dwaraka
-
ద్వారకా తీరంలో అన్వేషణ..!
రెండు దశాబ్దాల తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) గుజరాత్లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో అయిదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తోంది.తొలిసారిగా ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. ఏఎస్ఐ డైరెక్టర్(తవ్వకాలు, అన్వేషణలు) హెచ్కే నాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజ కుమారీ బార్బీనా పరిశోధన బృందంలో సభ్యులుగా ఉన్నారు. దశల వారీగా ఈ బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలిదశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ‘ఇదొక అపూర్వమైన అవకాశం’ అంటుంది పూనమ్ వింద్. నిజమే కదా! (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.అందులో భాగంగా జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. త్వరలో స్తంభాలకు బంగారు పూత అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్ కోటెడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
బ్రహ్మోత్సవాలకు వేళాయే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి శనివారం తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను జరుపుతామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 13 నుంచి 20 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.అక్టోబర్ 13న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. 14 న రాత్రి ధ్వజారోహణ, రాత్రి 9 హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేపడతారు. 16 న ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.17 న రాత్రి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. 18 న రాత్రి రథోత్సవాన్ని, 19న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ చేపడతారు. 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
పోలవరం మట్టిన పందికొక్కుల్లా తినేస్తున్నారు
-
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
-
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
సముద్రగర్భంలో ద్వారక దర్శనం
-
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్ప్రెస్వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్ప్రెస్వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్ప్రెస్వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్ప్రెస్వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్ప్రెస్వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
ద్వారకా ఎక్స్ప్రెస్వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్(కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే కారిడార్లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది. ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. CAG exposed the scam of 6741 crores in building of Dwarka Expressway. If TV media raise these issues & debate on this, BJP will fall like a pack of cards ♠️ pic.twitter.com/81ohaACopW — Baijuu Nambiar CFP®✋ (@baijunambiar) August 14, 2023 ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు -
స్టార్టప్స్కు ద్వారక కో-వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్.. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్లో ద్వారక ప్రైడ్ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డి వివరించారు. అనువైన విధానం..: ఆఫీస్ స్పేస్ పరిశ్రమలో ప్లగ్ అండ్ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్ స్పేస్ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు. -
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం
భోపాల్: ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి (99) ఆదివారం శివైక్యం పొందారు. మధ్యప్రదేశ్లోని నర్సింగపూర్లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచినట్టు ఆయన ముఖ్య అనుచరుడైన స్వామి సదానంద మహరాజ్ తెలిపారు. ద్వారక, శారద, జ్యోతిష్ పీఠాలకు శంకరాచార్యుడిగా ఉన్న స్వామి స్వరూపానంద ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లా డిఘోరిలో 1924లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడారు. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపారు. 1981లో ద్వారకపీఠాధిపతి అయ్యారు. స్వరూపనంద శివైక్యం చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! — Narendra Modi (@narendramodi) September 11, 2022 द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। सनातन संस्कृति व धर्म के प्रचार-प्रसार को समर्पित उनके कार्य सदैव याद किए जाएँगे। उनके अनुयायियों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करें। ॐ शांति pic.twitter.com/uPnv3JEull — Amit Shah (@AmitShah) September 11, 2022 -
గుజరాత్లో వరుణ విలయం
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్లోని ఉస్మాన్పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్నగర్లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలో కొంత ఊరట నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. థానె జిల్లా మిరాభయందర్ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. రాయ్గఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్తోపాటు తెలంగాణ, రాజసాŠత్న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
కౌరవుల జాబితా తయారు చేయండి: రాహుల్
ద్వారక: కాంగ్రెస్ పార్టీలోని కౌరవుల జాబితా తయారు చేయాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ గుజరాత్ పార్టీ శ్రేణులను కోరారు. ఏసీ కార్యాలయాల్లో కూర్చుని ఏపనీ చేయకుండా ఇతరులను ఇబ్బంది పెట్టే అటువంటి నాయకులు, చివరికి బీజేపీ పంచన చేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి కౌరవులను వదిలించుకోవాలని సూచించారు. ద్వారకలో మూడు రోజులపాటు జరిగే పార్టీ చింతన్ శిబిర్లో నేతలు, ఆఫీస్ బేరర్లనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. బీజేపీ రాజకీయాల కారణంగా గుజరాత్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. అధికారం అప్పగిస్తే ఏం చేయనుందనే విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర విభాగాలైన సీబీఐ, ఈడీలతోపాటు మీడియా, పోలీస్ వ్యవస్థలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని దుయ్యబట్టారు. చదవండి: (కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్) -
Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా
Kerala Vaccine RJ Aswathy Murali: కరోనాకు వ్యాక్సిన్ రాకముందు..వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మాస్కులు పెట్టుకోవాలి? బయటకెళ్లాలంటేనే భయమేస్తుంది..అంటూ వ్యాక్సిన్ కోసం ఒకటే ఎదురు చూపులు చూసిన వారు కూడా తీరా వ్యాక్సిన్ వచ్చాక.. కరోనా కంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ ప్రమాదమన్న అపోహతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. అస్వతి బామ్మ కూడా ‘‘ఇప్పటిదాకా నిక్షేపంగా ఉన్నాను నేను... వ్యాక్సిన్ వేసుకుంటే నా ఆరోగ్యం పాడవుతుంది.. వ్యాక్సిన్ వేసుకోను’’ అని మొండికేసింది. వ్యాక్సిన్ గురించి తెలిసిన అస్వతి.. ‘‘బామ్మా ..వ్యాక్సిన్ వేసుకుంటే ఏం కాదు, కరోనా వచ్చినా ప్రమాదం ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పడంతో వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇవే మాటలు తన కమ్యూనిటీలో ఎంతోమందికి చెప్పి, వ్యాక్సిన్పై అవగాహన కల్పించింది అస్వతి. దీంతో గ్రామంలో ఉన్న వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వతి ద్వారక నుంచి ప్రసారమయ్యే ‘మట్టోలి(90.4 ఎఫ్ఎమ్)’ కమ్యూనిటీ రేడియో సర్వీస్లో రేడీయో జాకీగా పనిచేస్తుంది. వైనాడ్లో ‘పనియార్’ జాతికి చెందిన గిరిజనుల జనాభా 18 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ‘పనియా’ భాషనే మాట్లాడుతారు. మట్టోలి మారుమూల గ్రామం, పనియా భాష ఒక్కటే తెలుసు. వీరికి వ్యాక్సిన్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వీరిలాగే అస్వతి బామ్మ ముందు మొరాయించినప్పటికీ తరువాత వ్యాక్సిన్ వేసుకున్నారు. బామ్మను ప్రేరణగా తీసుకున్న అస్వతి, తను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కావడంతో గ్రామస్థులందరికి వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలనుకుంది. దీనికోసం ఒకపక్క ఆర్జేగా పనిచేస్తూనే తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డాక్టర్ల టాక్షోలు శ్రద్దగా వినేది. కోవిడ్కు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించేది. కోవిడ్ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి పనియా భాషలో రేడియోలో వివరించేది. ఈ కమ్యూనిటీకి సమాచారం అందించే ఒకే మాధ్యమం రేడియో కావడంతో..కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రేడియో ద్వారా అందించేది. అంతేగాక రేడియోకు కాల్ చేసి ఎవరైనా సందేహాలు అడిగినా వాటిని నివృత్తి చేసి, వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. దీంతో గ్రామస్థులంతా వ్యాక్సిన్ వేసుకున్నారు. టీవీ కంటే రేడియో ద్వారా.. ‘‘మా కమ్యూనిటీలో ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. వీరిని విపత్కర పరిస్థితుల్లో నుంచి బయట పడేయడానికి.. నావంతు సాయం కమ్యునిటీకి చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి టీవీలో కంటే రేడియో ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునేదాన్ని. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా రేడియోలో ప్రసారమయ్యే డాక్టర్ కార్యక్రమాలు ఇంగ్లిష్లో వచ్చేవి. అవి మా కమ్యూనిటీ వాళ్లకు అర్థం కావు. అందువల్ల అవన్నీ వింటూ రాసుకుని తరువాత మా పనియా భాషలో వివరించేదాన్ని. గ్రామస్థులకు ఉన్న సందేహాలను తెలుసుకుని వాటికి సమాధానాలు చెప్పేదాన్ని. ఈ ప్రశ్నలనే రేడియోలో కూడా ప్రస్తావిస్తూ ఎక్కువమందికి చేరేలా చెప్పాను. నేను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందినదాన్ని కావడంతో అంతా నా మాటలపై నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో మట్టోలి గ్రామం పూర్తి వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని అస్వతి చెప్పింది. చదవండి: సోషల్ స్టార్.. ఇక్కడ కాకపోతే ఇంకోచోట! -
గుజరాత్లో భూకంపం
గాంధీనగర్: గుజరాత్ ద్వారకలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. గురవారం మధ్యాహ్నం 03.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ద్వారకకు వాయవ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు భూకంప అధ్యయన కేంద్రం(ఎన్సీఎస్) తెలిపింది. (చదవండి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం) అసోంలో కూడా గురువారం ఉదయం భూకంపం సంభవించింది. తేజ్పూర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయ్యింది. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
వారం క్రితం ప్రేమపెళ్లి.. నూతన జంటను వెంటాడి వేటాడి..
ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా నగరంలో పరువు హత్య కలకలం రేపింది. పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటపై ఏడుగురు దుండగులు వారి ఇంట్లోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో ఆ జంట తప్పించుకునే ప్రయత్నం చేయగా.. రోడ్డుపై వెంటాడి మరి తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో యువకుడు చనిపోగా.. అతని భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. డీసీపీ ఎస్కే. మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సోనాపేటకు చెందిన వినయ్ దహియా, కిరణ్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారం క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. దానికోసం పథకం వేసి కిరాయి అంతకులను మాట్లాడి వారు ఉంటున్న ప్రాంతం వివరాలు ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చిన వినయ్ తన భార్య కిరణ్తో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో వారు ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన అగంతకులు తుపాకీలతో కాల్పులు జరిపారు. వినయ్ శరీరంలోకి బులెట్లు దిగడంతో ప్రాణభయంతో అతను భార్యను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. కానీ అగంతకులు వారిని వెంటాడి మరీ కాల్పులు జరిపారు. దీంతో వినయ్ అక్కడికక్కడే మరణించగా.. కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా స్థానికులు వచ్చి వారిని దగ్గర్లోని వెంకటేశ్వర్ ఆసుపత్రిలో చేర్చారు. వినయ్ అప్పటికే మృతి చెందగా.. కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సాక్షి, విజయవాడ : విజయవాడలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లకుంట గ్రామానికి తరలించారు. పోస్టుమార్టం మొత్తాన్ని డాక్టర్లు వీడియోల ద్వారా రికార్డు చేసి భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రకాశ్తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. -
చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, కృష్ణ: విజయవాడలో దారుణ హత్యకు గురైన బాలిక మొవ్వ ద్వారక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాశ్తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. ( చదవండి: పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు) -
గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం
సాక్షి, విజయవాడ: ఇంటి ముందు ఆడుకుంటూ నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి ద్వారక మువ్వ ఉదంతం విషాదంగా ముగిసింది. పక్కింట్లోనే చిన్నారి మృతదేహం ఓ గోనె సంచిలో లభ్యమైంది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాష్ అనే వ్యక్తి ... ద్వారకపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా మువ్వ ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద్వారక తల్లి ఇంటి పక్కనే ఉన్న కళాశాలలో స్వీపర్గా పనిచేస్తోంది. పని ముగించుకుని ఆమె ఇంటికి వచ్చినా.. కూతురు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ద్వారక ఉంటున్న పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రకాష్...అత్యాచారానికి పాల్పడి అనంతరం హతమార్చి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటాన్ని గమనించిన ప్రకాష్ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రకాష్ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య? వర్షిత హంతకుడు ఇతడే! -
డబ్బులు చెల్లించమన్నందుకు దాడి
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : పొదుపు సంఘానికి చెందిన బకాయి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు డ్వాక్రా సంఘాల సీసీ ఇబ్రహీం, హెడ్డీసీసీ రామ్మోహన్లపై పొదుపు సంఘం లీడర్ వరలక్ష్మితో పాటు ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారని వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి (ఏపీఎం) అపర్ణ దేవి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు... మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో సాయిచందన గ్రూపు పొదుపు సంఘం లీడర్ డి. వరలక్ష్మి తన అవసరాల నిమిత్తం రూ.2.70 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును చెల్లించకపోవడంతో ఆ గ్రూపులోని సభ్యులందరూ బకాయి డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చిలంకూరు పొదుపు సంఘాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఇబ్రహీం, హ్యూమన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామ్మోహన్లు డబ్బులు చెల్లించాలని ఆమెను అడిగారు. ఆగ్రహించిన వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరు ఎర్రగుంట్లలోని వెలుగు కార్యాలయానికి వచ్చి విధి నిర్వహణలో ఉన్న సీసీ ఇబ్రహీం, హెచ్డీసీసీ రామ్మోహన్లపై కర్రలు, వాటర్పైపు, వైర్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోలీవుడ్కూ అర్జున్రెడ్డిగా..
సినిమా: టాలీవుడ్లో క్రేజీ కథానాయకుడిగా వెలుగొందుతున్న యువ నటుడు విజయ్దేవరకొండ. అక్కడ ఈయన సినీ జీవితంలో అర్జున్రెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంత సంచలన విజయాన్ని ఆ చిత్రం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం విక్రమ్ వారసుడు ధ్రువ్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్దేవరకొండ నటించిన గీతగోవిందం చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆయన నటించిన మరో చిత్రం ద్వారకా. ఇందులో విజయ్దేవరకొండకు జంటగా నటి పూజాజవేరి నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేఖవాణి పృథ్వీరాజ్ నటించారు. శ్రీనివాస రవీంద్ర కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయ్కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని జీఆర్.వెంకటేశ్ భాగ్య హోమ్స్ సంస్థ సమర్పణలో శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజి తమిళ ప్రేక్షకులకు అర్జున్రెడ్డి పేరుతో అందించనున్నారు. ఈయన ఇంతకు ముందు నంబర్ 1, బిజినెస్మెన్, హలో వంటి చిత్రాలను అనువదించారు. అర్జున్రెడ్డి చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రం తెలుగులో ద్వారకా పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగులో విజయ్దేవరకొండ నటించిన అర్జున్రెడ్డి చిత్రం సంచలన విజయాన్ని సాధించిందని తెలిపారు. అదేవిధంగా ఆయన నోటా చిత్రంతో నేరుగా కోలీవుడ్కు ప్రేక్షకులకు దగ్గర అయ్యారని, తాజాగా తమ అర్జున్రెడ్డి తమిళ ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంటూ కమర్శియల్ ఫార్ములాలో తెరకెక్కిన అర్జున్రెడ్డి చిత్రం తమిళ ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత బాలాజి తెలిపారు. -
డ్వాక్రా మహిళలకు షాక్
-
ముక్కలుగా చేసి, సెప్టిక్ ట్యాంకులో దాచి..
సాక్షి, న్యూఢిల్లీ: డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కిరాతకులు అతన్ని దారుణంగా హతమార్చి ముక్కలు చేశారు. పోలీసులకు పట్టుబడకుండా వాటిని మూటకట్టి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. ఈ దారుణ ఘటన ద్వారకలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్లో నివాసముండే సచిన్ యాదవ్(21) ఒక ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్లో పనిచేసే వరుణ్ (26), అతని బావమరిది రితురాజ్ అలియాస్ విక్కీ (24)తో కలిసి సచిన్ను మే 12ని అపహరించారు. వారి బారినుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ యాదవ్ దొరికిపోవడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా సచిన్కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని ద్వారకా డీసీపీ షిబేశ్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజున సచిన్ తల్లిదండ్రులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘మీ కొడుకుని కిడ్నాప్ చేశాం. 50 లక్షల రూపాయలు తీసుకొస్తేనే అతన్ని వదిలేస్తామ’ని సచిన్ తల్లిదండ్రులకు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అనుమానం నిజమైంది.. సచిన్తో పాటు అదే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్న వరుణ్ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి పనిలోకి రావడంలేదు. అతను ఇల్లు ఖాళీ చేయడం, ఫోన్ చేస్తే స్పందించక పోవడంతో వరుణ్పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మొబైల్ నంబర్ను ట్రేస్ చేయడంతో నిందితులు పట్టుబడ్డారని డీసీపీ షిబేశ్ తెలిపారు. -
ద్వారక మునిగి తేలిన నగరం
ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది. పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాలగుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది. ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. పవిత్ర నగరం ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు. శ్రీద్వారకనాథ్ మహాత్యం ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి. ద్వారకాసామ్రాజ్యం మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు. బేట్ ద్వారక బేట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి. ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. సికింద్రాబాద్, అహ్మదాబాద్ ఓఖా ఎక్స్ప్రెస్లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా ఆలయం ఉంది. –గోపరాజు పూర్ణిమాస్వాతి -
'ద్వారక' మూవీ రివ్యూ
టైటిల్ : ద్వారక జానర్ : కామెడీ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, పూజా జవేరి, 30 ఇయర్స్ పృద్వీ, మురళీ శర్మ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర నిర్మాత : సూపర్ గుడ్ ఫిలింస్, లెజెండ్ సినిమా పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ద్వారక. పెళ్లి చూపులు సక్సెస్ తరువాత విజయ్ రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఆ మార్పులు సినిమా సక్సెస్ కు ప్లస్ అయ్యాయా..? విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో అందుకున్న సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? కథ : గురుమూర్తి ( 30 ఇయర్స్ పృథ్వీ) హోమాలు పూజలు చేయించే ఆధ్యాత్మిక గురువు. తన శిష్యుడు నష్టాల్లో ఉండటంతో తనను ఆదుకోవడానికి ఓ మహాపురుషుడు వస్తాడని అతని రాకతో నీ జీవితం మారిపోతుందని చెప్తాడు. ఎర్ర శీను (విజయ్ దేవరకొండ) తన స్నేహితులతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అయితే ఈ సారి ఇలాంటి చిన్న దొంగతనం కాదు ఒకే సారి లైఫ్ సెటిల్ అయ్యే పని చేయాలని ఓ గుళ్లో దేవుడి విగ్రహాన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే హీరోయిన్ ను చూసి ఆగిపోతాడు. ఈ లోగా జనాలు వెంటపడటంతో పారి పోయే ప్రయత్నంలో గురుమూర్తి శిష్యుడి అపార్ట్మెంట్ లో దాక్కుంటాడు. ఎర్ర శీనును చూడగానే కోర్టు లో ఉన్న స్థలం సమస్య తీరిపోవటంతో అతనే తనను ఆదుకోవడానికి వచ్చిన దేవుడని ఫిక్స్ అయిపోతాడు గురుమూర్తి శిష్యుడు. ఎర్ర శీనును కృష్ణానంద స్వామి అంటూ అక్కడే ఆశ్రమం కట్టేస్తారు. కృష్ణానందస్వామి మహిమల గురించి విని జనం తండోపతండాలుగా వచ్చేస్తుంటారు, ఈ విషయం తెలిసిన క్రిమినల్ లాయర్ రవి( కాలకేయ ప్రభాకర్) కృష్ణానంద స్వామిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఎర్ర శీను గతం గురించి అందరికీ చెప్తానంటూ బెదిరించి, కృష్ణానందగా ఎర్ర శీనుకు మరింత పబ్లిసిటీ తీసుకువచ్చి ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కూడబెడతాడు. ఈ గొడవ లను తప్పించుకోవాలని ప్రయత్నించిన ఎర్రశీను తను గుళ్లో చూసిన అమ్మాయి ఆశ్రమంలో కనిపించటంతో అక్కడే ఉండిపోతాడు. అదే సమయంలో దొంగ బాబాల ఆటకట్టించే హేతువాది చైతన్య( మురళీ శర్మ) దృష్టి కృష్ణానంద స్వామి మీద పడుతుంది. ఎలాగైన కృష్ణనంద ముసుగు వెనక ఉన్న రహస్యం కనిపెట్టాలని ఆశ్రమంలో చేరుతాడు. మరి అనుకున్నట్టుగా చైతన్య కృష్ణానంద గుట్టు బయటపెట్టాడా..? ఎర్ర శీను తనను బెదిరిస్తున్న లాయర్ రవి నుంచి ఎలా బయట పడ్డాడు..? ఎర్ర శీను తను ప్రేమించిన అమ్మాయి వసుధను దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి మంచి నటన కనబరిచాడు. తన అనుభవానికి మించిన పాత్రే అయినా.. క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ పూజా జవేరి ఉన్నంతలో పరవాలేదనిపించింది. గురుమూర్తి పాత్రలో పృథ్వీ నవ్వులు పూయించాడు. అనవసరపు పంచ్ డైలాగ్ లకు పోకుండా హెల్దీ కామెడీతో మెప్పించాడు. పూర్తి స్థాయి విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్ తన పరిథి మేరకు బాగానే నటించాడు. కీలకమైన చైతన్య పాత్రలో మురళీ శర్మ సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో మురళీ శర్మ నటన సినిమా స్థాయిని పెంచింది. చిన్న పాత్రే అయినా ప్రకాష్ రాజ్ తన మార్క్ చూపించారు. సాంకేతిక నిపుణులు : ప్రజల నమ్మకాలను ఎలా వ్యాపారంగా మారుస్తున్నారో చూపిస్తూ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర రాసుకున్న కథ చాలా బాగుంది. రెండున్నర గంటలకు సరిపడా కథ వస్తువును తయారు చేసుకోవటంలో ఫెయిల్ అయిన దర్శకుడు తొలి భాగం అంతా అనవసరపు సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అయితే సినిమా స్లో అయినప్పుడు కామెడీతో కవర్ చేసిన దర్శకుడు మంచి మార్కులు సాధించాడు. ప్రతీ నాయక పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో క్లారిటీ మిస్ అయ్యింది. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు విజువల్ గా బాగున్నాయి. నేపథ్య సంగీతంతో మరోసారి తన మార్క్ చూపించాడు సాయి కార్తీక్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ క్యారెక్టర్ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ క్లైమాక్స్ సీన్స్ ద్వారక... నమ్మకంతో చేసిన ప్రయత్నం బాగానే ఉంది - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఐదు వందలు కొట్టేశాడు!
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత, సూపర్గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి సమర్పకులు. మార్చి 3న అంటే.. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి హీరో విజయ్ దేవరకొండ చెప్పిన సంగతులు.... ♦ స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఫోనులు చేసి ‘ద్వారక’ గురించి అడుగుతుంటే.. ‘అరే, మళ్లీ మన సినిమా విడుదలకు వచ్చేసింది’ అనే ఎగ్జయిట్మెంట్ వస్తుంది. ‘పెళ్లి చూపులు’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకూ, వాళ్లు పెట్టిన టైమ్, మనీకి తగ్గ వినోదం దొరుకుతుంది. ♦ ఈ సినిమాలో ఎర్రశీను అనే పాత్రలో నటించాను. మనుగడ కోసం దొంగతనాలు చేసే స్థాయికి దిగజారతాడు. పరిస్థితుల ప్రభావం వల్ల బాబాగా మారతాడు. ♦ టీవీల్లో దొంగ బాబాల మాయలు – మంత్రాలు అనే వార్తలు చూసేవాణ్ణి. ఓసారి డిగ్రీలో ఉన్నప్పుడు నేనూ, నా స్నేహితుడు రోడ్ పక్కన బైక్ మీద మాట్లాడుకుంటుంటే... సడన్గా ఓ ఫకీరు వచ్చి రెండు మూడు మ్యాజిక్స్ చేసి మా దగ్గర 500లు కొట్టేశాడు. ‘ద్వారక’ చిత్రీకరణకు ముందు కొన్ని యూ ట్యూబ్ వీడియాలు చూశా. మా దొంగ బాబా కంటే వాళ్లు చేసిన వి చాలా ఓవర్గా ఉన్నాయి. మా స్క్రిప్ట్కి అంత ఓవర్ సెట్ కావడం లేదని దర్శకుడు చెప్పింది ఫాలో అయ్యా ♦ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్రగారు 17 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందు నేను కేబీఆర్ పార్కులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్ చేసేవాణ్ణి. నన్ను అక్కడ చూశారు. అప్పుడే ఈ కథ చెప్పారు. ‘ఎవడే..’ విడులైన తర్వాత మా నిర్మాతలు సిన్మా తీయడానికి ముందుకొచ్చారు. విజయ్ హీరోగా బాగుంటాడని కన్విన్స్ చేశారు. ‘ద్వారక’ కథ చెప్పే ముందు దర్శకుడు ఓ ఫిలాసఫీ చెప్పారు. ‘‘సినిమా ఎలా వస్తుందనేది మనకు తెలీదు. కానీ, మన కంటెంట్ ఏంటో మనకు తెలుసు. ‘రిలీజ్ తర్వాత ఏం రాశార్రా! ఏం చేశార్రా’ అని ప్రేక్షకులు అనుకోవాలి. జీవితంలో మనకంటూ ఓ పేరు రావాలి’’ అనేవారు. ఆయనలో నాకది నచ్చింది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలెబెట్టుకున్నాననే అనుకుంటున్నా. ♦ డీఓపీ శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ప్రకాశ్రాజ్, మురళీశర్మ, పృథ్వీ, ‘షకలక’ శంకర్.. భారీ స్టార్ కాస్ట్, మంచి టెక్నీషియన్లతో సినిమా చేశాం. ‘పెళ్లి చూపుల’కు ముందే మా నిర్మాతలు కథపై నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టారు. పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు. వాళ్ల నమ్మకానికి హ్యాపీ. ♦ మన పల్లెటూళ్లు, సిటీల్లో ప్రజలందరూ మంచి బాబాలు, దొంగ బాబాల గురించి వింటుంటారు. మా సినిమాలో అదే చెప్పాం. సరదా సరదాగా సాగే కథ చివర్లో ఓ మంచి విషయం కూడా చెప్పాం. ప్రతి ఒక్కరికీ కథ, సినిమా కనెక్ట్ అవుతాయి. సినిమా మంచి హిట్టవుతుందనే నమ్మకముంది. -
ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..!
పెళ్లిచూపులు సినిమా రిలీజ్ అయ్యే వరకు విజయ్ దేవరకొండ అనే పేరు చాలా మందికి తెలీదు. అంతుకు ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. వరుస అవకాశాలు మాత్రం రాలేదు. పెళ్లి చూపులు సక్సెస్ విజయ్ లైఫ్ను టర్న్ చేసింది. ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ కిక్తో విజయ్ ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ శుక్రవారం (మార్చి 3) ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత గీతా ఆర్ట్స్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో కూడా విజయే హీరోగా నటించనున్నాడు. దీంతో పాటు పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ విజయ్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తోంది. కళ్యాణవైభోగమే సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన నందిని రెడ్డి కూడా విజయ్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసింది. సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు సినిమాను పూర్తి చేసిన క్రాంతి మాధవ్ కూడా తన నెక్ట్స్ సినిమాను విజయ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడికి కూడా విజయ్ సినిమా ఓకె చేశాడట. వీటితో పాటు ప్రస్థానం ఫేం దేవాకట్టా కూడా విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
రేప్ కేసులో యువకుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
ఢిల్లీ: అత్యాచార కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బుధవారం ఢిల్లీ ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏడెళ్ల జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమాన విధించింది. గత ఏడాది జనవరిలో పశ్చిమ ఢిల్లీకి చెందిన రాజేందర్ (22) భయపెట్టి అత్యాచారం చేశాడని 21 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా లాక్కెళ్లాడని, సహాయం కోసం అర్తనాదాలు పెట్టినా.. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరు రాలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడు మాత్రం బాధితురాలి ఆరోపణలు ఖండించాడు. అత్యాచారం చేయలేదని, ఘటన జరిగిన రెండు రోజుల ముందే ఆమెతో వాగ్వాదం జరిగిందన్నాడు. దీనికి ప్రతీకారంగానే తనపై ఫిర్యాదు చేసిందని కోర్టులో తన వాదనలను వినిపించాడు. ఈ కేసు వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడని 376 (అత్యాచారం), 506 (భయపెట్టడం) సెక్షన్ల కింద నిందితుడికి 7 ఏళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమాన విదిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసు తీర్పుకు ఏడాది సమయం పట్టింది. -
‘ద్వారకా’ మూవీ స్టిల్స్
-
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఏడు రోజులకు గాను నగదు రూపంలో రూ.37,29,587, కానుకుల రూపంలో 83 గ్రాముల బంగారం, 971 గ్రాముల వెండి లభించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా అధికంగా లభించిందని చెప్పారు. పాతనోట్ల తిరస్కరణ హుండీల ఆదాయంలో ప్రభుత్వం రద్దు చేసిన 476 రూ.1,000, 535 రూ.500 నోట్లు వచ్చాయి. వీటి మొత్తం రూ.7,43,500 ఉంది. అయితే స్థానిక ఆంధ్రాబ్యాంకు అధికారులు మాత్రం ఈ నోట్లను జమచేసేందుకు అంగీకరించలేదు. ఈనెల 30న ఒకేసారి ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని బ్యాంకు అధికారులు సూచించారని, దీంతో హుండీ ఆదాయాన్ని రూ.29,86,083గా చూపినట్లు ఈవో చెప్పారు. -
ఏకంగా ఆరు సినిమాలు లైన్లో పెట్టాడు..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ ఫాంలో ఉన్నాడు. పెళ్లిచూపులు సక్సెస్ ఇచ్చిన జోష్ ఏకంగా ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ద్వారక సినిమాను దాదాపుగా పూర్తి చేసిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత తాను చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు విజయ్. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాకు ఓకె చెప్పాడు విజయ్. ఈ సినిమాలతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీని ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు భరత్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమాకు ఓకె చెప్పాడు. వరుసగా ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన విజయ్, రెమ్యూనరేష్ విషయంలోనూ కాస్త బెట్టు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
నేత్రపర్వం.. శ్రీవారి విహారం
ద్వారకా తిరుమల : సుదర్శన పుష్కరణిలో హంస వాహన రూరుడైన చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి శనివారం రాత్రి విహరించారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ తెప్ప ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. మిరమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, డప్పు వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ఈ ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా తొళక్కవాహనంపై ఉయభదేవేరులతో శ్రీవారిని ఉంచి, ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీది సేవ అనంతరం వాహనాన్ని సుదర్శన పుష్కరణి వద్దకు అట్టహాసంగా తీసుకొచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న పుష్కరణిలో హంసవాహనంగా అలంకరించిన తెప్పలో స్వామి, అమ్మవార్లను ఉంచారు. ఆలయ చైర్మ¯ŒS ఎస్వీ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా పాల్గొని తెప్పలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన చినవెంకన్నకు విశేషపూజలు జరిపారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారు పుష్కరణిలో వహించారు. పుష్కరణి మద్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్త జంటలతో కళకళలాడిన క్షేత్రం శ్రీవారి క్షేత్రం శనివారం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. క్లోక్ రూములు నిండిపోవడంతో యాత్రికుల బ్యాగులను అనివేటి మండపంలో భద్రపరిచారు. క్షేత్రంలో శనివారం తెల్లవారుజామున వివాహాలు అధికంగా జరిగాయి. కొత్త జంటలు, వారి బంధువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.2.02 లక్షల విరాళం ద్వారకా తిరుమల : శ్రీ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా రూ.2,02,232లను శనివారం విరాళంగా అందించారు. భీమవరానకి చెందిన మోహ¯ŒSదాస్ అనే భక్తుడు గంధం వెంకట విశ్వేశ్వరరావు, వెంకట ఉష దంపతుల పేరున రూ.1,01,116లను, కొవ్వూరుకు చెందిన ఏలూరిపాటి శ్రీరామచంద్రమూర్తి రూ. 1,01,116 విరాళాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ పత్రాలను అందించి అభినందించారు. -
తిరువీధుల్లో మెరిసిన కరుణాంతరంగుడు
ద్వారకాతిరువుల : కోరిన కోర్కెలు తీర్చే చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి రథంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. రథంపై శ్రీదేవీ, భూదేవిలతో కొలువుతీరిన కరుణాంతరంగుని వీక్షించిన భక్తజనులు పరవశించిపోయారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నావుస్మరణలు, ఆగమ విద్యార్థుల వేద ఘోషల నడువు శ్రీవారి రథయాత్ర ఆద్యంతం భక్తులను అలరించింది. ఉదÄýæుం నుంచి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీహరి కళా తోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైభవం.. డోలోత్సవం శ్రీవారి తిరుకల్యాణ వుహోత్సవం జరిగిన వురుసటి రోజు రథోత్సవాన్ని జరపడం ఇక్కడ సంప్రదాÄýæు బద్ధమైంది. బ్రహ్మోత్సవాల సవుÄýæుంలో స్వామివారికి భక్తులు స్వÄýæుంగా సేవ చేసుకునే భాగ్యం ఈ రథవాహనం ద్వారానే కలుగుతుంది. శ్రీవారికి ఎంతో ప్రీతికరమైనది కావడంతో ఈ రథోత్సవ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా రాత్రి ఆలయంలో ఉభÄýæు దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సవుర్పించారు. ఆ తరువాత మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగవు విద్యార్థుల వేద వుంత్రోచ్ఛరణల నడువు వాహనాన్ని రథం వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణవుూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. ఆ తరువాత విశేష వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాట భజనలతో శ్రీవారి రథం భక్తుల గోవింద నావుస్మరణలతో క్షేత్రపురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సవుర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈవో త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు lఉదయం 8 గంటలకు – భజన సంకీర్తనలు lఉదయం 9 గంటలకు – భక్తి రంజని lఉదయం 10.30 గంటలకు – చక్రవారి, అపబృదోత్సవం lమధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సదస్సు lసాయంత్రం 5 గంటలకు – ఉపన్యాసం lసాయంత్రం 6 గంటలకు భరతనాట్యం lరాత్రి 7 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ lరాత్రి 8 గంటల నుంచి – శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం నాటకం lరాత్రి 8 గంటల నుంచి గ్రామోత్సవం -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్ ధర పెంపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత కల్యాణం టికెట్ ధరను పెంచినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకూ రూ.1,000 ఉన్న టికెట్ రుసుంను రూ.1,500కు పెంచామని, కొత్త ధర గురువారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిత్య కల్యాణం జరిపించుకునే దంపతులకు పంచె, కండువ, రవికతో పాటు ఐదు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు, ఒక శర్కర పొంగలి ప్యాకెట్ ఇస్తున్నారు. ధర పెంచిన నేపథ్యంలో వీటితో పాటు అదనంగా చీర కూడా అందిస్తామని ఈవో తెలిపారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు విరాళాల వెల్లువ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఆదివారం విరాళాలు వెల్లువెత్తాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం చిన్నం సుబ్బారావు, జగదీశ్వరి దంపతులు రూ.2,02,232ను విరాళంగా అందజేశారు. దీనిలో సుబ్బారావు పేరున రూ.1,01,116, జగదీశ్వరి తల్లిదండ్రుల పేరున రూ.1,01,116ను అందజేశారు. సుబ్బారావు కుమారుడు, కోడలు రాంబాబు, ప్రమీళకుమారి, కుమార్తె అల్లుడు అంబటి గాంధీ, నాగమణి ఉన్నారు. మచిలీపట్నంకు చెందిన డేరం రామకష్ణ శర్మ, సీతామహాలక్ష్మి దంపతులు తమ కుమార్తె శైలజ పేరున రూ.1,01,116ను అందజేశారు. దాతలకు ఈవో త్రినాథరావు విరాళం బాండ్లు అందజేశారు. -
నేత్రపర్వం.. సహస్ర ఘటాభిషేకం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శివదేవునికి ఆదివారం సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ ఈ కార్యక్రమాన్ని చినవెంకన్న దేవస్థానం నిర్వహించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మణిక్యాలరావు ఆదేశాల మేరకు ఈనెల 26 నుంచి జరుగుతున్న వరుణ జపాలు ఆదివారం ఆలయంలో జరిగిన విశేష పూజాధి కార్యక్రమాలతో ముగిశాయి. ముందుగా ఆలయ మండపంలో రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేసి గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను ఉంచి విశేష అలంకరణ చేశారు. పక్కన ఋష్యశంగ ప్రధాన మండప దేవుడ్ని ఏర్పాటుచేశారు. అనంతరం దేవతామూర్తుల ముందు 1,296 కలశాలను ఉంచి పూజాధికాలు ప్రారంభించారు. ఆలయ పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఋష్యశృంగ సహిత ప్రధాన మండపారాధన, మహన్యాసం, పంచద్రవ్యారాధన, పంచామత స్నపన, దశవిదస్నానాలు, వారుణానువాక శతానువాదం సహిత శతరుద్రాభిషేకాలు చేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పండితులు, అర్చకుల వేదమంత్రాల నడుమ గర్భాలయంలో కొలువైన శివదేవుని లింగస్వరూపం నీటిలో మునిగే వరకు కలశాల్లోని జలాలతో అభిషేకించారు. అనంతరం ఋష్యశంగ సహిత వరుణ హోమాలు జరిపి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. -
వైభవంగా పవిత్రాధివాసం
లక్ష్మీపురం (ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల చినవెంకన్న ఉపాలయం లక్ష్మీపురం శ్రీ వేంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పవిత్రాధివాసం వేడుకగా జరిగింది. ఆలయ యాగశాలలో పవిత్రాలను ఉంచి ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యహవాచన జరిపించారు. అనంతరం పంచగవ్యప్రోక్షణను జరిపి అగ్నిప్రతిష్ఠాపన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో పవిత్రాలను ఉంచి ప్రోక్షణ గావించారు. పవిత్రాలను ఉత్సవమూర్తులకు పంచశయ్యాదివాసాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛారణలతో జరిపారు. మహాశాంతి హోమాన్ని ఆలయ యాగశాలలో నిర్వహించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు ఈ వేడుకను జరపడం ఇక్కడ సాంప్రదాయ బద్ధమైంది. ఈ క్రమంలో చినవెంకన్న అమ్మవార్లతో కలసి క్షేత్రపురవీదుల్లో ఊరేగుతారు. అయితే మధ్యాహ్నం నుంచి అడపాదడప వర్షపు జల్లులు కురుస్తుండటంతో శ్రీవారి తిరువీధిసేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టి, యువకులు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. -
వైభవంగా పవిత్రావరోహణ
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ తెలియక జరిగిన తప్పులకు ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగురోజుల పాటు ఘనంగా సాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి హోమాన్ని, మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరాuŠ‡, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లపైన, ఉత్సవమూర్తులపైన ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు శనివారం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
వైభవంగా పవిత్రావరోహణ
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ తెలియక జరిగిన తప్పులకు ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగురోజుల పాటు ఘనంగా సాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి హోమాన్ని, మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లపైన, ఉత్సవమూర్తులపైన ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు శనివారం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.1.01 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్కు ఓ భక్తుడు శుక్రవారం రూ. 1,01,116ను విరాళంగా అందించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం విరాళాన్ని శ్రీ అమ్మా కనస్ట్రక్షన్స్ పేరున చెక్కు రూపంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుకు అందశారు. ఈవో విరాళం బాండ్ అందించిన దాతను అభినందించారు. -
శ్రీవారి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) ఆలయంలో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఆలయ భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించామని ఏఆర్ ఎసై నాగేశ్వరులు అన్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాలు, ప్రధాన, తూర్పు రాజగోపుర ప్రాంతాలు, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాలలు, పలు విభాగాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. క్షేత్రానికి వచ్చిన భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో తనిఖీలు జరుపుతున్నట్టు తనిఖీ సిబ్బంది తెలిపారు. డాగ్ హ్యాండ్లర్ డీడీ ప్రసాద్, విజయ, రంగారావు, డాగ్ లిజీ పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను చంపేశాడు
కాకుమాను (గుంటూరు జిల్లా): భార్యపై అనుమానంతో భర్త రోకలి బండతో తలపై బాది హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాంత్రపాడు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సజ్జనరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ద్వారకా (30), కుమార్తె సంధ్య ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్యను అతడు అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు.