సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు

Published Thu, Apr 10 2025 1:03 AM | Last Updated on Thu, Apr 10 2025 1:03 AM

సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు

సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు

నరసరావుపేట రూరల్‌: స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ పి.ఝాన్సీరాణి తెలిపారు. కోటప్పకొండలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో బుధవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఝాన్సీరాణి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.120కోట్లు కాగా రూ.47కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు అందించడంలో బెల్లంకొండ, శావల్యాపురం, చిలకలూరిపేట, నకరికల్లు, రొంపిచర్ల, నాదెండ్ల, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నూజెండ్ల మండలాలు మందు వరుసలో ఉన్నాయన్నారు. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన జీవనోపాధి రుణాలను స్వల్పకాలిక, మైక్రో, ట్రైనీగా వర్గీకరణ చేసి అందిస్తున్నట్టు తెలిపారు.

డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement