agent
-
తాగుబోతు భర్తతో విసిగి.. రికవరీ ఏజెంట్తో పెళ్లి
రోజూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తపై ఆమెకు విరక్తి కలిగింది. మద్యం తాగవద్దని ఎంత చెప్పినా వినని భర్త తీరుపై విసుగు చెందిన ఆ ఇల్లాలు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. విషయం తెలుసుకున్న కొందరు భర్తకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..బీహార్లోని జముయీలో విచిత్రమైన ప్రేమకథ వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఇంద్రకుమారి మందుబాబు అయిన తన భర్తను విడిచిపెట్టి, లోన్ రికవరీ ఏజెంట్ పవన్ కుమార్ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ ప్రేమ పెళ్లిని ఇక్కడివారంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఇంద్రకుమారికి 2022లో చకాయీ నివాసి నకుల్ శర్మతో వివాహం జరిగింది. అయితే నకుల్ శర్మ నిత్యం మద్యం తాగేవాడు. గృహహింసకు కూడా పాల్పడేవాడు. దీంతో ఇంద్రకుమారి భర్త తీరుకు విసిగిపోయింది.ఇదేసమయంలో ఆమెకు వవన్ కుమార్ యాదవ్ పరిచయమయ్యాడు. పవన్ ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 4న వారు తమ ఇళ్లలో చెప్పకుండా, అసన్సోల్ చేరుకున్నారు. అక్కడ ఇంద్రకుమారి మేనత్త ఉంటోంది. ఫిబ్రవరి 11న ఇంద్రకుమారి, పవన్ కుమార్ అక్కడి ఒక శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పవన్ కుటుంబ సభ్యులు మద్దతునివ్వగా, ఇంద్రకుమారి కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చకాయీ పోలీస్ స్టేషన్లో పవన్పై ఫిర్యాదు చేశారు.ఇంద్రకుమారి మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టాపూర్వకంగానే పవన్ను వివాహం చేసుకున్నానని తెలిపారు. పవన్పై పోలీసులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతోంది. మరి పోలీసులు ఈ జంట విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు -
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
లాటరీ ఏజెంట్ జాక్పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్గా భావించిన అరుణ్ నంబర్ను కూడా బ్లాక్ చేస్తూ కాల్ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్కే జాక్పాక్ తగిలింది. -
ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?
వేర్పాటువాది నిజ్జర్ హత్య అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా కెనడాలో నివసిస్తున్న ముస్లింలు ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు భారత్ తీరును తప్పుపడుతూ, ఖలిస్తానీలకు మద్దతు పలుకుతున్నారు. గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యకు భారతదేశమే కారణమని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను సస్పెండ్ చేశాయి. క్రమంగా ఈ వివాదం పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. సోదరభావంతో సిక్కులు, ముస్లింలు తాజాగా కెనడాలో నివసిస్తున్న ఒక ముస్లిం న్యాయవాది మాట్లాడుతూ నిజ్జర్ హత్య ఉదంతం తమను ఆందోళనకు గురిచేసిందన్నారు. సిక్కు నేత హత్య తర్వాత దేశంలోని వాతావరణం అధ్వాన్నంగా మారిందన్నారు. జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ఇక్కడ ముస్లింలు, సిక్కులు సోదరభావంతో మెలుగుతుంటారన్నారు. గత జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన విషయం విదితమే. భారత్పై కఠిన వైఖరి అవలంబించాలి భారత్-కెనడా వివాదం కారణంగా కెనడాలోని పలువురు ముస్లిం కార్యకర్తలు మైనారిటీలకు మరింత రక్షణ కల్పించాలని కోరుతున్నారని ఆ న్యాయవాది తెలిపారు. భారత్పై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారన్నారు. ప్రధాని మోదీ ముస్లింలపై వివక్ష చూపుతున్నారని కొందరు ముస్లిం కార్యకర్తలు ఆరోపిస్తున్నరని ఆ న్యాయవాది తెలిపారు. ట్రూడో ప్రభుత్వం భద్రత కల్పించాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిం (ఎన్సీసీఎం) అడ్వకేసీ గ్రూప్ హెడ్ స్టీఫెన్ బ్రౌన్ మీడియాతో మాట్లాడుతూ ట్రూడో ప్రభుత్వం కెనడియన్ ముస్లింలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తారని, వారు వలసవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రూడో ప్రభుత్వం తమ భద్రతకు హామీ ఇవ్వాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కెనడియన్ ముస్లింలు కోరుతున్నారని బ్రౌన్ తెలిపారు. ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని.. ఇండియా- కెనడా వివాదం మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఉగ్రవాది పన్నూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్లాన్ చేశాడు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావించాడు. ఖలిస్తాన్ మాత్రమే కాదు, ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కాగా భారతదేశంలో ఉగ్రవాది పన్నూపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. అతని ఆస్తులను కూడా జప్తు చేశారు. విద్యార్థుల ఆందోళన ఇదిలా ఉండగా కెనడాలోని భారతీయ విద్యార్థుల బహిష్కరణ అంశం మరింత వేడెక్కుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చదువుకుంటున్నవారిలో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన విద్యార్థులున్నారు. నకిలీ ఆఫర్ లెటర్ల ద్వారా తమకు కెనడా యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చారని ఈ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువుకుని, భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు కెనడాకు వచ్చిన ఈ విద్యార్థులు భారత్లోని ట్రావెల్ ఏజెంట్లను తప్పుపడుతున్నారు. ఇది కూడా చదవండి: డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? -
ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
ఏజెంట్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాక్షి వైద్య.. తన ట్రెండీ రీల్స్.. ట్రెండీ లుక్స్తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది. నేను హీరోయిన్ అయ్యాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. లాక్డౌన్లో రీల్స్ చేయడం, ఆడిషన్స్ ఇవ్వడం తర్వాత సినిమాలో నటించటం.. వీటన్నింటినీ తలచుకుంటే నా జీవితం నాకే సర్ప్రైజ్గా అనిపిస్తోందని అంటోంది సాక్షి వైద్య. ఆమెకు అంతటి ఫాలోయింగ్ని పెంచడంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ సృష్టించిన స్టయిల్ రోల్ తక్కువేం కాదు! --సాక్షి వైద్య దేబ్యానీ.. మహారాణిగా మెరిసిపోవాలంటే దేబ్యానీ దుస్తులను ధరించాల్సిందే! నిజాం, మొఘల్స్ రాచరికం ఉట్టిపడేలా వీరి చీరలు, అనార్కలీలు, షరారాలు ఉంటాయి. అదే వీరి బ్రాండ్ వాల్య. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, బస్టియర్, బంధనీ ప్రింట్స్, చందేరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్తో లభించే ఈ బ్రాండ్ దుస్తులను సెలబ్రిటీలు తెగ ఇష్టపడతారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లోన లభ్యం. ఇంతకీ ఆమె ధరించిన దేబ్యానీ డ్రస్ ధర రూ. 100,000/- కర్ణిక జ్యూయెల్స్.. ష్యాషన్కి తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్ని రపొందిస్త కర్ణిక జ్యూయెల్స్ని టాప్ మోస్ట్ సెలబ్రిటీ బ్రాండ్గా నిలిపింది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతో పాటు, ఫ్యూజన్, నక్షి, నవరతన్, స్వరోవ్స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. జ్యూలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్ రూ. 33,000/- (చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..) -
పాక్ యువతి ట్రాప్లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
పూజా హెగ్డేతో డేట్కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్తో గ్రాండ్గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్ కెరీర్లో ఇంకో డిజాస్టర్గా ఏజెంట్ మిగిలిపోయింది. చదవండి: (ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్) ఇక సినిమా ఫెయిల్యూర్పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ హీరోయిన్గా డేట్కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు. ఇక హీరో రామ్చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్బీట్ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్ బయటపెట్టేశాడు అఖిల్. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి -
ఆ ఆఫర్ స్కామ్ అనుకున్నాను
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్’. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్ని. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ చాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు. -
డైరెక్షన్ ఆలోచన ఉంది
‘‘ఏజెంట్’ ఒక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్ కెరీర్లో ‘ఏజెంట్’కి ముందు, ‘ఏజెంట్’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అఖిల్ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రాఫర్కి చెప్తాను. ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో అఖిల్ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్ కట్టినప్పటికీ రిస్క్ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్ చేస్తానన్నాడు. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే చాలా సమయం పట్టింది. ‘ఏజెంట్’ని ముందు తెలుగులో రిలీజ్ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్లో స్పై జోనర్లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్ బ్యానర్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. -
వరంగల్లో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
వారి ప్రేమ, అభిమానం గొప్పవి
‘‘అక్కినేని ఫ్యాన్స్ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్ కావు. అఖిల్కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్లో నిర్వహించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్. ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు పొందారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్గా తెరకెక్కించడంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్ చేస్తే మంత్రి దయాకర్రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్కు వస్తాం. తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్.. ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా మైండ్లో ఒకటే ఉంది. ‘ఏజెంట్’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. -
షూటింగ్లో నటితో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్? అసలు విషయమిదే!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్ ట్వీట్పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. అసలు ట్వీట్లో ఏముంది? అఖిల్ అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్ మూవీ షూట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. #AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc — Umair Sandhu (@UmairSandu) April 18, 2023 View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చాడు. -
Agent Trailer Launch Event : ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
అఖిల్ ‘ఏజెంట్’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
గర్ల్ఫ్రెండ్ గోవిందా.. బ్రేకప్ అయ్యిందంటున్న అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె, ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా..’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడగా, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. -
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్లో తన డ్యాన్స్తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. -
పైకి అలా కనిపిస్తాడు కానీ.. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ : అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వార్కి రెడీ అవుతోంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడు పెంచారు మేకర్స్. తాజాగా యాంకర్ సుమతో ముచ్చటించిన అఖిల్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్న షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాక మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తారు. సినిమాల గురించి డిస్కషన్స్ చేయరు. మా అన్న నాగచైతన్య కూడా అంతే. సేమ్ నాన్న లాగే. పైకి నేను నాటీ(చిలిపి)గా కనిపిస్తా కానీ నాకంటే ఎక్కువ నాటీ చై. సైలెంట్ కిల్లర్. అన్నీ సైలెంట్గా చేసేస్తాడు అంటూ నాగచైతన్య సీక్రెట్ను రివీల్ చేసేశాడు. ప్రస్తుతం చైపై అఖిల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
సమంతకు హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చిన అఖిల్.. పోస్ట్ వైరల్
అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందని చాలాసార్లు రుజువైన సంగతి తెలిసిందే. రానా, మిహికా, అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంత ఇప్పటికీ టచ్లో ఉంటుంది. ఇక తాజాగా నిన్న(ఏప్రిల్8)న అఖిల్ బర్త్డే సందర్భంగా బెస్ట్ విషెస్ను అందించింది సమంత. గతేడాది కూడా అఖిల్ పుట్టినరోజున సామ్ స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పినా ఎందుకో అఖిల్ మాత్రం స్పందించలేదు. దీంతో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నెటిజన్లు ఎదురుచూశారు. గతేడాది లాగే ఇప్పుడు కూడా సామ్ పోస్టును పట్టించుకోడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్స్టాలో షేర్ చేసుకున్నాడు. 'థ్యాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా' అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు. దీంతో అఖిల్ షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
రొమాన్స్ లేదా అఖిల్.. ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
-
అక్కినేని హీరోకు బర్త్డే విషెస్ చెప్పిన సమంత.. రిప్లై వస్తుందా?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని మాజీ కోడలు సమంత కూడా అఖిల్కు బెస్ట్ విషెస్ను అందించడం విశేషం. నాగచైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. అక్కినేని హీరోలు అఖిల్, సుశాంత్ల సినిమాలకు ఇప్పటికీ సామ్ తన బెస్ట్ విషెస్ను అందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. అటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహికా, వెంకటేశ్ కూతురు అశ్రితలతో ఆమెకు మంచి అనుబంధం ఉందన్నది సోషల్ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా శనివారం అఖిల్ 29న ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. ( ఫైల్ ఫోటో ) ఈ క్రమంలో అతనికి బెస్ట్ విషెస్ను అందించింది సమంత. 'హ్యాపీ బర్త్డే అఖిల్ అక్కినేని. ఎయ్.. ఏజెంట్ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్లా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. గతేడాది కూడా బర్త్డే సందర్భంగా సామ్ విషెస్ చెప్పినా అఖిల్ స్పందించలేదు. మరి ఈసారైనా సమంత షేర్ చేసిన పోస్ట్కు రిప్లై ఇస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
రూమర్స్కి చెక్ పెట్టిన అఖిల్ అక్కినేని.. కొత్త పోస్ట్తో క్లారిటీ
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేంద్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఇటీవలె ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. అయితే రిలీజ్ డేట్ విషయంలో డైరెక్టర్కి, నిర్మాతకి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఏజెంట్ మళ్లీ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపించింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని మేకర్స్ తేల్చేశారు. రేపు(శనివారం)అఖిల్ బర్త్డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో ముందుగా అనౌన్స్ చేసినట్లుగా ఏప్రిల్ 28నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. The Advance celebrations begin 💥 Team #AGENT wishes the WILD ONE, @AkhilAkkineni8 a blockbuster birthday 😎 More surprises awaiting ahead🤘#HBDAkhilAkkineni ❤️#AGENTonApril28th 🔥@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha @Laharimusic pic.twitter.com/SZSDtTTUGq — AK Entertainments (@AKentsOfficial) April 7, 2023 -
రైల్వేతో కలిసి పనిచేస్తారా? రూ.80 వేల వరకూ సంపాదించుకోవచ్చు!
రైల్వేలో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటారు. అయితే తక్కువ సంఖ్యలో పోస్టులు, తీవ్రమైన పోటీ కారణంగా ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. అయినా పర్వాలేదు.. రైల్వేతో కలిసి పనిచేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కల్పిస్తోంది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? ఐఆర్సీటీసీ ఏజెంట్గా చేరితే మంచి మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఇందులో చేరేవారిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్గా వ్యవహరిస్తారు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కార్యాలయం అవసరం లేదు. ఇంట్లో నుంచే కంప్యూటర్లో ఈ పని చేసుకోవచ్చు. రైల్వేలో టికెట్ క్లెర్క్లు చేసే పనినే ఈ ఏజెంట్లు ఇంటి వద్ద నుంచి చేయాలి. మీరు బుక్ చేసిన టికెట్లకు ఐఆర్సీటీసీ కమీషన్ ఇస్తుంది. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! సంపాదన ఇలా.. నాన్ ఏసీ కోచ్ టిక్కెట్ను బుక్ చేస్తే ఒక్కో టికెట్కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్కు కమీషన్ వస్తుంది. అలాగే టికెట్ ధరలో ఒక శాతం డబ్బును కూడా ఏజెంట్కు ఇస్తారు. ఐఆర్సీటీసీ ఏజెంట్లు పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు బుక్ చేసిన టిక్కెట్ల ఆధారంగా మీ సంపాదన ఉంటుంది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! మంచి బుకింగ్ లభిస్తే నెలకు రూ.80 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏజెంట్గా చేరాలనుకునేవారు ఐఆర్సీటీసీ రుసుము కింద సంవత్సరానికి రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు సంవత్సరాలకు అయితే రూ. 6,999 చెల్లించాలి. నెలలో 100 టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక్కో టికెట్కు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! -
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' నుంచి రొమాంటిక్ మెలోడి రిలీజ్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై బాగా హైప్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఏందే ఏందే అంటూ ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్ను విడుదల చేశారు. మలాయళ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్మేన్’. ఈ సూపర్డూపర్ హిట్ ఫిల్మ్లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్లో ఇదొకటనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్హాసన్తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్చరణ్తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ని యాక్షన్ సీన్తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. -
పాన్ ఇండియా సినిమాలు ...ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే!
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఓ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ఆ సినిమాల అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ తో పాటు...స్టార్ హీరోల అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే వాళ్ల బర్త్డే కి మాత్రమే కాకుండా ఫెస్టివల్ కి కూడా ఏదొక అప్డేట్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే ఈ ఉగాదికి టాలీవుడ్ నుంచి చాలా సినిమా అప్డేట్స్ రాబోతున్నాయి. మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ #ssmb28. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబినేషనల్ రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ నెలాఖారు కల్లా సాంగ్స్ , ఒక ఫైట్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా రీస్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్డేట్ కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ లో ఈ మూవీ కి టైటిల్ ఏమి పెడతారనే విషయం పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ ప్రకటనతో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 22న ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా #NBK108 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఇక ఉగాది నాడు ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు ఓ పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఏజెంట్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఏజెంట్ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ సాంగ్స్ విడుదల చేశారు. ఇక ఉగాది నాడు అక్కినేని సర్ప్రైజ్ ఇచ్చే విధంగా ఏజెంట్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో సాగుతోంది. గ్లోబల్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూ మూవీ ఆదిపురుష్. జూన్ 16న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి...ఓ క్రేజీ అప్డేట్ ఉగాది రోజు రానుందట. ఆదిపురుష్ మైథిలాజికల్ ఫిల్మ్ కాబట్టి ఉగాది నాడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ ఓంరౌత్ టీమ్ ప్లాన్ చేస్తుందట. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.సి.15. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. కాబట్టి ఉగాది నాడు ఆర్.సి.15 టైటిల్ అనౌన్స్ చేసి...బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా బోళా శంకర్...శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఉగాది రోజు మెగా ట్రీట్ ఖచ్చితంగా ఇస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సో...ఉగాది నాడు సినీ అభిమానులను ఏ మూవీ అప్డేట్స్ పలకరిస్తాయో చూడాలి మరి. -
అఖిల్ పరిచయం చేస్తున్న కొత్త అందం సాక్షి వైద్య ఫోటోలు
-
ఎండల్లో హాయ్ హాయ్..అంటున్న స్టార్స్.. సమ్మర్ టార్గెట్గా భారీ సినిమాలు
వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్ కూల్గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్ టార్గెట్గా ఎక్కువ సినిమాలు సిల్వర్ స్క్రీన్కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... ♦ ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ♦ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్లో నటించారు. ప్రస్తుతం నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ♦ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ . కదిరేశన్∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించినా వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎ న్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం. ♦ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్ప్యాక్ దేహం, పొడవాటి హెయిర్ స్టైల్తో స్టైలిష్గా మేకోవర్ అయ్యారు అఖిల్. ఫారిన్లో చిత్రీకరించే ఓ ఫైట్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ♦ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ (పీఎస్– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 30నపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ♦ తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్ల్ ప్రారంభమైంది. తన కెరీర్లో తొలిసారి మాస్, యాక్షన్ మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏప్రిల్ 29న బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ∙ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ రిలీజ్ అవుతుందా? మరో కొత్త డేట్ని అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సమంత లీడ్ రోల్లో నటించినపాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మనసును హైజాక్ చేసి...
‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే దట్స్ ఏ సైన్ అని మనసంటుందే.. నా లేటెస్ట్ మిషనువు నువ్వే.. సాధించాలనిపిస్తుందే...’ అంటూ సాగుతుంది ‘ఏజెంట్’ చిత్రంలోని పాట. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పైయాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘మళ్లీ మళ్లీ నువ్వే... మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆదిత్యా అయ్యంగార్ సాహిత్యం అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు హిప్హప్ తమిళ పాడారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది..
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటgంsyత ఈ చిత్రం నుంచి త్వరలోనే మ్యూజికల్ ట్రీట్ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. కాగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్28న విడుదల కానుంది. -
ఫారిన్లో ఫైట్
ఫారిన్లో యాక్షన్ ప్లాన్ చేశారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా ఓ ఫారిన్ షెడ్యూల్ను ప్లాన్ చేశారట యూనిట్. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం వచ్చే వారంలో చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్తో ‘ఏజెంట్’ షూటింగ్ దాదాపు పూర్తవుతుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ రిలీజ్ కానుంది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్ హాప్ తమిజా. -
మ..మ..మాస్ అంటున్న యంగ్ హీరోలు
చిత్రపరిశ్రమలో మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు, ఆ హీరోలకు ఉండే క్రేజే వేరు. మాస్ హీరోల సినిమాలు విడుదలయితే థియేటర్స్లో దద్దరిల్లిపోవాల్సిందే. క్లాస్ మూవీస్ ఎన్ని చేసినా రాని ఇమేజ్ ఒక్క మాస్ మూవీతో వస్తుంది. ఆ హీరో మార్కెట్తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా డబుల్ అయిపోతుంది. అందుకే ఏ హీరో అయినా మాస్ హీరో అనిపించుకోవడానికే ట్రై చేస్తాడు. ఇప్పుడు మన టాటీవుడ్ యంగ్ హీరోలంతా మాస్ ఇమేజ్పై ఫోకస్ చేశారు. ఊరమాస్ కథలను ఎంచుకుంటూ క్లాస్ నుంచి మాస్కు షిఫ్ట్ అవుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉన్నాడు. అష్టాచమ్మా నుంచి అంటే సుందరానికి.. వరకు నాని చేసిన సినిమాలన్ని క్లాస్ కథలకు సంబంధించినవే. ఇప్పటి వరకు నాని ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. కృష్ణార్జున యుద్దంలో మాస్ గెటప్లో కనిపించినా.. అది వర్కౌట్ కాలేదు. ఈ సారి నాని తన రూటుని మార్చాడు. ప్రేక్షకులకు తనలోని ఊరమాస్ని పరిచయం చేసేందుకు ‘దసరా’తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్లో నాని గెటప్ అదిరిపోయింది. తెలంగాణ భాషలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే నాని మాస్ సినిమాల కౌంట్ పెంచే చాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు కేరీర్ స్టార్టింగ్లో మాస్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని.. మధ్యలో క్లాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్లాస్ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ మాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత వరుసగా రెడ్, ది వారియర్ అనే మాస్ సినిమాలు చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి మాస్లో మాస్టర్స్ చేసిన బోయపాటితో రామ్ జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఓ మాస్ మూవీ తెరకెక్కుతుంది. ఇక హీరో నితిన్ కూడా మాస్ సినిమాలవైపే మొగ్గు చూపుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో మాస్ ఫ్లేవర్ చూపించిన నితిన్.. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కంప్లీట్ మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా పిరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోయే సినిమా కూడా పక్కా మాస్ మూవీ అనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్తో అఖిల్.. ‘కస్టడీ’తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
ఏజెంట్కు మళ్ళీ షూటింగ్ కష్టాలు.. అఖిల్ మాస్ హీరోగా ప్రమోట్ అవుతాడా..?
-
చైతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో ఇంకా టచ్లో ఉన్న సమంత
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా వీరికి పేరుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు 2017లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్లో అయినా వీరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది. కానీ ఏమైందో ఏమో కానీ వీరి వివాహ బంధం బీటలు వారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే చై-సామ్లు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. తాజాగా అక్కినేని అఖిల్, షేర్ చేసిన ఓ పోస్ట్కు సైతం సమంత స్పందించింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ వీడియోను కూడా వదిలారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోగా దీనికి సమంత లైక్ కొట్టడంతో పాటు 'బీస్ట్ మోడ్' అంటూ కామెంట్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా గతేడాది అఖిల్ బర్త్డేకు సామ్ విష్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా సమంత శాకుంతలం పోస్ట్ను హీరో సుశాంత్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే చైతో డివోర్స్ అయినా అక్కినేని కుటుంబంతో సమంతకు మంచి రిలేషనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
ఏజెంట్ షూటింగ్లో గాయపడ్డ దర్శకుడు.. వీల్చైర్లో సెట్స్కి..
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్లో గాయపడ్డాడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ మూవీ షూటింగ్లో డైరెక్టర్కు గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో ఎడమకాలికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి సెట్లో అడుగుపెట్టాడు. గాయంతో బాధపడుతూనే ఏజెంట్లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. వీల్చైర్లో కాలికి కట్టుతో ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? ఫ్యాన్స్కు పూనకాలే -
సంక్రాంతి బరిలో ఎజెంట్.. ఆ బడా చిత్రాలకు పోటీగా
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్ ఏజెంట్గా కనిపించనున్నాడు . సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చదవండి: షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ ఈ నేపథ్యంలో ఎజెంట్ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా, అగ్ర హీరో సినిమాలతో పోటీ పడనుంది. సంక్రాంతి బరిలో ప్రభాస్-ఆదిపురుష్, మెగాస్టార్ చిరంజీవి- వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలయ్య వంటి బడా హీరోల సినిమాల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది. నిజానికి ఈ సినిమా 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి బరిలో దిగుతోంది. Get caught upon all the ACTION 😎#Agent Arriving in theatres WorldWide this SANKRANTHI 2023 🔥 #HappyDiwali ఏజెంట్・एजेंट・ஏஜென்ட்・ഏജന്റ്・ಏಜೆಂಟ್@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic @GTelefilms pic.twitter.com/AsKXt0BqrW — AK Entertainments (@AKentsOfficial) October 24, 2022 -
సంక్రాంతి రేసులో పందెంకోళ్లు, సై అంటున్న అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్. స్టైలిష్ స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీలో మమ్ముట్టి ఓ ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. కాగా సంక్రాంతి రేసులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', ప్రభాస్ 'ఆదిపురుష్', విజయ్ 'వారసుడు' సినిమాలున్నాయి. తాజాగా ఈ లిస్టులో అఖిల్ 'ఏజెంట్' కూడా వచ్చి చేరింది. చదవండి: హ్యాపీగా టాయ్లెట్స్ కడిగేవాడిని: నటుడు నేను ఎలా ఉన్నా అందగత్తెనే: ప్రగతి -
కలలు కల్లలు.. ఏజెంట్ చేతిలో మోసపోయి కటకటాల్లోకి కొత్తగూడెం మహిళ
భద్రాద్రి కొత్తగూడెం: గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు అమయాక మహిళలను మోసం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష్మీ (40) అనే మహిళ కూడా ఇలాగే అమలాపురానికి చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఉద్యోగం వస్తుందని నమ్మి గల్ఫ్ దేశం ఒమన్ వెళ్లిన ఆమెను మస్కట్లో ఎయిర్పోర్టు అధికారులు ఆపారు. ఆమె వీసా నకిలీదని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కేరళలోని కొచ్చికి తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏర్నాకులం పోలీస్ స్టేషన్కు రిమాండ్కు తరలించారు. ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒమన్ కేసులను వాదించే కోర్టులు ప్రస్తుతం కేరళో మూతపడ్డాయి. దీంతో విజయలక్ష్మీ జైల్లోనే మగ్గుతోంది. ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తోంది. విజయలక్ష్మి భర్త మరణించారు. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి పూలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే విజయలక్ష్మీ గల్ప్ దేశం వెళ్లాలనుకుంది. కానీ ఏజెంట్ను నమ్మి మోసపోయి ఇప్పుడు జైల్లో దుర్భర జీవితం గడుపుతోంది. చదవండి: కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ -
మస్కట్లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..
ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా): ‘నేను ఏజెంట్ చేతిలో మోసపోయా. ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్ నుంచి సెల్ఫీ వీడియో పంపింది. తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది. చదవండి: పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్ -
అఖిల్ 'ఏజెంట్' టీజర్పై మహేశ్ బాబు రివ్యూ..
Mahesh Babu Praises On Akhil Agent Teaser: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తరెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మూవీ టీజర్, అఖిల్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ మూవీ టీజర్ను, అఖిల్ లుక్స్ను పలువురు కొనియాడారు. తాజాగా ఈ టీజర్పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. 'ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, సినిమా థీమ్ ఎంతో నచ్చింది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్.' అని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఈ ట్వీట్పై అఖిల్ స్పందించాడు. 'థ్యాంక్యూ బ్రదర్. మీ సపోర్ట్, ప్రోత్సాహాం ఎంతో విలువైనది.' అని రీట్వీట్ చేశాడు. అలాగే శర్వానంద్ ట్వీట్పై కూడా స్పందించాడు అఖిల్. ప్రస్తుతం 'ఏజెంట్' టీజర్ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో #AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! :)https://t.co/ecNasoflIr — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022 Thank you so much brother 🙏🏻 we are thrilled to see your support and encouragement. Means a lot 🙏🏻 https://t.co/ps7kOMeAdT — Akhil Akkineni (@AkhilAkkineni8) July 16, 2022 -
అఖిల్ 'ఏజెంట్' టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
అఖిల్ను 'వైల్డ్ సాలే' అన్న హీరోయిన్..
Akhil Agent Teaser Released: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను స్టార్ యాక్టర్స్ శివకార్తికేయన్, కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్.. అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్' చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. -
'ఏజెంట్' బ్యూటీ లుక్ విడుదల.. వైరల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి విలన్గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదలైన పోస్టర్స్కు, అఖిల్ లుక్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోన్న సాక్షి వైద్య లుక్ను విడుదల చేశారు మేకర్స్. జూన్ 19న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సాక్షి వైద్య జీన్స్ ప్యాంట్, బ్రౌన్ కలర్ టాప్తో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సాక్షి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏజెంట్ సినిమా వరల్డ్వైడ్గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ Team #AGENT⚡️ Introducing & Wishes the beauty with Immense Talent @sakshivaidya99 a very Happy Birthday💖 Welcome to TFI 🤗 @AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @S2C_Offl #AgentLoading pic.twitter.com/Wao5A7M8Qi — AK Entertainments (@AKentsOfficial) June 19, 2022 -
కులుమనాలీలో అఖిల్ ఏజెంట్ షూటింగ్
అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. ‘‘స్టైలిష్ స్పై థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కులు మనాలీలో విజయ్ మాస్టర్ నేతృత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రసూల్ ఎల్లోర్. Grappling to STRIKE HARD 👊🏾#AGENT Shoot progressing at a brisk pace in Manali with fierce action sequences💥💥#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/f1daRar0O0 — SurenderReddy (@DirSurender) May 25, 2022 చదవండి: విషాదం.. టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి కిచ్చా సుదీప్, జాక్వెలిన్ల 'రారా రక్కమ్మా..' సాంగ్ విన్నారా? -
అఖిల్ 'ఏజెంట్' మూవీ ఆగిపోయిందా? ట్వీట్తో క్లారిటీ
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి హిట్టు మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే! నిర్మాత అనిల్ సుంకరతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దీంతో సినిమా ఆగిపోయిందంటూ కూడా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుంది. త్వరలోనే టీజర్ అప్డేట్ ఇస్తాం. దయచేసి అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్ గురించి పట్టించుకోవద్దు' అంటూ స్పష్టతనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కి చెక్ పెట్టినట్లయ్యింది. చదవండి: 'షూటింగ్ ఆపేశారు.. నన్ను వాష్రూంలో పెట్టి బంధించారు' #AGENT schedule starting in Manali. An update abt teaser will be given shortly. Please only follow verified twitter handles for updates. Ignore all the rumours please. 🙏🙏🙏 — Anil Sunkara (@AnilSunkara1) May 16, 2022 -
వైజాగ్లో ఏజెంట్
ప్రత్యర్థుల ప్లాన్ను తిప్పి కొట్టడానికి వ్యూహం పన్నారు ఏజెంట్. మరి.. ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిక్కుకుని ఎలా అల్లాడిపోయారు? అనేది థియేటర్స్లో చూడాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రధారి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అఖిల్ వైజాగ్ వెళ్లారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారని, ఈ బ్లాక్ ఇంట్రవెల్లో వస్తుందని టాక్. ‘ఏజెంట్’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బ్యాడ్ న్యూస్.. అక్కినేని ఫ్యాన్స్కు సారీ చెప్పిన నిర్మాత
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం(ఏప్రిల్8)న అఖిల్ బర్త్డే . ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయవచ్చని అంతా భావించారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్తో సరిపెట్టేశారు. 'ఈరోజు టీజర్ విడుదల చేయలేకపోతున్నాం. అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్నే అందించాలని అనుకుంటున్నాం. మీ నిరీక్షణకు తగినట్లుగా నాణ్యమైన టీజర్ను త్వరలోనే విడుదల చేస్తాం' అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. దీంతో బర్త్డే టీజర్ లేనట్లేనంటూ ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. For all Akkineni fans a big SORRY for not giving the teaser today. We want to give the best and it will be worth your wait. We promise to give a highest quality theatrical teaser in May. — Anil Sunkara (@AnilSunkara1) April 7, 2022 WWM 🔥 #AGENT ⚡️ Many more updates exploding soon💥#HBDAkhilAkkineni @AkhilAkkineni8 #AgentOnAugust12 pic.twitter.com/xZeS44aFM2 — AK Entertainments (@AKentsOfficial) April 8, 2022 -
పాన్ ఇండియా మార్కెట్పై అఖిల్ గురి!
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్పై క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో జరుగుతోంది. ఓ సాంగ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ని ఇందులో చిత్రీకరిస్తున్నారని టాక్. మెట్రోలో అఖిల్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో ఏజెంట్ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీని కోసం భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్కి అందరూ షాక్ అయ్యారు. ఈ లుక్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ బర్త్ డే ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో అఖిల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడట. ఇకపై వరుసగా పాన్ ఇండియా చిత్రాలను ఎంచుకోవాలని అఖిల్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఏజెంట్ విడుదల తర్వాత.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి.. తదుపరి సినిమాను ఎంచుకోవాలని భావిస్తున్నాడట. మరి అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఏజెంట్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారట. -
హైదరాబాద్ మెట్రోలో అఖిల్ అక్కినేని.. ఫోటో వైరల్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా ఏజెంట్. ఇప్పటివరకు లవర్ బాయ్గా కనిపించిన అఖిల్ ఈ సినిమా కోసం యాక్షన్ హీరోగా మారుతున్నాడు. ఇందుకోసం షూటింగ్కి ముందు నుంచే తెగ కష్టపడుతున్న అఖిల్ ఈ చిత్రంలో సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తర్వాత అఖిల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆగస్టు 12 ఈ సినిమాను విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్గా హైదరాబాద్ మెట్రోలో అఖిల్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్లో భాగంగా అఖిల్కి సీన్స్ వివరిస్తున్నట్లుగా ఫోటోలో ఉంది. -
అఫీషియల్: అఖిల్ 'ఏజెంట్' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇప్పటివరకూ లవర్బాయ్గా కనిపించిన అఖిల్ ఏజెంట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా కనిపించనుండగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆగస్టు 12 ఏజెంట్ విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ వెల్లడించడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో యంగ్ హీరో సిక్స్ప్యాక్ లుక్లో కనిపిస్తాడు. ఈ సినిమాకు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. An Action Spectacle awaits you in theatres 😎 THE WILD ONE🤙🏻#AGENT⚡️ Reporting in theatres from AUGUST 12th 2022 💥💥💥#AGENTonAugust12 🔥@AkhilAkkineni8 @mammukka @DirSurender @AnilSunkara1 @hiphoptamizha @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/lHKDvNwGjC — AK Entertainments (@AKentsOfficial) March 11, 2022 -
షాకింగ్ : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్..
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జిమ్లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
లేట్గా వస్తున్న 'ఏజెంట్'.. డేట్ మారినా దూకుడు మారదు
Agent Movie Postponed Due To Corona: థియేటర్స్లోకి కాస్త ఆలస్యంగా రాబోతున్నాడు ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా కనిపించనుంది. శుక్రవారం (డిసెంబరు 24) విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘‘కరోనా వల్ల మా ‘ఏజెంటు’ డేటు మారినా దర్జా మారదు. దూకుడు మారదు. ధీమా మారదు. అఖిల్ అద్భుతమైన యాక్టింగ్, సురేందర్ రెడ్డి స్టైల్ ఆఫ్ మేకింగ్తో ‘ఏజెంట్’ వరల్డ్ క్లాస్ స్పై థ్రిల్లర్గా రాబోతోంది’’ అని ట్వీట్ చేశారు అనిల్ సుంకర. ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో దసరా హీరోగా మారాడు అఖిల్. రుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొట్టాడు అక్కినేని వారసుడు. అయితే 'ఏజెంట్' మూవీని 'బ్యాచ్లర్'ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రామబ్రహ్మం సుంకర మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో– ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. అక్కినేని అభిమానులందరికి నమస్కారం కరోనా వలన మా ఏజెంట్ డేటు మారినా దర్జా మారదు, దూకుడు మారదు. ధీమా మారదు. #Agent will be on par with any world class spy movies with abundant Action(Akhil)and Style(Surender)We promise all the fans that we will deliver 1000% whatever u r dreaming. pic.twitter.com/jglmoXsCrI — Anil Sunkara (@AnilSunkara1) December 24, 2021 ఇదీ చదవండి: మాస్ సాంగ్తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
అఖిల్ ‘ఏజెంట్’లో మలయాళ స్టార్ హీరో!
ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. పుష్పలో ఫాహద్ ఫాజిల్ విలర్ రోల్ చేస్తున్నాడు. అలాగే సలార్ లో మరో మలయాళ నటుడు పృథ్విరాజ్ కీరోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు బ్యాచ్ లర్ కొత్త చిత్రం ఏజెంట్ లోనూ మాలీవుడ్ సూపర్ స్టార్ అడుగు పెట్టబోతున్నారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్తో దసరా హీరోగా మారాడు అఖిల్.ఇప్పుడు నెక్ట్స్ మూవీని బ్యాచ్లర్ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఏజెంట్ లోమాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మమ్ముట్టి చిత్రాలు చేశాడు. రీసెంట్గా వైఎస్సార్ బయోపిక్ యాత్ర లో మహానేతగా మెప్పించారు.ప్రస్తుతం మాలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మమ్ముట్టి. ఈ దశలో మాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ వరకు వచ్చి అఖిల్ మూవీలో కీరోల్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. -
స్టార్ట్..కెమెరా..యాక్షన్ : వరుసగా షూటింగులు
తెలుగు చిత్ర పరిశ్రమలో సోమవారం ‘యాక్షన్.. స్టార్ట్’ అంటూ షూటింగ్స్ సందడి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన చిత్రాలతో పాటు కొత్త సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. అఖిల్ ‘ఏజెంట్’ లుక్ విడుదల చేసి, షూటింగ్ ఆరంభించారు. రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ లుక్ని విడుదల చేయడంతో పాటు షూటింగ్ షురూ చేశారు. ఇక మహేశ్బాబు ‘సర్కారు వారి పాట’, బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాల షూటింగ్ పునః ప్రారంభమైంది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ కూడా ఆరంభమైంది. ► అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో సాక్షీ వైద్య హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్–2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘కిక్, రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కాంబినేషన్లో ‘ఏజెంట్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. ► రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు: ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, దివ్యాంశా కౌశిక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ► మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈఓ: చెర్రీ. ► బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రధారి. ► రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్. -
ఒంటిపై మేక టాటూ.. కంప్లీట్గా మారిపోయిన అఖిల్ లుక్
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్. ఫుల్ యాక్షన్ మూవీగా తయారయ్యే ఈ సినిమాలో ఓ అండర్కవర్ ఆపరేషన్ చేసే ఏజెంట్ పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు. అఖిల్ నటిస్తున్న ఈ 5వ చిత్రంలో అతడు సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అఖిల్ లుక్కు సంబంధించి ఓ పోస్టర్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ లుక్ కంప్లీట్గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్లో వర్కవుట్ చేస్తున్న అఖిల్ ఫోటోను రిలీజ్ చేస్తూ..'ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ' అంటూ ఓ పోస్టర్ను వదిలారు. ముఖ్యంగా అఖిల్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ ఫోటోలో అఖిల్ బాడీపై కొమ్ములు కలిగిన మేక టాటూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. 'ఏజెంట్ లోడింగ్. వైల్డ్ రైడ్కు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నట్లు లుక్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఎప్పుడు చూడనంతగా రఫ్ లుక్లో అఖిల్ కనిపించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. This is just the beginning...Meeku mundu mundu undi pandaga!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/trOj5shejN — SurenderReddy (@DirSurender) July 11, 2021 -
అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే..
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు పాస్పోర్టు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత రెండు, తర్వాత 32 పాస్పోర్టులు అనుకున్నప్పటికీ ఈ విషయంలో కూపీ లాగిన కొద్దీ అక్రమంగా జారీ అయిన పాస్పోర్టుల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం.. ఈ పాస్పోర్టులతో ఎవరైనా ఇప్పటికే దేశం దాటారా? అన్న విషయంపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలసి బోధన్లో ఒకే ఇంటి నంబరు నుంచి జారీ అయిన పాస్పోర్టుల నంబర్లతో విచారణ చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారి స్థానిక గల్ఫ్ ఏజెంటేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడి సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటితో విదేశీయులతో పాస్పోర్టుకు దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలతోనే ఒకే చిరునామా నుంచి 32 మందికిపైగా విదేశీయులకు అక్రమ పద్ధతిలో పాస్పోర్టులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇంకా ఎన్ని పాస్పోర్టులు ఒకే ఇంటి నంబరు నుంచి వచ్చాయన్న దానిపై చిక్కుముడి వీడాల్సి ఉంది. మరింత లోతుగా దర్యాప్తు..! ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. తొలుత కేవలం రెండు పాస్పోర్టులే అనుకున్నా పోలీసులు మరింత కూపీలాగారు. మొత్తంగా 32కిపైగా పాస్పోర్టులు రెంజల్ కాలనీలోని ఒకే చిరునామా నుంచి జారీ అయ్యాయని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్న ప్రచారం స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో అనేక లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విదేశీయులకు పాస్పోర్టుల వ్యవహారంలో ఈ ఇద్దరు పోలీసులేనా..? ఇంకా ఇతర పోలీసు అధికారులెవరైనా సహకరించారా? ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో పాస్పోర్టు దరఖాస్తులు వస్తున్నా ఎందుకు అనుమానించలేదు? దీని వెనక ఇంకా ఎవరైనా హస్తముందా? అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
మహిళపై దుబాయ్ ఏజెంట్ లైంగిక దాడి
కంటోన్మెంట్: దుబాయ్ వెళ్లాలని వచ్చిన ఓ అమ్మాయిపై ఏజెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ సంఘటన గోపాలపురం పోలీసుస్టేషన్ పరి«ధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేఎల్ఎన్ మూర్తి దుబాయ్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన ఓ మహిళను దుబాయ్ పంపించే క్రమంలో గతవారం నగరానికి తీసుకొచ్చాడు. మూడురోజుల క్రితం ఇమ్మిగ్రేషన్ నిమిత్తం మూర్తి అమ్మాయితో పాటు చెన్నైకి వెళ్లాడు. అయితే దుబాయ్ వీసా తిరస్కరణకు గురికావడంతో శనివారం తిరిగి హైద్రాబాద్కు వచ్చిన వీరు భార్యభర్తలుగా చెప్పుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సాయి లాడ్జీలో రూము తీసుకున్నారు. ఆదివారం ఉదయం వేళలో వారి గదిలోంచి అరుపులు, కేకలు రావడంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే లాడ్జీకి చేరుకున్న పోలీసులు మూర్తితో పాటు అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏజెంట్ నిర్వాకం : వీడియో వైరల్
సాక్షి, ఫరీదాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ సందర్భంగా హరియాణాలో ఓ సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఓటు వేయడానికి మహిళా ఓటర్లకు బదులుగా ఓ పోలింగ్ ఏజెంట్ స్వయంగా తానే ఓటు వేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో స్పందించిన అధికారులు సంబంధిత పోలింగ్ ఏజెంట్పై ఫిర్యాదు చేయడంతోచ పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. ఆరో విడుత ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్లో కూర్చొన్న ఓ ఏజెంట్.. ఈవీఎం కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అక్కడ మహిళ ఉండగానే అతడు ఓటేశాడు. ఇలా ముగ్గురు మహిళల ఓట్లు ఆ పోలింగ్ ఏజెంటే ఓటేసినట్లు అక్కడున్న వారు తెలిపారు. అయితే ఈ తతంగాన్ని అక్కడున్న ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ సంఘటనపై ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదరు పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. కేసు నమోదు చేశామని, ముగ్గురు మహిళల ఓట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పోలింగ్ ఏజెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. The person in the video is the Polling agent who has been arrested in the afternoon itself. FIR lodged. He was trying to effect at least 3 lady voters. Observer & ARO with teams visited the booth at Asawati in prithala constituency. He is satisfied that voting was never vitiated — DISTRICT ELECTION OFFICE FARIDABAD (@OfficeFaridabad) May 12, 2019 What the is this? Is this what we call democracy? pic.twitter.com/XFuvq5dD1m — Ravi Nair (@t_d_h_nair) May 12, 2019 -
మనస్థాపానికి గురై అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
-
గుండెపోటుతో ఎన్నికల ఏజెంట్ మృతి
సాక్షి, సూర్యపేట : తెలంగాణ తొలి పంచాయితీ ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాలు.. విలాస కవి సత్యం రాజు(70) సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో ఎన్నికల ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. సోమవారం ఉదయం గుండెపోటు రావడం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా దురదృష్టావషాత్తు మార్గమధ్యలోనే మరణించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. -
అంట్లు తోమాడు.. అడుక్కున్నాడు
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: దుబాయ్లో మంచి పనిలో చేర్పిస్తానని ఆ యువకుడిని ఓ గల్ఫ్ ఏజెంట్ నమ్మించి రూ.లక్షన్నర తీసుకుని దుబాయ్ పంపించాడు. అక్కడ రోడ్డు చెంత హోటల్లో కప్పులు, ప్లేట్లు కడిగే పనిలో చేర్చాడు. ఆ పనులు చేస్తే వచ్చే అరకొర జీతంలో కొంత మొత్తాన్ని అక్కడే ఉన్న ఏజెంట్ మరదలు లాక్కునేది. ఐటీఐ చదువుకుని బతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు అడుగడుగునా అష్టకష్టాలు పడ్డాడు. మండలంలోని బండార్లంక గ్రామానికి చెందిన పిల్లి నాగేంద్ర దీన గాథ ఇది. నాగేంద్ర తండ్రి హేమసుందరరావు గతంలో బండార్లంకలో ఓ చిరు వ్యాపారంతో జీవించేవాడు. బతుకు తెరువు కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి హేమసుందరరావు కుటుంబం ఇటీవల వలస వెళ్లింది. అక్కడే నభీఖాన్ అనే గల్ఫ్ ఏజెంట్ పరిచయయ్యాడు. అప్పటి దాకా తనకు వచ్చిన మెకానిక్ పనితో కష్టపడుతూ తండ్రికి తోడై కాస్త సంపాదనలో ప డ్డాడు. ఏజెంట్ అరి చేతిలో వైకుంఠాన్ని చూపించి అతడిని దుబాయ్ పంపించే ఏర్పాట్లు చేశాడు. దుబాయ్లో తన మరదలు ఉంటుందని..అక్కడ అంతా ఆమె చూసుకుంటుందని ధైర్యం చెప్పాడు, నాగేంద్ర వద్ద రూ.లక్షన్నర తీసుకుని విజిట్ వీసాతో ఈ ఏడాది మే 29న విమానం ఎక్కించాడు. అంట్లు తోమే పనిఅప్పగించారు దుబాయ్లో దిగాక ఏజెంట్ మరదలు తొలుత రోడ్డు చెంత ఓ గ్యారేజ్లో హెల్పర్గా చేర్పించింది. అక్కడి పాకిస్తాన్ యువకుల వేధింపులు తాళ లేకపోయాడు. తర్వాత ఆమె రోడ్డు చెంత హోటల్ సర్వర్–కమ్–పాత్రలు శుభ్రం చేసే పనిలో పెట్టింది. విజిట్ వీసాతో పంపించినా అక్కడ పర్మినెంట్ వీసా ఇప్పిస్తానన్న ఏజెంట్ పట్టించుకోలేదు. వీసా గడువు ముగిసిపోయే పరిస్థితిలో.. చేసేది లేక పోలీసుల కంట పడకుండా భిక్షగాడి అవతారమెత్తాడు. కొంత సొమ్ము సమకూరాక వీసాను పొడిగించుకున్నాడు. తండ్రి చొరవతో స్వదేశానికి.. కొడుకు దీనస్థితిని చూసి నాగేంద్ర తండ్రి హేమసుందరరావు చలించిపోయాడు. అప్పు చేసి విమా నం టికెట్ తీయించి కొడుకు క్షేమంగా స్వదేశానికి వచ్చేలా చేసుకున్నాడు. సత్తుపల్లిలో ఏజెంట్ను తండ్రిని పదే పదే తన కొడుకుని తిరిగి స్వదేశం వచ్చేలా చేయమని ఒత్తిడి తెచ్చినప్పుడు అతడిపై దాడి కూడా చేశాడు. అక్కడ న్యాయం జరగదేమోనన్న భయంతో సొంతూరు బండార్లంక వచ్చి అమలాపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాడు చేశాడు. అయితే ఏజెంట్ది సత్తుపల్లి కాబట్టి అక్క డ ఫిర్యాదు చేయమని ఎస్సై గజేంద్రకుమార్ చె ప్పారు. దీంతో సత్తుపల్లి పోలీసుస్టేషన్లోనే ఫిర్యా దు చేయనున్నట్టు బాధితుడు నాగేంద్ర తెలిపాడు. -
ఆంధ్రా ఏజెంటుగా ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రాకు ఏజెంటుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెస్సే అని మరోసారి రుజువైందన్నారు. విభజన చట్టం లో ని హామీలు ఏపీకి అమలు చేస్తే అభ్యంతరం లేదని, ఆ పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కష్టపడుతుంటే కాంగ్రెస్ దానికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టి ఏపీకి ప్రయోజనం చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. ఉద్యోగాల నియామకంపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. -
లోన్ రికవరి కోసం వెళ్తే చితకబాదిన టీఆర్ఎస్ నేత
-
నా భార్యను ఏజెంట్ అమ్మేశాడు
చిత్తూరు, మదనపల్లె క్రైం : తన భార్యను ఓ ఏజెంట్ కువైట్కు పంపుతానని నమ్మబలికి తీసుకెళ్లి ఎక్కడో అమ్మేశాడని బాధితుడు ఆదివారం రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. మదనపల్లె మండలం కొండామారిపల్లె పంచాయ తీ బాలాజినగర్లో ఉంటున్న శెట్టిపల్లె వెంకట్రమణ పెయింట్ పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకునేవాడు. సంపాధన చాలకపోవడంతో భార్య రాధ(35)ను కువైట్ పం పించాలని అనుకున్నాడు. పాస్పోర్టు కూడా తీసుకున్నాడు. క్రిష్ణానగర్లో ఉంటున్న ఏజెంట్ రెడ్డిబాషాను ఆశ్రయించాడు. అతను త్వరలో గల్ప్ నుంచి వీసా తెప్పించి కువైట్కు పంపుతానని వెంకటరమణకు హామీ ఇచ్చాడు. మూడు రోజుల క్రితం రాధ కనిపించకుండా పోయింది. ఏజెంట్ రెడ్డి బాషా తన ఇంటికి కొంతకాలంగా వస్తూ పోతూ ఉండేవాడని, అతనే తన భార్యను కువైట్ పేరుతో తీసుకెళ్లి ఎక్కడో అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. -
రూ.24 లక్షలకు కుచ్చుటోపీ
– ఉడాయించిన సహకార బ్యాంకు డైలీ డిపాజిటర్ ఏజెంట్ – లబోదిబోమంటున్న బాధితులు కోవెలకుంట్ల: కోవెలకుంట్ల సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్ డిపాజిట్ సొమ్ముతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు... పట్టణానికి చెందిన నాగరాజు గత 20 సంవత్సరాల నుంచి సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. నూర్ అహమ్మద్, రంగడు, పుల్లయ్య, రామిరెడ్డి, అమీర్, నారాయణరెడ్డి, సావిత్రి, ప్రసాదు, వెంకటేశ్వరరావు, గణేష్రెడ్డి, దస్తగిరి, బాష, గోవిందు, చౌడయ్య, సుధాకర్రెడ్డి, శివభాస్కర్రెడ్డి, మరో 50 మంది ఏజెంట్ వద్ద ప్రతి రోజు రూ. వంద నుంచి రూ. 3వేల వరకు ఏజెంట్ వద్ద డిపాజిట్ చేశారు. ఏడాదిపాటు రోజుకు రూ. వంద చెల్లించిన లబ్ధిదారునికి ఏడాది ఆఖరులో బ్యాంకు రూ. 36,800 చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నట్లు తెలుస్తోంది. డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 24 లక్షలు వసూలు చేసి ఇటీవల కన్పించకుండా పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 40 మంది లబ్ధిదారులు ఏడాదికాలం చెల్లించగా వారికి వడ్డీతో సహా మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఏజెంట్ కన్పించకపోవడంతో బాధితులు బ్యాంకును చేరుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను విన్నవించుకున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ కష్ణమూర్తి మాట్లాడుతూ ఏజెంట్ లబ్ధిదారుల నుంచి డిపాజిట్ వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. సహకార బ్యాంకు జిల్లా శాఖకు ఫిర్యాదు చేయగా ఈ సంఘటనపై విచారణ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఏజెంట్కు సంబంధించిన రికార్డులు, రసీదులు, తదితర అంశాలను పరిశీలించగా రూ. 12 లక్షలకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తేలిందన్నారు. డిపాజిటర్లు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డిపాజిట్ చేసిన సొమ్మున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రేవంత్ ఆంధ్ర ఏజెంట్
ఆయనకు చీము నెత్తురు ఉంటే చంద్రబాబు ఇంటిని ముట్టడించాలి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు పంపిన ఏజెంటే రేవంత్రెడ్డి అని, ఇలాంటి ఇంటి దొంగ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో టెలిఫోన్లో మాట్లాడారు. రేవంత్కు సిగ్గూ శరం, చీమూ నెత్తురు ఉంటే సొంత జిల్లా మహబూబ్నగర్కు నీళ్లందించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టొద్దని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలుపుకున్నప్పుడు ఈ రేవంత్రెడ్డి కళ్లలో ఏం పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆంధ్రా పెత్తనం పోయినా ఆంధ్ర వాళ్ల కుట్రలు మాత్రం కొనసాగటం దురదృష్టకమన్నారు. రేవంత్రెడ్డి ఒక దొరికిన దొంగ అని, ఓట్లకు నోట్ల కేసులో ఆయన జైలు జీవితం గడపాల్సిన రోజులు ముందున్నాయన్నారు. -
ఐఎస్ఐ కూడా ఐఎస్ఐఎస్ మాదిరిగానే..
మీరట్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధ మాదిరిగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా ఐఎస్ఐ అనుమానిత ఏజెంటు మహ్మద్ ఇజాజ్ వెల్లడించాడు. అతడిని భారత స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇజాజ్ను విచారిస్తున్న పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. భారత్లో గూఢచర్యం నిర్వహించడానికి ఇజాజ్కు 9 నెలల పాటు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. శిక్షణలో సమాచారాన్ని సేకరించడం, చేరవేయడంలో అతన్ని ఆరితేరేలా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ గుండా అతన్ని భారత్కు అక్రమంగా పంపినట్లు తేలింది. ఇజాజ్ను భారత్కు పంపే సమయంలో అతని పాస్పోర్ట్ను ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కూడా తామ సంస్థలో చేరిన సభ్యుల పాస్పోర్ట్లను కాల్చివేసి వారిని తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటుంది. అలాగే అజీజ్కు నెలకు 50 వేల రూపాయల జీతంతో పాటు, చెల్లి పెళ్ళికి సహాయం అందిస్తామని నమ్మించి తరువాత ఆ వాగ్దానాలను ఐఎస్ఐ నిలుపుకోలేదని ఇజాజ్ విచారణలో తేలిందని డీఎస్పీ అనిత్ కుమార్ వెల్లడించారు. ఇజాజ్ స్కైప్ ద్వారా ఐఎస్ఐతో తన సంభాషణలు కొనసాగించాడని తేలింది. అయితే అతడు పాక్కు ఎలాంటి సమాచారాన్నిచేరవేశాడనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. -
ముంచెత్తుతానన్నాడు... నిండా ముంచాడు
-
నకిలీ నోట్ల ఏజెంట్ అరెస్టు
ఖమ్మం క్రైం : నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఏజెంట్ను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ దక్షిణామూర్తి ఆదివారం విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. నగరంలోని బుర్హాన్పురంనకు చెందిన షేక్ అమీరుద్దీన్ పాన్షాప్ నడుపుతున్నాడు. గతనెల 29న అతని షాపునకు ఓవ్యక్తి వచ్చి హిందీలో మాట్లాడుతూ రూ. 1000 నోటు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. మిగితా చిల్లర డబ్బులు తీసుకుని వెళ్లిపోయూడు. ఆ రూ. 1000 నోట్ను ఈనెల 1న అమీరుద్దీన్ సరుకులు కొనుగోలు చేసేందుకు ఓ షాపునకు వెళ్లాడు. షాపు యజమాని నకిలీ నోటు అని చెప్పడంతో అమీరుద్దీన్ అవాక్కయ్యాడు. టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చే శాడు. మరుసటి రోజు అమీరుద్దీన్ బస్టాండ్కు వెళ్లగా తనకు నకిలీ నోట్ ఇచ్చిన వ్యక్తి తారసపడ్డాడు. వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్టాండ్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తిని బీహర్ రాష్ట్రంలోని బేగ్సరాయి జిల్లా పబ్ర గ్రామానికి చెందిన అమరజిత్ కుమార్గా గుర్తించారు. ఇతను పశ్చిబెంగాల్లోని వజీర్ అనే వ్యక్తికి రూ. 40 వేల అసలు నోట్లు ఇచ్చి రూ. లక్ష నకిలీ నోట్లను తీసుకున్నాడు.అనంతరం అమీరుద్దీన్ ఖమ్మం చేరుకుని కొంతకాలంగా ఇక్కడ పాన్ షాపులలో, చిల్లర దుకాణాలలో ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ నోట్లను మారుస్తున్నాడు. అతను తెచ్చిన రూ. 100, రూ. 1000 నోట్లు 44 నకిలీవి ఇప్పటికే మార్చాడు. పోలీసులు అతని వద్ద ఉన్న 56 నకిలీ రూ .100, రూ. 500 నోట్లను స్వాధీన పర్చుకోన్నారు. అదేవిధంగా తాను ఇప్పటి వరకు మార్చిన రూ. 25 వేలల్లో రూ. 10 వేలు బ్యాంకులో జమచేయగా మిగతావిసొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలిపాడు. అతని వద్ద అసలు నగదును కూడా పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నకిలీ కరెన్సీ నోట్ల పట్ల ముఖ్యంగా చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నకిలీ కరెన్సీని ఎక్కువగా చిన్న వ్యాపారాలు చేసే వారి వద్దనే నిందితులు చలామణి చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వారిని గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. నకిలీ నోట్ల నిందితుడిని పట్టుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు సుబ్బయ్య, కుమార్ ఐడి పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.వారికి రివార్డులు ప్రకటించారు. -
మలేసియాలో మనోళ్ల పాట్లు
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్కు చెందిన 300 మంది వేతనం అడిగితే దాడులు చేస్తున్నారని ఆవేదన భీమ్గల్: ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 300 మంది మలేసియాలో అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంటు ఇచ్చిన టూరిస్టు వీసా గడువు ముగిసి మలేసియా పోలీసులకు చిక్కి పరిహారం చెల్లించిన కొందరు స్వదేశం చేరుకోగా, మిగిలిన వారంతా అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి వచ్చిన వారిలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందిన ఇద్దరు ఉన్నారు. వారి కథనం మేరకు.. భీమ్గల్కు చెందిన పొలాస నడ్పి భూమేశ్వర్, తొగర్ల గంగాధర్లను కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ సబ్ ఏజెంట్ మధుగౌడ్.. వేములవాడకు చెందిన ప్రధాన ఏజెంట్ జోరిగ దేవరాజ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఒక్కొక్కరి వద్ద రూ. 1.20 లక్షలు తీసుకొని మలేసియా పంపించాడు. అక్కడ పవర్ప్లాంట్లో నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. తొలుత టూరిస్టు వీసాపై అక్కడికి వెళ్తే.. మూడు నెలల్లో కంపెనీ వీసా ఇప్పిస్తానని, లేనిపక్షంలో డబ్బులు తిరిగి ఇస్తానని హమీపత్రం రాసిచ్చాడు. దీంతో వీరు నమ్మి ఏజెంట్ చేతిలో పాస్పోర్టు పెట్టారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వీరి కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ప్లాంట్ నిర్మాణంలో ఉందని చెప్పి నెలరోజులు ఖాళీగా ఉంచాడు. ఓ చిన్న గదిలో 40 మందిని ఉంచారు. మరోనెలలో సిమెంట్ ప్యాక్టరీలో పనికి కుదిర్చాడు. అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో పనికి కుదిర్చాడు. అందులో మూడు నెలలు పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇదేమని అడిగితే.. ఏజెంటును తీసుకురమ్మని గదమాయించారు. ఏజెంటుకు ఫోన్ చేస్తే పత్తాలేకుండా పోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది. వీసా గడువు ముగియడంతో ఇక్కట్లు ఇక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా మూడు నెలల తర్వాత కంపెనీ వీసా ఇవ్వలేదు. విజిట్ వీసా గడువు ముగియడంతో ఏజెంట్ను ప్రశ్నించగా, కుదరదనడంతో పాటు ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’మని బెదిరించాడు. దీంతో వీరు ఇక్కడి బంధువులను ఆశ్రయించగా, టికెట్లు కొనిపంపించారు. అక్కడి ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని దేశం విడిచి వెళ్లేందుకు అవకాశమిస్తూ గడువు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకొని బయటపడ్డారు. వీసా గడువు నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి ప్రభుత్వం విధించిన రూ. 400 రింగిట్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 8 వేలు జరిమానా)ను ఇంటినుంచి పంపడంతో చెల్లించి బయటపడ్డారు. -
జగ్గారెడ్డి.. చంద్రబాబు ఏజెంట్
సిద్దిపేట టౌన్: మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏజెంట్, బీజేపీ మైనార్టీల వ్యతిరేకమని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ధ్వజమెత్తారు. సిద్దిపేట శివమ్స్ గార్డెన్లో ఆదివారం నియోజకవర్గ మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ మాట్లాడుతూ, దశాబ్దాల నుంచీ తెలంగాణలో ముస్లింలు అణచివేతకు గురయ్యారన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి కాంగ్రెస్ పాలకులకు చెంచాగిరి చేసిన పైరవీకారుడన్నారు. సిద్దిపేట నీళ్లు తాగితే గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి రగులుతుందన్నారు. ఇందుకు కేసీఆర్, హరీష్రావులే నిదర్శనమన్నారు. ఇప్పుడు తెలంగాణలో మైనార్టీలు తలెత్తుకుని తిరిగే ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాల పట్ల ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణలో మైనార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ సంక్షేమ పథకాలు దళారులకు ఎక్కువగా చెందాయని, తమ ప్రభుత్వ ఫలాలు మాత్రం నేరుగా ప్రజలకు చేరుతాయన్నారు. ముస్లింలంటే నవాబులు కాదు: మంత్రి ఈటెల ముస్లింలంటే నవాబులు మాత్రమే కాదని, ఇరానీ హోటళ్లలో టేబుళ్లు తుడిచేవారు, పంక్చర్ దుకాణాల్లో పనిచేసేవారు, పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయేవారు కూడా ముస్లింలలో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అట్టడుగున ఉన్న ముస్లింలను ఉన్నత స్థాయికి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంత మెజార్టీ వస్తే అంత బలం: మంత్రి హరీష్ మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తే ప్రభుత్వానికి, పేద ప్రజల సంక్షేమ పథకాలకు అంత బలం చేకూరుతుందని మంత్రి హరీష్రావు అన్నారు. మైనార్టీలంతా టీఆర్ఎస్కు మద్దతు తెలిపి కేసీఆర్ను మరింత శక్తివంతున్ని చేయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోరీలో పడ్డట్టే, బీజేపీకి ఓటేస్తే చంద్రబాబుకు మద్దతు పలికినట్లేనన్నారు. దేశంలో కేసీఆర్ పాలన మోడల్గా మారుతుందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకున్నాయని ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, మైనార్టీ నేతలు ఖాదర్, మిస్కిన్, గౌస్మొహినొద్దీన్, అసీఫ్, వాజీద్, సర్వర్, షమీ, అలీం, ఆరీఫ్, సుల్తాన్, అబ్దుల్ రజాక్, తంజుముల్ ముసాజిత్ సంఘ్ సార థి ఎజాజ్ హఫీజ్, కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు ముజాఫరొద్దీన్, అఫ్జల్, అక్బర్, టీఆర్ఎస్ మహిళ నాయకురాలు షకీరా మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు నరేంద్రనాథ్, రాజనర్సు పాల్గొన్నారు.