సిలిండర్‌ పేలి ఐదుగురు దుర్మరణం | 5 dead in Salem as cylinder explosion triggers building collapse | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి ఐదుగురు దుర్మరణం

Published Wed, Nov 24 2021 6:19 AM | Last Updated on Wed, Nov 24 2021 6:19 AM

 5 dead in Salem as cylinder explosion triggers building collapse - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్‌ పట్టి పాండురంగన్‌ విట్టల్‌ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి.

ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న పద్మనాభన్‌ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్‌ తల్లి స్టౌవ్‌ వెలిగించే సమయంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్‌ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement