రిజర్వాయర్‌ వద్దని రైతుల నిరసన | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌ వద్దని రైతుల నిరసన

Published Thu, May 9 2024 4:55 AM

రిజర్వాయర్‌ వద్దని రైతుల నిరసన

బల్మూర్‌: మండల కేంద్రం సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, బుధవారం రిజర్వాయర్‌ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు అనంత సీతారాంరెడ్డి మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడలేని ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అధికారులకు మొరపెట్టుకుంటున్నా.. స్పందించడం లేదని ఆరోపించారు. అనుమతులు రద్దు చేస్తేనే నిర్వాసిత గ్రామాలైన బల్మూర్‌, అనంతవరం, మైలారం గ్రామాల ప్రజలం పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొంటామని చెప్పారు.

రైతు నాయకుడిని అదుపులోకి

తీసుకున్న పోలీసులు

పోలీస్‌స్టేషన్‌ ముట్టడించిన రైతులు

Advertisement
 
Advertisement
 
Advertisement