Farmer
-
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చే విధంగా 3 నెలల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి, చివరి విడతగా 3,13,896 మంది రైతులకు రూ. 2,747.67 కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన తీరును తెలంగాణ సమాజం గుర్తించిందని పేర్కొన్నారు.2014లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, అందుకోసం నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్దని అన్నారు. విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల అధిక వడ్డీ భారం పడిందని గుర్తు చేశారు. గ్రామాలవారీ పంట నష్టం వివరాలివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో సంభవించిన వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై వివరాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వెంటనే గ్రామాలవారీ పంట నష్టంపై సర్వే చేసి వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. తుమ్మల తాజా ఆదేశాలతో పూర్తి స్థాయి పంటనష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ యంత్రాంగం నిమగ్నం కానుంది. -
నిజామాబాద్ జిల్లాలో అన్నదాతకు కడగండ్లు మిగిల్చిన వడగండ్ల వాన
-
ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి. -
కూటమి పాలనలో ఓ రైతు కన్నీటి గాథ
-
కూటమి పాలనలో ఓ రైతు కన్నీటి గాథ
అనకాపల్లి: కూటమి పాలనలో రైతుల కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక వాటికి వారే స్వయంగా నిప్పుపెట్టుకునే పరిస్థితులు రావడంతో కూటమి పాలన ఎలా ఉందో చెప్పడానికి అద్దం పడుతోంది. తాజాగా ఓ రైతు పండించిన చెరుకుకు మంట పెట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు.. ఎకరా చెరుకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నాడు. పండించిన చెరుకును సాగు చేద్దామంటే గిట్టబాటు కాదు.. అదే సమయంలో ప్రభుత్వం గిట్టుబాట ధర కూడా లేదు. ఇంకెమీ చేసేది లేక చెరుకు పంటను మంట పెట్టాడు.‘పండించిన చెరుకు గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీకి చెరుకు పంపిన పేమెంట్లు ఇవ్వడం లేదు. నెలల సంవత్సరాల తరబడి పేమెంట్లను అందడం లేదు. చెరుకును ఫ్యాక్టరీకి చెరుకు పంపిన ఎప్పుడు క్రస్సింగ్ జరుగుతుందో తెలీదు. గిట్టుబాటు ధర లేక చెరుకు పంటకు నిప్పు అంటించాను. గతంలో 15 రోజులకు పేమెంటు ఇచ్చేవారు’ అని రొంగలి వెంకటరావు చెప్పుకొచ్చాడు.ఇది ఒక్కరి గాథే కాదు.. ఇది ఒక్క రొంగలి వెంకటరావు పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. అటు మిర్చి పంటల దగ్గర్నుంచీ చెరుకు పంట వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రైతులకు తాము ఉన్నామనే భరోసా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం హామీలకు పరిమితమైన కూటమి సర్కారు.. రైతుల గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయం అనేది పండుగలా సాగింది. ‘రైతు భరోసా’ తో రైతుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ జగన్ అటు రైతుకే కాదు.. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన నాయకుడు వైఎస్ జగన్. ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత ‘వైఎస్ జగన్ పాలనే ఉండి ఉంటే బాగుండేది’ అనే మాట.. ప్రతీ నోట వినిపిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు వైఎస్ జగన్. ఇక్కడ పార్టీలను అస్సలు పట్టించుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ ముందుకెళితే.. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. మరొకవైపు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన సభలో ఏమన్నారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ వారైతే సంక్షేమం ఇవ్వొద్దనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రకటించారు. వైఎస్సార్ సీపీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు. ఏ స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుందని అంటూ అధికారులను అప్రమత్తం చేశాడు. మరి అటువంటప్పుడు రైతుల కన్నీటి గాథలే ఉంటాయి తప్పితే వారికి గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి. -
ఇంటర్ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్కె–4 పసుపు!
చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్ది. పన్నెండో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్కె–4’. ఈ వంగడం సచిన్కు ఉత్తమ ప్లాంట్ బ్రీడర్గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!సచిన్ కమలాకర్ కరేకర్ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్ సెలక్షన్ మెథడ్ అంటారు.1998 నుంచి కొత్త వంగడంపై కృషిసచిన్ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను. పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్కె–4 అని పేరు పెట్టాను.’కుక్కుమిన్ 4%పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్ బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డిబిఎస్కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసింది.ఎస్కె–4 పేరు ఎందుకొచ్చింది?తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్ కొంకణ్ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్దుర్గ్, రాయ్గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్ తాలూకా వేలాంబ్ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలుడాక్టర్ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్లో ఆ మొక్కల్ని పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్ అంటున్నారు. విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్ కమలాకర్ కారేకర్, ఎస్కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఎన్ఐఎఫ్ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) 2024 డిసెంబర్లో సచిన్ అభివృద్ధి చేసిన ఎస్కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్ కమలాకర్ కరేకర్ను ప్లాంట్ బ్రీడర్’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్కు దఖలుపడింది. నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్ -
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
నాబార్డ్ పంట రుణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. 2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు. రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది. ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు. 53 శాతం నిధులు ఎంఎస్ఎంఈలకే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్లో 53 శాతం. వ్యవసాయ టర్మ్ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు. -
,,,వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్లవి ఏం తీసుకెళ్తార్సార్
-
రైతుకు బ్యాంక్ ఆఫీసర్ల టార్చర్
-
లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు
కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్ఘన్పూర్ బ్రాంచ్ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు. అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు డిఫాల్టర్లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల బ్రాంచ్ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్ కాగా బ్యాంక్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు జనగామ - పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు pic.twitter.com/NA0yGAjSPq— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025 -
PM Modi: రైతు మాదిరిగా ఆహారపు అలవాట్లు ఉండాలి..!
పరీక్ష పై చర్చ(పీపీసీ(Pariksha Pe Charcha 2025) ఎనిమిదవ ఎడిషన్ గత సోమవారం(ఫిబ్రవరి 10, 2025న) న్యూఢిల్లీలో జరిగింది. ఆ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి సంభాషించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో మార్గదర్శకత్వం చేయడమే. అయితే ఈ కార్యక్రమంలో మోదీ ఆహారపు అలవాట్లు, ఎలా తినాలి వంటి వాటి గురించి కూడా విద్యార్థులకు చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..ఇక మోదీ ఈ సెషన్లో మంచి ఆరోగ్యం, జ్ఞాపక శక్తికోసం పోషకాహారం ప్రాముఖ్యత గురించి హైలెట్ చేశారు. శరీరానికి చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలు వంటివి ఎంత ముఖ్యమో వివరించారు. అంతేగాదు ఆ సెషన్లో మోదీ విద్యార్థులకు తిల లడ్డూ(నువ్వుల లడ్డూ)లను ఇస్తూ..వీటిని శీతాకాలంలో ఎందుకు తినాలో తెలుసా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థులు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని బదులిచ్చారు. ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం గురించి కూడా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిందని, అలాగే భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రోత్సహించిందో వివరించారు. మన దేశంలో సహజసిద్ధంగా లభించే వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ఎలా ఆసక్తి కనబరుస్తుందో కూడా ప్రస్తావించారు. అలాగే వాటికి పలు రకాల వ్యాధులను నివారించే శక్తి ఉండటమేగాక రాకుండా నివారించే శక్తి ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే..ఆ కార్యక్రమంలో పరీక్షల ప్రిపరేషన్కి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తోపాటు సకాలంలో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. అంతేగాదు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి వంటి ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. అయితే విద్యార్థులకు పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశంలోని రైతులు(farmers) ఉదయాన్నే నిద్రలేచి భోజనం చేస్తారు, రోజంతా పని చేస్తారు మళ్లా ఇంటికి వచ్చి సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం(dinner) చేస్తారు. నిజంగా ఇది వేళ్లకు భోజనం చేసే మంచి అలవాటుగా పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియకు మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేయడమే గాక దీర్ఘాయువుని అందిస్తుందని అన్నారు. నిపుణలు అభిప్రాయం ప్రకారం..ప్రధాని మోదీ చెప్పినట్లుగా సాయంత్రం ఏడు గంటలకు ముందు తినడం వల్ల ఆయుష్షు సుమారు 35% పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతంలో నిర్వహించిన మరో పరిశోధనలో సెంచరీ దాటిన చాలమంది వ్యక్తుల్లో సైతం వృద్ధాప్య లక్షణాలు తక్కువుగా ఉన్నట్లు చెప్పారు. వారంతా మెక్కలు ఆధారిత ఆహార పదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉన్న భోజనమే తీసుకున్నట్లు కూడా పరిశోధన పేర్కొంది. కాబట్టి అందరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే యత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!:.Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha. #PPC2025. https://t.co/WE6Y0GCmm7— Narendra Modi (@narendramodi) February 10, 2025(చదవండి: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు: హర్ష్ గోయెంకా ఫైర్) -
ప్రతి రైతుకూ గుర్తింపు సంఖ్య
సాక్షి, అమరావతి: రైతు (ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి రోజు 63 వేల మందికి విశిష్ట సంఖ్య (యూసీ) జారీ అయినట్లు సమాచారం. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికీ గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో యూనిక్కోడ్ (యూసీ)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనాకాగా, వెబ్ల్యాండ్ డేటా ప్రకారం 60 లక్షల మంది రైతులున్నట్టుగా గుర్తించారు. ఫిబ్రవరి 25వ తేదీలోగా 25 లక్షల మందికి, మార్చి 25వ తేదీలోగా మిగిలిన 35 లక్షల మందికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేయనున్నారు. ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే.. ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్ లబ్దిదారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిందే. కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలురైతులు, అటవీ , దేవాదాయ భూ సాగుదారులు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. ప్రతీ రైతుకు జారీ చేసే యూనిట్ ఐడీకి ఆయా రైతులు సీజన్లో పొందే సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. ఇలా తయారైన ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలురైతులతో పాటు ల్యాండ్ లెస్ లేబరర్స్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్ల ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు.ఈ ఐడీని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్తో కూడిన ఆరి్ధక సేవలను పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.రిజిస్ట్రీ ఎలా... రిజిస్ట్రీ కోసం ఏపీఎఫ్ఆర్అగ్రిస్టాక్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ) అనే వెబ్సైట్ను రూపొందించారు. దీన్ని వెబ్ల్యాండ్, గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానించారు. ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్లి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది.రెండోసారి ఓటీపిని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఆ రైతుకు గ్రామంలో పొలం ఉన్నట్టయితే ఆటోమెటిక్గా ల్యాండ్ డిటైల్స్ డిస్ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్తో కూడిన మెస్సేజ్ రైతు మొబైల్కు వెళ్లడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. -
‘కంది’పోయిన ‘రైతు’
కంది రైతు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్నాడు. ఓ వైపు రిటైల్ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.180 పై మాటే. కాస్త నాణ్యమైన కందిపప్పు ధర ఏకంగా రూ.224 వరకు పలుకుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ కంది పండించే రైతులకు మాత్రం కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నాణ్యమైన కందులకు కూడా ఆశించిన ధర దక్కక రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు. – సాక్షి, అమరావతిమెజార్టీ రైతులకు దక్కని మద్దతు ధరఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రతీ ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంట చేతికొచ్చే సమయంలో ధరల అంచనా వేస్తుంది. ఏఏంఐసీ అంచనా నివేదిక ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో కందులకు క్వింటా రూ.7,830 నుంచి రూ.8,680 మధ్య ఉంటుందని అంచనా. కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో సోమవారం కందులకు గరిష్టంగా క్వింటా రూ.7,200 పలికింది. 70– 80 శాతం మంది రైతులకు నాణ్యత లేదనే సాకుతో క్వింటాకు రూ.4,700 నుంచి రూ.6,170 మధ్య చెల్లిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భరోసామార్కెట్లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్కెట్లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు. కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.మార్కెట్లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్కెట్లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు. కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.» ఖరీఫ్ సీజన్లో 9 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. » సగటున హెక్టార్కు 754 కేజీల చొప్పున 2.73 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు.» అధిక వర్షాలు,వర్షాభావ పరిస్థితులు వేరుశనగ, పత్తి తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు కందిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.» గతేడాది ఇదే సమయానికి క్వింటా రూ.9,400–9,800 మధ్య పలికింది. దీంతో ఈ ఏడాది మంచి రేటు పలుకుతుందని రైతులు ఆశపడ్డారు.» అయితే పూత, పిందె దశలో భారీ వర్షాల ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. దాదాపు ఆరేడు సార్లు మందులు పిచికారీ చేయాల్సి రావడంతో ఎకరాకు రూ.2వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది.» కందులకు కనీస మద్దతు ధర క్వింటాకురూ.7,550గా కేంద్రం ప్రకటించగా, పంట వేసిన సమయంలోనే అతి తక్కువగా క్వింటా రూ.7,500 నుంచి రూ.8వేల శ్రేణిలో పలికింది.» కోతకొచ్చే వేళలో మద్దతు ధరయినా దక్కు తుందని ఆశించారు.» అయితే వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధర లేకుండా చేసారు.» తీరా పంట చేతికొచ్చే వేళ ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.» ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2–3 క్వింటాళ్ల మించిరాని పరిస్థితి ఏర్పడింది.మద్దతు ధర కూడా దక్కలేదు.. నేను రెండెకరాలు సొంతంగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది సాగు చేసా. పెట్టుబడి రూ.80 వేల చొప్పున ఖర్చు కాగా, ఎకరాకు కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కనీస మద్దతు ధరకు కొనే వారు లేకపోవడంతో క్వింటాను రూ.7,200 చొప్పున విక్రయించా. వచ్చిన సొమ్ము పెట్టుబడులకు కూడా సరిపోలేదు. – వడ్డే ఈశ్వరప్ప, గిరిగెట్ల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా -
కొత్త పట్టాలకూ ‘భరోసా’
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఆఖరు వరకు భూములు కొనుగోలు చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులందరికీ ‘రైతుభరోసా’కింద ఎకరానికి రూ. 6వేలు అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీ లోపు పట్టాదార్పాస్ పుస్తకాలు పొందినవారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. కొత్తగా దరఖాస్తు తప్పనిసరి జనవరి 1వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారు రైతుభరోసా పథకానికి వ్యవసాయ విస్తరణాధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాస్పుస్తకం జిరాక్స్ లేదా ధరణి(భూభారతి)లో రిజిస్ట్రేషన్ రోజు ఇచ్చి న డ్రాఫ్ట్ పాస్ బుక్ కాపీని, పట్టాదారు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ భూముల డేటా వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద ఉండడంతో వారు దాన్ని సరిచూసుకొని రైతుభరోసాకు లింక్ చేస్తారు. ఇప్పటికే రైతుబంధు తీసుకుంటున్న వారికి ఆటోమేటిక్గా ఆర్థికసాయం అందుతుంది. వారెవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల దరఖాస్తులకు చివరి గడువు తేదీని ప్రకటించలేదు. -
త్వరలోనే ‘ఆ పది’కి ఉప ఎన్నికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్: బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 26 నుంచి రైతులందరికీ ఎకరానికి రూ.17,500, కౌలు రైతులకు రూ.15,000, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 ఇవ్వాలనే డిమాండ్తో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేవెళ్ల సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ పది నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.అప్పట్లో కాంగ్రెస్ తరఫున వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఈ ఉప ఎన్నికలపై కూడా వాదిస్తున్నారు. కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు ఆ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్లో అనేక మంది సిద్ధంగా ఉన్నారు’అని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లాపట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ సహా సీఎం రేవంత్రెడ్డిపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు ఢిల్లీలో సీఎం గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తామంటుండు కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ‘నాడు కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడు పైసలు ఇస్తే.. నేడు రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా అంటుండు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేక పోయిండు. 1.60 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.30 వేలు బాకీ పడింది. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ముందు తమ బాకీ తీర్చాలని అడగండి’అని పిలుపునిచ్చారు. 21న నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ ఈ దీక్షలు కొనసాగుతాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ రైతు దీక్షలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీల బాగే వ్యవసాయ బాగు
అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.అప్రకటిత నిర్లక్ష్యం2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. తగ్గుతున్న పనికాంట్రాక్ట్ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్ కంపెనీల మార్కెట్ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్ కొనేటప్పుడు, హోటల్ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.కూలీలు కేంద్రంగా విధానంఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
చిరుతను బంధించిన ధైర్యశాలి
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt— Yasir Mushtaq (@path2shah) January 7, 2025 -
తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త!
భూపాలపల్లి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న శేఖర్ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ‘రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా 22 ఏ, భూ సర్వే, భూ రికార్డుల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేందుకు, భూములకు సంబంధించి రెవెన్యూ నిబంధనల సరళతరం కోసం పరిశ్రమలు, మునిసిపల్, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు.రైతులకు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వాటాను చూశాక... రైతు భరోసాలో రాష్ట్రం వాటాపై ఆలోచన చేయాలని చర్చించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని చర్చించినట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజకీయ కమిటీని నియమించి కూటమి నేతలంతా జన సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ భవనాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.⇒ తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకలకు అప్గ్రెడేషన్, 191 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం. ⇒ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు రాజధానిలో మరో రూ.2,723.02 కోట్లతో రెండు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి.⇒ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోదం. తద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్తో పాటు జోనల్ డెవలప్మెంట్లో అవసరమైన మార్పులు.⇒ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 6.35 ఎకరాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఆమోదం. ⇒ కడపలో టీడీపీ కార్యాలయానికి గత ప్రభుత్వం రద్దు చేసిన రెండు ఎకరాలను తిరిగి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. ⇒ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిలయన్స్ లిమిటెడ్ నెలకొల్పే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వృథాగా ఉన్న ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున, అదే రైతుల భూమి అయితే ఎకరాకు ఏడాదికి 30 వేల చొప్పున 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో మెట్రో ప్రాజెక్టుల నిధుల అంశంపై సీఎం ఎన్.చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.విశాఖలో మొదటి స్టేజ్లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించాలన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలుక్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన ఖేల్రత్న అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. -
తల్లి మామిడి అంట్లకు కేరాఫ్ పాణ్యం
పాణ్యం: మామిడి సాగు చేయాలకునే రైతులకు టక్కున గుర్తొచ్చేది నంద్యాల జిల్లా పాణ్యంలో లభించే అంటు మొక్కలే. ఇక్కడ అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) పద్ధతిలో అంట్లు కట్టడం ఇక్కడి రైతులు స్పెషాలిటీ. ఈ ప్రాంతంలో 1885లో మామిడి సాగు ప్రారంభమైంది. అప్పటినుంచీ ఇప్పటివరకు ఆరోగ్యకరమైన, మంచి రుచికరమైన ఫలాలను అందించే మొక్కలను ఇక్కడ రూపొందిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాణ్యంలో మాత్రం తల్లి చెట్ల నుంచే అంటుకట్టి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేయడం నేటికీ కొనసాగుతోంది.అప్రోచ్ గ్రాఫ్టింగ్తో ఆరోగ్యంపాణ్యంలో దాదాపుగా 70 ఎకరాల్లో మామిడి అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. 30 సెంట్లు మొదలుకుని ఎకరా వరకు చిన్న, సన్నకారు రైతులు మామిడి మొక్కలను పెంచుతున్నారు. వాటిలో 6 ్ఠ6 వెడల్పుతో తల్లి మొక్కలను నాటి.. ఇతర ప్రాంతాలను నుంచి మొలకను తెచ్చి వాటిని ఈ తల్లిమొక్కలకు అంటుకడతారు. ఇలా 90–100 రోజుల వరకు అంటును అలాగే ఉంచుతారు. దీంతో ఆ మొలక 4–5అడుగుల వరకు ఎత్తు పెరిగి.. ఆరోగ్యంగా, ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకునేలా పెరుగుతుంది. మొక్కలు కావాలకునే రైతులు మే, జూన్ నెలల్లోనే ఆర్డర్లు ఇస్తారు. పది రోజుల్లో మొక్కలను తీసుకెళ్లాలని చెప్పగానే మామిడి రైతులు తల్లి అంటు నుంచి మొలకల్ని వేరుచేసి తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 రోజుల పాటు డిపోలో ఉంచుతారు. ఆ తరువాత మొక్క ఆరోగ్యంగా ఉంటేనే రైతుకు విక్రయిస్తారు. లేకపోతే పక్కనపెడతారు. మొక్కను నాటుకున్న రైతులు మూడో ఏడాది నుంచే కాపు తీసుకోవచ్చు.ఇతర రాష్ట్రాలకు ఎగుమతిపాణ్యం నుంచి ఏపీలోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్నగర్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు మామిడి మొక్కలను ఎగుమతి చేస్తుంటారు. ఏటా కనీసం లక్ష మొక్కల వరకు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. సీజన్ ప్రారంభమైదంటే నర్సరీల్లో కూలీలకు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది.నమ్మకంతో తీసుకెళ్తారు30 ఏళ్లు నర్సరీని నడుపుతున్నాను. మామిడిలో అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి. సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి చాలామంది రైతులు వచ్చి మొక్కల కోసం ఆర్డర్ ఇస్తారు. ఎప్పుడైనా మొక్కకు డ్యామేజీ జరిగితే తిరిగి ఇస్తాం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మొక్కలు కొంటారు. – జంపాల నడిపెన్న, శ్రీనివాస నర్సరీ యజమాని మొక్కలు చాలా బాగా పెరిగాయినేను మూడేళ్ల క్రితం రెండెకరాల్లో మామిడి మొక్కలను సాగు చేశాను. పాణ్యం నుంచే 120 మొక్కలు తెచ్చుకున్నాను. ఇప్పటివరకు మొక్క ఎదుగుదల విషయంలో ఎలాంటి సమస్య రాలేదు. మొక్కలు తెచ్చుకునే సమయంలో నేను చాలాసార్లు నర్సరీకి వెళ్లి చూశాను. – మహరాజ్, రైతు రామవరం, అవుకు మండలంనర్సరీ రైతులకు లైసెన్స్లుపాణ్యంలోని నర్సరీలకు లైసెన్స్లు ఇచ్చాం. రైతులు ఎలాంటి మొక్కలు విక్రయించినా కొన్నవారు బిల్లులు తీసుకోవాలి. అంతేకాక పాణ్యంలో అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) అధికంగా సాగు చేస్తుంటారు. మామిడి సాగు చేయాలనుకునే రైతులు అప్రోచ్ గ్రాఫ్టింగ్ మొక్కలనే ఇష్టపడతారు. – నాగరాజు, జిల్లా ఉద్యాన అధికారి -
రైతు కుటుంబంపై పవన్ అవహేళన
-
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్ అవహేళన
వైఎస్సార్ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. -
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
చనిపోతున్నా బిడ్డా..!
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. -
రైతు అదిరిపోయే ఐడియా
-
ఈ యుద్ధం గెలవాలంటే మనం కలిసి పోరాడాలి
చండీగఢ్: ‘ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే సమైక్యంగా ఉంటూ పోరాడాలి’అని రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లెవాల్(70) ఉద్బోధించారు. పంజాబ్–హరియా ణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. డల్లెవాల్ ఆరోగ్యం విషమంగా ఉన్న ట్లు ఆయన్ను పరీక్షించిన వైద్యులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖనౌరీలో ని దీక్షా శిబిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. ‘నిరశన దీక్షకు మద్దతుగా నిలిచిన వారందరికీహృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నానని, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో మనం గెలవాలి. దేశం యావత్తూ కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నెగ్గగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనల్ని ఇక్కడి నుంచి తొలగించరాదని నేను కోరుతున్నా. ప్రభుత్వం మన పోరాటాన్ని కొనసాగనిస్తే మనం గెలుస్తాం లేదా ఇక్కడే చనిపోతాం. ఈ రెండింటిలో ఒకటి ఖాయం’అని ఆయన స్పష్టం చేశారు. డల్లెవాల్ చాలా బలహీన స్వరంతో నెమ్మదిగా రెండు నిమిషాలసేపు మాత్రం మాట్లాడగలిగారని ఆయనకు సహాయకుడిగా ఉంటున్న రైతు నేత అభిమన్యు కొహార్ చెప్పారు. తాను బాగానే ఉన్నానంటూ డల్లెవాల్ చెప్పడం అంటే..శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు అర్థమని అనంతరం కొహార్ వివరించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కలి్పంచడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగానే డల్లెవాల్ నిరాహార దీక్ష చేపట్టారు. -
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
50 ఏళ్లుగా చొక్కా వేసుకోలేదు చివరికి పెళ్ళికి కూడా..
-
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
-
‘లగచర్ల’ రైతుకు బేడీలు!
సంగారెడ్డి/ సంగారెడ్డిటౌన్/దుద్యాల్/సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’కేసులో అరెస్టయి జైలులో ఉన్న రైతు ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైతే.. చేతులకు సంకెళ్లు వేసి, గొలుసుతో కట్టి ఆస్పత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది. ఆరోగ్యం బాగోలేని రైతుకు బేడీలు వేయడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన రైతు హీర్యానాయక్ను జైలు అధికారులు, పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారమే అస్వస్థతకు గురైన రైతు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ వద్దని, తమ భూములు ఇవ్వబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగడం.. ‘లగచర్ల’గ్రామంలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులు సుమారు నెల రోజులుగా సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిలో దుద్యాల్ మండలం పులిచర్లకుంట తండాకు చెందిన గిరిజన రైతు హీర్యా నాయక్ బుధవారం సాయంత్రం ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షలు చేసిన జైలు వైద్యులు, అధికారులు.. చికిత్స కోసం గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు వేసి, గొలుసుతో కట్టి తీసుకువచ్చారు. అలాగే బేడీలు, గొలుసుతో ఆస్పత్రి లోపలికి నడిపించుకుని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం చెలరేగింది. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి... సంగారెడ్డి ఆస్పత్రి వైద్యులు హీర్యానాయక్కు పలు వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని రిఫర్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. అక్కడి అనుభవజు్ఞలైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ మేరకు జైలు అధికారులు, పోలీసులు హీర్యానాయక్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ యూనిట్లో కార్డియాలజీ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు నిమ్స్ అధికారులు తెలిపారు. హీర్యానాయక్ వెంట ఆయన భార్య దేవిబాయి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఛాతీలో నొప్పి వస్తోందని రోదిస్తూ.. జైలులో ఉన్న హీర్యానాయక్ బుధవారం రాత్రి తండ్రి రూప్లానాయక్, తల్లి జెమినీబాయి, భార్య దేవిబాయిలతో ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తనను ఎలాగైనా తీసుకెళ్లాలని, అక్కడే ఉంటే చనిపోయేలా ఉన్నానని రోదించాడని తెలిపారు. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం సంగారెడ్డికి బయలుదేరారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసి, అక్కడికి వెళ్లారు. అయితే హీర్యానాయక్ను చూసేందుకు పోలీసులు చాలాసేపు అనుమతించలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గుండె పోటుకు గురైన వ్యక్తికి ఇలా బేడీలు వేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుక్కి ఏం జరిగినా సీఎం బాధ్యత వహించాలి.. నా కొడుకును అనవసరంగా కేసులు పెట్టి జైలులో పెట్టారు. నా కొడుక్కి ఏమైనా జరిగితే సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలి. హీర్యాను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యం బాగోలేనివారికి బేడీలు వేయడం ఏమిటి? – రూప్లానాయక్, హీర్యానాయక్ తండ్రి రైతుకు బేడీలపై సీఎం సీరియస్ – ఇలాంటి చర్యలను సహించబోమని అధికారులకు హెచ్చరిక – ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం ‘లగచర్ల’ఘటనలో అరెస్టయి రిమాండ్లో ఉన్న రైతు హీర్యానాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై అధికారులతో మాట్లాడి వివరాలను ఆరాతీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి సమీక్షించిన ఐజీ జైలులో రైతుకు గుండెపోటు, బేడీలు వేసి ఆస్పత్రికి తరలించిన అంశం వివాదాస్పదం కావడంతో మలీ్టజోన్ ఐజీ సత్యానారాయణ గురువారం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జైలర్ సస్పెన్షన్.. సూపరింటెండెంట్పై విచారణ లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై విచారణకు ఆదేశించారు. -
లగచర్లకు చెందిన రైతు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
-
లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లడంపై సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులతో ఆరా తీసిన సీఎం. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని రేవంత్ హెచ్చరించారు.ఇదెక్కడి పాలన?: హరీష్రావుమరోవైపు, రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. లగచర్ల రైతు ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగా?. ఇదెక్కడి పాలన అంటూ నిప్పులు చెరిగారు. చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్తారా. రైతుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?. భూములు గుంజుకొని తిరగబడితే అరెస్ట్ చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య. ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?… pic.twitter.com/qJQG14Cbwq— Harish Rao Thanneeru (@BRSHarish) December 12, 2024 -
రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
-
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి
-
నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
న్యూఢిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు(సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.రైతుల డిమాండ్లు ఇవే..పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు, 64.7శాతం పెంచిన పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.సరిహద్దుల్లో తనిఖీలు- ట్రాఫిక్ మళ్లింపులురైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత -
సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది ‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్రావు, ఈటల రాజేందర్లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు.. ‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం. బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం. తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం.. ‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. గుజరాత్లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..‘రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
విరుగుడు లేని విషం!
⇒కాగజ్నగర్కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
వల్లభాపురం రైతు కిడ్నాప్
వల్లభాపురం (తెనాలి): ఓ రైతు కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీశ్రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చి నిద్రలేపి మరీ తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ తెలియ రాలేదు. కుటుంబసభ్యులు ఫోను చేసినా సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కుమారుడు, విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. జగదీశ్ రెడ్డి భార్య శ్రీదేవి వివరాల ప్రకారం... వల్లభాపురానికి చెందిన జగదీశ్ రెడ్డి రైతు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ముగ్గురు ఆగంతకులు ఇంటికొచ్చి జగదీశ్ రెడ్డి కావాలని అడిగారు. స్నేహితులేమోనని భావించిన తల్లి జగదీశ్ రెడ్డిని నిద్ర లేపారు. బయటకు వచ్చిన ఆయన, లోపలకు వచ్చి షర్ట్ వేసుకుని వచ్చిన వారితోపాటు వెళ్లిపోయారు. నిద్రలో ఉన్న తనకు ఈ విషయాలేమీ తెలియదని శ్రీదేవి చెప్పారు. మధ్యాహ్నం పొలానికి భోజనం తీసుకెళ్లే మనిషి వస్తే యధాప్రకారం క్యారేజీ ఇచ్చానని, తీరా చూస్తే పొలానికి వెళ్లలేదనీ, తెల్లవారుజామున ముగ్గురు ఆగంతకులు వచ్చి తీసుకెళ్లారని అప్పుడు తెలిసింది ఆమె చెప్పారు. దీంతో అక్కడ సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలిస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చినట్టు స్పష్టంగా కనిపించిందన్నారు. వారిని చూస్తుంటే మఫ్టీలో వచ్చిన పోలీసుల్లా ఉన్నారని భావించామనీ, దీనిపై గ్రామస్తులు, సమీప బంధువులు కొల్లిపర, తెనాలి రూరల్ పోలీసులను విచారిస్తే, తమకేమీ తెలియదని చెప్పడంతో అయోమయానికి గురయ్యామన్నారు. ఆయన జాడ తెలియ రాలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. జగదీశ్రెడ్డికి ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు లండన్లో చదువుతున్నారు. సెలవులని ఊరొచ్చిన కుమారుడు, లండన్ వెళ్లేందుకు ముందు రోజే హైదరాబాద్ వెళ్లారు. తండ్రి కిడ్నాప్ సమాచారంతో వారిద్దరూ వల్లభాపురం బయలుదేరారు. -
ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు
మంచిర్యాల జిల్లా( జన్నారం): కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నస్పూరి సంతోష్. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రా మానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంప తుల కుమారుడు సంతోష్ పదో తరగతి వరకు తపాల పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్లో పూర్తి చేశారు. బీఈడీ రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.2023లో రైల్వేలో ఉద్యోగాల ప్రకటన రావడంతో పరీక్షలు రాసి పాయింట్మెన్ ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే ఈ ఏడాది గురు కు ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యో గాలు సాధించారు. వాటిలో చేరకుండా టీజీపీఎస్సీ వేసిన నోటిఫికేషన్లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని చదివారు. ఈ నెల 27న ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తనను కష్టపడి చదివించిన అమ్మనాన్నల ఆశీర్వాదంతోనే ఇన్ని ఉద్యోగాలు సాధించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న సంతోష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరుతానని వెల్లడించారు.చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం! -
అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం
దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్. అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు. నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్. ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్హౌస్లు, పాలీహౌస్లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు. View this post on Instagram A post shared by Bollapally Srikanth (@bollapallysrikanth) -
భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేలు
చింతకాని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళితబంధు లబ్ధిదారులు 847 మందికి రెండో విడతగా రూ.15.54 కోట్ల మేర మంజూరు పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున తమ ప్రజాప్రభుత్వం సెపె్టంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల మేర అందిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున రైతులు దృష్టి సారించాలని, సేంద్రియ విధానంలో సాగు చేసే ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భట్టి తెలిపారు.చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిచేస్తూ ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, ఆస్పత్రి మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజన కారి్మకుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. కాగా, దళితబంధు యూనిట్లను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని భట్టి స్పష్టం చేశారు. అలా ఎవరైనా యూనిట్లను తీసుకెళ్తే తిరిగి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
దారి చూపగలది వ్యవ‘సాయమే’!
దేశ జనాభాలోని అత్యధికులు ఇంకా వ్యవసాయ రంగంలోనే ఉండిపోవడం, వారి ఆదాయాలు నామమాత్రం కావడం దురదృష్టకరం. కానీ, ఈ ప్రతికూ లతలోనే, మెరుగైన ఉపాధి కల్పనకు, డిమాండ్ పెంపుదలకు అవకాశాలను వెతుక్కోవచ్చు. 60 శాతం వ్యవసాయ ఆధారిత గ్రామీణ జనాభా ఆదాయా లను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఉదాహరణకు బాగా ఆదాయం వచ్చిన ఒక పసుపు రైతు... కారు, బైకు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే, ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2018 డిసెంబర్ నాటికే 45 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉందని జాతీయ నమూనా సర్వే గణాంకాలు వెలుగు చూశాయి. ఈ కారణాల చేతనే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 22 శాతం (అంతకు ముందటిసంవత్సరం కంటే) అంటే, 46 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అదే కాలంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులను కూడా కలి పితే, దేశంలోకి వచ్చింది 70.97 బిలియన్ డాలర్లు.అంతకు ముందరి సంవత్సరంలో ఈ మొత్తం 84.83 బిలియన్ డాలర్లు. ఇది, దేశీయంగా డిమాండ్ తగ్గుదలను సూచిస్తోంది. మరో పక్కన, భారతదేశం నుంచి విదేశాలకు పెట్టుబడులుగా వెళ్ళిన మొత్తం 2023లో, దానికి ముందరి సంవత్సరం కంటే 50 శాతం మేరన అంటే, 23.50 బిలియన్ డాలర్లకు మందగించింది. ఇది, అంతర్జాతీయంగా డిమాండ్ పతనాన్ని సూచి స్తోందని రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. స్థూలంగా మనం గమనించవలసిన మరో అంశం కూడా ఉంది. అంతర్జాతీయంగా ప్రజల కొనుగోలు శక్తి పతనం కంటే, మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పతనం మరింత అధికం. దీనికి తార్కా ణం, 1992 – 2012 కాలంలో, సరుకుల వ్యాపారంలో మన దేశం తాలూకు లోటు (ఎగుమతి, దిగుమతుల మధ్యన వ్యత్యాసం) సాలీన సగటున కేవలం 11 బిలియన్ డాలర్లు ఉండగా, అది ప్రస్తుత దశాబ్ద కాలంలో సాలీన సగటున 150 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశం ఎగుమతి చేస్తోన్న దాని కంటే, దిగుమతి చేసుకుంటోన్న సరుకుల విలువ పెరిగిపోయింది. దేశ స్థూలజాతీయ ఉత్పత్తిలో సరుకు ఉత్పత్తిరంగం వాటాను పెంచడం కోసం, 2014 సెప్టెంబర్లో ఆరంభమైన ‘మేకి¯Œ ఇండియా’ కార్యక్రమం విఫలం అయ్యింది. ఈ పథకం ఆరంభం తర్వాత,దేశంలో సరుకు ఉత్పత్తిరంగం ఎదగకపోగా, మరింత కుంచించుకుపోయింది. 2019లో ఉత్పత్తిని పెంచేందుకు కార్పొరేట్లకు ప్రోత్సాహకం పేరిట, 32 నుంచి 22% మేరకు తగ్గించిన కార్పొరేట్ పన్ను రేటు కూడా పెట్టుబడులను పెంచ లేకపోయింది. దీనితో పాటుగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పేరిట పి.ఎల్.ఐ. పథకాన్ని తెచ్చింది. 14 రంగాల కార్పొరేట్ ఉత్పత్తి సంస్థలకు ఈ పథకం కింద రాయితీలు ఇస్తోంది. అయినా, కేవలం 2, 3 పారిశ్రామిక రంగాలలో మాత్రమే కొద్ది మేరకు పెట్టుబడులు పెరిగాయి. ఈ పథకం కాస్తంత సానుకూల ఫలితాన్ని సాధించింది అనుకున్న స్మార్ట్ ఫోన్ల రంగంలో కూడా 2023 జూలై నాటికి వరుసగా రెండు త్రైమాసికాలలో ఎగు మతులు పతనం అయ్యాయి. మరో పక్కన దేశీయ సేవారంగం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సేవా రంగంలోని కీలక విభాగాలైన ఐటీ, బీపీఓ రంగా లలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలలో, 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి ఉద్యో గుల సంఖ్య, అంతకు ముందరి కాలం కంటే తగ్గిపోయింది. ఇక, మిగిలింది దేశీయ వ్యవసాయ రంగం. నేడు, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న వారి సంఖ్య 48.3%.ఎంతో కొంత వ్యవసాయం ఆధారంగా జీవించే వారిని కూడా కలిపితే ఇది 60% అవుతుంది. ప్రస్తుతం, గ్రామీణ రైతు కుటుంబ నెలవారీ సగటు ఆదాయం 10,218 రూపాయలు మాత్రమే. ఇది జాతీయ తలసరి సగటు ఆదాయం అయిన 10,495 రూపాయలకంటే తక్కువ. ఈ 60% జనాభా ఆదాయాలను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది. మరి వ్యవసాయ ఆదాయాల పెంపుదలకు చేయవలసింది ఏమిటి?దీనికి ఒకటే జవాబు. వ్యవసాయదారులకు, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం. ‘గ్లోబల్ డెవలప్మెంట్ ఇ¯Œ క్యుబేటర్’ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు, మన దేశ గ్రామీణ యువ జనులలోని 70– 85% మంది తక్కువ నిపుణతలు అవసరమైన చిన్న సరుకు ఉత్పత్తి రంగంలోనూ లేదా రిటైల్ రంగంలోనూ ఉపాధిని కోరుకుంటున్నారు. అంటే, వారు లాభసాటిగా లేని వ్యవసాయం నుంచి బయట పడాలనుకుంటున్నారు. కానీ, వారిలోని 60% మంది ఉపాధి కోసం తమ గ్రామాన్ని విడిచి వెళ్ళాలని కోరుకోవడం లేదు. కోవిడ్ అనంతర కాలంలో నగర ప్రాంత కార్మికులలోని పెద్ద విభాగం తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిపోయింది. నేడు నగర ప్రాంతా లలో ఉపాధి అవకాశాలు బలహీనంగా ఉండడంతో, వీరిలోని అత్య ధికులు తిరిగి నగరాలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.గ్రామీణ రైతాంగ ఆదాయాలు పెరిగితే, అది దేశీయంగాడిమాండ్ కల్పనను ఏ విధంగా తేగలదనేదానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. 2006–07లో నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట బాగా పండింది. ఆ సంవత్సరంలో అంతర్జాతీయంగా కూడా భారీగా ధర పలికింది. ఫలితంగా, పసుపు రైతులు చాలామంది సొంతిళ్లు నిర్మించుకున్నారు. కార్లు, బైకులు కొనుక్కున్నారు. టీవీలు, ఫ్రిజ్లవంటి గృహోపకరణాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమనించవలసింది, రైతుకు గనుక మంచి ఆదాయం ఉంటే... సిమెంట్, స్టీలు, వాహనాలు, గృహోపకరణాల వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగు తుంది. ఈ పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి కేంద్రాలుగా నగరాలుఉంటాయి. కాబట్టి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు. ప్రస్తుత స్థితిలో దేశ జనాభాలోని కేవలం 20–30% మంది కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉన్న మార్కెట్ కంటే, 60%మంది జనాభా తాలూకు కొనుగోలు శక్తి దేశీయ మార్కెట్కూ, ఉపాధి కల్పనకూ అత్యుత్తమమైన స్థితిగా ఉండగలదు. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరకు చట్టబద్ధతను కల్పించేందుకు సిద్ధంగా లేదు. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైన, నగర ప్రాంత కార్పొ రేట్లకు అనుకూలమైన విధానాలు అమలయ్యాయి. ఈ విధానాల సారాంశం: రైతాంగ ఉత్పత్తులకు ధరలను తక్కువ స్థాయిలోనేఉంచడం. ఎందుకు? తద్వారా నగర ప్రాంతాలలో నిత్యావసర ధర లను తక్కువ స్థాయిలో ఉంచొచ్చు. దీని వలన, ఈ కార్పొరేట్లపై నగర ప్రాంతాల ఉద్యోగులు, కార్మికుల నుంచి అధిక వేతనాల కోసం డిమాండ్లు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా ఉంటే, గ్రామీణ యువజనులు ఉపాధి కోసం నగరాల బాట పట్టరు. అంటే, నగర ప్రాంతాలలో కార్మికుల సప్లై తగ్గి కొరత ఏర్పడుతుంది. దాని వలన, వారికి డిమాండ్ పెరిగి కార్పొరేట్లు ఎక్కువ జీతాలతో పనిలో పెట్టు కోవాల్సి వస్తుంది. నగరాలకు నిరంతర కార్మికుల సరఫరా కోసం వ్యవసాయాన్ని నష్టాలలోనే ఉంచాలి. ఇప్పుడిప్పుడే కనీసం ఆలోచనల రూపంలో భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహా దారు అనంత నాగేశ్వర¯Œ ఇలా పేర్కొన్నారు: అంతర్జాతీయంగా వృద్ధి మందగిస్తోన్న దృష్టా ్య మనం ఏ రంగాన్ని కూడా తక్కువగా చూడగల స్థితిలో లేము. వ్యవసాయం కూడా ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా ఉండాలి. అంటే, వ్యవసాయాన్ని తిరిగి మరలా ‘ఆకర్షణీయంగా’ చేయగలగాలి. ఉదాహరణకు, నేడు బ్రెజిల్లో యువజనులు, గతంలో కంటే ఎక్కు వగా వ్యవసాయంలో భాగం పంచుకుంటున్నారు. కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ కాలంలో వ్యవసాయ ఆధారిత సరికొత్త నమూనాని విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలి. ఇది మాత్రమే దేశీయ నిరు ద్యోగం, కొనుగోలు శక్తి పతనాలకు పరిష్కారంగా ఉండగలదు.- వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు , మొబైల్: 98661 79615- డి. పాపారావు -
యువరైతును మింగిన వర్షాలు
కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్ కుమారులున్నారు. -
TG: ప్రభుత్వ ఆఫీసులో రైతు ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్జిల్లా: రుణమాఫీ కాలేదని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి(52) తనకు రుణమాఫీ కాలేదని శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
12 ఏళ్ల క్రితం చనిపోయిన రైతుకు రుణమాఫీ!
నేలకొండపల్లి: ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ తమకు అమలు కాలేదని ఒకవైపు అనేక మంది రైతులు ఆందోళనచేస్తుంటే, మరో వైపు ఎప్పుడో మృతి చెందిన రైతు పేరు రుణమాఫీ జాబితాలో వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన తుళ్లూరి వెంకయ్య 12 సంవత్సరాల కిందటే మృతి చెందారు. ఆయనకు టేకులపల్లి ఆంధ్రా బ్యాంక్లో ఖాతా ఉండగా.. ఆయన కానీ, ఆయన చనిపోయాక కుటుంబీకులు కానీ రుణం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ జాబితాలో వెంకయ్య పేరు వచ్చింది. ఈ విషయమై వెంకయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తండ్రి కానీ, తాము కానీ ఏనాడు బ్యాంక్లో రుణం తీసుకోలేదని.. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో పేరు ఎలా వచ్చిందో తెలియదని వెల్లడించారు. -
అంతిమ యాత్రలో అపశ్రుతి.. రూ.5 లక్షలు నష్టం
కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్ ఖాన్) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు. అనంతరం మదనపల్లె పైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది. ∙ -
మాకేదీ రుణమాఫీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ ప్రకటించిన తర్వాత కూడా తమకు రుణాలు మాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలాచోట్ల రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్, భీంపూర్ మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. తలమడుగులో 500మందికి పైగా రైతులు సీఎం దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించారు. కర్మకాండ కుండలతోనే మహారాష్ట్ర బ్యాంకులోనికి వెళ్లారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినదించారు. జైనథ్ మండలం గిమ్మలో రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత బ్యాంకు అధికారుల వినతిమేరకు తాళాలు తొలగించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్లో రైతు జక్కుల లచ్చన్న పంచాయతీ కార్యాలయం వద్ద విషగుళికలు తిని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడ ఉన్న మరో రైతు అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.⇒ నిజామాబాద్ జిల్లా 63 నంబరు జాతీయ రహదారి వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, మోర్తాడ్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.⇒తమకు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్ శాఖ ఇండియన్ బ్యాంక్ను ముట్టడించి రైతులు షట్టర్ను మూసివేశారు. తర్వాత అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఈ నెల 20న రైతు వేదికలో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ బ్యాంక్ పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి సుమారు 1,250 మంది రైతులకు ఖాతాలుండగా కేవలం 430 మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ⇒ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్రోడ్డు వద్ద కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రుణమాఫీ జాబితాలో తమ పేర్లులేవంటూ సుమారు 500 మంది రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ⇒ జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని రైతువేదికలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన రుణమాఫీ అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది. మూడో విడతలో కూడా తన పేరు లేకపోవడంతో ఏలేటి రాజారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ⇒ బౌరంపేట్లోని బ్యాంక్లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికే రుణమాఫీ అయ్యిందని, మిగతా రైతులకు ఎందుకు మాఫీ చేయలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.⇒ఖమ్మం రూరల్, కొనిజర్ల, వైరా, రఘునాథపాలెం తదితర మండలాల రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.రుణమాఫీ రూ.83తిమ్మాపూర్: కేవలం రూ.83 మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు రూ.83 మాఫీ అయినట్టు మొబైల్కు సందేశం వచ్చింది. గత డిసెంబర్లో ఎల్ఎండీలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.1.50 లక్షల పంటరుణం తీసుకున్న మల్లయ్య మూడో విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు.కానీ.. రూ.83 రుణఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్కు గురైన ఆయన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా, వారు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంక్ టైం అయిపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు. మాఫీకి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తాను అర్హుడినని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్తో సహా పంట ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్లో వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించామన్నారు.మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్తోపాటు ఏఎంఆర్పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్రెగ్యులేటర్ ప్యానల్బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్విచ్ ఆన్చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేతసాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. -
చినుకు తెచ్చిన సంబరం : ఒళ్ళంతా తుళ్ళింతే! వైరల్ వీడియో
మబ్బొచ్చినా, వానొచ్చినా తొలుత పులకించిపోయేది రైతన్నే. బీటలు వారిన నేలన నాలుగు చినుకులు పడినప్పుడు రైతు గుండె ఉప్పొంగి పోతుంది. వర్షపు దాహం తీరిన మట్టి చిందించే పరిమళానికి ఉత్సాహంగా చిందులేస్తాడు. గుజరాత్లోని కచ్లోని ఒక ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది. జోరుగా కురిసిన వాన ప్రవాహంలో పరిపూర్ణ ఆనందంతో తండ్రీ కొడుకులు ఆనందంతో చిందులు వేశారు. అచ్చమైన రైతులా తండ్రి, అతనికి తోడుగా కొడుకు కూడా చేరాడు. ఇద్దరూ కలసి చేసిన అచ్చం లగాన్ సినిమాలో లాగా చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యం ఇంటర్నెట్లో హృద్యంగా నిలిచింది. రోనక్ గజ్జర్ అనే జర్నలిస్టు ఎక్స్లోదీన్ని పోస్ట్ చేశారు. The father and son demonstrated their joy by performing a traditional dance in a field, as the semi-arid region of Kutch experienced substantial rainfall.#Gujarat #Monsoon pic.twitter.com/HTPTJ2D8Qr— Ronak Gajjar (@ronakdgajjar) July 23, 2024 -
అందాల భామలే దిష్టిబొమ్మలు
చిక్కబళ్లాపురం: పొలాల్లో దిష్టిబొమ్మలు ఉండడం మామూలే. కానీఆ పొలాన్ని చూస్తే సుందరాంగుల పోస్టర్లు కనువిందు చేస్తాయి. దాని వెనుక ఓ కథ ఉంది. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో యువ రైతు దీపక్ 5 ఎకరాలలో టమాటా పంటను సాగుచేశాడు. ఇప్పుడు టమాటా రేటు బాగా పెరిగింది. పంటకు ఎవరి దిష్టీ తగలరాదని భావించిన రైతు నర దృష్టిని మళ్లించేలా ఒక ఉపాయం పన్నాడు. బాలీవుడ్ నటి సన్నీ లియోన్, కన్నడ నటి రచితా రామ్ బ్యానర్లను తోటలో పెట్టాడు. అందరూ ఈ అందాల భామలను ఆశ్చర్యంగా చూసి వెళుతున్నారు. కాబట్టి తన పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని రైతు నమ్ముతున్నాడు. -
Viral: అధికారులు పట్టించుకోలేదు.. ఓపిక నశించి ఆ రైతు ఏం చేశాడంటే..
తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల వద్ద మొరపెట్టుకునేందుకు ఓ రైతు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లినా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఓపిక నశించి.. ఆ రైతు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాంద్సౌర్ కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) కార్యాలయంలో ఓ వ్యక్తి చేతులు జోడించి పొర్లు దండాలు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఉన్న రైతు పేరు శంర్ లాల్ పాటిదార్. సొంత ఊరిలో కొంత భూమి ఉంది. అయితే ఆ కొంత భూమిని కూడా కబ్జారాయుళ్లు వదల్లేదు. నకిలీ పత్రాలతో తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నారట. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో.. ఆ లాక్కున్న వ్యక్తి కలెక్టర్ ఆఫీస్లో పని చేసే బాబు దేశ్ముఖ్ అని శంకర్ తెలుసుకున్నాడు. అసలైన ధ్రువపత్రాలతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎలాగైనా పైఅధికారులకు ఆ విషయం వెళ్లాలనుకున్నాడు. తన బంధువుల సాయంతో ఓ వీడియో తీశాడు. ఆఫీస్ ప్రాంగణంలో పొర్లు దండాలు పెడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారాయన. దీంతో విషయం.. జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటానని, శంకర్కు న్యాయం చేస్తానని చెప్పారాయన. मंदसौर के बुजुर्ग किसान हैं, कहते हैं कहीं सुनवाई नहीं हो रही आरोप है कि ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है ... कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटे ... pic.twitter.com/bpAHfHp2NH— Anurag Dwary (@Anurag_Dwary) July 17, 2024 -
ధోతీ ధరించాడని.. మాల్లోకి అనుమతి నిరాకరణ!
బెంగళూరు: ధోతీని ధరించినందుకు ఓ వృద్ధరైతుకు షాపింగ్మాల్లోకి ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్లో చోటుచేసుకుంది. ఒక వృద్ధ రైతు జీటీ మాల్లో సినిమా చూడటానికి తన కుమారుడితో కలిసి వెళ్లారు. అయితే వృద్ధుడు ధరించిన ధోతీని చూసి.. భద్రతా సిబ్బంది ఆయన్ని, ఆయన కుమారుడుని మాల్ లోపలికి వెళ్లకుండా ఆపేశారు.This mall should be fined! Elderly farmer denied entry to GT world shopping mall in #Bengaluru cuz he was wearing a Dhoti 🤷🏽♀️Fakeerappa, a farmer in his 70's was hoping to watch a movie with his family, had booked his ticket prior, but was stopped at the gates of GT mall… pic.twitter.com/xpKaeBJzzf— Nabila Jamal (@nabilajamal_) July 17, 2024 మాల్ యాజమాన్యం ధోతీ ధరించినవారిని లోపలికి అనుమతించకూడదని ఆదేశించినట్లు తెలిపారు. మాల్లోకి ప్యాంట్స్ వేసుకొని వచ్చినవాళ్లను మాత్రమే అనుమతించాలని చెప్పారని అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో వృద్ధుడిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. తర్వాత ఆయనకు క్షమాపణలు తెలిపారు.మరోవైపు.. ‘ఈ ఘటనపై పోలీసులు మాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలమంది రైతులతో నిరసనకు దిగతాం’ అని రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్ డిమాండ్ చేశారు. ఇక.. సోషల్మీడియాలో సైతం నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ.. మాల్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఓ వ్యక్తి సంచి నెత్తిన పెట్టుకొని రాజాజీనగర్ మెట్రోస్టేషన్కు వెళ్లితే.. అక్కడి సిబ్బంది ఆయన దుస్తులు సరిగాలేని అనుమతింలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారటంతో స్టేషన్ ప్లాట్ఫామ్ అధికారులు క్షమాపణలు తెలిపారు. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. -
23 నుంచి ‘పొలం పిలుస్తోంది’
సాక్షి, అమరావతి: ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కమిషనర్ నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ పొలంబాట పట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలన్న సంకల్పంతో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సీజన్లో వారానికి 2 రోజుల పాటు, రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి మంగళ, బుధవారాల్లో తలపెట్టే ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు.పరిశోధన కేంద్రాలు, కేవీకేల శాస్త్రవేత్తలనూ భాగస్వాములను చేస్తున్నారు. మండలాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. సీజన్ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాకో కో–ఆర్డినేటర్ను నియమిస్తున్నారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు. -
బీమా పేరుతో భారం వేయవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకపార్టీ ఉచిత పంటల బీమాను మార్చే సాకుతో బీమా భారాన్ని రైతులపై వేసే యోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతుల సంఘాల సంయుక్త సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడలో నిర్వహించిన సంయుక్త సమావేశం వివరాలను ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. రైతుల భాగస్వామ్యం పేరుతో బీమా ప్రీమియం భారాన్ని రైతులపై వేసేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కరువు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి రైతులపై భారం వేసే ప్రయత్నాలు చేస్తే రైతు ఉద్యమం తప్పదని చెప్పారు. ఈ విషయమై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రైతులు, కౌలురైతులు కదులుతారని తెలిపారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయంతో ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ‘సామూహిక రాయబారాల’ పేరుతో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. 2023లో కరువు, తుపాన్లతో దెబ్బతిన్న పంటలకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాల్లో వేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పరిహారం ఇవ్వాలని, రైతు సేవా (రైతు భరోసా) కేంద్రాలను బలపర్చాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుసేవా కేంద్రాల ద్వారా అందించాలని, పెండింగులో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు ఇస్తామని వారు వివరించారు. -
ప్రజాభిప్రాయం మేరకే ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. -
రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్ ఎస్టేట్కు ఉంటుందని, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ అభివృద్ధి.. నా మార్క్ ‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ హైదరాబాద్లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్ ఉంది. ఇలా నా మార్క్ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్ వెళ్లి అక్కడి రివర్ డెవలప్మెంట్ మోడల్ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్ మార్క్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్ వివరించారు. గండిపేటకు ట్రంక్ లైన్.. ‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్ లైన్ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. మరికొన్ని అంశాలపై ⇒ వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్–1 విషయంలో బీఆర్ఎస్ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్ ఆరోపించారు. అయితే గ్రూప్–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. ⇒ లోక్సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. ⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.పదేళ్లు నేనే సీఎం..ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించిందిసార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్కు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. ఎలా జరగొచ్చంటే.. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ రోజు ఈవీఎంలను పోలింగ్ బూత్లకు తరలిస్తారు.అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఉంచుతారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్ సెంటర్కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు వెళ్తున్నాయి..’అని రేవంత్ తెలిపారు. ట్యాంపరింగ్ ఏ రకంగా చేస్తారో చెప్పలేం‘ఈవీఎంల ట్యాంపరింగ్ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’అని రేవంత్ చెప్పారు. -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
చనిపోయిన తర్వాత వస్తారా?
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్టుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ భూసమస్యతో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు బుధవారం తహసీల్దార్ రమేశ్ గ్రామానికి వచ్చారు. దీంతో ప్రభాకర్ కుటుంబసభ్యులు ఆయనను అడ్డుకున్నారు. భూసమస్యపై ఫిర్యాదు అందగానే అధికారులు స్పందిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఆయన తండ్రి బోజెడ్ల పెద్దవీరభద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. గత వేసవిలో సుమారు రూ.8 లక్షలు వెచ్చించి తమ భూమిలోకి మొరం మట్టి తోలించగా, చెరువు శిఖాన్ని ఆక్రమించారంటూ మత్స్యశాఖ సొసైటీ మూడు ఎకరాల్లో మట్టి తొలగించిందని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ను పొలంలోకి రాకుండా అడ్డుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎస్సై నాగుల్మీరా వారికి సర్దిచెప్పి తహసీల్దార్ను కారు ఎక్కించారు. అయినప్పటికీ వారు కారుకు అడ్డుగా కూర్చోవడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పగా వారు శాంతించారు. విచారణలో వేగం: రైతు ప్రభాకర్ ఆత్మహత్యను సీరియస్గా పరిగణించిన సీఎం రేవంత్రెడ్డి, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేÔశారు. రైతు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు సెల్ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక పోలీసులు తమకు లభించిన వీడియోలను సైతం పరిశీలిస్తున్నారు. -
ఆ రెండు గంటల్లో ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని/హైదరాబాద్: : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్(45) సోమవారం భూవివాదంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా.. ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించిరా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన చెబుతున్న మాటలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయడంతో పురుగుల మందు తాగిన సమయాన వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. దీంతో అదికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా చింతకాని తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు ఆరా తీయడమే కాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వరకు స్థానిక అధికారులు ఏం చేశారని ప్రశ్నించినట్టు సమాచారం.వీడియో తీసి... వాట్సాప్ గ్రూపులో పెట్టి కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించాక, ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.39 గంటలకు తీసిన వీడియోను సాయంత్రం 5.40 గంటలకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. దీంతో మధ్య రెండు గంటల సమయంలో ఏం జరిగిందో తేలాల్సి ఉంది. అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్యలో రాజకీయకుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ తొలుత సమస్యను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు విన్నవించాడు. కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మాట్లాడకపోవటంతో బీఆర్ఎస్ నాయకుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీడియో తీసినట్టు భావిస్తున్న గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.విచారణ చేయిస్తున్నాం..ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ను ఈ విషయమై ఆరా తీయగా రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యా దుతో ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో..బోజడ్ల ప్రభాకర్ తన తండ్రి పెదవీరయ్యతో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. కలెక్టర్ లేకపోవడం, అంతకు ముందే సమయం అయిపోవడంతో అధికారులు వెళ్లిపోగా సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాకర్ ఓ మామిడితోటలో వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లు పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వీడియోలో ప్రభాకర్ కన్నీటిపర్యంతమవుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభాకర్ కలెక్టరేట్కు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో ఎవరెవరు ఉన్నారు, మండల స్థాయిలో అధికారులను కలిసినా ఎందుకు పరిష్కారం చూపలేదనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. -
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
Farmer Suicide: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి...
చింతకాని/జనగామ /లింగాల/గద్వాల రూరల్: వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యతి్నంచారు. నాలుగు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి... ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచి్చంచి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు. గోలీలు మింగి...కిరోసిన్ డబ్బాతో... ⇒జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దేవులపల్లి జ్యోతి, స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచి్చంది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యతి్నంచగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇతరుల పేరిట పట్టా చేశారని... ∙నాగర్కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయతి్నంచింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. నేతలు భూమి కబ్జా చేశారని... ∙జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆ«ధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. వచ్చే నెల తొలివారంలో నియామకాలు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు. రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్హౌజ్లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు.. హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు. -
రైతు వర్సెస్ యూట్యూబర్.. పీఎస్కు చేరిన పంచాయితీ
పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్ స్టేషన్కు చేరింది. పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది.విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్ను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గ్రామాల్లో ధరల భారం తీవ్రం
ముంబై: దేశంలో మహమ్మారి కరోనా అనంతరం ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులతో రికవరీ అవుతున్న అయిన విధంగానే (ఇంగ్లీషు అక్షరం ‘కే‘ నమూనా) ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయని బ్యాంకింగ్ సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా అనంతరం దేశ ప్రజలందరికీ ఎకానమీ రికవరీ ప్రయోజనాలు ఒకే రీతిగా అందకుండా తీవ్ర అడ్డంకులు నెలకొన్నాయని, అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం కొన్ని వర్గాలపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోందని వివరించింది. దేశంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజూల్ భండారీ నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా తీవ్ర వేడి, పంట నష్టం, పశువుల మరణాల కారణంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యలను గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. 👉పలు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి అనేక ఇంధనాలను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించరు. దీనివల్ల పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. 👉 ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ఇది ఎంతో ‘‘నిగూఢమైన’’ అంశం. నిజానికి ఆహారాన్ని పండించే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రైతు ఆదాయాలు దెబ్బతింటున్నందున వారు పట్టణ ప్రొక్యూర్లకు (పంట సేకరణ వ్యాపారులు)తమ పంటలను విక్రయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సరఫరాలకు దారితీసి, ఆయా ప్రాంతాల్లో ధరల తీవ్రతకు దారితీస్తోంది. 👉ఇక ఇదే సమయంలో తగిన మౌలిక సదుపాయాలు, సరఫరాల వ్యవస్థ పటిష్టత, భారీ దిగుమతుల వెసులుబాటు వంటి అంశాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకంటే తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కలిగి ఉంటున్నారు. 👉 మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. 👉 వర్షాలు తగిన విధంగా లేకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గుదలకు తగిన పాలసీ నిర్ణయాలను తీసుకోకపోవచ్చు. ఇది ఎకానమీపై తీవ్ర ప్రతికూలత చూపుతుంది. 👉జూలై– ఆగస్టుల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాకపోతే తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య తప్పదు. ధాన్యాగారాల్లో గోధుమలు పప్పుధాన్యాల నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. తగిన వర్షపాతం నమోదుకాకపోతే, 2024లో ఆహార ఒత్తిడి 2023 కంటే అధ్వాన్నంగా ఉండవచ్చు. జూన్లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా తృణధాన్యాలు పండుతాయి. ఇక్కడ 63 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 👉 వర్షాలు సాధారణ స్థితికి వస్తే, ద్రవ్యోల్బణం బాగా పడిపోవచ్చు. దీనితో ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల వ్యవస్థకు నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల అంశాల నమోదయితే మార్చి 2025 నాటికి 0.5 శాతం రెపో రేటు తగ్గింపునకు దారితీయవచ్చు. 👉బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 6.5 శాతం. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. 👉 ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐ నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. -
ముఖ్యమంత్రి గారూ..! సీఎం అంటే ‘కటింగ్ మాస్టరా’?
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ.. సీఎం అంటే కటింగ్ మాస్టరా?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ‘ఎక్స్’వేదికగా వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటిలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెడుతోందని, సీఎం అనే పదానికి కటింగ్ మాస్టర్ అనే సరికొత్త నిర్వచనం తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయా పథకాల్లో కోతల గురించి కేటీఆర్ పోస్ట్ చేశారు. ‘నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు రూ. 2 లక్షల రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదట రూ.39 వేల కోట్లు అని ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు’అని పేర్కొన్నారు.పాసుబుక్కులు లేవనే నెపంతో.. లక్షల మందికి కోత పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. అలాగే రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ వదిలేయమని స్పష్టం చేశారు.ఇప్పటికే రూ. 500 సిలిండర్, రూ. 200 యూనిట్ల విద్యుత్ పథకాలకు కూడా కోతలు విధించారని విమర్శించారు. ఇదే విధంగా రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి, లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని అన్నారు. ‘నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండుగ ముగిసినా.. ఎకరానికి రూ.7,500 రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో ‘‘అందరికీ అన్నీ’’అన్నారు. అధికారంలోకి రాగానే ‘‘కొందరికే కొన్ని’’అని కోతపెడుతున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాడుతాం’అని హెచ్చరించారు. -
రేపు ‘పీఎం కిసాన్’ తొలి విడత
సాక్షి, అమరావతి: రైతన్నలకు ప్రధానమంత్రి కిసాన్ 17వ విడత సాయం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయనుంది. మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ పెట్టుబడి సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు.అన్నదాతలకు అండగా..2018–19 నుంచి కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. తొలి విడత సాయం మే–జూన్లో, రెండో విడత అక్టోబర్– నవంబర్లో, మూడో విడత జనవరి–ఫిబ్రవరిలో జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో దేశ వ్యాప్తంగా రూ.3.04 లక్షల కోట్లు జమ చేసిన కేంద్రం రాష్ట్రంలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.14,717 కోట్లు అందచేసింది. 2024–25 సీజన్లో ఏపీలో 43.52 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.870 కోట్లు జమ చేయనుంది. ఇప్పటికే ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. యూపీ పర్యటనలో భాగంగా మంగళవారం పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను ప్రధాని మోదీ నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.ఐదేళ్లూ ఠంచన్గా ఇచ్చిన వైఎస్ జగన్పీఎం కిసాన్తో పాటే గత ఐదేళ్లూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నలకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని అందజేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయంగా అందించి తోడుగా నిలిచింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి వారం రోజులు గడుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటోంది. ఈ సమయంలో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం పట్ల రైతన్నలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
కొనుగోలు మోసాలతో.. కునారిల్లుతున్న రైతు
తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ఎవరున్నా రైతు మాత్రం పచ్చి మోసానికీ, దోపిడీకీ గురవుతున్నాడు. ముఖ్యంగా పండిన పంట అమ్ముకునే క్రమంలో రైతులను వడ్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జాబు తిరుపతి అనే కౌలురైతు ఉదంతం.తిరుపతి దాదాపు నలభై రోజుల క్రితం 40 కేజీల తూకంతో ఉన్న 297 బస్తాల రబీపంట ధాన్యం మొత్తాన్నీ స్తంభనపల్లి ‘ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ’ (పీఏసీఎస్–ప్యాక్స్) వడ్ల కొనుగోలు కేంద్రాని (పీపీసీ)కి అమ్మాడు. ఈ పీపీసీ బాధ్యుడు ఆశ పవన్. ఈ ధాన్యం విలువ రూ. 2,61,716. అయితే వడ్లు కొన్నట్లుగా పవన్ ఎలాంటి రసీదును ప్యాక్స్ తరఫున ఇవ్వలేదు. కౌలు రైతు తన వడ్ల డబ్బుల కోసం, బ్యాంకు పాస్బుక్, కౌలు ధ్రువీకరణ తదితర పత్రాలన్నింటిన్నీ ప్యాక్స్కు అందించాడు.తిరుపతి అమాయకత్వాన్ని గమనించిన పవన్ తన స్నేహితుడైన గుండెల్లి ప్రవీణ్తో కుమ్మక్కై అతని డబ్బును కాజేశాడు. పథకం ప్రకారం పవన్ తన స్నేహితుడు ప్రవీణ్కు ఫోన్ చేసి, ‘నీ ఖాతాలో జాబు తిరుపతి అనే రైతు డబ్బులు వేస్తున్నా’నని పదే పదే చెప్పి మరీ వేశాడు.పవన్ వడ్లు అమ్మిన రైతుకు, రసీదు ఇవ్వకపోవడం మొదటి తీవ్రమైన తప్పు. రైతు ఖాతాలో డబ్బులు వేయకుండా ఆ డబ్బులు మిత్రుని ఖాతాలో వేయడం తీవ్రమైన నేరం. పాక్స్ –1964 చట్టం, తెలంగాణ పౌరసరఫరాల చట్టాల ప్రకారం అత్యంత నేరపూరితమైన చర్య. జగిత్యాల జిల్లా కలెక్టర్కు, పౌరసరఫరాల అధికారికి, జిల్లా సహకార సంఘం (ప్యాక్స్ ఉన్నత) అధికారికి, స్థానిక పోలీసు సీఐకీ, బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. ప్యాక్స్ సంఘాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించే జిల్లా సహకార సంఘం అధికారులు తమ కింది సంఘాలు రైతుల పట్ల పాల్పడుతున్న ఘోరమైన మోసాన్ని గుర్తించారు.ఈ ప్యాక్స్కు ఆర్థిక వనరులు అంటే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, వరి ధాన్యం కొనుగోలు ఇలా అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ ఎత్తున డబ్బు వస్తుంది. ప్యాక్స్ చట్టం ప్రకారం ఈ డబ్బుతో మోసపోయిన రైతుకు డబ్బు చెల్లించాలి. ప్యాక్స్ చట్టం –1964 ప్రకారం రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలి. ఇలా రైతులను మోసం చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్యాక్స్ పరిధిలో మోసం చేసిన వారిని విచారించి వారి ఆస్తులను వేలం వేసి సమానమైన డబ్బును ప్యాక్స్కు జమకట్టాలని 1964 చట్టం చెబుతుంది. ధాన్యం కొలుగోల్లలో రైతులకు ఎలాంటి మోసం జరిగినా తానే బాధ్యుణ్ణి అని కొనుగోలు కేంద్రాల బాధ్యులందరితో ప్రతి ఏటా ప్రమాణ పత్రాలు తీసుకోకపోవడం ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద తప్పు.జాబు తిరుపతికి తను అమ్మిన ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్యాక్స్ రసీదు ఇచ్చి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. జరిగినా రసీదు అనే ఆధారం ఉండేది. డబ్బులు వాటికవే రైతు ఖాతాకు వచ్చేవి. తెలంగాణలో ధాన్యం అమ్మిన లక్షలాది మంది రైతులలో చాలామందికి రసీదులు ఇవ్వక పోవడం వారికి సామూహికంగా జరుగుతున్న అన్యాయం. రసీదులో రైతు ధాన్యం బరువు కచ్చితంగా తెలుస్తుంది. ఇవ్వవలసిన డబ్బులు ఎంత అనేది తెలుస్తుంది. రైతుకు రసీదు ఇచ్చిన తరువాత ధాన్యానికి సమానమైన ధర చెల్లించక తప్పదు. రసీదు ప్రకారం అమ్మకం జరిగిన నాటి ధాన్యం బరువులో కోత విధించకూడదు. ధాన్యం నాణ్యత బాగాలేదు, తేమ ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇలా అనేక విషయాల్లో పీపీసీ బాధ్యుడి అన్యాయాలకు రసీదు సంకెళ్లు వేస్తుంది.ఈ రబీ పంట కాలంలో 40 కిలోల వడ్ల బస్తాకు మూడున్నర కిలోల చొప్పున మిల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా రైతులను దోచుకున్నారు. అంటే క్వింటాల్కు 7–8 కిలోల చొప్పున రైతాంగాన్ని యధేచ్ఛగా దోపిడీ చేశారు. ప్రతి క్వింటాల్కు రైతును రూ. 160 చొప్పున మిల్లర్లు దోచుకున్నారు. ఈ లెక్కన తెలంగాణ అంతటా కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం ఎంత? దోపిడీ ఎంత అనేది గణిస్తే తేలికగా దోపిడీ అర్థమవుతుంది.జరిగిన మరో పెద్ద మోసం అన్ని రకాల వడ్లను గ్రేడ్ల వారీగా కాకుండా, ఓకే సాధారణ వెరైటీ కింద మిల్లర్లు కొనుగోలు చేయడం. ఇందులో జరిగిన మిల్లర్ల దోపిడీ మాయాజాలం ఏమిటి? ఏ– గ్రేడ్ సన్న రకం వడ్లకు రూ. 2,203 కాగా బీ–గ్రేడ్ కు రూ. 2,183. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఏ ఒక్క క్వింటాల్ ధాన్యానికీ గ్రేడ్ల వారీగా ధర చెల్లించిన దాఖలా లేదు. అంటే ప్రతి క్వింటాల్ ధాన్యానికి రైతు రూ. 20 నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్కు మిల్లర్ రూ. 20 దోచుకున్నాడు. దీన్నిబట్టి రాష్ట్రం మొత్తం కొనుగోళ్లలో దోపిడీ ఎంత భారీ స్థాయిలో జరిగిందో గుర్తించవచ్చు. అలాంటప్పుడు ఏ– గ్రేడ్, బీ– గ్రేడ్ లేదా సన్న, దొడ్డు రకాలు అని వేరువేరుగా విభజన చేయడం, గుర్తించడం ఎందుకు? ఏ– గ్రేడ్ వడ్లు పండించడానికి రైతు చేసిన ప్రత్యేక శ్రమ, ఖర్చులకు సస్యరక్షణకు విలువ ఏమిటి?సన్న వడ్లకే రూ. 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం ఒక మోసం కదా? ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు బోనస్గా క్వింటాల్కు రూ. 500 చెల్లిస్తామన్నారు. నిజానికి సన్న, దొడ్డువడ్లు అనే విభజన అమలులో లేదు. ఎన్నికల తర్వాత మాట మార్చడం ఏమి నీతి? ఈ సన్న రకాలకు గత ఖరీఫ్ సీజన్లో బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ. 2,800– 3,000 వరకు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం ఇచ్చే బోనస్తో కలుపుకుని 2,703 రూపాయలు మాత్రమే (రూ. 2,203+500) రైతుకు వస్తుంది. గత ఖరీఫ్ బహిరంగ మార్కెట్తో పోలిస్తే, ప్రతి క్వింటాల్కు రైతు వంద రూపాయల నుండి 300 వరకూ నష్టపోతున్నాడు. ఇది రైతాంగానికి తలపెట్టిన సామూహిక మోసం కాదా?పదేళ్ల కేసీఆర్ పాలనలో ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వ ప్యాక్స్, డీసీఎమ్ఎస్ల దోపిడీ యధేచ్చగా సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇదొక కారణం. గత పదేళ్ల దోపిడీని గుర్తించి కొన్ని ప్రాంతాలలో ప్యాక్స్ డీసీఎంఎస్లకు ఈ రబీ సీజన్లో ఒక్కటంటే ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. వీరి స్థానంలో ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఇచ్చారు.కేసీఆర్ పాలనలో దోపిడీకి అలవాటు పడ్డ ఒక ప్రభుత్వ ప్యాక్స్ సంఘమే, తమది రైతు రాజ్యం అని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఓ అమాయక నిరుపేద కౌలు రైతు మొత్తం కష్టాన్నీ నిట్ట నిలువునా దోచుకుంది. భూమి కౌలు, పెట్టుబడుల భారం, అప్పుల వాళ్ళ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు ఆ రైతు యత్నిస్తే, బంధుమిత్రులు ఆపారు. పంట అమ్మి నేటికీ 40 రోజులవుతోంది. ప్రభుత్వం ప్యాక్స్ సంఘంతో కౌలు రైతు కష్టం ఇప్పిస్తారా? ఈ ‘రైతు రాజ్యం’లో ఏం జరుగుతుందో చూద్దాం!అభిప్రాయం: – నైనాల గోవర్ధన్, వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్, 97013 81799ఇవి చదవండి: బాల్యానికి భరోసా ఏదీ? -
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!) -
‘నా తల్లి కోసం ఇలాంటి వెయ్యి ఉద్యోగాలైనా కోల్పోతా’ : కుల్విందర్ కౌర్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ సస్పెండ్ అయ్యారు. అయితే, తాజా పరిణామాలపై కుల్విందర్ కౌర్ స్పందించారు. ఈ ఉద్యోగం పోతుందనే భయం లేదు.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా తల్లి గౌరవం కోసం అలాంటి వేలాది ఉద్యోగాలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.కంగనా రనౌత్ గతంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ధర్నా చేసిన వారిలో తన తల్లి కూడా ఉందంటూ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కంగనాను చెంప దెబ్బకొట్టింది. రైతులను అగౌరపరించినందుకు తాను ఈ పనిచేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘనటపై కొన్ని గంటల్లోనే ఆమె సస్పెండ్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఉదయం పోలీసులు కుల్విందర్ కౌర్ను అరెస్ట్ అయ్యారు. కాగా, కంగనాపై చేయి చేసుకున్న కుల్విందర్ కౌర్కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమె ఒప్పుకుంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఎవరైనా మీ తల్లి రూ.100కే అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే మీరేం చేస్తారు? అని ప్రశ్నించారు. मुझे नौकरी की फिक्र नहीं है,मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024 -
92% మందికి ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్ఎస్కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్ఎంఎస్కు ప్రతిపాదనలు పంపింది.ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలుదేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్కు ఆ సీజన్లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబునాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.ఆ కథనాల్లో నిజం లేదు..ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
రుణమాఫీకి మహారాష్ట్ర మోడల్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణలోనూ రైతులకు పంటల రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. మహారాష్ట్రలో గతంలో ఒకేసారి రూ.20 వేల కోట్లు మాఫీ చేశారు. సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి.. రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాల మాఫీని అమలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇటీవల మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించి అధ్యయనం చేశారు. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఎలా సమకూర్చారన్న దానిపైనా ఆరా తీశారు. రాజస్తాన్లోనూ ఇదే పద్ధతిలో రుణమాఫీ చేశారని తెలుసుకున్నారు. ఆ వివరాలతో తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది.అసలు వడ్డీతో కలిపి మాఫీ..మహారాష్ట్రలో పర్యటించి వచ్చిన అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆ రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల మంది రైతులు ఉన్నారు. వారిలో చాలా మంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే 2015 నుంచి 2019 వరకు కరువు పరిస్థితులతో రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31వ తేదీ మధ్య రైతులు తీసుకున్న పంట రుణాల్లో రూ.2 లక్షల వరకు ఉన్నవాటిని మాఫీ చేసింది. ఇందుకోసం పెద్దగా షరతులేవీ పెట్టలేదు.రైతుకు ఎక్కువ భూమి ఉందా, తక్కువ ఉందా అన్న కొర్రీ ఏదీ పెట్టలేదు. నిర్ణీత గడువులో రుణం అసలుతోపాటు వడ్డీ మొత్తాన్ని కూడా మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా పంట రుణాలు తీసుకున్న రైతులకు.. ఆ పరిమితి వరకే మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణఖాతాలకు సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఆధార్తో లింక్ చేయని రుణ ఖాతాదారులను గుర్తించి లింక్ చేయించారు. రైతుల సమాచారాన్ని పోర్టల్లోకి అప్లోడ్ చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయి పాలనా యంత్రాంగం రుణమాఫీ బాధ్యతను స్వీకరించింది.కటాఫ్ తేదీనే కీలకం..తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక దానిపై కొంత కసరత్తు జరిగింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కసరత్తు చేపట్టిన అధికారులు.. మహారాష్ట్రలో అధ్యయనం చేశారు. తెలంగాణలో రైతుల రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే.. వడ్డీతో కలిపి దాదాపు రూ. 35 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. కటాఫ్ తేదీని బట్టి ఈ మొత్తం మారొచ్చని అధికారులు అంటున్నారు.అయితే బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా, వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంపన్నులకూ రైతుబంధు ఇచ్చి దుర్వినియోగం చేశారంటూ విమర్శలున్న నేపథ్యంలో.. రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినతేదీ డిసెంబర్ 9ని పంట రుణమాఫీకి కటాఫ్ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తేదీని కటాఫ్గా తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు సమాచారం. -
ఉప్పు రైతుకు ధరల తీపి
సింగరాయకొండ: వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉప్పు రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడులోని ఉప్పు పండించే ట్యుటికోరన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పండించే ఉప్పుకు గిరాకీ ఏర్పడింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఉప్పు తయారీ ప్రారంభం కాగా.. నిన్న మొన్నటివరకు 75 కేజీల బస్తా ఉప్పు ధర రూ.100 నుంచి రూ.150 పలికింది. తమిళనాడు నుంచి భారీఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తుండటంతో బస్తా రూ.200 ధర పలుకుతోంది. 9 నెలలూ ఉప్పు సాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో సుమారు 9 నెలలపాటు ఉప్పు సాగు చేస్తారు. ఎకరాకు 800 నుంచి 900 బస్తాల వరకు ఉప్పు దిగుబడి వస్తోంది.ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలించడంతో 1,300 నుంచి 1,400 బస్తాల వరకు దిగబడి వస్తోంది. ప్రతినెలా ఇక్కడ 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా కూలీలు లబ్ధి పొందుతున్నారు. ధరలు బాగున్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో ఉప్పు నిల్వ చేశాను. తమిళనాడు వ్యాపారులు నేరుగా వచ్చి నన్ను కలవటంతో మంచి ధర లభించింది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెందిగుబడి బాగా వచ్చింది ఐదెకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ఏడాది ప్రారంభంలో ధరలు తక్కువగా ఉన్నా దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారుల రాకతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఉప్పు కొనుగోలు చేస్తే రైతుకు మంచి ధరలు లభిస్తాయి. – గౌరవరపు శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం -
సంతోషాలు పంచిపెట్టె
నరసరావుపేట: వారు రైతు బిడ్డలు. భూమాతను నమ్ముకున్న అన్నదాతల కష్టాలు తెలిసిన మానవతావాదులు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీలు చేసినా ఉద్యోగం చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలికారు. ఉన్న ఊరిలోనే పలువురికి ఉపాధి కలి్పస్తూ సొంతంగా వ్యాపారం చేయాలని సంకలి్పంచారు. ప్యాకింగ్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఇదీ నరసరావుపేట ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం.ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయప్రస్థానం ∙ స్వయం ఉపాధితో పాటు 40 మందికి బతుకుతెరువుప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం విస్తరిస్తున్నామన్న యాజమాన్యం ∙ ఉన్నత చదువులు చదివినా ఉన్న ఊరికి మేలు చేయాలనే సంకల్పంఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అయినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూడలేదు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంత అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు. అధ్యయనం చేశారు. ఆయిల్, స్పిన్నింగ్, మిల్క్ యూనిట్లు అనేకం ఉండడంతో ఆయా ఉత్పత్తులు ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అట్ట పెట్టెలు తయారీ పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇదీ నరసరావుపేట పెద్దచెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అధినేత కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి విజయగాథ.వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాకతో ఉజ్వల ప్రగతి పరిశ్రమ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసింది. ఓ వైపు కోవిడ్ తో ప్రభుత్వానికి ఆరి్థక కష్టాలు వెంటాడుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో 2015–20 పాలసీ కింద ఏర్పాటుచేసిన పరిశ్రమలకు చెల్లించాల్సిన సబ్సిడీలను విడుదల చేశారు. దీంతో ఆంజనేయ ఇండస్ట్రీస్ కు రూ. 13 లక్షల సబ్సిడీ లభించింది. దీంతోపాటు విద్యుత్ టారిఫ్ల మినహాయింపులు, చెల్లించాల్సిన రుణానికి వడ్డీలో సబ్సిడీ మంజూరు చేశారు. ప్రభుత్వ చర్యలతో యజమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. సుమారు 40 మంది ఉద్యోగులు, కూలీలను నియమించుకొని వ్యాపారాన్ని మరింత విస్తరించారు. మూడు షిప్టులుగా పనిచేస్తున్న సిబ్బందికి ఒకొక్కరికి నెలకు రూ.40వేలు నుంచి రూ.15వేలు వరకు జీతాలు చెల్లించి ఉపాధి చూపించారు. జిల్లాలోని పలు వ్యాపారులు, పరిశ్రమలకు కావాల్సిన అట్టపెట్టెలను ఆర్డర్లు తెప్పించుకొని వారికి నచ్చిన రీతిలో తయారుచేసి సకాలంలో అందిస్తూ వ్యాపారుల మన్ననలు పొందుతున్నారు. ఇంతితై వటుడింతై అన్న చందంగా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.3 నుంచి 4కోట్ల టర్నోవర్ చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రిక్త హస్తం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రచారాలు చేసిన గత టీడీపీ పాలకులు హామీలను తుంగలో తొక్కారు. ఎటువంటి సబ్సిడీని మంజూరు చేయకపోయినా కృష్ణకిషోర్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కొని సొంత పెట్టుబడితో పరిశ్రమను స్థాపించాడు. సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనుకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దీంతో కష్టంగానే వ్యాపారాన్ని నెట్టుకొచ్చారు.40 మందికి ఉపాధి నరసరావుపేటకు చెందిన కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. నరసరావుపేటలోనే ఏదైనా పరిశ్రమ పెట్టాలని భావించారు. ఈ ప్రాంతంలో ఆయిల్, స్పిన్నింగ్ మిల్లులు, మిల్క్ యూనిట్లు, లాంటి సంస్థల ఆవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్కు ఉపయోగించే అట్టపెట్టెల పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి 2020 పరిశ్రమల ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పాలసీ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన స్నేహితుడు గెల్లి అరుణ్రెడ్డిని భాగస్వామిగా చేసుకొని 2019 జనవరిలో పట్టణంలోని పెద్దచెరువు ఇండ్రస్టియల్ ఎస్టేట్లో ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అనే చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు. మెషినరీ కోసం రూ.60లక్షలు, మరో రూ.25లక్షల ఓవర్ డ్రాప్్టతో సంస్థను ప్రారంభించారు. నా ఆశయం నెరవేరింది మా లాంటి చిన్నతరహ పరిశ్రమలకు ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. ఏ అధికారి వత్తిళ్లు లేవు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాం. ఉన్న పట్టణంలోనే పదిమందికి ఉపాధి కలి్పంచాలనే నా ఆశయానికి ప్రభుత్వ సహకారం తోడైంది. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. –కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి, ఎం.డి. ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉన్న ఊరిలో ఉపాధి దొరికింది ఈ పరిశ్రమ రావడంతో నాకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించింది. ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తుండడంతో కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా అట్ట పెట్టెలు తయారుచేస్తున్నాను. –కె.కోటేశ్వరరావు, కూలీ యూనిట్ పేరు : ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి : అట్ట పెట్టెల తయారీ యజమానులు : కృష్ణకిషోర్రెడ్డి, అజయ్ రెడ్డి పెట్టుబడి : రూ. 85 లక్షలు టర్నోవర్ : రూ. 3 కోట్లుఉపాధి : 40 మంది కేటగిరి : చిన్నతరహా ప్రాంతం : నరసరావుపేట -
బాబు దండగ అంటే.. జగన్ పండగ చేశారు..
ఇక వ్యవసాయం దండగ.. దాని పని అయిపోయింది.. రైతులు వేరే పనులు చూసుకోండి.. వ్యవసాయానికి ఉచిత కరెంట్ అట! సాధ్యమయ్యే పనేనా? కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి’. ఈ మాటలు అన్నది ఎవరని తెలుగు ప్రజలు ఎవరిని అడిగినా ‘చంద్రబాబునాయుడు’ అని టక్కున సమాధానమిస్తారు. రైతులంటే ఆయనకు చులకన. వ్యవసాయం అంటే దరిద్రం అని భావన. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర ఆయనది. ‘ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఆధారపడిన వృత్తి వ్యవసాయం. ఆరుగాలం శ్రమిస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతుల కష్టాలు కళ్లారా చూశాను కాబట్టే వారి కోసం ఎందాకైనా.. అంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రభుత్వాల పరంగా ఎంత చేసినా తక్కువే’ అని సీఎం వైఎస్ జగన్ తరచూ చెబుతుంటారు. వైఎస్ జగన్కు, చంద్రబాబుకు మధ్య ఎంత తేడా ఉందో పై రెండు ఉదాహరణలే నిదర్శనం. ఇలాంటి చంద్రబాబుకు ఈనాడు రామోజీ నిత్యం బాకా ఊదుతున్నారు. వ్యవసాయ రంగ పితామహుడు చంద్రబాబే అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. దింపుడు కల్లం ఆశలతో ఉన్న టీడీపీని ఎలాగైనా సరే బతికించాలని బరితెగింపు రాతలు రాస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఆలోచన వినూత్నం.ప్రపంచ స్థాయి ఆవిష్కరణ. వ్యవసాయాధారిత దేశాలన్నీ అనుసరించదగ్గ గొప్ప విధానం. వీటికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. వీటి గురించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి కూడా నివేదించాం.– తోమియో షిచిరీ, కంట్రీ మాజీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (యూఎన్వో) జాతీయ స్థాయిలో అధ్యయనం జరగాలి ఆర్బీకేల ద్వారా సంక్షేమ పథకాల అమలుతో పాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు బాగుంది. వాటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు చర్చ, అధ్యయనం జరగాలి. ఆర్బీకేలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తున్నాం. -అమితాబ్కాంత్,సీఈవో, నీతి ఆయోగ్ రామోజీ.. కళ్లకు పచ్చగంతలు తీసి చూడు...మొత్తంగా వ్యవ‘సాయం’ రూ. 1,86,548 కోట్లుచంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు నిండా మునిగారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. – పంపాన వరప్రసాదరావు ధాన్యపు సిరులు..పంట ఉత్పత్తులుఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు బ్రేకయ్యాయి. బాబు హయాంలో గరిష్టంగా 2017–18లో 167.22 లక్షల టన్నుల దిగుబడులు నమోదు కాగా, గడచిన ఐదేళ్లలో 2019–20 సీజన్లో గరిష్టంగా 175.12 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇదే గరిష్ట దిగుబడులు.. 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 162.04 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే బాబు హయాంతో పోల్చుకుంటే 8 లక్షల టన్నులకు పైగా పెరిగింది . మరో పక్క కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతులకు అండగా నిలిచేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.ఇలా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7746.31 కోట్ల విలువైన 22.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి కేవలం రూ.3322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించగలిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 37.73 లక్షల మంది రైతులకు రూ.65,258 కోట్లు చెల్లించారు. గ్యాప్ సరి్టíఫికేషన్తో రైతులకు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయి ధరలు లభించేలా కృషి చేస్తోంది. ఇప్పటికే 3,524 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు గ్యాప్ సరి్టఫికేషన్ ద్వారా 1673 మంది రైతులు లబ్ధి పొందారు. ఆర్బీకేలు.. ఆదర్శం ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. ఇవి ప్రతి రైతును గ్రామస్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. గ్రామల్లో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలను వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్లుగా తీర్చిదిద్దారు. వీటిలో 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ఇక్కడ స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్్కలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. మెరుగైన సేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్, బ్యాంకింగ్ సేవల కోసం 9,277 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు.ఈ క్రాప్ ప్రామాణికంగా ధాన్యంతో సహా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన రైతులకు అందిస్తున్నారు. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు గోదాములు, కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్స్ వంటి మౌలిక వసతుల కల్పనతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్మోడల్గా నిలిచింది.పొరుగు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), నీతి ఆయోగ్, ఐసీఎఆర్, నాబార్డు, ఆర్బీఐ ఇలా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆర్బీకేలను సందర్శించి వీటి సేవలను కొనియాడారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ వైఎస్సార్ రైతు భరోసా పథకం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నికల్లో ఇచి్చన హామీ కంటే మిన్నగా ఏటా 3 విడతల్లో ఒక్కో విడతకు రూ.13,500 చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు 1.65 లక్షల కౌలు రైతులు, 94 వేల అటవీ భూ సాగు రైతులతో సహా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి 4 విడతల్లో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా, 5 విడతల్లో రూ.67,500 సాయం అందించారు. నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల చొప్పున రెట్టింపు పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో రూ.37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ ముగిసేలోపే పంట నష్ట పరిహారం ► ఈ ప్రభుత్వంలో ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం అందజేత. ►ఇందుకోసం రూ.2వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు. ►తిత్లీ తుఫాన్ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారం అందజేత ►ఈ ఐదేళ్లలో 34.41లక్షల మంది రైతులకు రూ.3261.60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందజేత ►39.07లక్షల మంది రైతులకు బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్లు అందజేత ►ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతులకు రూ.2050.53 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందజేత ►2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిపి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారం జమ పాడి రైతులకు వెన్నుదన్నుగా.. మూగజీవాల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తూ రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు.ఈ వాహనాలæ ద్వారా 8.81లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించగలిగారు. ఆర్బీకేల్లో నియమించిన 6548 పశుసంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశువైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు.ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 16.72 కోట్ల లీటర్ల పాలను సేకరించగా, రూ.762.88 కోట్లు చెల్లించారు. 40 నెలల్లో ఏడుసార్లు అమూల్ పాల ధరలను పెంచడంతో, ఆమేరకు ప్రైవేటు డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాటికి పాలు పోసే రైతులు రూ.4911 కోట్ల మేర లబ్ధి పొందగలిగారు. చేయూత, ఆసరా లబ్ధి్దదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడిగేదెలు, ఆవులు, 1.35లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మరో పక్క రూ.385 కోట్ల పెట్టుబడితో మూతపడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆక్వా రైతులకు అడుగడుగునా అండగా.. మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతీ కౌంట్కు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేస్తోంది. పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరించుకునేలా చేసింది. ఆక్వా జోన్ పరిధిలోని 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. బాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74లక్షల టన్నులు పెరిగితే. ఈ ప్రభుత్వ హయాంలో 6.94లక్షల టన్నులు పెరిగింది.ఎగుమతులు కూడా 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు జరిగితే. ప్రస్తుతం రూ.20వేల కోట్ల విలువైన 3.30లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులవుతున్నాయి. స్థానిక వినియోగం పెంచేందుకు జిల్లా స్థాయిలో ఆక్వా హబ్లు, 4వేలకుపైగా అవుట్లెట్స్తో పాటు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. ఈ దశలో దేశంలోనే తొలిసారి ఆక్వా రైతులకు బీమా సదుపాయం కలి్పంచింది. వరుసగా రెండుసార్లు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. మరో పక్క మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఈ ఐదేళ్లలో ఏటా సగటున 1.16 లక్షల మందికి రూ.538 కోట్ల మత్స్యకార భృతిని అందించారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచడం ద్వారా ఈ ఐదేళ్లలో రూ.148 కోట్ల సబ్సిడీని అందించింది. మౌలిక వసతులతో మెరుగైన సేవలు► టీడీపీ ఐదేళ్లలో 4.99 లక్షల మంది రైతులకు కేవలం రూ.1488.20 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించింది. ► ఈ ఐదేళ్లలో రూ.1052.42 కోట్లతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయిలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు. ► వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.366.25 కోట్లు సబ్సిడీ అందించింది. ► 6362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్స్, 31,356 ఇతర యంత్ర పరికరాలు అందజేత ► ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1584.61 కోట్లతో 500 టన్నులు, 1000 టన్నుల సామర్థ్యంతో గోదాములతో కూడిన 2536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు ► అందుబాబులోకి వచ్చిన గోదాములు – 554 ►వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివి«ధ రకాల మౌలిక సదుపాయాల కల్పన. ► 60 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.19.95 లక్షల అంచనాతో 97 ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జ్ల నిర్మాణం ► రూ.210 కోట్లతో 147 నియోజకవర్గ, 10 జిల్లా స్థాయి, 4 రీజనల్ స్థాయి ల్యాబ్స్తో పాటు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో గుంటూరులో రాష్ట్ర స్థాయి ల్యాబ్ల ఏర్పాటు ► అందుబాటులోకి వచి్చన జిల్లా స్థాయి ల్యాబ్స్ – 127 ► మరో 154 వెటర్నరీ, 35 ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి ఉద్యాన పంటల హబ్గా ఏపీ ► 2018–19లో సాగవుతున్న ఉద్యాన పంటలు 42.5 లక్షల ఎకరాలు ► ప్రభుత్వ ప్రోత్సాహంతో 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరుగుదల ► 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు ► 2022–23 నాటికి ఏకంగా 368.89 లక్షల టన్నులు ► దీంతో సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం వద్ధి రేటు సాధన ► బాబు హయాంలో జరిగిన అరటి ఎగుమతులు – 24వేల టన్నులు ► కాగా ఈ 5ఏళ్లలో జరిగిన అరటి ఎగుమతులు– ఏకంగా 1.75లక్షల టన్నులు ► అరటి ఎగుమతుల కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా కిసాన్ రైళ్లు ఏర్పాటు ► గతంలో మిరప ఎగుమతి – 12లక్షల టన్నులు ► ప్రస్తుతం జరిగిన మిరప ఎగుమతి – 16 లక్షల టన్నులు ► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిందు, తుంపర పరికరాలకు ఈ ప్రభుత్వం చెల్లించిన నిధులు రూ. 800.16 కోట్లు ► ఈ ఐదేళ్లలో సబ్సిడీ రూపంలో చెల్లించిన నిధులు – రూ.2669.65 కోట్లు ► తద్వారా కొత్తగా సాగులోకి తీసుకొచి్చన ఎకరాలు – 7.33లక్షల ఎకరాలు ► దీనివల్ల లబ్ధి పొందిన రైతులు 2.60లక్షల మందిరామోజీవి దుర్మార్గపు రాతలే..వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ, ఆర్బీకేలు, ఇతర విప్లవాత్మక కార్యక్రమాలేవీ రామోజీ కళ్లకు కనిపించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తిస్తే.. ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని బాబు విస్మరించారు. ఆ బకాయిలు సహా.. పరిహారం పెంచి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. ఇది కూడా తనకు కనిపించనట్లు రామోజీ నటిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రగతిని ప్రశంసించడం కూడా విస్మరించి దుర్మార్గపు రాతలు రాస్తుండటం రామోజీకే చెల్లింది.ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. 10,778 ఆర్బీకేలు, వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్లు.. ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు అన్నదాతలకు సేవలందిస్తున్నారు. స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్్కల ద్వారా సత్వర సేవలు అందుతున్నాయి. సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు.. చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో ఓ వలంటీర్, 9,277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు. ఆర్బీకే ఛానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్మోడల్గా నిలిచింది. ఏపీలో తగ్గిన ఆత్మహత్యలు : కేంద్రమంత్రి ప్రకటన మూడేళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్సభ సాక్షిగా ప్రకటించారు. కానీ చావులతో రాజకీయాలు చేయడం రామోజీ, చంద్రబాబు ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య తక్కువగా ఉందంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ దుష్టచతుష్టయం మాత్రం లోలోన కుళ్లిపోతుంటారు. ఒక పక్క రైతులను అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం అర క్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతిపరులా? కాదా? అనేకోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో రూ.1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన రూ. 3.50 లక్షలు విత్డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కలి్పంచేవారు. చాలా కాలం తర్వాత ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ ఐదేళ్లలో 2014–18 మధ్య 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున రూ.22.50 కోట్లు అందించారు. రూ.7లక్షల పరిహారం ఇస్తున్నఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క ఏపీలోనే రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. రాజకీయాలకు అతీతంగా బాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునః పరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.23.70 కోట్ల ఆర్థికసాయం అందించింది. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిసి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. దేశం మొత్తం ఏపీని చూస్తోంది.. మాది తమిళనాడు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక అగ్రి ల్యాబ్స్(33) మా రాష్ట్రంలోనే ఉన్నాయనుకునే వాడ్ని. కానీ ఏపీలో ఏకంగా 160 ల్యాబ్స్ను తక్కువ సమయంలో నాణ్యతతో ఏర్పాటు చేశారు. ఇక్కడి ల్యాబ్స్, సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచి్చన ‘రైతు భరోసా కేంద్రాలు’ గొప్ప ప్రయోగం. గ్రామ స్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు. – డాక్టర్ కె.పొన్ను స్వామి, జాయింట్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ ఈ క్రాప్ విప్లవాత్మక మార్పు ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర పొందగలగడమనే ప్రధాన సమస్యకు ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (పంటల నమోదు) ద్వారా శాస్త్రీయ పరిష్కారాన్ని ఏపీ ప్రభుత్వం చూపించింది. రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో ఈ క్రాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. పంటల వారీ దిగుబడి అంచనాలతో ఏయే పంట ఉత్పత్తులు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా మార్కెట్లను అనుసంధానిస్తే ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం గొప్ప విషయం. – ప్రొఫెసర్ విజయ్ పాల్ శర్మ, చైర్మన్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు
సాక్షి, ఆదిలాబాద్: మండుతున్న ఎండలతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. చెరువులు ఎండిపోతున్నాయి. పంటలకు నీరందక చేలలో బీటలు కనిపిస్తున్నాయి. మరో వైపు తాగునీటి సమస్య కూడా జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్)లోని ఓ గిరిజన రైతు పంట చేనులో మాత్రం బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా సహజంగా నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. 2005 నుంచి కొనసాగుతున్న ధార.. గిరిజన రైతు టేకం తుకారాంకు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులతో కలిసి దీన్ని సాగుచేస్తున్నాడు. 2005లో తుకారాం చేనులో బోరు వేయించాడు. అప్పుడు 9 అడుగులకే నీళ్లు ఉబికి వచ్చాయి. కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ జలధార ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో జొన్న, గోధుమ పంటలు పండిస్తున్నాడు. వీటికి నిరంతరాయంగా బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నాడు. ఆర్టీసియన్ బావి కారణంగానే.. దీన్ని భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఆర్టిసియన్ బావి అంటారు. దుబ్బగూడ (ఎస్)కు సమీపంలో గుట్ట ఉంది. వర్షం కురిసినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో జలం రీచార్జ్ అవుతుంది. అక్కడి నుంచి నిలువుగా ఉన్నటువంటి పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో నుంచి వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేనును దాటి వెళ్తోంది. దుబ్బగూడలో ఒక లేయర్లో భూగర్భ జలాలు పైవరకు ఉంటాయి. మధ్య ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక ట్యూబ్కు మధ్యలో ఎక్కడైనా పంచర్ పడ్డప్పుడు గాలి, నీరు ప్రెషర్తో బయటకు వచ్చినట్లే ఇక్కడ కూడా పైపొర, చివరి పొర మధ్యన బోరువేసినప్పుడు నీటికి బయటకు వెళ్లే మార్గం ఏర్పడింది. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం బోరింగ్గూడలో కూడా ఇలాగే నీళ్లు ఉబికి వస్తాయి. –టి. పుల్లారావు,అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, ఆదిలాబాద్ -
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
భూమి రికార్డుల్లో నమోదు కాలేదని..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 76 సర్వే నంబర్లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు. అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో.. రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
ఈ రైతన్న మాటలకు సీఎం జగన్ ఫిదా
-
పాత పద్ధతిలోనే పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రంలో సొంతంగా పంటల బీమా తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. కొన్నేళ్ల కింద రాష్ట్రంలో అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)నే తిరిగి అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనితో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందనుంది. నిజానికి 2020 వరకు రాష్ట్రంలో పీఎంఎఫ్బీవై అమలైంది. కానీ అప్పటి సర్కారు రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి బయటికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా అమల్లో లేదు. పంట దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఏదో ఒక పంటల బీమా పథకం ఉంటే మేలన్న భావన చాలా మంది రైతుల్లో నెలకొని ఉంది. పంటల బీమాతో ప్రయోజనం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది బీమా చేయించేవారు. నేరుగా పంటల బీమా తీసుకోవడానికి రైతులు ముందుకు రావడంలేదని భావించిన సర్కారు.. బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు తప్పనిసరిగా పంటల బీమా చేయించే నిబంధన పెట్టింది. పంట రుణం ఇచ్చేప్పుడే బీమా ప్రీమియాన్ని మినహాయించుకొని మిగతా డబ్బులు రైతులకు ఇచ్చేవారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2012–13లో 10 లక్షల మంది పంటల బీమా చేయగా.. పంట నష్టపోయిన 1.80 లక్షల మందికి రూ.78.86 కోట్ల పరిహారం అందింది. 2013–14లో 8.52 లక్షల మంది బీమా చేయించగా.. 1.18 లక్షల మందికి రూ.56.39 కోట్ల పరిహారం వచ్చింది. 2015–16లో 7.73 లక్షల మంది బీమా చేస్తే.. ఆ ఏడాది పంట నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. ► 2016 వానాకాలం సీజన్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం అ మల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొ మ్మును తమ వాటాగా భరిస్తాయి. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు ఫసల్ బీమా చేయించగా.. 1.34 లక్షల మందికి రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. ∙2018–19, 2019–20 సంవత్సరాల్లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరైనా.. అందులో కొంతమేర మాత్రమే రైతులకు దక్కింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రీమియం చెల్లించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. బీమా ప్రీమియంపై కట్టడి తప్పనిసరి పంటల బీమా వల్ల లాభం ఉన్నా.. చాలా మంది రైతులు బీమా ప్రీమియం విషయంలో అసంతృప్తితో ఉన్నారు. బీమా కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నా.. ప్రీమియం ధరలను పెంచుకుంటూ పోయాయని వాపోతున్నారు. తెలంగాణలో అప్పట్లో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్టుగా అమలైందని.. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శలు ఉన్నాయి. పీఎంఎఫ్బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం చొప్పున, పసుపు రైతులు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించారు. ఇక పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతాన్ని రైతులు ప్రీమియంగా చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హెక్టార్కు రూ.24,165 చొప్పున, మిరపకు ఏకంగా రూ.38,715 చొప్పున ప్రీమియంగా ఖరారు చేయడం గమనార్హం. అంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై తీవ్ర అసంతృప్తి చెందారు. తమకు పంటల బీమా వద్దని మొత్తుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో.. బీమా ప్రీమియంపై కట్టడి అవసరమని, ఆ దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఇలా చేయండి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యవత్మాల్ను సందర్శించారు. ఆ సందర్భంలోనే మోదీ 9 కోట్ల మంది రైతులకు రూ. 21,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడతను విడుదల చేశారు. కానీ కొందరికి ఈ స్కీముకు సంబంధించిన డబ్బు ఖాతాలో జమ కాలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడత డబ్బు జమకావడానికి కొందరికి ఇంకా కొంత సమయం పట్టచ్చు. అయితే స్కీమ్ నమోదు చేసుకున్నప్పటికీ.. డబ్బు జమకాకపోతే.. దానికి వివిధ కారణాలు ఉంటాయి. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు ఖాతాలో జమకాకపోవడానికి ప్రధాన కారణం కేవైసీ అప్డేట్ సరిగ్గా లేకపోవడం అని తెలుస్తోంది. మీరు కేవైసీ అప్డేట్ చేసినప్పటికీ.. డబ్బు రాకపోతే మీరు హెల్ప్లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.. లేదా అధికారిక వెబ్సైట్లో పిర్యాదు చేయవచ్చు. పీఎమ్ కిసాన్ డబ్బు రాకపోవడానికి కారణాలు లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం కేవైసీ పూర్తి కాకాపోవడం అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు IFSC కోడ్ తప్పుగా రాయడం తప్పు అకౌంట్ నంబర్స్ ఇవ్వడం బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్ వాలీడ్ కానీ బ్యాంక్, ఫాస్ట్ ఆఫీస్ పేరు బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండూ సరైనవి కానప్పుడు ఇదీ చదవండి: పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది -
28న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500 ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. 2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ –2021–22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ
దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ పెంపుదలతో కోట్లాది మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ‘న్యాయమైన, లాభదాయక ధర’ (ఈఆర్పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్ఆర్పి క్వింటాల్కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్ఆర్పి క్వింటాల్కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి. देशभर के अपने किसान भाई-बहनों के कल्याण से जुड़े हर संकल्प को पूरा करने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी कड़ी में गन्ना खरीद की कीमत में ऐतिहासिक बढ़ोतरी को मंजूरी दी गई है। इस कदम से हमारे करोड़ों गन्ना उत्पादक किसानों को लाभ होगा।https://t.co/Ap14Lrjw8Z https://t.co/nDEY8SAC3D — Narendra Modi (@narendramodi) February 22, 2024 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్ఆర్పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి చేకూరనుంది. -
కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. రాహుల్ దేశ్ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. రాహుల్ దేశ్ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్కు కూడా పంపే యోచనలో ఉన్నాడు. వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు. -
కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ గవర్నెన్స్లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్ అప్ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్చార్జి రాజేష్ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు. #WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV — ANI (@ANI) February 12, 2024 మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. -
ఆరోగ్యం, పోషకాలు కావాలంటే... దేశీ పంటలే కీలకం!
అధిక పోషకాలున్న దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ఇటు భూదేవి ఆరోగ్యంతో పాటు అటు ప్రజల, పర్యావరణ, పశుపక్ష్యాదుల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని మనసా వాచా కర్మణా నమ్మిన ఆదర్శ రైతు గోగుల రాధాకృష్ణయ్య. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత 8 ఎకరాల సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించి తాను తింటూ, నలుగురికీ అందిస్తున్నారు. ఆయన క్షేత్రం ప్రకృతి వ్యవసాయదారులు, వ్యవసాయ విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణాలయంగా మారిపోయింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆహ్వానం మేరకు గోగుల విజయవాడలోని రాజభవన్లో తేనేటి విందులో పాల్గొనటం విశేషం. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా ప్రకృతి సేద్యాన్ని రైతులందరికీ నేర్పించాలని సూచిస్తున్న 63 ఏళ్ల రాధాకృష్ణయ్య సేద్య అనుభవాల సారమిది.. వైస్సార్ జిల్లా బద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ అబ్బుసాహేబ్ పేటకు చెందిన గోగుల రాధాకృష్ణయ్య కడప నీటి΄ారుదల శాఖలో సహాయ సాంకేతికత అధికారిగా పనిచేస్తూ 2013లో ఉద్యోగ పదవీ విరమణ చేశారు. వ్యవసాయంపై మక్కువతో తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టారు. రెండేళ్లపాటు సాధారణ రసాయనిక వ్యవసాయం చేసినా భూమి నిస్సారం కావటం వల్ల అంతగా ఆదాయం రాలేదు. ఆ దశలో 2017లో సుభాష్ పాలేకర్ వద్ద 5 రోజుల శిక్షణ ఉంది అధిక పోషక విలువలు కలిగిన దేశీ వరి వంగడాలతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రాధాకృష్ణయ్యకు 2017లో ప్రభుత్వం నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ షాపు మంజూరు చేసింది. దీంతో ఆయన కషాయాలు, వేప పిండి వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తూ, తానూ శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తొలుత 6 ఎకరాల్లో నవార, బర్మాబ్లాక్, పరిమళ సన్న, బహురూపి, మాపిళ్లై సాంబ 5 రకాల దేశీ వరిని సాగు చేశారు. రెండెకరాల్లో కరివే΄ాకు సాగు చేస్తున్నారు. తొలి రెండేళ్లు కరివే΄ాకు సాగు చేస్తూ ఏటా మూడు పంట కోతలు చేసేవారు. ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల సూచన మేరకు గత ఐదేళ్లుగా కరివేపాకు విత్తనోత్పత్తిపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో దేశవాళీ వరి నవార రకాన్ని, 2 ఎకరాల్లో కరివే΄ాకు విత్తనోత్పత్తి చేస్తున్నారు. మిగతా 4 ఎకరాల్లో పరిమళ సన్న, సుంగధి, ఇంద్రాణి, కాలాభట్, మణిపూర్ బ్లాక్, బ్లాక్ బర్మా, బహురూపి, మాపిళ్లై సాంబ, సిద్ధ సన్నాలు, కుజిపటాలియా, రత్నచోళి, రత్నశాలి వంటి 14 రకాల దేశవాళీ వరిని సాగు చేస్తున్నారు. ఈ దేశీ వరి విత్తనాలను ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులకు కిలో 100–120 చొప్పున విక్రయిస్తున్నారు. వాట్సప్ వంటి సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. రెండెకరాల్లో నవార కేరళకు చెందిన పోషకాల గని వంటి నవార ధాన్యాన్ని రెండెకరాల్లో పండిస్తున్నారు రాధృకృష్ణయ్య. 6 నెలలు మాగబెట్టిన ధాన్యాన్ని మర పట్టించి కిలో రూ. 120–130 చొప్పున నవార ముడి బియ్యాన్ని రాధాకృష్ణయ్య అమ్ముతున్నారు. ఈ బియ్యం తిన్న షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఆయన తెలి΄ారు. నవార బియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో ఈ ఒక్క రకాన్ని 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్లు నలుపుగా బియ్యం ఎరుపుగా ఉండే నవారను రబీ కాలంలో సాగు చేస్తే పడి΄ోకుండా ఉంటుందన్నారు. మనుషులతోనే నాట్లు, కోత, నూర్పిడి చేయిస్తానని, ఎకరానికి రూ. 21 వేల ఖర్చు వస్తోందన్నారు. ఎకరానికి 18 బస్తాల ధాన్యం పండుతోంది. 76 కిలోల ధాన్యం నుంచి 51 కిలోల ముడిబియ్యం దిగుబడి వస్తోందన్నారు. వాట్సప్ ద్వారా సమాచారం తెలుసుకొని ఆర్డర్లు ఇచ్చే వారికి ΄ార్శిల్ ద్వారా పంపుతున్నామన్నారు. కరివేపాకు విత్తనోత్పత్తి రాధాకృష్ణయ్య 2 ఎకరాల్లో కరివేపాకును 7 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఏటా మూడు సార్లు కరివే΄ాకు అమ్మేవారు. తరువాత ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనల మేరకు నాలుగేళ్లుగా కరివేపాకు విత్తనాలు ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. ఒక్కో ఎకరాకు 500 కిలోల వరకు కరివే΄ాకు విత్తనాల దిగుబడి వస్తుంది. ఎకరానికి 40-50 కిలోల నాణ్యమైన విత్తనం సరి΄ోతుందని, పండ్లను ఎండబెట్టకుండా చెట్టు నుంచి కోసిన ఒకటి, రెండు రోజుల్లోనే నాటుకోవాలని, ఇలా చేస్తే 90శాతం మొలక వస్తున్నదని రాధాకృష్ణయ్య తెలిపారు. ఖర్చులన్నీ పోను ఎకరానికి కనీసం రూ. 1,50,000 ఆదాయం పొందుతున్నానని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో΄ాటు బద్వేల్లోని బీబీఆర్ కళాశాలకు చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులకు గోగుల వ్యవసాయ క్షేత్రంలోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం విశేషం. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే దేశీ వంగడాలతో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులనే ఆహారంగా తినాలని ఆయన సూచిస్తున్నారు. – గోసల యల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్లా డ్రస్లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్టాక్లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
అమ్మో.. పులొచ్చింది!
ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్ఆర్వో ఎస్వీకే కుమార్, నూజివీడు ఎఫ్ఆర్వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. -
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్లో పంట కోసుకున్నారు. నవంబర్లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
రైతు రుణాలను రికవరీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్లను బలోపేతం చేయండి: ప్యాక్స్ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్ఫెడ్ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు. తుమ్మల ఆదేశాలపై చర్చ కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
-
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్గా కాకుండా రైతు యూనిట్గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్లెñట్స్♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందంఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం
అడ్డాకుల: కర్నూల్ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. శాఖాపూర్ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తిప్పగా.. కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అందులోని రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రామయ్యను ఎల్అండ్టీ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మాధవరెడ్డి తెలియజేశారు. విద్యుదాఘాతంతో రైతు.. మహబూబ్నగర్ రూరల్: మండల పరిధిలోని మనికొండలో పెండెం చంద్రశేఖర్(49) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డు వద్ద ఆన్ఆఫ్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు సర్పంచ్ గంగాపురి తెలియజేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని పేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్యం దుకాణం సీజ్ మహబూబ్నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్ఎస్ అధికారి కుందన్యాదవ్ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ మద్యం దుకాణంలో స్టాక్ పరిశీలించి సీజ్ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. భారీగా మద్యం పట్టివేత చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కళ్యాణ్, స్పెషల్ పార్టీ పోలీస్ రవినాయక్, వీపనగండ్ల ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. -
‘అనంత’ రైతుకు ‘కర్మ వీర చక్ర’ అవార్డు
సాక్షి, అమరావతి: అతనో సన్నకారు రైతు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్ఈఎక్స్, కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ‘కర్మవీర చక్ర’ పురస్కారం నారాయణప్పను వరించింది. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతిగడించిన దివంగత శాస్తవేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటుదక్కించుకున్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు ‘కర్మ వీర గ్లోబల్ ఫెలోషిప్’ (2023–24) కూడా అందిస్తారు. ఏడాది పొడవునా ఆదాయమే వ్యవసాయం కలిసి రాక కొంతకాలం భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసిన నారాయణప్ప తిరిగి పొలం బాట పట్టాడు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత సాగుకు శ్రీకారం చుట్టాడు. అందరిలా ఏడాదికి రెండు పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులొచ్చేలా ఎనీ టైం మనీ (ఏటీఎం) విధానానికి శ్రీకారం చుట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నారు. ఇంటికి సరిపడా పంట ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయాన్ని రాబట్టి తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు పొందవచ్చని రుజువు చేసి చూపించాడు. తాను ఆర్థికంగా ఎదగడంతోపాటు సమాజానికి సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ.. తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తనతో పాటు మరో 25 మందికి ఏటీఎం మోడల్ సాగును నేర్పించాడు. వీరందరినీ చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో అడుగులేస్తూ సిరులు పండిస్తున్నారు. ఐకాంగోను ఆకట్టుకున్న ఏటీఎం నారాయణప్ప చేపట్టిన ఈ వినూత్న సాగు విధానం (ఎటీఎం) ఐకాంగోను ఆకర్షించింది. దీనిపై సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసింది. ఈ వినూత్న విధానంలో మట్టి, భూమి ఆరోగ్యంగా మారడంతోపాటు భూమి మెత్తబడి ఆకు, కాండం ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఏటీఎం మోడల్లో సాగు చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ‘క్త్లెమేట్ ఛేంజ్’ సాధ్యమవుతోందని గుర్తించారు. ఏటీఎం మోడల్ను ప్రపంచంలోనే ఏ గ్రేడ్ మోడల్గా గుర్తించడంతోపాటు ఏడాది పొడవునా పంటలు పండించడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించడంతో పాటు నేలల్లో కర్బన స్థిరీకరణకు దోహదపడేలా కృషి చేస్తూ నారాయణప్ప రైతుల పాలిట ‘ఛేంజ్ ఏజెంట్’ నిలిచారని పేర్కొంటూ ఆయనను 2023–24 సంవత్సరానికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డుకు ఎంపిక చేశారు. గర్వంగా ఉంది మార్పు అనేది మనతోనే మొదలవ్వాలన్నది నా ఆలోచన. వ్యవసాయంలో ఏడాది పొడవునా ఆదాయం ఎందుకు రాదన్న ఆలోచన నుంచి పుట్టిందే ఏటీఎం మోడల్. రైతు సాధికార సంస్థ వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నాను. పట్టుదల, నిరంతర శ్రమతో తగిన ప్రతిఫలం పొందుతున్నా. నేను చేస్తున్న సాగు విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వంగా ఉంది. – ఎం.నారాయణప్ప, మల్లాపురం, అనంతపురం జిల్లా -
ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత
మన దగ్గర స్పూర్తిదాయక కథనాలకు కొదవే లేదు. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంత యువత మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు. ఏ ప్రాంతం, ఎంత డబ్బు ఉంది ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మొక్కవోని పట్టుదలతో ఎదిగి తామేంటో నిరూపించుకుంటున్నారు. కలల సాకారం కోసం ఒక్కసారి గట్టి నిశ్చయించు కుంటే.. తమకు ఎదురే ఉండదని నిరూపిస్తున్నారు. బిహార్కు చెందిన ఒక రైతు బిడ్డ సక్సెస్ స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తోంది. బిహార్లోని భోజ్పూర్ జిల్లాలోని పేద రైతు సిద్ధనాథ్ సింగ్ కుమారుడు సత్యం కుమార్ 13ఏళ్లకే కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-JEE)లో సీటు సాధించి విశేషంగా నిలిచాడు. రైతు బిడ్డ సత్యం 2013లో 679 ర్యాంక్ సాధించాడు. 2010లో IIT సీటు పొందిన ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల సహల్ కౌశిక్ రికార్డును ఛేదించి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును బద్దలు కొట్టాడు. ఐఐటీ పరీక్షకు సంబంధించి కుమార్కి ఇది రెండో ప్రయత్నం. 2012లో 12 ఏళ్ళ వయసులోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించాడు. అయితే బెస్ట్ ర్యాంక్ కోసం 12 నెలల తర్వాత మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంలో రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మూడు ప్రాజెక్టులపై పనిచేశాడు. ఎలక్ట్రోక్యులోగ్రామ్ బేస్డ్ ఐ బ్లింక్ క్లాసిఫికేషన్ డ్యూరింగ్ EOG సిగ్నల్ అక్యుయిషన్ టైం, “వివిధ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లలో ఎలక్ట్రోడ్ స్థానాల ఆప్టిమైజేషన్” , “ఇమాజినేటివ్ స్పీచ్ బేస్డ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్” ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఇక్కడితో సత్యం కుమార్ విజయ్ ప్రస్థానం ముగిసిపోలేదు. తాజాగా 24 ఏళ్ల వయసులో టెక్ దిగ్గజం యాపిల్ అతణ్ని ఉద్యోగంలోకి తీసుకుంది. 2018లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించి B.Tech-M.Tech ఉమ్మడి కోర్స్ పట్టా సాధించాడు సత్యం కుమార్. ప్రస్తుతం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేస్తున్నాడు. 2023 ఆగస్టు వరకు యాపిల్లో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్గా పని చేశాడు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ నిపుణుడిగా ఉన్న కుమార్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పలు టెక్నాలజీలను పిల్లలకు బోధించడానికి,వారి జీవితాలను మెరుగుపరచడానికి బిహార్లోని తన సొంత జిల్లా భోజ్పూర్కు తిరిగి రావాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పాడు ఎనిమిదో తరగత వరకు స్కూలు అంటే ఏంటో తెలియదు జూలై 20, 1999న జన్మించాడు సత్యం కుమార్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతటి వాడు కావాలనేది డ్రీమ్. ఇంకో విశేషం ఏమిటంటే అసలు ఎనిమిదో తరగతి వరకు స్కూల్కే వెళ్లలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో, స్థానిక వీర్ కుర్ సింగ్ కాలేజీలో క్లర్క్, మేనమామ పశుపతి సింగ్ సహాయంతో ఇంట్లోనే ప్రాథమిక విద్య పూర్తైంది. 2007లో రాజస్థాన్ బోర్డ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి కోటలోని మోడ్రన్ స్కూల్లో అడ్మిషన్ పొందాడు. అలా ఎనిమిదో తరగతిలో తొలిసారి పాఠశాలకు వెళ్లాడు. చాలా తొందరగా నేర్చుకునే తత్వం అసాధారణమైన జ్ఞాపకశక్తిగల విద్యార్థిగా ప్రశంసలందుకున్నాడు. రాజస్థాన్ బోర్డ్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని పదేళ్లకే పదో తరగతి, 12 సంవత్సరాల వయస్సులో XII తరగతిని క్లియర్ చేయడం విశేషం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ డ్రీమ్ అంతేకాదు తానేమీ పుస్తకాల పురుగును కాదనీ, సినిమాలు చూస్తా.. ఫుట్ బాల్ ఆడుకుంటా.. మొబైల్ చూస్తా..కానీ పూర్తి శ్రద్ధగా ఆరుం గంటలు చదువుకుంటా అని గతంలో తన స్టడీ హ్యాబిట్స్ గురించి తెలిపాడు. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి ఘనతను సాధించాలనేది కల. టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోవాలి...ఫేస్బుక్కు సమానమైనదాన్ని అభివృద్ధి చేయాలనేది అతని ఆకాంక్ష. -
ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి
సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నీటి ఎద్దడి పెరుగుతోంది.. గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ మిషన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్ లెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తోంది. తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్ మిషన్ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. -
సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై.. హమాలీ ఒక్కసారిగా..
ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై హమాలీ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలం వట్టోలికి చెందిన శ్రీనివాస్ సోయా విక్రయించేందుకు బుధవారం భైంసా యార్డుకు వచ్చాడు. బీట్ అనంతరం సోయాలు జల్లెడ పడుతుండగా కిందపడిన గింజలు తీసుకెళ్తానని రైతు కోరడంతో ఆగ్రహించిన హమాలీ రేకుడబ్బాతో కొట్టాడు. దీంతో రైతుకు కంటి వద్ద తీవ్రగాయం కావడంతో ఆగ్రహించిన రైతులు గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం గాంధీగంజ్లోకి వెళ్లి బీట్ నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎల్.శ్రీను, ఎస్సైలు శ్రీకాంత్, సందీప్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. బాధిత రైతును ప్రథమ చికిత్స కోసం తరలించే క్రమంలో రైతులు అడ్డుకున్నారు. దాడి చేసిన హమాలీని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత రైతు శ్రీనివాస్ను ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
కరెంటు మాయం..దళితబంధు ఆగం
సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. మూడు గంటల కరెంటు చాలంటున్నరు నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు. సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు. -
ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న రైతు
-
పంటనష్టమొచ్చిందని కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
మంథని (పెద్దపల్లి జిల్లా): ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధి నెల్లిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కటుకు అశోక్ (35), సంగీత (28) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (5), కూతురు సన (4) ఉన్నారు. గ్రామ శివారులో ఐదెకరాల వ్యవసాయభూమిని కౌలు తీసుకుని రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి వేశారు. వ్యవసాయ పనులు లేనిసమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం తెచ్చిన ఈ అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు...సోమవారం రాత్రి పురుగుమందు తాగారు. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించగా దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వీరి మృతితో అనాథలైన చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న దృశ్యం గ్రామస్తులను కలచివేసింది. -
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు తాను సవాల్ విసురుతున్నానని, ఏ సబ్స్టేషన్ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ.60 కోట్లు దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ ఫాలో కావడం లేదు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు. -
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
సాక్షి, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అదికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో అరీఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’ -
లక్కసాగరం పంప్హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం..!
-
ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఒక్క రైతుకు మేలు
-
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్ సీఐ శ్రీధర్ మంగళవారం హస్తాల్పూర్ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. -
మొక్క పైనే పిచికారీ చేసే రోబో!
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది. మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్ను నెలకొల్పారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..? ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు. 60% పురుగుమందు ఆదా ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు. అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే. (చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం) -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలామంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్'. మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో ఆటోమొబైల్ ఇంజనీర్గా పని చేసేవాడు. హార్టికల్చర్.. ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్హౌస్లో పండ్లు, కూరగాయలను పండించాడు. ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. ఇక ప్రమోద్ గౌతమ్ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు. (Disclaimer: వ్యవసాయం అనేది అందరికి లాభాలను తెచ్చిపెట్టకపోవచ్చు, కావున ఉద్యోగాలు వదిలి ఇలాంటివి చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి సాహసాలు చేయాలనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.) -
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్తో నడిచే ట్రాలీని, బైక్తో నడిచే స్ప్రేయర్ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్ను ఇటీవల హైదరాబాద్లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
త్వరలో రూ. లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీ
మెదక్: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు. కాంగ్రెస్కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఉన్నారు. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
3 లక్షల మంది రైతుల రుణమాఫీ 'సొమ్ము వెనక్కి'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద విడుదల చేసిన సొమ్ము లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదు. ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తిరిగి ట్రెజరీలకే వెళ్తోంది. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలతో లబ్దిదారులకు రుణమాఫీ సొమ్ము అందలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ వర్గాల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 3 లక్షల మంది రైతుల సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకుండా వెనక్కు వెళ్తోంది. దీనిపై రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా వ్యవసాయశాఖ స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా... ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందే తెలిసినా వ్యవసాయశాఖ నిర్లక్ష్యం... రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేక మంది రైతులకు రుణాల రెన్యువల్ సమస్య వచ్చింది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. దీంతో రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే కొందరు రైతులు అలా చెల్లించగా మరికొందరు రైతులు డబ్బుల్లేక బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో సుమారు 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయినట్లు అంచనా. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో, డబ్బు చెల్లించిన వారి ఖాతాలు మూసేయడంతో ఈ సమస్య వచ్చిపడింది. ఈ విషయంపై వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టత ఉన్నా, ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొందరు హెచ్చరించినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తెలిసింది. ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును జమ చేసినా, అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు విడతల్లో మాఫీ సొమ్ము విడుదల రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. రూ. 50 వేలలోపు రుణాలున్న 7.19 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం రూ. 1,943.64 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణ మాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.99, 999 వరకు రుణాలున్న రైతులకు బకాయిలను విడుదల చేసింది. ఆ మేరకు 10. 79 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 6,546.05 కోట్లు విడుదల చేసింది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తంగా 16.66 లక్షల మంది రైతులకు రూ. 7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లయింది. -
ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా!
ఆర్థికాభివృద్ధితో నిమిత్తం లేకుండా అభివృద్ధి చెందిన/చెందుతున్న/పేద దేశాలన్నిటిలోనూ ఏదో ఒక స్థాయిలో అర్బన్ అగ్రికల్చర్ ఊపందుకుంది. అయితే, అర్బన్ గార్డెన్లలో ఏ వనరులు వాడుతున్నారు? ఎంత ఆహారం పండిస్తున్నారు? వంటి గణాంకాలు లేకపోతే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకోవటం కష్టం. ఈ లోటును పూడ్చడానికి ఐదు పాశ్చాత్య దేశాల్లో (ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా)ని 72 అర్బన్ వ్యవసాయ క్షేత్రాలను/గార్డెన్లను 15 మంది పరిశోధకులు అధ్యయనం చేయగా, పరిమితులకు లోబడి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు స్వచ్ఛందంగా కలసి సాగు చేసుకుంటున్న గార్డెన్లు, ఇళ్ల దగ్గర ఖాళీల్లో గృహస్థులు సాగు చేసుకుంటున్నవి, కేవలం అమ్మకం కోసం సాగు చేస్తున్న అర్బన్ క్షేత్రాలు వీటిలో ఉన్నాయి. మట్టిలో సాగు చేసే గార్డెన్లకే పరిమితమై అధ్యయనం చేశారు. హైడ్రోపోనిక్స్ వంటì ‘ప్లాంట్ ఫ్యాక్టరీ’ల జోలికి పోలేదు. పరిశోధకులు స్వయంగా ఈ క్షేత్రాలను, గార్డెన్లను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. అధ్యయనానికి ఎంపిక చేసిన గార్డెన్లు, అర్బన్ ఫామ్స్లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నవి వున్నాయి. ఫ్రాన్స్ గార్డెనర్లు సగటున 36 ఏళ్లుగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. కమ్యూనిటీ గార్డెన్ – ‘మెరైనర్స్ హార్బర్ ఫామ్’, న్యూయార్క్. కిలో పంటకు.. దిగుబడిలో గార్డెన్లను బట్టి చాలా హెచ్చుతగ్గులున్నాయి. గ్రామీణ పొలాలతో పోల్చితే అనుభవజ్ఞులు నిర్వహించే అర్బన్ గార్డెన్లలో ఉత్పాదకత అధికంగా ఉంది. సరదా కోసం నిర్వహించే లీజర్ గార్డెన్లలో దిగుబడి అంతంత మాత్రమే. కిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించడానికి సగటున 0.53 చదరపు మీటర్ల భూమి, 71.6 లీటర్ల నీరు, 5.5 కిలోల కంపోస్ట్ అవసరమని ఈ అధ్యయనంలో తేల్చారు. సొంతంగా నీరు పోసుకునే వ్యక్తిగత గార్డెన్లలో కన్నా డ్రిప్ వాడే గార్డెన్లలో ఎక్కువ నీరు ఖర్చవుతోంది! వ్యక్తిగత తోట – బోషుమ్, జర్మనీ చదరపు మీటరు స్థలంలో పండిస్తున్న ఉత్పత్తిలో వ్యత్యాసం చాలానే ఉంది. 0.2 నుంచి 6.6 కిలోల మధ్యలో ఉంది. నాన్టెస్ (ఫ్రాన్స్)లో అమ్మకం కోసం (గ్రీన్హౌస్ ఉంది) పంటలు పండిస్తున్న అర్బన్ ఫామ్లో చ.మీ. భూమిలో ఉత్పాదకత అత్యధికంగా 6.7 కిలోలు వస్తోంది. చ.మీ.కి ఫ్రాన్స్లో ఓ వ్యక్తి 2,069 కేలరీల ఆహారాన్ని పండిస్తుంటే, పోలండ్లో ఓ గార్డెనర్ 52.8 కేలరీలు పండిస్తున్నారు. స్థానిక వాతావరణం, వ్యక్తిగత శ్రద్ధ తదితర అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది తెలిసిందే. అర్బన్ క్షేత్రం – కాలేజ్ పియర్ మెండెస్ ఫ్రాన్స్, పారిస్, ఫ్రాన్స్ పురుగు మందులు.. మొత్తం 128 రకాల పంటలు కనిపించాయి. ఒక పంట నుంచి 83 పంటలు సాగు చేసే గార్డెనర్లు, ఫామ్స్ ఉన్నాయి. సగటున 16–20 పంటలు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. వాటంతట అవే పెరిగే తినదగిన ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూలు అదనం. 40% గార్డెన్లు/అర్బన్ ఫామ్స్లో ఏ ఇంధనాన్నీ వాడకపోవటం విశేషం. ఈ పాశ్చాత్య అర్బన్ క్షేత్రాల్లో, గార్డెన్లలో సేంద్రియ ఎరువులతో పాటు, రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్లు గమనించారు. కలెక్టివ్ గార్డెన్–యూకే, వ్యక్తిగత తోట – డార్ట్మాండ్, జర్మనీ 22% గార్డెనర్లు ..కంపోస్టుతోపాటు రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నారు. 51% వ్యక్తిగత గార్డెన్లు, 22% అర్బన్ ఫామ్స్లో పురుగుమందులు కూడా వాడుతున్నారు. అయితే, సామూహిక అర్బన్ గార్డెన్లలో మాత్రం పురుగుమందులు అసలు వాడట్లేదు. విష రసాయనాల వల్ల కలిగే నష్టం గురించి వీటి నిర్వాహకులకు స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉందని అర్థం చేసుకోవచ్చు. ఐదు దేశాల్లోని అధ్యయనం చేసిన గార్డెన్లు, అర్బన్ పొలాలు అర్బన్ ఫామ్ – మడ్లార్క్స్, యూకే(హెచ్) వ్యక్తిగత గార్డెన్ – లెస్ ఎగ్లాంటియర్స్, నాంటెస్, ఫ్రాన్స్ - పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాగుబడి డెస్క్ (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
ఏపీ రైతుకు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇందులో భాగంగా 2023–25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్ను జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘువీర్ అవార్డు, ప్రశంసాపత్రంతోపాటు రూ.1.50లక్షల నగదు బహుమతిని అందుకున్నారు. 257 రకాలు సేకరించిన రఘువీర్ అత్యంత పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో రఘువీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వచ్చారు. దేశవ్యాప్తంగా తిరిగి ఇప్పటి వరకు 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు ఉన్నాయి. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని సొంత పొలం 1.3 ఎకరాల్లో సంరక్షిస్తున్నారు. వీటిని భవిష్యత్ తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధి(సీడ్ బ్యాంక్)ను ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో ‘విత్తన నిధి’ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పురాతన వరి విత్తనాలను అందించడమే కాదు... వాటి సాగులో మెళకువలపై అవగాహన కలి్పంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు నాలుగు రకాల పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. -
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని.. రాత్రి పొలంలోకి వెళ్లి
మైసూరు(బెంగళూరు): సాధారణంగా మనం దుస్తులు షాపింగ్ అంటేనే గంటల తరబడి సమయం తీసుకుంటుంటాం, అలాంటిది జీవితాంతం ఒకరితో కలిసుండాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఫాస్ట్ యుగంలో అంతా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇటీవల కొన్ని వివాహాలు పీటల వరకు వచ్చి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడమే అందుకు ఉదాహరణ. తాజాగా వక్కతోటను దుండగులు ధ్వంసం చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మనుగనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మూడు ఎకరాల్లో అల్లం, ఒక్కచెట్లు సాగు చేశాడు. ఈ క్రమంలో అతను నాటిన 850 మొక్కలను పెరికివేశారు. ఇదిలా ఉంటే బాధిత రైతు తన కుమార్తెను అశోక్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. అయితే అదే గ్రామానికి చెందిన అశోక్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాత్రి సమయంలో అశోక్ వక్కచెట్లను పెరికివేయించినట్లు బాధిత రైతు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: అమెరికాలో మోదీకి పాదాభివందనం.. ఇప్పుడు మణిపూర్పై కీలక వ్యాఖ్యలు -
పురుగుమందుల స్ప్రే కోసం ఓ యువరైతు వినూత్న ఆవిష్కరణ
-
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్పిఓపి థర్డ్పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
రుణమాఫీ మళ్లీ షురూ.. గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా, కేంద్రం వైఖరితోనే ఆలస్యం ‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. అయితే కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం రాష్ట్రం పట్ల అనుసరించిన కక్షపూరిత వైఖరి తదితర కారణాల వల్ల ఏర్పడిన ఆర్థిక లోటుతో.. రుణ మాఫీ ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైంది. కానీ రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే వస్తోంది. మేం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. రైతు సాధికారత సాధించే వరకు, రైతులను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు..’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు. బకాయిలు చెల్లించినా మాఫీ వర్తింపు! లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటివరకు రూ.36 వేల వరకు బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన వారికీ మాఫీ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద తీసుకున్నాయి. మరోవైపు కొత్త రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించినట్టైతే తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొందరు రైతులు సొంతగా బ్యాంకులకు చెల్లింపులు చేశారు. కొందరు మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. కాగా కొత్త రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రుణం చెల్లించిన రైతులకు సైతం ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రైతుల జాబితా ప్రకారమే సొమ్మును వారివారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.రూ.19 వేల కోట్ల చెల్లింపుతో రూపాయి కూడా మిగలకుండా తెలంగాణలో సంపూర్ణ ‘రైతు రుణమాఫీ’కార్యక్రమం పూర్తి కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 42 లక్షల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ జరగనుంది. తద్వారా 29.61 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతుబంధు తరహాలో విడతల వారీగా.. ► రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలా పదిహేను రోజుల్లో, సెపె్టంబర్ రెండో వారం వరకు రైతు రుణమాఫీ కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే పునఃప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరి్వంద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ రుణమాఫీ..!
కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఆగుతూ సాగిన ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు. ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు. రైతుబాంధవుడు సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు. నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
టమాటా సాగుతో కోటీశ్వరులు.. 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం
గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్పాట్ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు. భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు. చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! 22 ఎకరాల్లో టమాటా సాగు తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది. రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ! ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. మొత్తంగా 22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధరలు మరోవైపు భారత్లోనే అతిపెద్ద టమటా మార్కెట్లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్లో తప్పిన ప్రమాదం -
జాక్ పాట్ కొట్టిన టమోటా రైతు
-
పెరిగిన డ్రోన్ పైలెట్లు!
దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అనేక రంగాల్లో వినియోగం.. ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతుల ఖర్చులు తగ్గించేందుకు.. డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుతం భారత్లో గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో ఏదైనా ఉందా అంటే అది టమోటా అనే చెప్పాలి. కొనగోలుదారులకు చుక్కలు చూపిస్తూ, రైతులకు కనక వర్షం కురిపిస్తోంది. ఇక దొంగలు కూడా బంగారం, డబ్బులు వదిలేసి టమోటాలపై పడ్డారు. కర్ణాటకలో ఓ రైతు ఏళ్లుగా సాగు చేసినా ఏనాడు కాసింత లాభాలు కూడా మిగల్చని టమాట పంటనే ఈ పర్యాయం ఆయనపై ధనవర్షం కురిపించనుంది. కొన్ని రోజుల్లో లక్ష్మీదేవి అతని ఇంటి తలుపులు తట్టనుంది. అసలు కథ ఏంటంటే.. చిక్కబళ్లాపురం తాలూకా పట్రేనహళ్లికి చెందిన రైతు దేవరాజు ఐదేళ్లుగా టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు వచ్చినప్పుడల్లా ధరలు నేలచూపు చూశాయి. దీంతో పెట్టుబడులు కూడా దక్కేవి కాదు. అయినప్పటికీ దేవరాజు టమాట సాగు చేయడం మానలేదు. ఈ ఏడాది అర ఎకరాలో సాగు చేయగా ప్రస్తుతం నిండుపూతతో ఉంది. కొద్ది రోజుల్లో పంట కోతకు రానుంది. అర ఎకరాకు రూ.లక్షా50వేలు వ్యయం చేశాడు. ప్రస్తుతం కిలో టమాట ధర 120 పలుకుతోంది. పది రోజుల వరకు ఇవే ధరలు కొనసాగితే రూ.9 నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం వస్తుందని దేవరాజు ధీమాతో ఉన్నాడు. పంటకు తెగుళ్లు, చీడ పీడలు ఆశించాయని, మందులు పిచికారీ చేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రైతు దేవరాజు తెలిపాడు. చదవండి: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి -
ఈ రైతు తెలివి మామూలుగా లేదు.. టమోట తోటకు అవే కాపాలా!
మైసూరు: ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోను, విదేశాల్లోనూ టమాటకు భారీ ధర ఉంది. కేజీ వంద రూపాయల దాకా ఉండడంతో రైతులకు కనకవర్షం కురుస్తోంది. కానీ దొంగలు రాత్రిపూట పంటను ఎత్తుకెళ్లడం అక్కడక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం రైతులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని కుప్పె గ్రామంలో నాగేష, కృష్ణ ఆనే ఇద్దరు రైతులు తమ టమాటా తోటలకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగేష 10, కృష్ణ 4 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశారు. ధర ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండుసార్లు తోటల్లో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు రైతులు వాపోయారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దొంగలను అడ్డుకుంటామని రైతులు చెబుతున్నారు. చదవండి పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్సేల్గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్కు చెందిన మహిపాల్రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
నష్టపోతున్న రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త సూచనలు
-
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. -
పంట పంటకీ.. డీలర్లకు తూకం తంటా..!
నల్లగొండ: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని గోదాముల వద్ద తూకం వేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీలర్లుకు ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ వద్ద బియ్యం తూకం వేసి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు లేకపోవడంతో డీలర్లు బయోమెట్రిక్ను గోదాముల్లో సేకరిస్తూ.. బియ్యం తూకం మాత్రం బయట వేబ్రిడ్డిల వద్ద వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 4,66,529 రేషన్ కార్డులు జిల్లాలో మొత్తం 4,66,529 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 13,96,933 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఉచితంగా ప్రభుత్వం ఐదు కిలోల చొప్పన బియ్యం అందిస్తోంది. అయితే ప్రతినెల డీలర్లు కార్డుదారులకు బియ్యం తూకం వేసి ఇస్తున్నారు. కానీ డీలర్లకు బియ్యం సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద మాత్రం తూకం వేయకుండా బస్తా 50 కేజీల చొప్పున లెక్కగట్టి పంపుతున్నారు. దీనివల్ల బియ్యం తక్కువగా వచ్చి తా ము నష్టపోతున్నామని డీలర్లు కోర్టును ఆశ్రయించడంతో డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆలస్యంగా బియ్యం పంపిణీ.. డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో తూకం వేసి బియ్యం ఇవ్వాలని నిర్ణయించడంతో జూలై మాసానికి సంబంధించి ప్రజలకు బియ్యం పంపిణీని 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బియ్యం సరఫరాలో ఆలస్యం కారణంగా 10వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. గ్రామీణ డీలర్లకు ఇబ్బందులు.. కోర్టు ఆదేశాల మేరకు జూలై మాసానికి సంబంధించిన బియ్యం తూకం వేసి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలోని ఆరు ఎంఎల్ఎస్ పాయింట్లలో డీలర్లు వేలిముద్రలు వేసి బియ్యం మాత్రం ప్రైవేట్ వేబ్రిడ్జిల మీద తూకం వేయించుకుంటున్నారు. పట్టణ ప్రాంతంలోని డీలర్లకు ఎక్కువ బియ్యం ఉండడం వల్ల వారికి ఒక లారీ బియ్యం తూకం వేసేందుకు వీలు అవుతుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల డీలర్లకు మాత్రం ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒక లారీలో బియ్యం పంపిస్తారు. అలా ముగ్గురికి బయట వేబ్రిడ్జి మీద తూకం వేయడం సాధ్యం కావడం లేదు. దీంతో తూకం వేయకుండా పాత పద్ధతినే 50 కేజీల బస్తా చొప్పన లెక్కగట్టి ఇస్తున్నారని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. తూకం వేయకపోవడం వల్ల మళ్లీ తరుగు వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.