28న ‘వైఎస్సార్‌ జలకళ’ ప్రారంభం | YSR Jalakala Program Starts From 28th September | Sakshi
Sakshi News home page

28న ‘వైఎస్సార్‌ జలకళ’ ప్రారంభం

Published Wed, Sep 23 2020 4:12 AM | Last Updated on Wed, Sep 23 2020 4:12 AM

YSR Jalakala Program Starts From 28th September - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో పెద్ద పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్‌ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. 

► వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
► ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సీఎం అదే రోజు ప్రారంభిస్తారు.
► ఆన్‌లైన్‌ విధానంతో పాటు ఎంపీడీవోల ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్‌ విభాగపు డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement