లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం | - | Sakshi
Sakshi News home page

లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం

Published Sun, Mar 19 2023 12:26 AM | Last Updated on Sun, Mar 19 2023 12:26 AM

మాట్లాడుతున్న కొత్తపల్లి శ్రీనివాస్‌ - Sakshi

కాగజ్‌నగర్‌రూరల్‌: ప్రశ్నాపత్రాల లీకేజీతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 2016లో సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ పేపర్‌, 2019లో ఎంసెట్‌ పేపర్‌ లీక్‌ అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నష్టపోయారన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దోని శ్రీశైలం, ఉపాధ్యక్షులు ముత్తు అశోక్‌, కోశాధికారి అరుణ్‌లోయా, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, నాయకులు రాజేందర్‌, మహేశ్వరచారి పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement