lottery
-
రూ.7 కోట్ల లాటరీ.. తీరా గెలిచాక తూచ్!
కోట్ల రూపాయలు లాటరీ (lottery) గెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎగిరి గంతులేస్తాం. ఆ ఊహే గాల్లో తేలేలా చేస్తుంది కదూ.. మరి తీరా కోట్ల రూపాయలు చేతికి అందుతున్నాయన్న తరుణంలో తూచ్.. టికెట్ తిరిగి ఇచ్చేయండి అంటే.. పాపం ఇలాంటి పరిస్థితే చైనాలో (China) ఓ ఉద్యోగికి ఎదురైంది.2019 మార్చిలో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బోలో ఒక కంపెనీ వార్షిక సంవత్సరాంతపు పార్టీని నిర్వహించింది. వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్యోగులకు 500 లాటరీ టిక్కెట్లను పంపిణీ చేసింది. అందులో ఒక టిక్కెట్టుకు 6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.7.14 కోట్లు) అత్యధిక బహుమతి లభించింది. అయితే ఆ టికెట్ను కంపెనీ వెనక్కితీసేసుకుంది.అంతా కంపెనీల మాయ!ఇది పాత సంఘటనే అయినా స్ప్రింగ్ ఫెస్టివల్ సమీపిస్తున్న సమయంలో చైనీస్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చాలా కంపెనీలు ఇలాంటి ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. క్షీణిస్తున్న లాటరీ టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికే కొన్ని కంపెనీలు ఇలా ఈవెంట్లు నిర్వహించి లాటరీలపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు.ఉద్యోగి లాటరీ గెలిచారన్న వార్తలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అనేక మంది ఉద్యోగులు తమ ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగి గెలిచిన లాటరీ టికెట్ను వెనక్కితీసుకున్న కంపెనీ వైఖరి పండుగ వేడుకల సందర్భంగా కార్పొరేట్ విధానాలు, ఉద్యోగుల హక్కుల గురించి చర్చలకు దారితీసింది.ఏం జరిగిందంటే..ఉద్యోగుల్లో ఉత్సుకతను రేకెత్తించేందుకు సదరు కంపెనీ స్థానిక మార్కెట్లో 500 లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఉద్యోగులకు పంపిణీ చేసింది. అందులో ఒక టికెట్కు జాక్పాట్ తగిలింది. కానీ ఆ టికెట్ తిరిగి ఇచ్చేయాలని ఉద్యోగిని కోరింది. దీంతో ఈవెంట్లో ఉన్న వారంత షాక్కు గురయ్యారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. గెలుపొందిన లాటరీ టికెట్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ వివాదం అధికారుల వద్దకు వెళ్లింది.అవకతవకల ఆరోపణలుఈవెంట్కు జరిగిన రెండు రోజుల ముందు లాటరీ డ్రా జరిగిందని అంతర్గత వ్యక్తులు వెల్లడించడంతో మరింత వివాదం తలెత్తింది. వార్షిక పార్టీలో గెలిచిన టిక్కెట్లను పంపిణీ చేసే ముందు వాటిని తొలగించాలని కంపెనీ ఫైనాన్స్ బృందానికి సూచించిందని ఆరోపణలు వచ్చాయి. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్మ్యాన్
దుబాయ్లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగితే.. కోటీశ్వరురాలు అయింది
ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవల ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగిన మహిళ, లాటరీ టికెట్ కొని కోటీశ్వరురాలు అయిపోయింది.నార్త్ కరోలినాకు చెందిన ఒక మహిళ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడం కోసం ఆగింది. అక్కడే కనిపించిన లాటరీ టిక్కెట్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.సరిగ్గా ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు లాటరీ తగిలింది. దీంతో 2,50,000 డాలర్ల విజేతగా నిలిచింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ వారి జీవితాన్నే మార్చేసిందని ఆ మహిళ చాలా సంతోషపడింది.కొన్ని రోజులకు ముందు అమెరికాకు చెందిన ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు గెలుచుకున్నాడు. -
లంచ్ బాక్స్ మరిచిపోయి.. కోటీశ్వరుడయ్యాడు
ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..అమెరికాకు చెందిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లే హడావిడిలో లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఆ తరువాత అతని భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మరిచిపోయావు అన్న విషయం చెప్పింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు.ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు (3 మిలియన్ డాలర్లు) గెలుచుకున్నట్లు మిస్సౌరీ లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి.. లాటరీ తగిలిందంటే అస్సలు నమ్మలేదు. ఆ తరువాత టికెట్ నెంబర్ చూసుకుని నిర్దారించుకుని, తెగ సంతోషపడ్డాడు.ఇదీ చదవండి: మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!లాటరీ గెలిచిన తరువాత, ఆ విషయాన్ని తన భార్యకు చెప్పడానికి ఫోన్ చేసాడు. అయితే ఆమె కూడా మొదట్లో నమ్మలేదని.. ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషయాన్ని నమ్మడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. మొత్తానికి లంచ్ బాక్స్ మరిచిపోవడంతో అతడు ధనవంతుడయ్యాడు. -
మద్యం షాపుల లాటరీ.. చింతమనేని అనుచరుల ఓవరాక్షన్
ఏలూరు జిల్లా: ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చింతమనేని అనుచరులు.. పోలీసులను దాటుకుని లోపలికి దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు.పోలీసులు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను పోలీసులు నిలువరించడంతో.. చలసాని గార్డెన్లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల: మద్యం షాపుల కేటాయింపులో టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఆత్మకూరు పరిధిలో మెజార్టీలు షాపులు కూటమి నేతలకు వచ్చేలా చేసుకున్నారు. 13 మద్యం షాపులకు 11 దుకాణాలను స్కెచ్ వేసి.. కూటమి నేతలు రాబట్టుకున్నారు.నంద్యాల: వ్యాపారి ముత్తుకు టీడీపీ నేతలు బెదిరించారు. లాటరీలో ముత్తుకు జూపాడుబంగ్లా మద్యం షాపు దిక్కింది. దీంతో ఆ మద్యం షాపును తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ముత్తుపై బెదిరింపులకు పాల్పడ్డారు.ప్రకాశం: ఒంగోలులో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మద్యం టెండర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. పూర్తి మద్యనిషేధం విధించాలాని నినాదాలు చేశారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
రూ.కోట్లలో లాటరీ గెలుపొందిన భారతీయులు (ఫొటోలు)
-
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్ఛార్జీ, సెస్ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
జాక్పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
దుబాయ్: తెలుగు వ్యక్తికి బంపర్ లాటరీ
దుబాయ్ సిటీ: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కనికరించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో దుబాయ్ వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెల నెలా పొదుపు చేసి లాటరీ టికెట్ కొన్నాడు. ఇంకేముంది జాక్పాట్కొట్టాడు. లాటరీ టికెట్పై ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. పొదుపు పథకం చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో అతడు విజేతగా నిలిచారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ తాను సంపాదించిన సొమ్ములో నుంచి ప్రతి నెలా 100 దిర్హమ్(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్ బాండ్స్లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్మనీ రావడంపై నాగేంద్రమ్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని సంతోషపడ్డారు. -
గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..
లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.డైలీ స్టార్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్దని తెలిపాడు. దీంతో వారు జాన్ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్రామ్లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్లోని సీవీఎస్ స్టోర్కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్లో కూడా తన బిజినెస్ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
లాటరీ టిక్కెట్ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు!
పంజాబ్లోని ఫజిల్కాలో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి లాటరీని గెలుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు అతను రాకపోవడం విశేషం. ఈ లాటరీని పంజాబ్ స్టేట్ మంత్లీ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. ఈ లాటరీలో బహుమతి మొత్తం రూ.7 లక్షలు. ఈ లాటరీలో ఫాజిల్కాకు చెందిన ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. లాటరీ టిక్కెట్ల విక్రేత బాబీ బవేజా మాట్లాడుతూ తన వద్ద ఫాజిల్కాకు చెందిన వ్యక్తి లాటరీని కొనుగోలు చేశాడని, ఆ టికెట్ నంబర్ 688558 అని, దానికి మొదటి బహుమతిగా రూ.7 లక్షలు వచ్చిందని తెలిపారు. విజేతను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అతని చిరునామా తెలుసుకుని, అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, అతనికి రూ.7 లక్షల రివార్డు ఇస్తామని బాబీ బవేజా తెలిపారు. గతంలో తన దగ్గర లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో రూ. 5 కోట్లు, రూ. 2.5 కోట్లు, రూ. ఒక కోటి, రూ. 51 లక్షలు, రూ. 25 లక్షలు ఇలా భారీ మొత్తాలను గెలుచుకున్నవారున్నారని వివరించారు. అయితే లాటరీ విజేత బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు తమ దగ్గరకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాల్లో లాటరీకి అధికారిక గుర్తింపు ఉంది. వాటిలో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో లాటరీ డ్రాను ప్రభుత్వం నిర్వహిస్తుంది. -
లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!
చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: రెస్టారెంట్గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్ చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు. -
రూ.166 లాటరీ టికెట్.. వచ్చిన బహుమతి.. రూ.13,339 కోట్లు
ఒక్కసారిగా ఏదైనా కలిసి వచ్చిందంటే.. లాటరీ తగిలిందని అంటుంటాం. మరి ఒక లాటరీ తగిలి మొత్తం జీవితం అసలే మాత్రం ఊహించనంతగా మారిపోతే.. ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా.. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఓ వ్యక్తికి లాటరీ(రూ.166)లో ఏకంగా 13,339 కోట్ల రూపాయల (160 కోట్ల డాలర్ల) ‘మెగా మిలియన్’ లాటరీ తగిలింది. నిజానికి సెప్టెంబర్ 27నే విజేత ఎవరో తేలిపోయినా.. భద్రతా నిబంధనల మేరకు మూడు నెలల తర్వాత తాజాగా పేరును ప్రకటించారు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ‘మెగా మిలియన్’ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతి మొత్తం కావడం గమనార్హం. ఇక లాటరీ టికెట్ను అమ్మిన జాక్సన్విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్కు రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) అదనపు కమీషన్గా లభించాయి. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వెయిటర్కి కోట్లలో జాక్పాట్ తగిలింది! అదే ఆమె జీవితాన్ని..
కోట్లల్లో లాటరీ తగిలితే వాట్ ఏ జాక్పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..! ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్ టోండా డికర్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్. అంతేగాదు ఆ వాఫిల్ హౌస్లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. ఇప్పడు డికర్సన్ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్ ఇచ్చిన ఎడ్వర్ సెవార్డ్కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్ వాటా ఇవ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది. అయితే డికర్సన్కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్ కార్పోరేషన్ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్(ఐఆర్స్) ఎదుర్కొంటోంది. డికర్సన్ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్గా ఇచ్చినట్లు ఐఆర్ఎస్ చెబుతోంది. ఐతే డికర్సన్ అది గిఫ్ట్ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్.. టెన్షన్..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!. In 1999, waitress Tonda Dickerson was tipped a lottery ticket and won $10,000,000. Her colleagues then sued her for their share. Then she was sued by the man who tipped her the ticket. Later, she was kidnapped by her ex-husband and had to shoot him in the chest. Finally, she… pic.twitter.com/KpDR4lhN4I — Fascinating (@fasc1nate) December 11, 2023 (చదవండి: 24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!) -
అలా వెళ్లి.. ఇలా రూ. 2.5 కోట్లు గెల్చుకున్నాడు
చండీగఢ్: ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా అనే ఆశతో లాటరీ టికెట్ కొంటూ ఉంటారు చాలామంది. ఆ తరువాత దానిసంగతి మర్చిపోతూ ఉంటారు కూడా. కానీ ఇలా లాటరీ కొన్నాడో లేదో అలా జాక్పాట్ వరించింది ఒక పెద్దాయన్ను. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని హోషియార్పూర్లోని మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్ని ఆ అదృష్టం వరించింది. ఇంట్లోని వారి కోసం మెడిసిన్ కొనడానికి దుకాణానికి వెళ్లాడు. స్తూ వస్తూ ఒక లాటరీ టికెట్ కూడా కొని జేబులో వేసుకున్నాడు. బహుశా అంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వస్తుందని అస్సలు ఊహించ ఉండడు. ఇలా ఇంటికి వెళ్లాడో లేదో రూ. 2.5 కోట్ల లాటరీని మొదటి బహుమతిగా గెల్చుకున్నారంటూ సమాచారం అందిందింది. టికెట్ కొన్న దాదాపు నాలుగు గంటల తర్వాత తనకు రూ. 2.5 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేది కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పాడు బోసి నవ్వులతో శీతల్ సింగ్. వ్యవసాయ పనులు చేసుకునే సింగ్ ఇద్దరు పిల్లల. వారు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, తాను పదిహేనేళ్ల నుంచి లాటరీ టికెట్లు వ్యాపారంలో ఉన్నానని లాటరీ టికెట్ల దుకాణదారుడు చెప్పాడు. ఇప్పటివరకు తన దగ్గర టికెట్లు కొన్నవారిలో ముగ్గురు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని తెలిపాడు. -
రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..
తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి. ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. -
లాటరీ ఏజెంట్ జాక్పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్గా భావించిన అరుణ్ నంబర్ను కూడా బ్లాక్ చేస్తూ కాల్ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్కే జాక్పాక్ తగిలింది. -
Telangana: ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023–25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! -
దుబాయ్లో భారతీయుడి జాక్పాట్.. నెలకు రూ.5.59 లక్షలు..
అబుదాబి: యూపీకి చెందిన ఖాన్ దుబాయ్లో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. బహుమతిగా అతను మరో 25 ఏళ్లపాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) సొంతం చేసుకోనున్నాడు. దుబాయ్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్టుగా పనిచేసున్న మహమ్మద్ అడిల్ ఖాన్ టైఖేరోస్ సంస్థ నిర్వహించిన ఫాస్ట్ 5 ఎమిరేట్స్ డ్రాలో మొట్టమొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పాల్ చాడర్ మాట్లాడుతూ ఈ డ్రా మొదలుపెట్టిన ఎనిమిది వారాల్లోపే మొట్టమొదటి విజేతను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా ఎమిరేట్స్ డ్రాలో విజేతగా ఖాన్ పేరును ప్రకటిస్తూ బహుమతిగా ఆయనకు 25 సంవత్సరాల పాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. యూపీకి చెందిన ఖాన్ మాట్లాడుతూ.. ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెబితే వారు కూడా నమ్మలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమన్నారు. మా కుటుంబంలో నేనొక్కడినే పనిచేస్తుంటాను. మా అన్నయ్య కరోనా సమయంలో చనిపోయారు. అన్నయ్య కుటుంబాన్ని కూడా నేనే చూసుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రుల తోపాటు నాకొక ఐదేళ్ల పాప కూడా ఉందని, ఈ బహుమతి నాకు సరైన సమయంలోనే అందిందనుకుంటున్నానని అన్నాడు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ముందస్తుగా ‘మద్యం లాటరీలు’?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్లో జరగాల్సిన వైన్షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుగానే ఎందుకు?: వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అడిగితే ఇవ్వరా?: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఆదాయం కోసమేనా?: మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. -
11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ టికెట్కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారిలో ఒకామె మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్పాట్.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..
అతను నేషనల్ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్ లైఫ్లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్ గార్డ్నర్, అతని బిజినెస్ పార్ట్నర్ పాల్ మెడిసన్ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్ .. బ్రిటన్కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. ‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’ అయితే మార్క్ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్ గ్లాస్లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు. ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు మార్క్కు ఇప్పటికీ ఫుట్బాల్తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్లో లోకల్ క్లబ్ ఉంది. అలాగే మార్క్ గతంలో బార్బాడోస్లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్నర్ పాల్ ప్రస్తుతం స్కాట్ల్యాండ్లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్ తెలిపాడు. ఇది కూడా చదవండి: కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్పూర్ జిల్లాకు చెందిన రూపీందర్జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. ( -
లాటరీలో కేజీ బంగారం సొంతం
సాక్షి, బళ్లారి: నెల రోజులు క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంటను భారీ అదృష్టం వరించింది. షాపులో బంగారం కొన్నందుకు లాటరీ తీయగా, ఆ దంపతులకే కేజీ బంగారం కై వసమైంది. వివరాలు.. బళ్లారి తాలూకాలోని కప్పగల్ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుమార్తె రుచిత పెళ్లిని అల్లీపురానికి చెందిన నాగార్జునతో పెళ్లి జరిపించారు. ఈ సమయంలో బళ్లారిలోని ఒక నగల షాపులో తాళిబొట్టు కొనుగోలు చేశారు. అప్పటికే కర్ణాటక రాష్ట్ర జ్యువెలరీ ఫెడరేషన్ సంస్థ ఆఽధ్వర్యంలో ఏప్రిల్ 10 నుంచి రాష్ట్రంలో బంగారు షాపుల్లో రూ.5 వేలకు పైగా బంగారం కొనుగోలు చేసిన వారికి లాటరీ కూపన్లు పంపిణీ చేశారు. నాగరాజుకు కూడా షాపులో కూపన్ ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో 12 లక్షలకుపైగా కూపన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ తీయగా, నాగరాజుకు ఒక కేజీ బంగారం తగిలిందని ప్రకటించారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కనీసం రూ. 55 లక్షల విలువ చేస్తుంది. ఆదివారం నూతన దంపతులు నాగార్జున, రుచితలకు ఒక కేజీ బంగారాన్ని అందచేశారు. ఇందులో జ్యువెలరీ ఫెడరేషన్ ప్రముఖులు పాల్గొని జంటను అభినందించారు. -
4,082 ఇళ్లకు 23 వేలకు పైగా అప్లికేషన్లు
మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ముంబైలో వివిధ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అపార్ట్మెంట్లను అందిస్తోంది. ఇందు కోసం లాటరీ నిర్వహించి ఫ్లాట్లను కేటాయించనుంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 23 వేలకు పైగా దరఖాస్తులు ఎంహెచ్ఏడీఏ మొత్తం 4,083 ఫ్లాట్లకు మే 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వీటికి ఇప్పటివరకూ 23 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 4,083 ఫ్లాట్లలో ఒకటి లిటిగేషన్లో ఉండటంతో దాన్ని జాబితా నుంచి తొలగించింది. దీంతో మొత్తం ఫ్లాట్ల సంఖ్య 4,082కు తగ్గింది. లాటరీ జాబితా నుంచి తొలగించిన ఈ అపార్ట్మెంట్ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి సమూహం (MIG) అపార్ట్మెంట్. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. దీని విలువు రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్లు 200 నుంచి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ల ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్ల మధ్య ఉంటుంది . అమ్మకానికి ఉన్న 4,082 ఫ్లాట్లు ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS), దిగువ ఆదాయ వర్గం (LIG), మధ్య ఆదాయ సమూహం (MIG), అధిక ఆదాయ సమూహం (HIG) వంటి వివిధ వర్గాల కోసం ఉద్దేశించారు. కాగా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 26. లాటరీ ఫలితాలు జూలై 18న ప్రకటిస్తారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
ఆరేళ్ల క్రితం ఇల్లు లేదు... ఇప్పుడు మిలియనీర్
కాలిఫోర్నియా: ఆరేళ్ల క్రితం నిలువ నీడలేని అమెరికన్ మహిళ నక్కతోక తొక్కారు. అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టి రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు. లాటరీలో 50 లక్షల డాలర్లు గెలుచుకున్నానని తెలియగానే ఆమె మొదట నమ్మలేదు. అది నిజమేనని అర్థమయ్యాక ఆమె ఆనందానికి అంతేలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసియా ఫోర్సెథ్ను చాలా కాలంగా ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం ఇల్లు కూడా లేదు. కష్టపడి చదివి డిగ్రీ సంపాదించారు. చిన్న ఉద్యోగం వచ్చింది. కారులో ఆయిల్ కొట్టించినప్పుడు చిల్లర లేక అయిష్టంగానే లాటరీ టిక్కెట్ తీసుకున్నారు. దాంతోనే ఆమె ఇంట డాలర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది లూసియా పెళ్లి చేసుకోనున్నారు. జీవిత భాగస్వామితో పాటు ఈ లాటరీ టిక్కెట్ తన జీవితాన్నే మార్చేసిందని సంబరపడుతున్నారు. -
కర్నూలులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
-
రూ.328 కోట్ల లాటరీ బ్రో అంటే.. ‘ఏప్రిల్ ఫూల్’ అనుకున్నాడు.. తీరా చూస్తే షాక్!
క్లీవ్(అమెరికా): ఆదివారంతో వారాంతం ముగిశాక అందరూ సోమవారం కొత్త వారాన్ని మొదలుపెడతారు. కానీ అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ ఏకంగా కొత్త జీవితాన్నే మొదలుపెట్టారు. 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.328 కోట్ల) లాటరీ రూపంలో ఆయనను ధనలక్ష్మి వరించింది. చిరకాల మిత్రుడొచ్చి లాటరీ గెలుపు సంగతి చెబితే ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తున్నాడని భావించాడు ఎర్ల్ లాపే. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆ టికెట్ కొన్నాడు మరి. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ సిటీలో ఉండే 61 ఏళ్ల లాపే మెకానిక్గా చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయన కొన్న ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్కు జాక్పాట్ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్ను క్లెయిమ్ చేశాడు. విడతలవారీగా అయితే రూ.328 కోట్లను 29సంవత్సరాల కాలంలో ఇస్తారు. కానీ విడతలవారీగా కాకుండా ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనకు రూ.175 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. -
రూ. 3 కోట్ల లాటరీ.. భర్త ఇంటికి రావడంతో ఊహించని షాకిచ్చిన భార్య!
సుమారు రూ.3 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్న ఓ భార్య ఈ విషయాన్ని భర్త దగ్గర దాచిపెట్టి సర్ప్రైజ్ కాదు పెద్ద షాక్ ఇచ్చింది. అసలు విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యపై దావా వేశాడు. ఈ ఘటన థాయ్లాండ్లో చోటు చేసుకుంది. అసలు వీళ్ల కథేంటంటే.. వివరాల్లోకి వెళితే.. థాయ్ల్యాండ్లో నివసిస్తున్న నారిన్కి 20 ఏళ్ల క్రితం చవీనాన్ అనే మహిళతో వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వారికి పెద్ద మొత్తంలో అప్పులు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లు. కుటుంబ పోషణతో పాటు అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకుని.. ఈ క్రమంలో సంపాదన కోసం భార్యాభర్తలు 2014లో దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే కొన్ని రోజులు తర్వాత నరిన్ దక్షిణ కొరియాలో పని చేస్తూనే ఉండగా, అతని భార్య మాత్రం కుమార్తెలను చూసుసుకునేందుకు తిరిగి థాయ్లాండ్కు వచ్చేసింది. కుటుంబం కోసం ప్రతి నెల నరిన్ ప్రతి నెలా దాదాపు డబ్బులు పంపేవాడు. చవీవాన్ లక్కీగా లాటరీలో రూ.2.9 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ గుడ్న్యూస్ తన భర్తకి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత లాటరీని విషయాన్ని చవీనాన్ దాచిందని తన కుమార్తెల ద్వారా నరిన్ తెలుసుకున్నాడు. ఇది తెలుసుకునేందుకు ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి మార్చి 3న అతను థాయ్లాండ్కు వెళ్లాడు. అయితే తన భార్య ఫిబ్రవరి 25న తన ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు తెలిసి షాకయ్యాడు. దీనిపై నరీన్ స్పందిస్తూ.. ‘నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యా. ఏం చేయాలో తెలియడం లేదు. మా 20 ఏళ్ల వైవాహిక జీవితంలో తన భార్య ఇలా చేస్తుందని ఏరోజూ ఊహించలేదు. నా బ్యాంకు ఖాతాలో కూడా ప్రస్తుతం పెద్దగా నగదు లేదు. తను మోసం చేసింది. అందుకే న్యాయం కోసం ఆమెపై కోర్టులో దావా వేశా’ అని అతడు వాపోయాడు. పోలీసులు, ఇతర సంబంధిత శాఖలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. -
సినీ నటి ఇంట్లో పనివాడు.. కట్ చేస్తే ఆ అలవాటే కోటీశ్వరుడిని చేసింది!
అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. కొంతమంది ఒక్కోసారి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి. సరిగ్గా ఈ తరహాలోనే.. ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఒక్కసారిగా ధనవంతుడిగా మారడు. ఎలాగో తెలుసుకుందాం. బంపర్ లాటరీ.. దెబ్బకు దశ తిరిగింది వివరాల్లోకి వెళితే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో పని కోసం కేరళకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్ఈ 222282 టికెట్ కొన్నాడు. అయితే ఈసారి అతని లక్ మామూలుగా లేదు. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ 'సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ' విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్కి ఏకంగా రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్లకు మొదటి, రెండు బహుమతులు లభించాయి. బంపర్ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్ ఇందుకు చేయవలసిన ప్రాసెస్ పూర్తి చేసుకుని టికెట్ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలు, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభిస్తుంది. -
రూ.100 కోట్లు.. లగ్జరీ కార్లు, విల్లా నుంచి .. బిల్లులు కట్టలేని దీనస్థితికి!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. లక్లో లాటరీ.. అంతా పోయింది ఇది జాన్ మెక్గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి. యూకేలోని సౌత్ లానార్క్షైర్లోని బోత్వెల్లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు. -
భార్యను సంతోష పెట్టడానికి లాటరీ కొన్న వ్యక్తి.. కలిసొచ్చిన అదృష్టం
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే మన ఆనందానికి అవధులుంటాయా?. లాటరీ వ్యక్తి జీవితాన్నే మార్చేస్తే?. సాధారణ వ్యక్తిని ఒక్కసారిగా కోటీశ్వరులను చేస్తే.. ఈ ప్రపంచలంలో మనకంటే అదృష్ట వంతులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతుంటాం. తాజాగా ఇలాంటి ఊహించనే ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూ సౌత్ వేల్స్కు చెందిన జంట గత మూపై ఏళ్లుగా ఒకే నెంబర్పై లాటరీ టికెట్ కొంటూ వస్తోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైతుంది. అయితే ఇటీవల భార్యను సంతోషపెట్టేందుకు అతడు ఆమె పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. ఈ ఘటన మార్చి 13న చోటుచేసుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ జంట దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు. తనకు రెండు లాటరీ టికెట్లు ఎలా వచ్చాయో చెబుతూ సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ‘గత మూప్పై ఏళ్లుగా లాటరీ టెకెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్పై లాటరీ తీసుకోవడం మర్చిపోయారు. నేను చేసిన పనికి తను బాధగా ఫీల్ అయ్యింది. కోపంలో ఉన్న ఆమె ముఖం మీద చిరునవ్వు చూసేందుకు ఈ వారం తన పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్ పరీక్షించగా మొదటి టికెట్పై మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. అప్పడే నేను తనకు రెండో టికెట్ కూడా తసుకున్నానని చెప్పాలనుకున్నా. వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసింది. కాగా తన చాలా కాలంగా ఒకే నెంబర్ కాంబినేషన్ టికెట్ కొనుగోలు చేస్తోందని.. ఏదో ఒక రోజు గెలుస్తుందని ఊహించినట్లు చెప్పాడు. అయితే తన నమ్మకం నిజం కావడానికి చాలా కాలమే పట్టిందని.. ఇది ఖచ్చితంగా విలువైనదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోనున్నట్లు తెలిపారు. కూతురికి కొత్త ఇల్లు కొనిచ్చి.. తన పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక దేశమంతా చుట్టి రావాలన్న ఆలోచన కూడా ఉందని అన్నారు. -
జాక్పాట్ అంటే ఇదే! నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు!
న్యూఢిల్లీ: అదృష్టాన్ని నమ్మొద్దు, కష్టపడి పనిచేయాలని సాధారణంగా మనం అందరమూ నమ్ముతాం. కానీ ప్రపంచంలో ఎక్కువమందిని హార్డ్ వర్క్ కంటే అదృష్టమే ఎక్కువగా పలకరిస్తుంది. అలాంటి వారిలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కూడా ఒకరు. చరిత్రలో ఏన్నడూ లేని విధంగా రికార్డ్ లాటరీ గెల్చుకుని బిలియనీర్గా అవతరించాడు. ఏకంగా వేల కోట్ల రూపాయల జాక్పాట్ తగలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అమెరికా చరిత్రలోనే విలువైన పవర్బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల (రూ.16,407 కోట్లు) ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అఅమెరికాలో ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఒక బిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. కాగా తాజా లాటరీలో పన్ను, ఇతర తగ్గింపుల తరువాత, మొత్తం రూ .8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. ఈ జాక్పాట్తో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు నివాసముండే ఏరియాలో అతి ఖరీదైన 200 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. అలా అరియానా గ్రాండే, డకోటా జాన్సన్ జిమ్మీ కిమ్మెల్ వారికి పొరుగువాడిగా చేరిపోయాడు. ఈ విషయంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ తెలిపింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపు 4 వేల కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ భవనం ప్రత్యేకతలు 13,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఐదు లగ్జరీ బెడ్ రూములు, అధునాతన సదుపాయాలతో ఏడు బాత్రూమ్లు. ఇంకా ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, అవుట్డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేటర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. -
లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..!
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించి రూ.12.13 కోట్ల(10 మిలియన్ యువాన్లు) లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో అతను ఆనందపరవశంలో మునిగిపోయాడు. అయితే భార్య మాత్రం అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు లాటరీ డబ్బుతో పాటు, ఆస్తులను చెరి సమానంగా పంచాలని కోరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆమెకే మద్దతుగా నిలుస్తారు. వీరి కథేంటో ఇప్పుడు చూద్దాం.. రూ.12 కోట్ల లాటరీ గెలుచుకున్న ఈ వ్యక్తి పేరు జోవ్. ట్యాక్స్ కట్ చేసుకోగా అతనికి రూ.10.22 కోట్లు వచ్చాయి. అయితే ఇంత డబ్బు వచ్చిన విషయం భార్యకు తెలియకుండా దాచాడు. ఈ డుబ్బులో కొంత తన సోదరికి ఇచ్చాడు. అంతే కాదు రూ.85 లక్షలు డ్రా చేసి తన మాజీ ప్రేయసి కోసం మంచి ఫ్లాట్ను కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్కు ఈ విషయాలు తెలిశాయి. ఇన్ని కోట్ల డబ్బు గెలుచుకున్నా తనకు చెప్పలేదని ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతను కొంత డబ్బును సోదరికి ఇవ్వడంతో పాటు, ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడం ఆమెకు మరింత కోపం తెప్పించాయి. దీంతో తనకు ఇంత అన్యాయం చేసిన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని లిన్ కోర్టును ఆశ్రయించింది. లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని సమానంగా పంచాలని కోరింది. కోర్టు కీలక తీర్పు.. వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. లాటరీ టికెట్ను ఇద్దరి డబ్బుతోనే కొన్నప్పటికీ.. జోవ్ రూ.12 కోట్లు గెల్చుకున్న విషయాన్ని భార్య దగ్గర దాచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అతని సోదరి, ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా లాటరీలో గెల్చుకున్నదే అని గుర్తించింది. దీంతో రూ.12.13 కోట్లలో 60 శాతం డబ్బును(రూ.7.29కోట్లు) భార్యకు చెల్లించాలని ఆదేశించింది. మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచింది. ఇందుకు సంబంధించి చైనా మీడియాలో వచ్చిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భర్త తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాలో గతేడాది కూడా ఇలాంటి ఘటన జరిగింది. లాటరీలో ఏకంగా రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా దాచాడు. ఇంత డబ్బు ఉందని తెలిస్తే వారు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, కష్టపడరనే భయంతో అతను ఇలా చేశాడు. చదవండి: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు -
18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్కు యజమాని అయింది. ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది. జూలియెట్ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఫస్ట్టైం సరదాగా లాటరీ కొంటే, వందల కోట్ల జాక్పాట్ కొట్టేసిన అమ్మడు
న్యూఢిల్లీ: జాక్ పాట్ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు ఇంతపెద్ద లాటరీ గెలుచుకున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది 18 ఏళ్ల జూలియెట్ లామర్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 287 కోట్ల రూపాయలు (48 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా 35.8 అమెరికా మిలియన్ డాలర్లు) జాక్ఫాట్ కొట్టేసింది. వివరాల్లోకి వెళితే జూలియెట్ లామర్ సాల్ట్ స్టీలోని అల్గోమా విశ్వవిద్యాలయంలో విద్యార్థి. ఏదో సరదాగా అంటారియో ఒట్టో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్కు చెందిన లాటరీని కొనుగోలు చేసింది. అదీ 18వ పుట్టిన రోజు సందర్భంతా తాత కోరిక, తండ్రి సలహా మేరకు లోట్టో 6/49 లాటరీ కొనుగోలు చేసింది. కానీ జాక్పాట్ వస్తుందని ఊహించలేదు. అసలు ఫలితాలు ప్రకటించే సమయానికి జూలియట్ లామర్ ఆ టిక్కెట్ గురించి దాదాపు మర్చిపోయింది కూడా. తీరా వచ్చాక సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనైంది. (ఇదీ చదవండి: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) తన తొలి లాటరీ టిక్కెట్పై గోల్డ్ బాల్ జాక్పాట్ ..ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లామర్ పేర్కొంది. మనీ మేనేజర్, తండ్రి సహాయంతో గెలుపొందిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడతానని పేర్కొంది. ముఖ్యంగా డాక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి గెలిచిన మొత్తంలో కొంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందట. -
లేటు వయసులో జాక్పాట్.. రూ.5కోట్లు గెలుచుకున్న వృద్ధుడు
చండీగఢ్: అదృష్టం తలుపుతడితే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి అంటారు. పంజాబ్ డేరాబస్సికి చెందిన ఓ వృద్ధుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 88 ఏళ్ల వయసులో అతనికి జాక్పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి పూలమాలలు వేసి అభినందించారు. లాటరీ గెలుచుకున్న ఇతని పేరు మహంత్ ద్వారకా దాస్. డేరాబస్సిలోని త్రివేది క్యాంప్లో నివాసముంటున్నాడు. 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అయితే ఇతనికి ఓ అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒకరోజు అదృష్టం తన తలుపుతట్టి కుటుంబం తలరాత మారుతుందని ఆశించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత అదే నంబర్కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. లాటరీ గెలుచుకున్న వృద్ధుడు.. ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు రానుంది. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని మహంత్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన లాటరీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: హిమగర్భంలో భారీ ఉల్క -
లాటరీలో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
-
లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...థాయ్లాండ్కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్కన్రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది. ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే మణిత్, అంగన్రాత్లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు. (చదవండి: బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....) -
Hyderabad: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!
సాక్షి, హైదరాబాద్: సార్, మీరు చాలా అదృష్టవంతులు మీ ఫోన్ నంబర్ రూ. 25 లక్షల లాటరీ మనీ గెలుచుకుంది. వెంటనే మేం అడిగిన డాక్యుమెంట్స్ను అందించండి.. మీ రూ. 25 లక్షల చెక్కును సొంతం చేసుకోండి.. అంటూ నాలుగేళ్ల క్రితం ఓ అనామకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్కు స్పందించాడు చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు. డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు పంపగా.. రూ. 25 లక్షలు.. ఇపుడు కోట్లకు చేరుకుందని ఆశపెట్టి ఇప్పుడు అప్పులబారిన పడేలా చేశారు సైబర్ కేటుగాళ్లు. చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు వృత్తి రీత్యా ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో రూ. 25 లక్షల లాటరీ గెలిచాననే ఆనందంలో ఇదంతా ఫేక్ అనేది గ్రహించలేకపోయాడు. రూ. 25 లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేస్తే పోయేదేముందనుకుని సైబర్ కేటుగాళ్లు అడిగినప్పుడల్లా వేలకు వేలు పంపాడు. ఇతను పంపుతున్న కొద్దీ అక్కడ లాటరీ మనీ పెరుగుతుందని నమ్మించారు. రూ. 25 లక్షల నుంచి రూ. 14 కోట్లు గెలుచుకున్నావంటూ ఊహల్లో కోటీశ్వరుడిని చేసేశారు. ఆ రూ.14 కోట్ల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వారికి చెప్పిన అకౌంట్లకు పంపాడు. ఈ నాలుగేళల్లో తన సొంత డబ్బు, కుటుంబీకుల దగ్గర తీసుకున్నవి, స్నేహితుల దగ్గర అప్పుల చేసి మరీ వెచ్చించాడు. వారు లాటరీ డబ్బు పెంచుతూ ఇతని వద్ద డబ్బు కాజేస్తున్నారే తప్ప.. ఇతనికి వచ్చిన లాటరీ డబ్బు మాత్రం ఇవ్వట్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు ఇదంతా ఫేక్ అని గ్రహించి సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎ ప్రసాద్ తెలిపారు. లాభాలంటూ రూ. 16 లక్షలు లూటీ అంబర్పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. కోటీశ్వరుడివి అవుతావంటూ ఆశ పెట్టడంతో క్యాట్ డీడీ డాట్కామ్, క్యాట్ జీఎస్టీ డాట్కామ్లలో ఇప్పటి వరకు రూ. 16.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవడంతో బాధితుడు సిటీ సైబర్క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు ...కానీ భార్య, పిల్లలకు చెప్పకుండా..
ఒక వ్యక్తికి ఏకంగా రూ. 248 కోట్లు ఫ్రైజ్మనీ గెలుచుకున్నాడు. కానీ ఈ విషయం తన భార్యకు పిల్లలకు చెప్పలేదట. పైగా చెబితే వారుకి ఎక్కడ అహంకారం నెత్తికెక్కి సోమరులుగా మారతారని చెప్పలేదంటున్నాడు. వివరాల్లోకెళ్తే...చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ. 248 కోట్ల ఫ్రైజ్మనీ గెలుచుకున్నాడు. అతను అక్టోబర్ 24న ఫ్రైజ్మనీని కలెక్ట్ చేసుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. అతను ఈ డబ్బును తీసుకునేటప్పుడూ కూడా కార్టూన్ వేషంలో వచ్చి తీసుకున్నాడు. అత్యంత గోప్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత అధికారులు సదరు వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతానికి లీగా గుర్తించారు. తాను ఇంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లుతన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేదన్నాడు. ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే గాక పిల్లలు సరిగా చదువుకోవడం మానేస్తారని చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం సుమారు రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా దాదాపు రూ. 147 కోట్లు ఇంటికి తీసుకువెళ్లనున్నాడు. తాను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఈ సారి మ్రాతం ఈ నెంబర్కి భారీ మొత్తంలో లాటరీ తగిలిందని లీ ఆనందంగా చెప్పుకొచ్చాడు. (చదవండి: గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా) -
ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....
యూఎస్లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు. ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది. అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్లలోనూ, గ్యాస్స్టేషన్లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
అమ్మ మాట విని కోటీశ్వరురాలైన కూతురు
వాషింగ్టన్: అమ్మ చెప్పిన సలహాను పాటించి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో రూ.2 కోట్లు తగిలి ఆనందంలో తేలిపోయింది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. ఈ సంతోషంలో రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతోంది. లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల ఈ మహిళ పేరు గినా డిల్లార్డ్. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముంటోంది. తల్లితో కలిసి గ్రాసరీ షాప్కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని డిల్లార్డ్కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృష్టవశాత్తు ఆమే గెలిచింది. 2,54,926 డాలర్ల జాక్పాట్ కొట్టింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2కోట్లకు పైమాటే. తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది. చదవండి: శ్రీలంకకు జిన్పింగ్ ఆఫర్.. -
England: లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
-
అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
లండన్: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని లండన్లోని గ్లూసెస్టర్కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్లో జో(49), జెస్థ్వైట్(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో.. కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు. చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట! -
ఏమా అదృష్టం.. పెయింటర్ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
అదృష్టం అంటే ఇదే.. కోట్లలో లాటరీ!
లాటరీ తగిలితే.. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుంది. ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లాటరీ గెలిస్తే.. సంతోషానికి హద్దు ఉండదు. అచ్చం ఇటువంటి ఓ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో చోటు చేసుకుంది. మసాచుసెట్స్లోని అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన గెట్వెల్ కార్డులో వన్ మిలియన్(రూ.7.5 కోట్లు) డాలర్ల లాటరీ తగిలింది. మసాచుసెట్స్ రాష్ట్ర లాటరీ కమిషన్ తెలిపిన వివారాల ప్రకారం.. మెక్లీష్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టిక్కెట్లను తిసుకున్నాడు. అయితే సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేయగా.. వన్ మిలియన్ భారీ లాటరీ గెలుచుకున్నాడు. అన్ని టాక్స్లు పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 20 డాలర్లు (రూ.1500) పెట్టి కొన్న లాటరికీ 6,50,000 డాలర్లు (రూ. 4.8 కోట్లు) పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం
లండన్ : అదృష్టం మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం ద్వారా చేతికి దక్కిన దాన్ని అనుభవించే రాత కూడా ఉండాలి. ఆ రాత లేనప్పుడు మనం కోట్లు సంపాదించినా వృధానే.. విషాదం వెంటాడితే మనం సంపాదించినవేవీ దాన్ని అడ్డుకోలేవు. ఇంగ్లాండ్కు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడి జీవితమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 16 ఏళ్లకు కోట్లు గెలుచుకుని, సరిగ్గా ఏడేళ్లకు.. 23 ఏళ్ల వయసులో మృత్యువాతపడ్డాడు. వివరాలు.. ఇంగ్లాండ్, బ్యాలీమార్టిన్కు చెందిన కాలమ్ ఫిట్జ్ పాట్రిక్కు 2014లో నేషనల్ లాటరీ ‘‘లాటో’’లో 4 కోట్ల రూపాయలు తగిలింది. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఇంగ్లాండ్లోనే లాటో లాటరీ తగిలిన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. తండ్రి కోలిన్, తల్లి షైలా, ముగ్గురు చెల్లెల్లతో ఉంటున్న అతడు వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా తన కోర్కెల్ని తీర్చుకుంటూ వస్తున్నాడు. 2017లో ఓ కారు కొనుక్కున్నాడు. తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆట కోసం కొంత మొత్తం ఖర్చుచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితమే అల్స్టర్ యూనివర్శిటీనుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అంతా బాగా జరుగుతోంది అనుకున్న సమయంలో గత మంగళవారం ఫిట్జ్ పాట్రిక్ మరణించాడు. అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గత శుక్రవారం సేయింట్ కాలమ్స్ చర్చిలో అతడి అంత్యక్రియలు జరిగాయి. అతడి అకాల మరణంపై పలువురు సంతాపం తెలియజేశారు. ఫిట్జ్ పాట్రిక్ మృతిపై అతడి సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ నా బెస్ట్ ఫ్రెండ్,అన్నయ్య.. మేము నిన్నెంత ప్రేమిస్తున్నామో చెప్పలేదు.. నీకెప్పటికీ తెలియదు కూడా’’ అని పేర్కొంది. -
మహిళా వ్యాపారి నిజాయితీ.. రూ. 6 కోట్ల లాటరీని...
కొచ్చి : నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది కేరళకు చెందిన ఓ లాటరీ వ్యాపారి. రూ. 6 కోట్ల లాటరీ టికెట్ను విజేతకు అందించి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన 37 ఏళ్ల స్మిజ లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గత ఆదివారం ఆమె దగ్గర అమ్ముడుపోని 12 బంపర్ లాటరీ టికెట్లు ఉన్నాయి. తరుచూ టికెట్లు కొనేవాళ్లు కూడా ఎవరూ షాపు దగ్గరకు రాలేదు. దీంతో ఆమె చంద్రన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు ఆ టికెట్లు అన్నీ తానే కొన్నాడు. ఆ రోజు సాయంత్రమే లాటరీ గెలుచుకున్న టికెట్కు సంబంధించిన వివరాలు ప్రకటించబడ్డాయి. చంద్రన్ కొనుక్కున్న టికెట్లలో ఓ దానికి రూ. 6 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆమె వెంటనే చంద్రన్ ఇంటికి చేరుకుని టికెట్ను అతడికి అందించింది. దీంతో జనం ఆమెను ప్రశంసలతో ముంచెత్తటం మొదలుపెట్టారు. దీనిపై స్మిజ మాట్లాడుతూ.. ‘‘ చంద్రన్కు రూ. 6 కోట్ల టికెట్ను ఇచ్చిన తర్వాత అతడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా నిజాయితీని మెచ్చుకుంటూ అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఇలాంటి వన్నీ మామూలే. టికెట్ కొనటానికి డబ్బులకోసం కష్టపడే కస్టమర్ల ద్వారానే మా పూట గడుస్తోంది కాబట్టి మేము నిజాయితీగా ఉండక తప్పదు. నేను, నా భర్త కాక్కనాడ్లోని గవర్నమెంట్ ప్రెస్లో పనిచేసేవాళ్లం. 2011లో ఈ వ్యాపారం మొదలుపెట్టాము. మొత్తం 5 గురు ఉద్యోగులు ఉండేవారు. మా ఉద్యోగాలు పోయిన తర్వాత మేమిద్దరమే వ్యాపారం చూసుకుంటున్నాము’’ అని తెలిపింది. చదవండి.. చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. -
ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా!
కొంత మంది యువకుల మధ్య పలు రకాల పోటీలు పెట్టి విజేతతో వధువుకు వివాహం చేయడం పురాణాల్లోనూ, పురాతన కాలంలోనూ జరిగేదని విన్నాం. ఇలాంటి స్వయం వరమే.. కాకపోతే కొంచెం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించిన నలుగురు యువకుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వధువును కట్టబెట్టారు. ఈ సంఘటన ఇటీవల రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. అసలేమైందంటే.. అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు. ఆ నలుగురు కలసి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఎవర్నీ కాదనకుండా ఆ నలుగురినీ ప్రేమించింది. కొంతకాలం ఈ చతుర్ముఖ ప్రేమాయణం సాగిన తర్వాత.. ఆ నలుగురూ కలసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి పెట్టారు. రెండు రోజుల తర్వాత ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అమ్మాయి గ్రామానికి చేరింది. విషయం బయటపడ్డ తర్వాత ఆ లవర్లను బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యాడు. అయితే అతన్ని గ్రామస్తులు వారించారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. పెద్దలు ఆ అమ్మాయిని పిలిచి నలుగురిలో నీకెవరంటే ఇష్టం అని అడిగారు. ఆ అమ్మాయి.. తడుముకోకుండా నలుగురూ ఇష్టమే అని చెప్పింది. అమ్మాయి ఎటూ తేల్చకపోవడంతో.. తర్వాత అబ్బాయిలు నలుగురినీ పిలిచి.. మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీనిని నలుగురూ ఒప్పుకోలేదు. దీంతో పెద్దలు తల పట్టుకున్నారు. ఇలా మూడు రోజులు చర్చలతోనే గడిచిపోయాయి. ఇక నాలుగో రోజు ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని విశ్వసించారు. లవర్సు, పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పులై నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. చదవండి: మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి అతడి పరిచయంతో ఆమె జీవితం మారింది -
హెచ్1బీ లాటరీకి చెల్లుచీటి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి స్వస్తి పలికింది. హెచ్–1బీ వీసాల మంజూరు విషయంలో మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. నూతన ఎంపిక ప్రక్రియ 60 రోజుల్లో అమల్లోకి రానుంది. హెచ్–1బీ వీసాకు భారీ డిమాండ్ ఉంది. ఇది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసాతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలోనే నియమించుకోవచ్చు. అమెరికా ఐటీ కంపెనీలు ప్రతిఏటా భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను ఈ వీసా ద్వారానే రప్పించుకుంటున్నాయి. తదుపరి హెచ్–1బీ వీసా ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. అమెరికాలోకి వలసలను నిరోధించే దిశగా ఇది మరో ప్రయత్నమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో భారతదేశ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పునఃసమీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం నోటిఫికేషన్పై ఐటీ వర్గాలు స్పందించాల్సి ఉంది. -
25 టికెట్లు కొంటే 25 లాటరీలు గెలిచాడు
వర్జీనియా: ఒక్కసారి లాటరీ తగిలితే ఏమంటారు? అదృష్టం అంటే నీదే అని! మరి రెండు సార్లు లాటరీ గెలుస్తే? మహా అదృష్టమంటారు.. పోనీ మూడు, నాలుగోసారి కూడా గెలిస్తే.. అదృష్టానికి నిలువెత్తు రూపం, అదృష్ట దేవత నీ ఇంట్లో తిష్ట వేసిందంటూ పొగడ్తలు కురిపిస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం మాటల్లో చెప్పలేనంత లక్కీ పర్సన్. అవును, అతను ఏకంగా 25 లాటరీలు గెలుపొందాడు. లక్ లక్కలా అతుక్కున్న ఈ వ్యక్తి పేరు రేమండ్ హారింగ్టన్. ఈయన అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ రోజు సరదాగా బీచ్కు వెళ్లగా అక్కడి వేగ్నమ్ దుకాణంలో 25 డాలర్లు వెచ్చించి 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. (ఉద్యోగం ఊడింది, భారీ లాటరీ తగిలింది) తీరా ఏమాత్రం లెక్క తప్పకుండా అతను కొనుగోలు చేసిన 25 టికెట్లు అన్నీ కూడా లాటరీను గెలుచుకున్నాయి. ప్రతి టికెట్కు 5 వేల డాలర్లు బహుమానంగా వస్తాయి. ఈ లెక్కన అతను మొత్తంగా 1,25,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 93 లక్షల 81 వేల రూపాయలు) గెలుచుకున్నాడు. దీంతో తొలుత అవాక్కయిన అతను తర్వాత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ డబ్బును తన కొడుకుల విద్యకు ఖర్చు పెడతానని, తద్వారా వారికి మంచి భవిష్యత్తును అందించేందుకు ఉపయోగిస్తానంటున్నాడు. (వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ) -
ఉద్యోగం ఊడింది, భారీ లాటరీ తగిలింది
కాన్బెర్రా: ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకునే ఉంటుందనేందుకు ఓ తండ్రి కథ రుజువుగా నిలిచింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాదిమందిలో ఆస్ట్రేలియాలోని ఆర్మడేల్కు చెందిన యువ తండ్రి ఒకరు. కరోనాకు ముందు అతను సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఎప్పుడైతే వైరస్ ప్రభంజనం మొదలైందో అప్పుడు అతని ఏకైక ఆదాయ మార్గమైన ఉపాధి కూడా కోల్పోయాడు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇదిలా వుంటే ఓరోజు అతను తన మూడేళ్ల కూతురు కోసం దుకాణంలో వస్తువులు కొనడానికి వెళ్లాడు. అయితే ఆ షాపులోని లాటరీ టికెట్లు అతని దృష్టిని ఆకర్షించాయి. (కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!) ఎందుకైనా మంచిది అని ఓజ్ లాటో నుంచి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు లాటరీ విజేతను నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఈ విషయం ఆయనకు తెలియదు. ఓ రోజు అతనికి లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తి మాటల మధ్యలో లాటరీ టికెట్ విజేత డబ్బు తీసుకునేందుకు ఇంతవరకూ ముందుకు రాలేదని చెప్పాడు. దీంతో అతను తన టికెట్ నంబర్ను చెక్ చేసి చూడగా ఆ విజేత తనేనని తెలిసింది. అక్షరాలా 31 కోట్ల రూపాయలు అతని సొంతమవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. "వెంటనే ఇంటికి వెళ్లి నా బంగారు బిడ్డను గట్టిగా హత్తుకుంటా" అని సంతోషంగా చెప్పుకొచ్చాడు. అలాగే తన సోదరుడు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఇప్పుడు తానే ఓ ఇల్లు కొనిస్తానంటున్నాడు. (లైవ్లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్) -
నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!
మిచిగాన్: లాటరీ గెలుచుకోవాలన్నది ఎంతోమంది కల. జీవితంలో ఒక్కసారైనా దాన్ని గెలుచుకుంటే చాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఒక్కసారేంటి, రెండుసార్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది. దీంతో అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు(30 కోట్ల రూపాయలు) అతడి సొంతమైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం ధృవీకరించారు. కాగా అతడు లాటరీ గెలుపొందండం ఇది రెండోసారి కావడం విశేషం. ఇక క్లార్క్ ముందు లాటరీ నిర్వాహకులు రెండు ఆప్షన్లు ప్రవేశపెట్టారు. (చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది) దీర్ఘ కాలంలో 4 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? లేదా తక్షణమే 2.5 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి అతడు డబ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడలేనంటూ 2.5 మిలియన్ డాలర్లు (18,95,18,750 కోట్ల రూపాయలు) అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. "నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. కానీ నేను మళ్లీ లాటరీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కారణమని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇప్పుడు దశ తిరిగిపోయినట్లు అనిపిస్తోంది" అని పేర్కొన్నాడు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
రూ.46 లక్షల లాటరీ వచ్చిందని..
సాక్షి, నిజమామాద్ : సైబర్ నేరస్తులు రూటు మార్చారు. గతంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టించి నగదు కాజేసిన నేరగాళ్లు.. తాజాగా గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. లాటరీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో జరిగిన సంఘటననే దీనికి నిదర్శనం. ఆర్మూరు మండలం చేవూరుకు చెందిన అశోక్కి ఇటీవల ఓ అజ్ఞాతవాసి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు మీద రూ.46లక్షల లాటరీ వచ్చిందని, రూ,16లక్షలు తమ అకౌంట్లో జమచేస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని నమ్మించారు. లాటరీ డబ్బులు వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన అశోక్, ముత్తమ్మ దంపతులు.. పుస్తెల తాడుతో సహా ఇంటిని అమ్మేసి రూ.16లక్షలు సైబర్ నేరస్తుల అకౌంట్లో జమచేశారు. కొద్ది రోజుల తర్వాత అది ఫేక్ లాటరీ అని తెలిసింది. దీంతో అశోక్ దంపతులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు రికవరీ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు. -
లైవ్లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్
-
లైవ్లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్
అందరికీ వార్తలను చేరవేసే ఓ జర్నలిస్టు అత్యుత్సాహంతో తప్పులో కాలేసింది. కానీ దానివల్ల ఆమెకు మాత్రమే నష్టం జరిగింది. లాటరీ గెలుచుకున్నానంటూ లైవ్లోనే నానా హడావుడి చేసి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతింది. ఇంతకీ ఏం జరిగిందంటే... క్రిస్మస్ పండగ సందర్భంగా లాటరీ నిర్వాహకులు లక్కీడ్రా తీస్తున్నారు. ఈ కార్యక్రమాన్నంతటినీ స్పానిష్ టీవీ రిపోర్టర్ నటాలియా ఈక్యుడెరో లైవ్లో వివరిస్తూ వచ్చింది. అయితే లాటరీ గెల్చుకున్నవారిలో ఆమె పేరు కూడా ఉండటంతో ఎగిరి గంతేసింది. తాను రేపటి నుంచి ఉద్యోగానికి రావడం లేదోచ్ అంటూ లైవ్లోనే రచ్చరచ్చ చేసింది. ఈ జాక్పాట్లో సుమారు నాలుగు మిలియన్ల డబ్బు అందుతుందనుకుని గాల్లో మేడలు కట్టేసింది. కానీ, తర్వాత అసలు విషయం తెలిశాక ఆమె ఆనందమంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. కేవలం రూ.3 లక్షలు మాత్రమే గెల్చుకుందని తెలియడంతో ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రిపోర్టర్ ట్విటర్లో క్షమాపణలు తెలిపింది. ‘అతిగా ఆశ పడితే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
లాటరీపై 28 శాతం పన్ను
న్యూఢిల్లీ: లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన 38వ కౌన్సిల్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్లు వచ్చేందుకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ మీద పన్ను మినహాయించామని చెప్పారు. గతంలో జరిగిన 37 కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్స్టీ రేట్లపై అందరూ కలసి ఒకే నిర్ణయం తీసుకోగా, ఈ భేటీలో మొదటిసారి ఓటింగ్ ప్రక్రియను అమలు చేశారు. -
వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ
దిమాపూర్: పశ్చిమ బెంగాల్కు చెందిన గౌర్ దాస్ రిక్షావాలా.. పొరుగున ఉన్న నాగాల్యాండ్లోని దిమాపూర్ నగరంలో రిక్షా నడుపుకుంటూ.. బతుకు వెళ్లదీసే గౌర్ దాస్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. నాగాల్యాండ్ ప్రభుత్వ లాటరీలో అతను తాజాగా రూ. 50 లక్షలు గెలుపొందాడు. దీంతో రిక్షావాలా కాస్తా ఓవర్నైట్ రిచ్వాలా అయిపోయాడు. ఆ రోజు వర్షమే రాకపోతే.. సెప్టెంబర్ 29వ తేదీన గౌర్ దాస్ తన తోటి రిక్షా యూనియన్ స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ రోజు తెడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పిక్నిక్ వెళ్లాలన్న ఆలోచన మానుకున్నాడు. ఈ తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి ఎదురుపడి.. నాగాలాండ్ ప్రభుత్వ లాటరీ టికెట్లు కొనుమంటూ బతిమాలాడు. గౌర్ దాస్ వద్దు జేబులో 70 రూపాయలు మాత్రమే ఉన్నాయి. లాటరీ టికెట్టు ధర రూ. 30. లాటరీ కొనాలని లేకపోయినా.. అమ్మే వ్యక్తి పదేపదే బతిమాలి.. బలవంతం చేయడంతో దానిని కొన్నాడు. ఆ రోజు వర్షం పడకపోయి ఉంటే.. తాము పిక్నిక్కు వెళ్లేవాళ్లమని, లాటరీ టికెట్ను తాను కొని ఉండేవాడిని కాదని గౌర్ దాస్ ‘న్యూస్-18’కు తెలిపాడు. గత ఆదివారం లాటరీ ఫలితాలు వచ్చాయి. తనకు అంతగా నమ్మకం లేకపోయినా ఓ దుకాణం వద్దకు వెళ్లి ఫలితాలను చెక్ చేసిన గౌర్ దాస్ షాక్ తిన్నాడు. లాటరీ విజేతల్లో తన టికెట్ నంబర్ ఉంది. తనకు రూ. 50 లక్షలు వచ్చాయి. ఆనందంతో ఎగిరి గంతేసిన గౌర్ దాస్ తన భార్యకు మాత్రేమే ఈ విషయాన్ని చెప్పాడు. కానీ, సెక్యూరిటీ భయంతో ఇరుగు-పొరుగు వారికి చెప్పలేదు. మరునాడు బ్యాంకుకు వెళ్లి లాటరీ టికెట్ను డిపాజిట్ చేశాడు. ఈ లోపు ఈ వార్త మీడియాలో రావడంతో లాటరీ విజేతగా గౌర్ దాస్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. -
రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు!
తిరువనంతపురం: కేరళకు చెందిన ఆరుగురు సేల్స్మెన్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. కొల్లాం జిల్లాలోని ఓ నగల దుకాణంలో రాజీవన్, రామ్జిమ్, రోనీ, వివేక్, సుబిన్ థామస్, రతీష్లు కేరళ లాటరీ విభాగం విడుదలచేసిన టికెట్ కొన్నారు. తాజా లాటరీ ఫలితాల్లో వీరుకొన్న టికెట్కు మొదటి బహుమతి కింద ఏకంగా రూ.12 కోట్లు వచ్చాయి. ఇందులో పన్నులు, ఇతర కత్తింపులు పోనూ ఆరుగురు విజేతలకు రూ.7.56 కోట్లు దక్కనున్నాయి. ‘మేమంతా తలో కొంత డబ్బు వేసుకుని గతంలో లాటరీ టిక్కెట్లు కొన్నాం. ఈసారి కూడా అలాగే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశామ’ని వివేక్ తెలిపారు. ‘లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెల్చుకోవడాన్ని మొదట నమ్మలేకపోయాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నామ’ని సుబిన్ థామస్ అన్నారు. తలో 50 రూపాయలు వేసుకుని 300 రూపాయల లాటరీ టిక్కెట్ కొన్నట్టు చెప్పారు. తమ దగ్గరున్న టిక్కెట్కే బంఫర్ డ్రా తగిలిందని తెలిపారు. రెండో ప్రైజ్ రూ. 5 కోట్లు(50 లక్షల చొప్పున 10 మందికి), మూడో ప్రైజ్ 2 కోట్లు (10 లక్షల చొప్పున 20మందికి), నాలుగో ప్రైజ్ రూ. కోటి రూపాయలు అని వెల్లడించారు. తిరువోనం బంఫర్గా పిలిచే ఈ లాటరీ కేరళలో చాలా పాపులర్. గురువారం లాటరీ తీసే సమయానికి 46 లక్షల టిక్కట్లగానూ దాదాపు 43 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ విజేతలను ప్రకటించారు. ఆరుగురు సేల్స్మెన్లు కొన్న టిమ్-160869 టిక్కెట్కు బంఫర్ లాటరీ తగిలింది. టిక్కెట్ అమ్మకాలపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఓనమ్, దసరా, కిస్మస్ పండుగల సందర్భంగా కేరళలో భారీగా లాటరీలు నిర్వహిస్తుంటారు. -
భర్తకు చెప్పకుండా లాటరీ.. కానీ..!
తిరువనంతపురం: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! యూఏఈలో నివాసముండే కేరళకు చెందిన సోప్నా నాయర్కు ఊహించని విధంగా జాక్పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను భారీ లాటరీ వరించింది. వివరాలు.. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వారు బిగ్ టిక్కెట్ లాటరీ నిర్వహిస్తున్నారు. సోప్నా గతంతో మూడునాలుగు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి బహుమతి లభించలేదు. ఇటీవల మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంది. తన భర్తకు తెలియకుండా ఐదోసారి టికెట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డ్రా.. బుధవారం జరిగింది. డ్రాలో సోప్నాకు 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక లాటరీ గెలుచుకోవడం పట్ల సోప్నా, ఆమె కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న సొమ్ములో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగతాది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానన్నారు సోప్నా. -
10 వేల కోట్ల లాటరీ విజేత ఏమయ్యాడు?
సింప్సన్విల్లే: అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సింప్సన్విల్లే అనే పట్టణంలో ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10,000 కోట్లు) లాటరీ గెలిచిన వ్యక్తి ఆ సొమ్మును ఇప్పటివరకు తీసుకోకపోవడం, అతను/ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీకపోవడం మిస్టరీగా మారింది. అమెరికా చరిత్రలోనే లాటరీలో గెలిచిన రెండో అతిపెద్ద మొత్తం ఇదే. సింప్సన్విల్లేలోని కేసీ మార్ట్లో గతేడాది అక్టోబర్ 20 నుంచి 23 మధ్య ఎవరో ఒకరు ఈ లాటరీ కొన్నట్లు తెలుస్తోంది. అయితే గెలిచిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదో, ఆ డబ్బును ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై స్థానికులు ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటున్నారు. కొందరేమో అంత డబ్బు గెలిచిన వ్యక్తి ఆ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె ఆగి చనిపోయి ఉంటారని అంటున్నారు. మరికొందరు ఆ లాటరీ టికెట్ ఎక్కడో గాలికి కొట్టుకుపోయి ఉంటుందనీ, అందుకే ఆ వ్యక్తి ఇప్పటివరకు డబ్బు తీసుకునేందుకు రాలేదని అంటున్నారు. ఇంకొందరేమో అతను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటాడనీ, లాటరీ సొమ్ము ఇచ్చే ముందు అతని నేపథ్యాన్ని పరిశీలిస్తే ఏమైనా నేరాలు బయటపడే అవకాశం ఉండటంతో ఇలా చేస్తుండొచ్చని అంటున్నారు. మరికొందరు అంత డబ్బు తీసుకునే ముందు ఇంకొన్ని రోజులు సాధారణ జీవితం గడపాలని అనుకుంటూ ఉండొచ్చని చెబుతున్నారు. ఏదేమైనా లాటరీ గెలిచిన వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 19లోపు ఆ డబ్బును తీసుకోకపోతే అది ఇంకెప్పటికీ ఆ వ్యక్తికి దక్కదు. ఆ లాటరీ టికెట్ను రద్దు చేస్తారు. -
జీఎస్టీ కౌన్సిల్ వాయిదా : గడుపు పెంపు
రియల్ ఎస్టేట్ రంగంలో విధించాల్సిన జీఎస్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్ మావేశం ముగిసింది.తదుపరి సమావేశాన్ని ఫిబ్రవరి 24 ఆదివారానికి వాయిదా వేసింది. అలాగే జీఎస్టీ 3బి ఫాంల సమర్పణకు గడువును పొడిగించింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రియల్టీ, లాటరీరంగాలపై విధించే జీఎస్టీ పై ఇంకా చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదావేశామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరి 24 ఆదివారం ఢిల్లీలో జరిగే కౌన్సిల్ దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో జనవరి మాసానికి సంబంధించిన అమ్మకాల రిజిస్ట్రేషన్ల (జీసీటీఆర్ 3బి) ఫైలింగ్కు గడువును అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 22 శుక్రవారం వరకు పొడిగించినట్టు తెలిపారు. జమ్ము కశ్మీర్ వాసులకు పిబ్రవరి 28 వరకు సమయాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కాగా నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నేతృత్వంలోని మంత్రుల బృందం అభిప్రాయపడింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయంతో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
వామ్మో.. పదకొండు వేల కోట్ల లాటరీ ఒక్కరికే!!
వాషింగ్టన్: లాటరీలో అదృష్టం వరించిన వారి గురించి వార్తలు నిత్యం చూస్తుంటాం. కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ లాటరీ అమెరికాలో ఎవరినో వరించింది. విచిత్రం ఏమిటంటే ఈ లాటరీ ఎవరికి తగిలిందో ఇప్పటివరకు తెలియదు. ఎప్పటికీ తెలియకపోవచ్చు. దక్షిణ కరోలినాకు చెందిన వారికి 1.6 బిలియన్ డాలర్ల (సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు) జాక్పాట్ తగిలిందని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన మెగా బాల్ డ్రాలో దక్షిణ కరోలినాలో కొనుగోలు చేసిన టికెట్కు లాటరీ దక్కిందని మెగా మిలియన్ నిర్వాహకులు తెలిపారు. టికెట్లోని ఆరు నంబర్లు.. డ్రా తీసిన అంకెలతో సరిగ్గా సరిపోయాయని ప్రకటించారు. అయితే లక్ష కోట్ల రూపాయలు గెల్చుకున్నదెవరో ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు! సింగిల్ టికెట్.. జాక్పాట్ ఒక్క లాటరీ టిక్కెట్కు 1.6 బిలియన్ డాలర్ల లాటరీ దక్కడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రాలో 5, 28, 62, 65, 70, 5 నంబర్లకు బిలియన్ మెగా మిలియన్స్ జాక్పాట్ తగిలింది. ప్రపంచంలో ఒక టిక్కెట్కు ఇంత మొత్తం ఏ లాటరీలోనూ లేదు. అయితే బుధవారం ఉదయం జాక్పాట్ మొత్తాన్ని 1.54 బిలియన్ డాలర్లుగా సవరించారు. దీంతో అమెరికా లాటరీలో రెండో అతిపెద్ద జాక్పాట్గా నిలిచింది. 2016లో ముగ్గురు 1.56 బిలియన్ డాలర్ల మొత్తాన్ని గెల్చుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన డ్రాలో ఒక్కరే 1.54 బిలియన్ డాలర్లు గెల్చుకోవడం విశేషం. లాటరీ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన ఆశావహులు ఎనిమిది రాష్ట్రాలకు జాక్పాట్ దక్షిణ కరోలినాతో పాటు డెలావర్, జార్జియా, కాన్సాస్, మేరీల్యాండ్, ఉత్తర డకోటా, ఒహియో, టెక్సాస్ రాష్ట్రాల్లోని వారికి కూడా లాటరీ తగిలింది. వాషింగ్టన్ డీసీ, వర్జిన్ ఐలాండ్తో పాటు 44 రాష్ట్రాల్లో ఈ లాటరీ నిర్వహిస్తున్నారు. ఒక్కో టిక్కెట్కు రెండు డాలర్లు వెచ్చించి ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే విజేతలు ఎవరనేది అత్యంత గోప్యంగా ఉంచుతారు. బిలియన్ మెగా మిలియన్స్ మొత్తాన్ని 29 ఏళ్లలో ఏడాదికి కొంత చొప్పున చెల్లించే అవకాశం కూడా ఉంది. అయితే ఎక్కువ మంది ఒకేసారి డబ్బు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. చెప్పలేనంత ఉద్వేగం.. ‘మేం ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. అమెరికా లాటరీ చరిత్రలో ఇది నిజంగా చారిత్రక సందర్భం. చెప్పలేనంత ఉద్వేగం ఉంది. ఒక్కరే బిలియన్ డాలర్ల లాటరీ సొంతం చేసుకోవడం చాలా సంతోషం. విజేతను కలుసుకునేందుకు సౌత్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ నిర్వాహకులు ఆత్రుతగా ఎదురు చేస్తున్నార’ని మెగా మిలియన్స్ గ్రూపు ప్రధాన డైరెక్టర్ గొర్డన్ మెడినికా పేర్కొన్నారు. మల్టీ-స్టేట్ లాటరీ అసోసియేషన్, ఇతర సంఘాల సమన్వయంతో మెగా మిలియన్స్ గ్రూపు ఈ భారీ లాటరీ నిర్వహిస్తోంది. -
అదృష్టం అంటే ఇదే మరి... ఐదు నెలల్లో రెండు సార్లు
కెనడా : అదృష్టం జీవితంలో ఒకసారే తలుపు తడుతుందన్నని అంటారు. కానీ మనోడిని మాత్రం రెండు సార్లు తలుపు తట్టింది. ఇంకేముంది రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. అది ఎలా అనుకుంటున్నారా.. మనోడికి అదృష్ట దేవత లాటరీ రూపంలో దర్శనమిచ్చింది. అది కూడా ఐదు నెలల్లో రెండు సార్లు. అఫ్రికా నుంచి కెనడా వలస వచ్చిన మెల్హిగ్ మెల్హిగ్ 28 ఏళ్ల వయసు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెల్హిగ్కు ఈ ఏడాది ఏప్రిల్లో 1.5మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అంతటితో సరిపెట్టుకోక గత నెలలో మళ్లీ లాటరీ టికెట్ కొన్నాడు. 13లక్షల మంది వేసిన ఈ లాటరీ(2మిలియన్ డాలర్లు) మళ్లీ మెల్హిన్కు దగిలింది. దీంతో మెల్హిగ్ దాదాపు 19 కోట్ల రూపాయలు(3.5మిలియన్ డాలర్లు) లాటరీ ద్వారా సంపాదించాడు. ఈ లాటరీ డబ్బుతో ఏం చెయ్యాలనుకుంటున్నావని లాటరీ అధికారులు అడగ్గా ‘ మొదటిసారి వచ్చిన లాటరీ డబ్బులతో నా భార్య, పిల్లల కోసం మంచి ఇంటిని కొన్నాను. ఈ సారి వచ్చిన డబ్బుతో నేను బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగ పడే ఏదైనా మంచి పని చేయ్యాలనుకుంటున్నాను. కార్లు వ్యాపారం లేక ఇంధన వ్యాపారం చేయ్యాలనుకుంటున్నాను’ అని మల్హిన్ పేర్కొన్నారు. 13లక్షల మందిని కాదని అదృష్ట దేవత మెల్హిన్ ఇంటి తలుపులు తెరిచింది. లక్కు అంటే మనోడిదే మరి. -
భారతీయుడికి జాక్పాట్!
దుబాయ్: దుబాయ్ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్లో నివసిస్తున్న సందీప్ మీనన్ రూ.6.8 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫిల్గా పిలుస్తున్న ఈ లాటరీలో గెలుపొందిన 132వ భారతీయుడిగా మీనన్ నిలిచారని ‘ఖలీల్ టైమ్స్’ వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫల్కు ధన్యవాదాలు’ అని మీనన్ అన్నారు. ఈ లాటరీలో మీనన్తో పాటు మరో భారతీయుడు సహ విజేతగా నిలిచారు. దుబాయ్కే చెందిన శాంతిబోస్ బీఎండబ్ల్యూ ఆర్9టీ కారును గెలుచుకున్నారు. ఈజిప్టుకు చెందిన హొస్సాం హుస్సేన్ సల్మాన్ బీఎండబ్ల్యూ 750ఐ లగ్జరీ సిల్వర్ మెటాలిక్ కారును సొంతం చేసుకున్నారు. -
గంటా ఇంట్లో లాటరీ.. ఏమిటీ కిరికిరి!
బహిరంగ ప్రదేశంలో.. సంబంధితులందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని.. నాలుగ్గోడల మధ్య అనుకూలమైన కొద్దిమంది సమక్షంలో మమ అనిపించేశారు..వేల సంఖ్యలో నిర్మిస్తున్న హుద్హుద్ బాధితులకు నిర్మిస్తున్న ఫ్లాట్ల కేటాయింపు ప్రహసనమిది.. అది కూడా ఒక మంత్రి ఇంట్లో జరగడం ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమిస్తోంది.నాలుగేళ్ల క్రితం కకావికలం చేసిన హుద్హుద్ తుపానులో నష్టపోయిన వారి కోసం గ్రామీణ ప్రాంతంలో 810, ఆర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో దాదాపు సగం మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలికే పోయాయి. నాలుగేళ్లపాటు ముక్కుతూ.. మూలుగుతూ ఎట్టకేలకు 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటిని కేటాయించేందుకే శుక్రవారం మంత్రి గంటా ఇంట్లో లాటరీ తీసి.. అక్కడికక్కడే కొందరికి పత్రాలు పంపిణీ చేసేశారు. మంత్రి అనుచరులకు, టీడీపీ కార్యకర్తలకు ఇళ్లు దక్కేలా చేసేందుకే ఈ మంత్రాంగం నెరిపారని మిగతా బాధితులు ఆరోపిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా హౌసింగ్ కాలనీలో ఫ్లాట్ల్ల కేటాయింపు లబ్ధిదారుల సమక్షంలో ఆ కాలనీలోనే చేపడతారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు అందరూ చూస్తుండగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా శుక్రవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని తన ఇంట్లో అతికొద్ది మంది లబ్ధిదారుల సమక్షంలో హుద్హుద్ ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనర్హులకు ఇళ్ల కేటాయింపులు.. అడ్డగోలు దోపిడీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా హౌసింగ్ అధికారుల స్టైలే వేరు. మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రాపకాన్ని పొందేందుకు వారు చూపిస్తున్న అత్యుత్సాహానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విరుచుకుపడిన హుద్హుద్ తుపాన్ దెబ్బకు వేలాది మంది నిలువ నీడలేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విశాఖ జిల్లాలోనే లక్ష మందికిపైగా నిర్వాసితులు కాగా.. హుద్హుద్ పునర్నిర్మాణం పేరిట ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి పదివేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఇంకా పూర్తి కాని దుస్థితి. ఇక విషయానికి వస్తే విశాఖ జిల్లాలో హుద్హుద్ బాధితుల కోసం గ్రామీణ ప్రాంతంలో 810, అర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా 2484 ఇళ్లు మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన ఒక్క భీమిలికే కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, భీమిలిలో 784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటి కోసం కాలనీ వద్దే మొత్తం లబ్ధిదారుల సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో మంత్రి గంటా ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీశారు. ఫ్లాట్లు దక్కించుకున్న పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఇంటికి పిలిచి వారికి ఫ్లాట్ల కేటాయింపు చేయడం వివాదాస్పదమవుతోంది. తమ అనుచరులకు అనువుగా ఉండే ఫ్లాట్లనే లాటరీలో పెట్టి కేటాయింపులు జరిపారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 216 మందికి గంటా ఇంట్లో లాటరీ ద్వారా కేటాయింపులు జరపడంపై మిగతా లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని గంటా ఇంట్లో తీయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పారదర్శకతకు తూట్లు పొడుస్తూ హౌసింగ్ అధికారులు మంత్రి ప్రాపకం కోసమే ఈ పని చేశారని, ఈ లాటరీని రద్దు చేసి గృహ సముదాయం వద్దే అందరి సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
మనోహరా.. లాటరీ నీదేరా..!
ఒక్కసారైనా లాటరీ గెలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎక్కడైనా లాటరీ వేస్తున్నారనగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓ కూపన్ తీసేసుకుంటారు. కొందరికి ఇదో సరదా.. కొందరికి ఇదో పిచ్చి.. మరికొందరికి ఇదో వ్యసనం.. ఏదైతేనేమి ఒక్కసారి లాటరీ తగిలితే దశ దిశ మారినట్లే. మరి అలాంటిది మూడు సార్లు లాటరీ తగిలితే.. దాన్నేమనాలి.. ఎక్కడో సుడి ఉందనుకోవాలి.. ఆయనే కేరళకు చెందిన ఆర్పీ మనోహరన్.. ఈయన కేరళ విద్యుత్ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పటివరకు వరుసగా మూడేళ్లుగా మూడు లాటరీలు గెలుచుకున్నాడు. తొలిసారిగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీని 2016 ఆగస్టులో గెలుచుకున్నాడు. అప్పుడు మనోహరన్ రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2017 నవంబర్లో నిర్మల్ లాటరీని గెలుచుకున్నాడు. అప్పుడు కూడా రూ.65 లక్షల నగదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోసారి లాటరీలో గెలిచి ముచ్చటగా మూడోసారి రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకుముందు కూడా చాలా చిన్న చిన్న మొత్తాల్లో లాటరీ గెలుచుకునేవాడినని, కానీ మూడేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. అసలు ఇదంతా నిజమో కలనో కూడా అర్థం కావట్లేదని చెబుతున్నాడు. -
కువైట్లో భారతీయుడికి జాక్పాట్
కువైట్ : అదృష్టం కలిసిరావడమంటే ఇదేనేమో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్న ఓ భారతీయుడికి భారీ జాక్పాట్ తగిలింది. కేరళకు చెందిన అనిల్ వర్గీస్ తెవెరిల్ గత 20 ఏళ్లుగా కువైట్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కొడుకు పుట్టిన రోజు 11/97 కావడంతో.. 11197 అనే నంబర్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గురువారం తీసిన డ్రాలో ఇదే నంబర్కు లాటరీ తగిలింది. ఇందులో విజేతగా నిలిచిన అనిల్.. 7 మిలియన్ల దిర్హామ్స్ (సుమారు రూ.12 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ డ్రాలో 8 మంది విజేతలుగా నిలువగా, అందులో ఆరుగురు భారతీయులే కావడం విశేషం. వీళ్లందరికీ తలో 1 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ.1.8కోట్లు) దక్కాయి. ‘బిగ్ టికెట్ ద్వారా రెండోసారీ నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. నేనే విజేతగా నిలుస్తానని అసలు ఊహించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన’ని వర్గీస్ సంభ్రమాశ్చర్యాలను వ్యక్తంచేశాడు. వర్గీస్ తనయుడు ప్రస్తుతం కేరళలో అండర్–గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. -
అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..!
కెనడా : ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. అయినా బతకడానికి ఏ పని చేయక్కర్లేదు. ఆమె కుటుంబం కూడా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా జీవితాంతం అలా బతికేయెచ్చు. ఆమె ఇంట్లో వాళ్లు ఏ పని చేయకపోయినా వారానికి వెయ్యి డాలర్లు అప్పనంగా వాళ్ల అకౌంట్లో పడతాయి. ఏంటి ఎందుకు అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన చార్లీ లగార్డే అనే యువతికి తన పుట్టిన రోజున లాటరీ తగిలింది. లాటరీయేగా ఏంటి గొప్ప అనుకుంటున్నారా..? అది మామూలు లాటరీ కాదు. అలాగని కోట్లు ఒకటే సారి వచ్చి పడవు. ఆమె బతికున్నంత కాలం వారానికి వెయ్యి డాలర్లు.. మన రూపాయల్లో అక్షరాల యాభై వేల రూపాయలు .. నెలకు మూడు లక్షల రూపాయలు చార్లీ అందుకోనుంది. కొద్ది రోజుల క్రితమే మొదటి వారానికి సంబంధించిన డబ్బును ఆమె అందుకుంది. ఈ సందర్భంగా చార్లీ మాట్లాడుతూ.. వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఇలాంటి లాటరీ మనకు కూడా తగిలితే బాగుండనిపిస్తుంది కదూ... -
ప్రేయసి పోయింది.. లాటరీ తగిలింది..
లండన్: అదృష్టవంతుడిని ఆపలేరు.. దురదృష్టవంతుడిని మార్చలేరు అని ఓ సామెత ఉంది. చాలా మందికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్న మొన్నటిదాకా అతనో సాధారణ మనిషి. ఉద్యోగం కూడా లేదు. ఈ మధ్యనే ఆయన్ను కూడా ప్రేయసి వద్దు పొమ్మంది. జీవితం ఇంతే అనుకున్న తరుణంలో హఠాత్తుగా భాగ్యలక్ష్మి వచ్చి పడింది. బంపర్ లాటరీ తగిలింది. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. యూకేకి చెందిన పాల్ లాంగ్ అనే ఓ నిరుద్యోగి కథ ఇది. పాల్ లాటరీలో 9.3 మిలియన్స్ పౌండ్స్(దాదాపు 851.62 లక్షలు) తగలడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరైపోయాడు. లాల్కి లాటరీ తగిలిన విషయం యూకే పత్రికల్లో ద్వారా దేశం అంతటా తెలిసింది. దీంతో లాల్ ఆనందానికి అవద్దుల్లేకుండా పోయింది. ‘కొద్ది రోజులుగా జీవితంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 24 గంటలతో నా జీవితమే మారిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రేయసి నాతో కలిసి ఉన్నప్పుడే నేను లాటరీ వేశాను. ఇప్పుడు ఆమె నాతో లేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. ఆమెను పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ది మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ చెప్పారు. పాల్ మాజీ ప్రేయసి జూలీ వెస్ట్(52) మాట్లాడుతూ.. పాల్కి లాటరీ తగలడం సంతోషంగా ఉంది. మేమిద్దరం కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన జీవితం బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో ఫోర్డ్ ప్లాంట్లోలో ఉద్యోగం చేసిన పాల్, ఆరోగ్యకారణాల వల్ల ఉద్యోగం మానేశారు. ‘లాటరీ డబ్బులను వృధాగా ఖర్ఛు చేయను. ఓ కారును కొంటాను. మిగతా డబ్బుతో కుటుంబానికి, స్నేహితులకి సహాయం చేస్తాను. పిల్లల ఆరోగ్య సమస్యలకై కొంత డబ్బు డిపాజిట్ చేస్తాను. నేను సాధారణ వ్యక్తిని. ఇప్పుడు కూడా సాధారణంగానే ఉంటాను. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తాను’ అని పాల్ పేర్కొన్నారు. -
బెంగళూరు వాసికి జాక్పాట్
దుబాయ్: లాటరీ ద్వారా దుబాయ్లో మరో భారతీయుడు కోటీశ్వరుడయ్యారు. తాజాగా బెంగళూరుకు చెందిన టామ్స్ అరాకల్ మణి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియం డ్రాలో భారత కరెన్సీలో సుమారు రూ.6.42 కోట్లు గెలుచుకున్నారు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి మణితో సహా ఇప్పటి వరకు 124 మంది భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. 38 ఏళ్ల మణి దుబాయ్లో ఓ అంతర్జాతీయ కంపెనీలో పనిచేస్తున్నారు. గత డిసెంబర్లో ఆయన కొన్న టికెట్ ఈ డ్రాలో గెలుపొందిందని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. తన జీవితంలో ఇదే అత్యంత మధుర క్షణమని, ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదని మణి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భారతీయుడికి 87 లక్షల జరిమానా దుబాయ్: యూఏఈ ప్రభుత్వ విభాగంపై ఆరోపణలు చేసిన ఓ భారతీయుడికి ఏకంగా రూ.87 లక్షల జరిమానా పడిందని అక్కడి మీడియా మంగళవారం వెల్లడించింది. సదరు వ్యక్తి యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో విసుగు చెందిన ఆయన వెంటనే రహదారులు, రవాణా విభాగానికి ఈ–మెయిల్ పంపిస్తూ ‘మీరు ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసి, వారు మళ్లీ డ్రైవింగ్ టెస్ట్కు డబ్బులు కట్టేలా చేయడం ద్వారా పేద కార్మికుల సొమ్మును దోచుకుంటు న్నారు’ అని పేర్కొన్నారు. దీంతో అధికారులు పోలీసులకు తెలపడంతో వారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ–మెయి ల్ను దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ విభాగాన్ని అవమానించడంలాంటి ఆరోప ణలపై కోర్టు విచారణ జరిపి జరిమానాతో పాటు మూణ్నెల్ల జైలు శిక్ష విధించింది. -
లాటరీ గుట్టు... గుహలో రట్టు
లాటరీలు అంటే మనకు అంతగా పరిచయం లేదుగానీ.. విదేశాల్లో వాటికి ఉండే క్రేజే వేరు. తమదైన రోజున అనేకమంది అనామకులు లాటరీ అదృష్టం తగిలి రాత్రికిరాత్రే వేలకోట్లకు అధిపతులయ్యారు. చైనాలోని వాంగ్ చెంగ్ జౌ అనే వ్యక్తికి ఇలాంటి లాటరీ పిచ్చే ఉంది. లాటరీ టికెట్లు కొనడం.. తన టికెట్ ప్రైజ్మనీ గెలుచుకుందో లేదో చూసుకుంటూ ఉండేవాడు. 2004లో బహుమతి గెలుచుకున్న ఓ లాటరీ టికెట్ను చూసిన వాంగ్ దీని వెనుక ఏదో పెద్ద గణిత సూత్రం ఉందని భావించి.. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలని అనుకున్నాడు. ఇక అంతే ఇళ్లు, కుటుంబసభ్యులను వదిలేసి కొంత డబ్బు తీసుకుని పాడుబడ్డ బ్రిడ్జి కింద ఉన్న గుహకు చేరాడు. లాటరీ గుట్టును ఛేదించే పనిలో పడ్డాడు. లాటరీ గుట్టును రట్టు చేసి రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయిపోవడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఓ చానల్ ఈ విషయాన్ని తెలుసుకుని కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని చూసిన వాంగ్ తల్లి అతన్ని ఇంటికి రావాలని కోరగా.. గుట్టు ఛేదించే వరకు ఇంటి గడప తొక్కనని శపథం చేశాడు. ఎట్టకేలకు 10 ఏళ్లు కష్టపడి లాటరీల వెనుకున్న రహస్యాన్ని గుర్తించాడు. అయితే ఆ రహస్యాన్ని తెలపాల్సిందిగా మీడియా కోరగా.. రహస్యాన్ని బయటపెట్టలేనిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే త్వరలో దీన్ని పుస్తక రూపంలో తెస్తానని అన్నాడు. ఒకసారి పుస్తకం విడుదలైతే తన వద్దకు వందల మిలియన్లు వచ్చి పడతాయని వాంగ్ తెగ సంబరపడిపోతున్నాడు. -
రూ. 17,924 కోట్ల క్రిస్మస్ లాటరీ
మాడ్రిడ్: ప్రపంచంలో అతిపెద్ద లాటరీగా గుర్తింపు పొందిన స్పెయిన్లోని ‘ఎల్ గోర్డో’ లక్కీ డ్రా విజేతలను శుక్రవారం ప్రకటించారు. 71198 నంబర్ టికెట్ను కొనుగోలుచేసిన వారిని అదృష్టం వరించడంతో వారికి సుమారు 30 కోట్ల చొప్పున విలువైన బహుమతులు దక్కనున్నాయి. ఇదే నంబర్ గల టికెట్ గరిష్టంగా 165 మంది దగ్గర ఉండొచ్చు. మిగతా విజేతలకు కూడా వారి టికెట్ సంఖ్య ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో బహుమతులు ఇస్తారు. దేశవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ లక్కీ డ్రాను ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. ఈసారి విజేతలకు మొత్తం సుమారు రూ.17924 కోట్ల బహుమతులు పంచనున్నారు. గతేడాది కన్నా ఇది 3 శాతం అధికం. ఎల్ గోర్డో ద్వారా లభించే మొత్తం ప్రైజ్మనీ ఇతర లాటరీల కన్నా ఎక్కువ. అందుకే 1812 నుంచి ఏటా డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా ప్రజలు ఈ డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.