విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి

Published Mon, May 6 2024 7:35 AM

-

సిర్పూర్‌(టి): మండలంలోని వేంపల్లిలో శనివారం సాయంత్రం విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. ఎస్సై డీకొండ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం వేంపల్లి గ్రామానికి చెందిన ఆడె శంకరాబాయి కుమారుడు డేవిడ్‌ (18 నెలలు) ఇంటివద్ద ఆడుకుంటూ పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లడంతో విద్యుత్‌ వైర్లను తాకి అక్కడే పడిపోయాడు. గమనించిన తల్లి కుమారుడిని పట్టుకోవడంతో ఆమెకు సైతం విద్యుత్‌షాక్‌ తగిలి స్పృహ కోల్పోయింది. గమనించిన గ్రామస్తులు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి చిన్నారిని కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆడె శంకరాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement