ద్వారకా తీరంలో అన్వేషణ..! | ASI Resumes Underwater Explorations In Dwarka | Sakshi
Sakshi News home page

ద్వారకా తీరంలో అన్వేషణ..!

Published Thu, Feb 20 2025 11:01 AM | Last Updated on Thu, Feb 20 2025 11:01 AM

ASI Resumes Underwater Explorations In Dwarka

రెండు దశాబ్దాల తరువాత ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) గుజరాత్‌లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్‌ అలోక్‌ త్రిపాఠి నేతృత్వంలో అయిదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది.

తొలిసారిగా ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. ఏఎస్‌ఐ డైరెక్టర్‌(తవ్వకాలు, అన్వేషణలు) హెచ్‌కే నాయక్, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్ట్‌ అపరాజిత శర్మ, పూనమ్‌ వింద్, రాజ కుమారీ బార్బీనా పరిశోధన బృందంలో సభ్యులుగా ఉన్నారు. 

దశల వారీగా ఈ  బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలిదశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ‘ఇదొక అపూర్వమైన అవకాశం’ అంటుంది పూనమ్‌ వింద్‌. నిజమే కదా! 

(చదవండి: ఆ టీచర్‌ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement