![Kerala Lottery Agent Hits Jackpot Wins Rs 1 Crore - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/9/Lottery-Agent-Jackpot.jpg.webp?itok=QDeRa3HB)
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు.
కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది.
33 సంవత్సరాలు బస్ కండక్టర్గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది.
మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది.
ఆఫర్లో వచ్చిన టికెట్కి రూ. 44 కోట్లు
బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్గా భావించిన అరుణ్ నంబర్ను కూడా బ్లాక్ చేస్తూ కాల్ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్కే జాక్పాక్ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment