![శేషాద్రి హత్య ఘటనపై దర్యాప్తు వేగవంతం](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/27/26mdpl42-400011_mr.jpg.webp?itok=ASGh4K3p)
మదనపల్లె : పట్టణంలో సంచలనం సృష్టించిన పుంగనూరు శేషాద్రి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంజునాథ కాలనీలోని హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ ప్రసాదరెడ్డి ఆదివారం మరోసారి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శేషాద్రి ఇంటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం హత్యలో భాగస్వామ్యులైన నిందితుల్లో నలుగురు లొంగిపోగా, విచారణలో భాగంగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరిత మంది హత్యకేసులో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చి, వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
● హత్యాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసాదరెడ్డి
● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు