పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

Published Tue, May 7 2024 6:55 AM

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

గంగారం: పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని పెద్ద ఎల్లాపురంతోపాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన బలరాంనాయక్‌.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గంగారంలో యువకులతో కలిసి క్రికెట్‌ ఆడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌, ఏఐసీసీ ఆర్గనైజింగ్‌ సెట్రకరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, వెంకటేశ్వర్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిళి, జెడ్పీటీసీలు ఈసం రమ, విజయ రూప్‌సింగ్‌, ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, పుష్పలత, మాజీ సర్పంచ్‌లు చుంచ వెంకటలక్ష్మి, మద్దెల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement