3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా.. | Florida Woman Sues Rs 40 Crore Claim Pasta Not Ready In 3 Minutes | Sakshi
Sakshi News home page

3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..

Nov 29 2022 8:11 AM | Updated on Nov 29 2022 8:24 AM

Florida Woman Sues Rs 40 Crore Claim Pasta Not Ready In 3 Minutes - Sakshi

వాషింగ్టన్‌: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్‌ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది.

ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్‌... క్రాఫ్ట్‌ హీంజ్‌ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్‌ పాస్తా అండ్‌ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్‌ ఛీజ్‌ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.
చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement