● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన
కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.