అగ్రికల్చర్ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు | Nirbhaya Case Filed On Anantapur Agriculture JD Habib Basha | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు

Published Tue, Aug 4 2020 4:14 PM | Last Updated on Tue, Aug 4 2020 4:48 PM

Nirbhaya Case Filed On Anantapur Agriculture JD Habib Basha - Sakshi

సాక్షి, అనంతపురం :  జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్  బాషాపై నిర్భయ కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ మహిళ ఉద్యోగి సల్మా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాను, డిప్యూటేషన్‌ అడిగితే కోరిక తీర్చమన్నాడని బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం జేడీ హబీబ్‌ బాషా సెలవుల్లో ఉన్నారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement