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్పాంగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అన్ని రకాలుగా అనువైన ప్రదేశమని, ఔటర్ రింగ్రోడ్డుతోపాటు త్వరలోనే రీజనల్ రింగ్రోడ్డు కూడా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేసి, సమగ్ర అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సింగపూర్ కాన్సుల్ జనరల్కు చెప్పారు. ఫార్మా, టెక్స్టైల్, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి.. అభివృద్ధి చేయనున్నట్లు భట్టి పేర్కొన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతం అంతటా కమర్షియల్, పిల్లల పార్కులు, మాల్స్ నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన భూమి, వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, సింగపూర్కు చెందిన కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఎడ్గర్పాంగ్, భట్టి విక్రమార్కకు వివరించారు. పట్టణ ప్రణాళికలో తమకు మంచి పట్టు ఉందని పాంగ్ తెలిపారు. -
వ్యాట్ తగ్గింపుతో ఏపీలో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాట్ తగ్గింపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తుందని ఏజీఅండ్పీ ప్రథమ్ ఎండీ, సీఈవో అభిలేశ్ గుప్తా తెలిపారు. ఇది తయారీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఏపీ ఆధారిత కంపెనీలు ఇతర రా ష్ట్రాల్లోని తయారీదారులతో పోటీపడేలా చేస్తుందని అన్నారు. రాష్ట్రం స్థిర అభివృద్ధిలో సరికొత్త మార్గాన్ని రూపొందించడానికి, సహజ వాయువు ఆధారిత పారిశ్రామిక వృద్ధిలో కొత్త యుగానికి నాంది పలికేందుకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. సీఎన్జీ, పై ప్డ్ నేచురల్ గ్యాస్ సేవల్లో ఉన్న ఏజీఅండ్పీ ప్రథమ్కు ఏపీలో 50కిపైగా సీఎన్జీ స్టేషన్లు ఉన్నా యి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్పై (సీఎన్జీ) ఏప్రిల్ 1 నుంచి విలువ ఆధారిత పన్నును (వ్యాట్) 24.5 నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు.. జగన్ రియల్ పెట్టుబడులు
చంద్రబాబు పాలన ఓ కంప్యూటర్.. అందులో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు, లోగోలు.. వాటి గ్రాఫిక్స్.. ఓ వంద అంకెలు, నలభై గీతలు.. వంద అబద్ధాలు. అన్నీ భూతద్దంలో చూపిస్తారు. వినడానికి, గ్రాఫిక్స్ చూడటానికి అబ్బో అనిపిస్తాయి. వాస్తవంగా వచ్చే పెట్టుబడులు సున్నా. పెట్టుబడులన్నీ కాగితాలకు, కంప్యూటర్లకే పరిమితం. సీఎం వైఎస్ జగన్ పాలన చంద్రబాబు గ్రాఫిక్స్ లాంటి టక్కుటమారాలేమీ ఉండవు. అంతా వాస్తవికత. వచ్చే పెట్టుబడులే కాగితాల్లో కనిపిస్తాయి. అవే ప్రజలకు చేరతాయి. వాస్తవంగా నూరు శాతం పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. కాగితాల్లో ఉన్న పెట్టుబడులే పరిశ్రమలుగా రూపుదిద్దుకొని ప్రజల ముందు నిలుస్తాయి. – సాక్షి, అమరావతి అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈ విషయం వెల్లడించింది స్వయానా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–18 మధ్య కాలంలో (చంద్రబాబు పాలన) రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చి న పెట్టుబడులతో పోలిస్తే 2019 నుంచి 2023 జూన్ వరకు (వైఎస్ జగన్ పాలన) వచ్చి న పెట్టుబడులు 226.9 శాతం అధికంగా వచ్చాయి. 2014–18 క్యాలండర్ ఇయర్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే. ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హాడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పిన వార్తల్లో వాస్తవం ఏమాత్రం లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి నట్లు ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయం సుస్పష్టమైంది. తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు చంద్రబాబుకు భిన్నంగా వైఎస్ జగన్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు చేయకుండా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, హెచ్యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. జీఐఎస్లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. -
5 ఏళ్లు.. 3 రెట్లు.. రూ.లక్ష కోట్లు!
ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందటి ఐదేళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులను ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతిని కేంద్ర పరిశ్రమల శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలలో నమోదైన ఎండస్ట్రియల్ ఎంట్రప్రిన్యూర్ మెమోరాండమ్స్ (IEM) పార్ట్ B ఫైలింగ్ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 32,803 కోట్ల వాస్తవ పెట్టుబడులను పొందింది. ఐఈఎంల పార్ట్ A ఫైలింగ్లు అనేవి పెట్టుబడి ఉద్దేశాలను సూచిస్తుండగా, పార్ట్ B ఫైలింగ్లు వాస్తవ పెట్టుబడికి సంబంధించినవి. ప్రముఖ బిజినెస్ పత్రిక ‘బిజ్ బజ్’ కథనం ప్రకారం.. నాలుగున్నరేళ్లలో 2019 నుంచి 2023 జూన్ వరకు రాష్ట్రానికి రూ. 100,103 కోట్ల వాస్తవ పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. ఇది 2014-18 కాలంలో వచ్చిన దానికంటే 226.9 శాతం ఎక్కువ అని అధికారిక వర్గాలు బిజ్ బజ్కి తెలిపాయి. ఈ నాలుగున్నరేళ్లలో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్లు, ఇతర అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ పురోగతి సాధించింది. 2022లో ఊపు వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019లోనే రాష్ట్రానికి 73 ప్రాజెక్టుల్లో రూ. 34,696 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అయితే ఆ తర్వాత సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో ఆంధ్రప్రదేశ్తోపాటు దేశమంతా ప్రభావం చూపించింది. దీంతో ఆ 2020లో 42 ప్రాజెక్టుల్లో కేవలం రూ.9,840 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. 47 ప్రాజెక్టులకు రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక 2022లో పెట్టుబడులు ఊపందుకున్నాయి. 46 ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే 2023 మొదటి ఆరు నెలల్లో 26 ప్రాజెక్ట్లకు రూ.7,135 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిర్వహించిన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్, వివిధ సూచికలపై మొత్తం 98.3 శాతం స్కోర్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2019-2023 లో వాస్తవ పెట్టుబడులు ఇలా.. సంవత్సరం ప్రాజెక్ట్లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో) 2019 73 34696 2020 42 9840 2021 47 10350 2022 46 45217 2023 (జూన్ నాటికి) 26 7135 మొత్తం 100103 2014-2018లో ఇలా.. సంవత్సరం ప్రాజెక్ట్లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో) 2014 19 2804 2015 51 4542 2016 76 11395 2017 62 4509 2018 72 9553 మొత్తం 32803 -
దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : రూ.5.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వేగంగా విస్తరిస్తోంది. ఫైవ్స్టార్ హోటల్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, స్పైసెస్ పార్క్, వైఎస్సార్ చేయూత వంటి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. గుంటూరు పట్టణంలో తొలి ఫైవ్స్టార్ హోటల్ను ఐటీసీ ఏర్పాటుచేసింది. సుమారు రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఈ ఫైవ్స్టార్ హోటల్ను నిర్మించారు. జనవరి 12, 2022న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి మాట్లాడుతూ.. తమ వ్యాపార విస్తరణకు ఏపీ ఎంతో కీలకమని.. విశాఖ, విజయవాడతో పాటు ఆధ్యాత్మిక నగరాల్లో హోటళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.200 కోట్లతో ఐటీసీ స్పైసెస్ పార్క్ మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్క్ను ఐటీసీ అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నారు. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పార్క్ను సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్, 2022లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక.. 5,500 మంది రైతు కుటుంబాలు ఈ పార్క్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటుచేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగుచేయిస్తోంది. ఈ పంటలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘చేయూత’లో భాగస్వామిగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకంలో ఐటీసీ ప్రధాన భాగస్వామిగా చేరింది. ఇందులో భాగంగా.. మహిళలు చేసే వ్యాపారాలు, మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్న సూపర్ మార్కెట్లకు ఐటీసీ ఉత్పత్తులను అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం ఐటీసీకి రాష్ట్రంతో సుదీర్ఘ అనుబంధముంది. మా నిర్ణయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాం. త్వరలో మరో రూ.400 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నాం. ముఖ్యమంత్రి విజన్తో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగస్వామ్యం కావడంతో పాటు ఫుడ్ ప్రోసెసింగ్, ఆక్వారంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్స్టార్ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ సీఎండీ సంజీవ్ పూరి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement