వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Published Wed, Sep 25 2024 3:10 AM | Last Updated on Wed, Sep 25 2024 8:23 AM

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

భర్తను హత్య చేసిన భార్య

వివరాలు వెల్లడించిన సీఐ సురేందర్‌రెడ్డి

సూర్యాపేట : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ కేసులో నిందితురాలుని స్థానిక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సూర్యాపేటరూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 సూర్యాపేట మండలంలోని హనుమానాయక్‌తండాకు చెందిన ధరావత్‌ కౌసల్య అదే తండాకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి తన భర్త ధరావత్‌ సైదా అడ్డొస్తున్నాడని, అతడిని ఎలాగైనా తొలగించుకోవాలనే ఆలోచనతో ఆగస్టు 17న రాత్రి భర్త సైదాను కౌసల్య గొడ్డలితో కణతపై నరికి హత్య చేసింది. అనంతరం ఏమి తెలియనట్లు తన భర్త మద్యం సేవించి తూలి చెక్కబల్లపై పడి మృతి చెందినట్లు అందరిని నమ్మించింది. 

ఈ హత్యను కౌసల్య చిన్న కుమారుడు వినోద్‌ చూడడంతో అతడిని బతిమిలాడి హత్య విషయాన్ని బయట తెలిస్తే నేను జైలుకు వెళ్తానని, అప్పుడు మీరు బతకడం కష్టమవుతుందని, ఎవరికి ఈ విషయాన్ని చెప్పనివ్వలేదు. ఈనెల 22న కౌసల్య తన చిన్న కుమారుడు వినోద్‌తో గొడవ పెట్టుకోగా వినోద్‌ తన తండ్రిని తన తల్లి కౌసల్యే హత్య చేసిన విషయం అన్న సాయికుమార్‌కు చెప్పాడు. 

దీంతో సాయికుమార్‌ ఈనెల 23న రూరల్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా నిందితురాలు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని సీజ్‌ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement