![మాస్టర్ స్విమ్మర్ మనోడే](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24srl32-180045_mr.jpg.webp?itok=FK-AOawV)
సిరిసిల్లటౌన్: మాస్టర్స్ స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో జిల్లా వాసి నంబర్వన్గా నిలిచాడు. హైదరాబాద్లో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ గేమ్స్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. సిరిసిల్ల నుంచి చొప్పదండి శ్రీనివాస్ యాభై ఏళ్ల కేటగిరీలో పాల్గొన్నారు. 200 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ప్రథమ), 100 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ద్వితీయ), 50 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ద్వితీయ) బహుమతులు సాధించారు. జాతీయ స్థాయిలో రాణించిన శ్రీనివాస్ను బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, నాయకులు రెడ్డబోయిన గోపి, పత్తిపాక సురేశ్, గరిపెల్లి ప్రభాకర్ అభినందించారు.
జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి