Salem
-
వివాహేతర సంబంధం.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంతో సేలంలో హెడ్ కానిస్టేబుల్ సోమవారం సస్పెండ్కు గురయ్యాడు. సేలం ప్రభుత్వ వైద్యశాల ఔట్ పోస్ట్లో హెడ్కానిస్టేబుల్గా గోవిందరాజన్ (38) పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (22). వీరి పిల్లలు దర్శిణి (4), రోహిత్ (8). గోవిందరాజన్ కుటుంబంతో ఇక్కడ ఉన్న పోలీసు క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. కాగా గోవిందరాజన్, సంగీతల మధ్య కుటుంబ గొడవ ఉన్నాయి. ఈ స్థితిలో గత ఏడాది అక్టోబర్ 18వ తేదీ ఇద్దరు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండగా, పక్కన సంగీత ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో గోవిందరాజ్కు, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఆ విష యం భార్య సంగీతకు తెలియడంతో గొవడలు జరుగుతూ వచ్చినట్టు తెలిసింది. ఆ కారణంగా జీవితంపై విరక్తి చెందిన సంగీత పిల్లలకు విషం కలిపిన నీటిని తాగించి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై సోమవారం సేలం నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్కుమార్ అభినబు గోవిందరాజ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అత్త కొడుకుతో సన్నిహితం, ఏడు నెలల గర్భం.. బలవంతంగా ప్రసవం
చెన్నై: గర్భం దాల్చిన మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళా డాక్టర్ ప్రసవం చేసింది. దీంతో బాలిక అస్వస్థతకు గురై మృతిచెందింది. విషయం బయటకు పొక్కడంతో డాక్టర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇందిరానగర్కు చెందిన జగదీశన్ కుమార్తె ఐశ్వర్య (17) అత్త కొడుకుతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వాలప్పాడిలో ఉన్న డాక్టర్ సెల్వంపాల్ రాజ్కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ సెల్వం పాల్ ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలిపారు. శనివారం ఉదయం ఐశ్వర్యకి ప్రసవం పేరుతో అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అబార్షన్ వీలుకాకపోడంతో బాలికకు ప్రసవం చేశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక అస్వస్థత ఏర్పడింది. వెంటనే వైద్యం కోసం అంబులెన్స్లో సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పుట్టిన శిశువుకు సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సేలం జిల్లా వైద్య సేవల డైరెక్టర్ వరమతి, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయశెల్వి, పేలూరు జిల్లా వైద్యాధికారి నంబలం, ఇతర సభ్యులు డాక్టర్ సెల్వం పాల్ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యురాలితోపాటు బాలిక గర్భం దాల్చడానికి కారణమైన బంధువుపై చర్యలు తీసుకోనున్నారు. -
చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..
సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీకి చెందిన యువరాజ్ (35) పాన్విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సోమవారం యువరాజ్ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి. సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. -
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
సాక్షి, చెన్నై: కేన్సర్తో తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతనను చూడలేక ఓ తండ్రి కారుణ్య హత్యకు పాల్పడ్డాడు. బంధువు సాయంతో తన కుమారుడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. సేలంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. ఆయనకు వన్నతమిళ్(14) కుమారుడు ఉన్నాడు. గత ఏడాది వన్న తమిళ్ కూడి వైపు కాలిలో ఓ కణితి బయట పడింది. వైద్యులు దీన్ని కేన్సర్ గడ్డగా తేల్చారు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులు భారం కావడమే కాకుండా, కేన్సర్ క్రమంగా శరీరం అంతా వ్యాపించడం, ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్నతమిళ్ పడుతున్న నరకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. విషం ఇంజెక్షన్ ద్వారా కారుణ్య హత్యకు సిద్ధం అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఆదివారం రాత్రి ఆ టీకాను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే ఆ బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ బాలుడి తండ్రి, బంధువును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
సీఎం సార్ రక్షించండి ప్లీజ్..! కదిలించిన చిన్నారి వీడియో
సాక్షి, చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్ను కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించారు. వివరాలు.. సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె పదో తరగతి చదువుతోంది. పదేళ్ల వయస్సులోనే కర్రసాము, విలువిద్య, స్కేటింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో హఠాత్తుగా ఈ బాలిక ఇంట్లో స్పృహ తప్పింది. చదవండి: CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్ను ఆశ్రయించింది. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్ను కదిలించింది. చదవండి: ఒకవైపు వర్షం మరోవైపు బంద్: క్యాబ్, ఆటోల చార్జీల మోత! ఆస్పత్రిలో జనని తల్లి రాజనందినిని ఓదారుస్తున్న సీఎం ‘‘సీఎం సార్, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. -
నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం సేలం జిల్లా కుజయ్యూర్కు చెందిన ధనుశ్ (19) నీట్కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్కు గురి చేసింది. నీట్కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்! கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்! நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA — M.K.Stalin (@mkstalin) September 12, 2021 -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం
సాక్షి, చెన్నై : తమిళనాడులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం జిల్లా కురుంగచావడి గ్రామానికి చెందిన అన్బళగన్ కుటుంబంలో ఐదుగురు మరణించడంతో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. మొత్తం 11 మంది ఉన్న ఆ కుటుంబంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం కాగా మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఎ. రామన్ ఆదేశించారు. (ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...) -
32 మంది రైతులపై కేసు
సాక్షి, తమిళనాడు: గ్రీన్ వేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన 32 మంది రైతులపై కేసులు నమోదుచేశారు. సేలం–చెన్నై మధ్య గ్రీన్ వే పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల అప్పీల్ చేసింది. దీనిపై సేలం జిల్లా లాలికాల్ పట్టిలో ఆదివారం ఆందోళన చేసిన 21 మంది రైతులపై మల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కుల్లంపట్టిలో మరో 11 మంది రైతులపై కారిపట్టి పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి సొంత పొలంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ సోమవారం సేలం జిల్లా అయోద్యపట్నంలో 7వ మైల్, రామలింగపురంలో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. చదవండి: విషమంగా డీఎంకే ఎమ్మెల్యే ఆరోగ్యం -
మోదీకి వ్యతిరేకంగా ఆందోళన
సేలం: చదువుకున్న యువకులు పకోడీ విక్రయించైన బతకవచ్చని తెలిపిన మోదీ వ్యాఖ్యను ఖండిస్తూ సేలం రైల్వేస్టేషన్లో డైఫీ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం సేలం రైల్వే స్టేషన్లో పకోడి పంపిణీ చేశారు. తర్వాత స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులను పక్కను తోసివేసి రైల్వే స్టేషన్లోకి చొరబడి, రైల్వే పట్టాలపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో యువకులకు అవకాశం కల్పించాలి, రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాని విరమించాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు 63 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న డైఫీ నేతలు, కార్యకర్తలు -
కావేరిలో విద్యార్థుల గల్లంతు..
సాక్షి, సేలం: ధర్మపురి జిల్లాలో కావేరి నదిలో మునిగి కర్ణాటక విద్యార్థులు ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సంతోష్ కారులో స్నేహితులు సూర్య, బాలాజీ, అరుణ్ కుమార్, కార్తిక్, నందకుమార్, పిజిలీ రావు, ఎస్ఎస్ అని మొత్తం ఎనిమిది మంది శుక్రవారం ధర్మపురి జిల్లాలో ఉన్న హొగ్నెకల్కు పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉన్న జలపాతాల్లో స్నానాలు చేసి ఆనందించారు. తర్వాత కర్ణాటకకు వెనుదిరిగిన వారు అంజట్టి వద్ద వెళుతుండగా ఆలంబాడి అనే ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో స్నానం చేయడానికి దిగారు. అయితే అక్కడ స్నానం చేయకూడదు– ప్రమాదం అనే బోర్డు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ నీటిలో స్నానం చేయడానికి దిగారు. వారిలో సంతోష్ కొంత దూరం వెళ్లగా నీటి ఉధృతి అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు బాలాజి, ఎస్ఎస్ ప్రయత్నించారు. అయితే వారు కూడా నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగిలిన వారు ఒడ్డుకు చేరి పెన్నగరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పెన్నగరం డీఎస్పీ అన్బురాజ్, అగ్నిమాపక సిబ్బంది చుట్టు పక్కల గాలించి బాలాజి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సరదాగా షికారుకు వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లిన స్నేహితుడిని చూసి సహ మిత్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
రౌడీని కొట్టి చంపిన మహిళలు
సాక్షి, సేలం (తమిళనాడు): నీళ్ల కుళాయి వద్ద దౌర్జన్యం చేసిన ఓ రౌడీని పది మందికిపైగా మహిళలు రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈరోడ్ జిల్లాలోని సిత్తోడు ఆర్ఎన్ పుదూర్ మాదేష్వరా నగర్కు చెందిన సెల్వం(38)పై పలు స్టేషన్లలో అనేక కేసులున్నాయి. ఓ హత్య కేసులో జైలు శిక్ష పడి రెండేళ్ల కిందట బెయిల్పై విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం తాగునీటి కుళాయి వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటుండగా సెల్వం అక్కడికి వెళ్లాడు. కుళాయి కిందనున్న బిందెను పక్కకు తీసి నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్నవారు సెల్వంతో గొడవ పడ్డారు. ఆగ్రహానికి గురైన సెల్వం.. రంగనాథన్ అనే వ్యక్తి చేతిని కత్తితో నరికాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలంతా సెల్వంపై మూకుమ్మడిగా దాడికి దిగారు. రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో చితకబాదారు. సెల్వాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హాస్య నటుడి నగలు దోపిడీ
చెన్నై: తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు. గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు బెంజిమన్కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
సేలంలో భారీ చోరీ
► 700 సవర్ల బంగారు నగలు, రూ. 2లక్షలు అపహరణ ► నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ ► రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు సేలం: సేలంలోని వ్యాపార వేత్త ఇంట్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం అంకమ్మాల్ ఆలయ వీధికి చెందిన ఆదియప్పన్ (74). ఈయన సెవ్వాపేట ప్రాంతంలో కొయ్య, ఇనుప వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని మొదటి భార్య మృతి చెందింది. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు మనోజ్ కుమార్, కుమార్తె దేవిప్రియ ఉన్నారు. గత ఏడాదిన్నర కిందట అనారోగ్యం కారణంగా ఆదియప్పన్ మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య విజయలక్ష్మి వ్యాపారం నడుపుతూ వస్తోంది. ఆమెకు సహాయంగా సోదరుడు భాస్కర్ కూడా ఉన్నాడు. ఆయన తన కుటుంబం సహా సోదరి ఇంట్లోనే ఉంటున్నాడు. విజయలక్ష్మి తన కుటుంబంతో అంకమ్మాల్ ఆలయ వీధిలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం విజయలక్ష్మి తన కుటుంబంతో తిరుమల వెళ్లారు. ఇంటికి భద్రతగా తన తండ్రి దక్షిణా మూర్తి(63), శివభాగ్యం(58) ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం తిరుమల నుంచి తిరిగి వచ్చిన విజయలక్ష్మి కారు డ్రైవర్కు డబ్బు ఇవ్వడం కోసం బీరువాను తెరిచి చూసింది. అప్పుడు బీరువాలో ఉన్న 700 సవర్ల నగలు, రూ. 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిచ్చిపాళయం పోలీసుల విచారణ : విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కిచ్చిపాళయం పోలీసులు, జాగిలం, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటి వెనుక వైపు ఉన్న స్నానపు గది తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో పలు గదుల్లో 8 నిఘా కెమెరాలు ఉన్నాయని, అయితే వీడియో దృశ్యాలను నమోదు చేసే బాక్స్ను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. మంత్రించిన నిమ్మ పండు : బీరువాలో మంత్రించిన నిమ్మపండు, దానితోపాటు పసుపు కుంకుమలు పూసిన ఒక లేఖ ఉంది. ఆ లేఖలో ‘ఈ విషయం గురించి బయట చెబితే కుటుంబం నాశనమవుతుంది’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో తమ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు చేస్తారని విజయలక్ష్మి తెలిపారు. ఆ పూజలు చేసే ఒక స్వామీజీ వద్ద పలుమార్లు డబ్బు, నగలు చూపినట్టు చెప్పింది. అంతేకాకుండా ఇటీవల పూజ చేసిన సమయంలో తమను తిరుపతికి వెళ్లి రావాల్సిందిగా సూచించింది కూడా ఆ స్వామీజీనే అని వెల్లడించింది. దీంతో పూజలు చేసిన ఆ స్వామీజీపై పోలీసులకు సందేహం ఏర్పడింది. ఇంటిలోపల ఒక్క కిటికీ అద్దాలుకానీ, తలుపులు, తాళాలు కానీ ఏవీ పగులగొట్టలేదు. నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ చేసి ఉన్నాయి. దీంతో ఆ కుటుంబీకులకు బాగా తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు సందేహిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాల పోలీసులు : సేలం నగర పోలీస్ కమిషనర్ సంజయ్కుమార్, నేర విభాగ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణన్, పోలీసు అధికారులు చోరీ జరిగిన ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సంజయ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహాయక కమిషనర్ల అధ్యక్షతన ఆరుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నేరస్తులను పట్టుకుంటామన్నారు. సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి ఉందని, త్వరలో నేరస్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ గురించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం వెల్లడైంది. -
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
సేలం: కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. జేఎన్యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
పళనికి బ్రహ్మరథం
► సొంత జిల్లాలో ఘన స్వాగతం ► నాలుగు జిల్లాలకు రూ. 331 కోట్లు ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సేలం: సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా సేలంలో అడుగు పెట్టిన పళనిస్వామికి పశ్చిమ తమిళనాడులోని జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు, మద్దతుదారులు, అధికార యంత్రాంగం బ్రహ్మరథం పట్టాయి. పశ్చిమ తమిళనాడులోని నాలుగు జిల్లాల అభివృద్ధికి రూ. 331 కోట్లను సీఎం కేటాయించారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, సేలం తిరుప్పూర్, ధర్మపురి, కృష్ణగిరిలు పశ్చిమ తమిళనాడులోని జిల్లాలుగా పిలుస్తున్నారు. పశ్చిమంలోని సేలం జిల్లా ఎడపాడికి చెందిన పళనిస్వామి ప్రస్తుతం సీఎం కావడం అక్కడి ప్రజలకు ఆనందమే. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం పశ్చిమం మీద పళనిస్వామి దృష్టి పెట్టినట్టున్నారు. ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా వేదికగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం సొంత జిల్లాకు వచ్చిన పళనిస్వామికి నామక్కల్, సేలంలో బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు సాగాయి. పార్టీ కేడర్, మద్దతుదారులు, ప్రజలు, అధికార వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రూ. 331 కోట్లతో: సేలం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రూ.331 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సేలం జిల్లాలో రూ.115 కోట్లు, నామక్కల్ జిల్లాలో రూ.61 కోట్లు, ధర్మపురి జిల్లాలో 60 కోట్లు, కృష్ణగిరి జిల్లాలో రూ. 93 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న పలు భవనాలను ప్రారంభించారు. పశ్చిమ జిల్లాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. గతంలో అమ్మ జయలలిత అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు చేసిన ప్రకటనల హామీలనంటినీ నెరవేరుస్తాననన్నారు. -
బిడ్డల్ని కడతేర్చి తల్లి ఆత్మహత్య
సేలం : కన్న తల్లి కర్కశత్వం, కన్న తండ్రి వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలను తీసింది. ఓ నిండు కుటుంబాన్ని నిలువునా కూల్చేసిం ది. ఈ హృదయవిదారక సంఘటన ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈరోడ్ జిల్లా చెన్నిమలై ప్రాంతానికి చెందిన వరదరాజన్ (41) బనియన్ కంపెనీలో ఉద్యో గి. ఇతని భార్య సుందరి (30) సైతం అదే బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు జనని (11) అనే కుమార్తె, రాజేష్కన్నన్ (6) అనే కుమారుడు ఉన్నారు. మనస్పర్థలతో భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. సుందరి ఇద్దరి పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల వరకు సుందరి ఇంటి తలుపులు తెరచుకోలేదు. సమీపంలో నివాసం ఉంటున్న సుందరి తల్లి మోహన కుమార్తె ఇంటికి వెళ్లింది. తలుపులు తీయకపోవడంతో సందేహం కలిగి ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా చిన్నారులు జనని, రాజేష్కన్నన్ గొంతుకోసి రక్తపు మడుగులో శవాలుగా పడివున్నారు. సుందరి చీరతో ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. ఫిర్యాదు అందుకున్న చెన్నిమలై పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై చెన్నిమలై పోలీసు ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటాచలం మాట్లాడుతూ బుధవారం రాత్రి సుందరి పక్క వీధిలో నివాసం ఉంటున్న తన తల్లి మోహన ఇంటికి రేషన్కార్డు కోసంవెళ్లింది. ఆ సమయంలో తల్లి మోహన, తన భర్త వరదరాజన్ సన్నిహితంగా ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉండడం చూసి విరక్తి చెందిన సుందరి ఇద్దరి పిల్లల గొంతు కోసి హతమార్చి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. -
తల్లి, తమ్ముడిని కడతేర్చిన అన్న
సేలం: తల్లి, తమ్ముడ్ని ఓ అన్న అతి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చాడు. అయితే అతడు మానసిక రోగిగా అనుమానాలు బయలు దేరడంతో ఆసుపత్రికి తరలించారు. వాలప్పాడిలో బుధవారం ఈ ఘాతుకం చోటు చేసుకుంది. సేలం జిల్లా వాలప్పాడి సమీపంలో నడు పట్టి గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, రాజమ్మాల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో సెంథిల్(35) పెద్ద వాడు. రాజశేఖరన్(32) చిన్నవాడు. కుమార్తె విజయ. వీరి లో రాజశేఖరన్, విజయలకు వివాహాలు అయ్యాయి. వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే, పెద్దవాడు రాజశేఖరన్కు వివాహం కాలేదు. తండ్రి సుబ్రమణ్యం ఇటీవల మరణించడంతో ఆయన పనిచేస్తున్న ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాన్ని రాజమ్మాల్కు తపాలా శాఖ కల్పించింది. దీంతో పెద్దవాడి పెళ్లిని పక్కన పెట్టిన రాజమ్మాల్ విధుల మీదే ఎక్కువ దృష్టిపెట్టింది. తనకు పెళ్లి చేయాలంటూ పదే పదే సెంథిల్ తల్లి మీద ఒత్తిడి తెచ్చేవాడు. అతడికి ఎలాంటి సంపాదన లేని దృష్ట్యా, తన సంపాదన మీద ఆధార పడాల్సి ఉండడంతో అతడికి వివాహం చేయకుండా రాజమ్మాల్ కాలం నెట్టుకు వచ్చి ఉన్నది. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి రెండు రోజుల క్రితం రాజశేఖరన్ గ్రామానికి వచ్చాడు. తన పెళ్లి మీద తమ్ముడు కూడా పట్టించుకోక పోవడంతో సెంథిల్ ఉన్మాదిగా మారాడు. బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న తన తమ్ముడ్ని కత్తితో గొంతు కోసం హతమార్చాడు. దీన్ని అడ్డుకునే యత్నం చేసిన రాజమ్మాల్ గొంతును సైతం కోసి పడేశాడు. పెద్ద ఎత్తున కేకలు పెడుతూ తాను కూడా గొంతు కోసుకునే యత్నం చేశాడు. ఉరి పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి వస్తున్న శబ్దంతో పరుగులు తీసిన ఇరుగు పొరుగు వారు అక్కడ దృశ్యాల్ని చూసి ఆందోళనలో పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న సెంథిల్ను పట్టుకుని చెట్టుకు కట్టి పడేశారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ సుబ్బులక్ష్మినేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. రాజమ్మాల్, రాజశేఖరన్లు సంఘటనా స్థలంలోనే విగత జీవిగా మారడంతో మృత దేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. సెంథిల్ను అదుపులోకి తీసుకున్నారు. గొంతు కోసుకోవడంతో స్వల్పంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం సేలం జిహెచ్కు తరలించారు. కాగా, సెంథిల్ మానసిక రోగిగా ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. అతడు రెండేళ్లు చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్సను సైతం పొంది ఉన్నట్టు పేర్కొనడంతో అరెస్టు విషయంగా పోలీసులు సంయమనం పాటిస్తున్నారు. వైద్యులు జరిపే పరీక్షల అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా అతడు మానసిక రోగినా, లేదా అన్నది తేలనున్నది. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బులక్ష్మి పేర్కొన్నారు. -
ఏటీఎంలో రూ. 12 లక్షలు మాయం
సేలం : ఏటీఎంలో నగదు మాయం సంఘటన ఓ ప్రైవేటు బ్యాంక్ వర్గాల్లో కలకలం రేపింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 గంటల్లో నిందితుడ్ని అరెస్టు చేశాయి. నామక్కల్ జిల్లా తిరుచంగోడు-సేలం రోడ్డులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం నగదు నింపడానికి సిబ్బంది వచ్చారు. ఏటీఎంలో ఉన్న నగదు వివరాల్ని సేకరించగా అందులో రూ. 12 లక్షల డబ్బు తగ్గి ఉండడం సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం చెందిన వారు తిరుచంగోడు డీఎస్పీ విష్ణు ప్రియకు ఫిర్యాదు చేశారు. తిరుచంగోడు ఇన్స్పెక్టర్ కుల శేఖరన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తనిఖీలను ముమ్మరం చేసింది. నిందితుణ్ని వెంటాడి పట్టుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి బ్యాంక్ పరిసరాల్లో బైక్పై వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల్ని చూసి ఆ వ్యక్తి ఉడాయించాడు. అతడ్ని సినీ ఫక్కీలో వెంటాడి పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా శాలపురం గ్రామానికి చెందిన ప్రభాకరన్ అని తేలింది. గతంలో ఇతను సదరు బ్యాంక్ ఏటీఎంలకు నగదు ఫిల్లింగ్ చేసినట్లు, ఆ సమయంలో రూ. యాభై వేలు డబ్బును దొంగలించడంతో సస్పెండ్ అయినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించడంతో అస్సలు బండారం బయట పడింది. అత్యాశతో దొరికిపోయాడు సోమవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఏటీఎం వాచ్మన్ టీ తాగేందుకు వె ళ్లడాన్ని అదునుగా తీసుకుని ప్రభాకరన్ ఏటీఎంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేసి, తన వద్దనున్న సీక్రెట్ పాస్వర్డ ఆధారంగా ఏటీఎం లాకర్ తెరిచి అందులో ఉన్న రూ. 12,23,0100 డబ్బు తీసుకుని ఉడాయించాడు. అత్యాశతో ఏటీఎంలో మిగిలిన డబ్బును దొంగలించడానికి మళ్లీ రాత్రి వచ్చాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసి కట కటాల్లోకి తరలించారు. అతడి వద్ద నుంచి దొంగలించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ సెంథిల్కుమార్ అభినందించారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
సేలం: సేలం కలెక్టరేట్లో ఇద్దరు మహిళలు వేర్వేరు సమయాల్లో ఆత్మాహుతి యత్నాలు చేశారు. తమ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం చేశారు. ఆ మహిళల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓమలూరుకు చెందిన ఇలంగో కూలీ కార్మికుడు. ఆయన భార్య శాంతి(48) సోమవారం ఉదయం సేలం కలెక్టరేట్కు వచ్చింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ను మీద పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేసింది. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారనలో 2012లో అనారోగ్యంతో ఓమలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అయితే, వాళ్లు తన గర్భ సంచి తొలగించినట్టు వివరించారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చివరకు కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంలో ఓమలూరు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని, స్వయంగా సేలం కమిషనర్ అమల్రాజ్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే సేలం కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని, అందుకు అనుమతి లభించని దృష్ట్యా, ఆత్మహుతి యత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఈమెను అదుపులోకి తీసుకుని అలా పోలీసు స్టేషన్కు తరలించారో లేదో, మరో మహిళ హఠాత్తుగా లోనికి ప్రవేశించి ఆత్మాహుతి యత్నం చేయడం కలకలం రేపింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. నామక్కల్జిల్లా రాశిపురానికి చెందిన గుణశేఖరన్ భార్య రాణిగా ఆమెను గుర్తించారు. ఆమె భర్త సేలం జైలులో హెడ్ వార్డెన్గా పనిచేసి పదవీ విరమణ పొందినట్టు తేలింది. ఆయనకు వచ్చిన పెన్షన్ రూ.7 లక్షలను జైలర్ జయరామన్, ఆయన భార్య అరుణ, స్నేహితుడు భూపతిలో మింగేసినట్టు తేలింది. తమకు ఇళ్లు ఇస్తామని నమ్మబలికి ఆ ఏడు లక్షల్ని తీసుకుని మోసం చేశారని, ఈ విషయంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్లు లేక చివరకు ఆత్మాహుతి చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. -
ప్రేమి‘కుల’ చిచ్చు
భగ్గుమన్న సోమం పట్టి ఇళ్లపై దాడులు గుడిసెలకు నిప్పు వాహనాల ధ్వంసం దళిత సంఘాల్లో ఆగ్రహం ఉద్రిక్తత, బలగాల మొహరింపు సేలం: ప్రేమి‘కుల’ చిచ్చు మళ్లీ భగ్గుమంది. దళిత సామాజిక వర్గంపై వన్నియర్ సామాజిక వర్గం తమ ప్రతాపం చూపించింది. సోమం పట్టిలో ఇళ్లపై దాడులు చేశారు. గుడిసెలకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలోని దళిత సామాజిక వర్గం పక్కనే ఉన్న మరో గ్రామంలో తలదాచుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత నెలకొనడంతో బలగాలను మోహరింప చేశారు. సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో ఇటీవల కాలంగా ప్రేమ వ్యవహారం చిచ్చు రేపుతుంది. గత ఏడాది ధర్మపురిలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఇలవరసన్, వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన దివ్యను ప్రేమించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. చివరకు ప్రేమ కుల చిచ్చుకు రైలు పట్టాలపై ఇళవరసన్ శవం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే, వారం రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ రైలు పట్టాలపై శవం కావడం సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్రాజ్ను హతమార్చినట్టుగా, హత్య కేసు నమోదుకు డిమాండ్ చేస్తూ సేలం నిరసన జ్వాల రగులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరో ప్రేమ వ్యవహారం సోమం వాలప్పాడి సమీపంలోని సోమం పట్టిని రణరంగంగా మారింది. ప్రేమి‘కుల’ చిచ్చు : సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని సోమం పట్టి గ్రామం ఉంది. ఇక్కడ వందకు పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన శరవణన్ చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్లో పనిచేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచే విలాడి పాళయంకు చెందిన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వన్నియ ప్రియను ప్రేమించాడు. ప్రస్తుతం వన్నియ ప్రియ ఓ పాఠశాలలో టీ చర్. తమకు ఉద్యోగం రావడంతో ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. ఈ ఇద్దరు ఆదివారం ఉడాయించారు. సోమవారం ఉదయాన్నే సేలం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సమాచారం వన్నియ ప్రియ కుటుంబీకుల్లో , బంధు వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. అర్ధరాత్రి దాడులు: సోమవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో యాభై మందికి పైగా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు దుడ్డు కర్రలను చేత బట్టి సోమం పట్టిలోకి ప్రవేశించారు. అక్కడున్న గుడిసెలకు నిప్పులు పెడుతూ, ఆ పరిసరాల్లోని వాహనాలపై తమ ప్రతాపం చూపిస్తూ ముందుకు సాగారు. అర్ధరాత్రి వేళ ఈ దాడులతో అక్కడున్న దళిత సామాజిక వర్గంలో ఆందోళన బయలు దేరింది. తమను ఎక్కడ కొట్టి చంపేస్తారోనన్న భయంతో పిల్లలతో కలసి చీకట్లో కూత వేటు దూరంలో ఉన్న మరో గ్రామంలోకి పరుగులు తీశారు. తమను రక్షించాలని శరణు కోరారు. దీంతో ఆ గ్రామస్తులు దళితులకు అండగా ముందుకు సాగారు. అప్పటికే ఆ వ్యక్తులు మూడు గుడిసెలకు నిప్పు పెట్టడం, రెండు ఆటోలు, మోటారు సైకిల్, సైకిళ్లను ధ్వంసం చేసి ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ పల్లత్తనూరు వద్ద గుడిసెలు వేసుకుని ఉన్న దళితుల మీద తమ ప్రతాపం చూపించి వెళ్లారు. అక్కడున్నకొన్ని గుడిసెల్ని దగ్ధం చేశారు. రంగంలోకి బలగాలు: అర్ధరాత్రి దాడులతో బెంబేళెత్తిన పోలీసులు సోమం పట్టికి పరుగులు తీశారు. అప్పటికే పక్క గ్రామస్తులు మంటల్ని ఆర్పి ఉండడంతో ఆస్తి నష్టం తగ్గిందని చెప్పవచ్చు. స్వల్పంగా గాయ పడ్డ పలువుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారంతో దళిత సంఘాల్లో ఆగ్రహం రేగింది. దాడులకు నిరసనగా దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుని ఉంది. రెండు సామాజిక వర్గాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంతో ఆ పరిసరాల్లో బలగాల్ని రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ సుబ్బులక్ష్మి పర్యవేక్షణలో బలగాలు ఆ గ్రామం, పరిసరాల్లో తిష్ట వేసి ఉన్నారు. ఇటీవల కాలంగా ఇక్కడ కులాంతర ప్రేమ వ్యవహారాలు గ్రామాల్లో చిచ్చు రేపుతుండడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు కుల ప్రేమ వ్యవహారాల కేసులు కొలిక్కి రాని సమయంలో, గోకుల్ రాజ్ మృతి వెలుగులోకి రావడం, తాజాగో, మరో జంట ఉడాయించడం వెరసి పోలీసులకు పని భారాన్ని పెంచుతోంది. తాజా వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్న దృష్ట్యా, ఈ ప్రేమి‘కుల’ చిచ్చు ఎపిసోడ్ మరెన్ని రోజులు సాగుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో, గోకుల్ రాజ్ మృతి వ్యవహారంలో తానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు వాట్సాప్లో కలకలం రేపుతున్నాయి. అయితే, గోకుల్ రాజ్ను బెదిరించి ఆ వ్యాఖ్యలు చెప్పించినట్టుగా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలు అటు దళితులు, ఇటు వన్నియర్ల మధ్య మరో యుద్ధానికి దారి తీసి ఉండడంతో ఆ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
విద్యార్థిని ఆత్మహత్య
సేలం: సేలంలోని ఓ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి పోసుకుని వేలాడుతున్న స్థితి అనుమానాలకు తావిస్తోంది. సేలం శంకగిరికి చెందిన పన్నీరు సెల్వం, ఉమా దంపతుల కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పం పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో తొ మ్మిదో తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమెను ఆ పాఠశాల్లో చేర్పిం చారు. ఆ పాఠశాలకు చెందిన హాస్టల్లో ఆమెకు బస సౌకర్యం కల్పించా రు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉద యం ప్రియదర్శిని శవంగా మారింది. దుపట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ హాస్టల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కిటికీలకు ఉ న్న ఇనుప రాడ్డు సాయంతో దుపట్టా ను ఉపయోగించి గొంతు బిగిసి ఉం డడం, రెండు కాళ్ల మోకాళ్లు నేలను తాకుతుండడంతో అనుమానాలు బ యల్దేరాయి. అయితే, స్కూలుకు ఆల స్యంగా వెళ్లినందుకు టీచరు మందలించినట్టు అందుకే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా హాస్టల్ వర్గా లు పేర్కొంటున్నాయి. అయితే, ఆ బాలిక మృతి మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తూ ఆ పరిసరవాసులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారుల్ని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమిం చాల్సి వచ్చింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
సేలం: భర్తను ప్రియుడితో కలసి హతమార్చి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాతి పెట్టిన ఓ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం అమ్మా పాళయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం అమ్మాపాళయంకు చెందిన బాలకృష్ణన్(45) స్థానికంగా సెలూన్ షాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుందరి(35). వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలోని రాజేంద్రన్ ఇంట్లో కుటుంబంతో కలసి బాలకృష్ణన్ అద్దెకు ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్లో బాలకృష్ణన్ అదృశ్యం అయ్యాడు. బాలకృష్ణన్ అదృశ్య మిస్టరీని ఛేదించేందుకు సూర మంగళం పోలీసులు రంగంలోకి దిగారు. సేలం పోలీసు కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ మురుగేషన్ విచారణ వేగవంతం చేశారు. భర్తను కడతేర్చి: పోలీసు రహస్య విచారణలో బాలకృష్ణన్ ఇంట్లోకి తరచూ ఇంటి ఓనర్ రాజేంద్రన్ తనయుడు లోకనాథన్(27) వెళ్లి వస్తుండడం వెలుగులోకి వచ్చింది. లోకనాథన్, బాలకృష్ణన్ భార్య సుందరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టు అయింది. లోకనాథన్, సుందరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసి బాలకృష్ణన్ ఇద్దరిని మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు బాలకృష్ణన్ను హతమార్చేందుకు పథకం వేశారు. గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ ఇంట్లో మద్యం మత్తులో బాలకృష్ణన్ ఉండడాన్ని గుర్తించి పథకం అమలుకు నిర్ణయించారు. తన స్నేహితులు కుమార్ (24), రేవన్(25)తో కలసి ఆ ఇంట్లోకి లోకనాథన్ చొరబడ్డారు. ఈ ముగ్గురు, సుందరి కలిసి కత్తులతో బాలకృష్ణన్ను పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయడం కష్టతరం కావడంతో, దానిని ముక్కలు మక్కలుగా కోశారు. ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరి దారిన వారు అన్నట్టుగా ఉండి పోయారు. మరుసటి రోజు ఆ ముక్కల్ని తీసుకెళ్లి ఓ శ్మశానంలో నాలుగైదు చోట్ల పూడ్చి పెట్టారు. వీరి వివాహేతర గుట్టు, హత్య బండారం బయట పడడంతో ఆ పరిసర వాసులు షాక్కు గురి అయ్యారు. ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహం ముక్కలు పాతి పెట్టిన ప్రాంతాల్లో తవ్వకాల్లో పడ్డారు. కేసు నమోదు చేసిన ఆ నలుగుర్ని కటకటాల్లోకి నెట్టారు. తన సుఖం కోసం వివాహేతర సంబంధం భర్తను కడతేర్చి సుందరి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
విద్యార్థిని ఆత్మహత్య
సేలం:ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన మురుగన్. ఆయన కుమార్తె సౌందర్య (18) నామక్కల్లో ఉన్న కింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెతో పాటు హాస్టల్ గదిలో ఐదుగురు బస చేస్తున్నారు. సౌందర్య బుధవారం ఉదయం హాస్టల్ గది నుంచి కళాశాలకు స్నేహితులతో బయలుదేరింది. మార్గమధ్యంలో తను గదికి వెళ్లిపోతానని తెలిపి వెను తిరిగి హాస్టల్ గదికి వెళ్లింది. కొంతసేపటికి మరొక విద్యార్థిని గదిలో మరిచిపోయిన నోట్ బుక్ను తీసుకునేందుకు వెళ్లగా అక్కడ గదిలో సౌందర్య ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. సమాచారం అందుకున్న నామక్కల్ ఎస్పీ సెంథిల్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి గదిలో సోదా చేశారు. ఆ సమయంలో టేబుల్పై సౌందర్య రాసిన ఒక లేఖ లభించింది. అందులో తల్లిదండ్రులు బలవంతంగా చదివిస్తున్నారని, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉంది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం నామక్కల్ జీహెచ్కు తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
మరణం కూడా విడదీయలేకపోయింది
సేలం: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా తనువు చాలించిన విదారక ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. 44 ఏళ్లు అన్యోన్యంగా కలిసి జీవించిన ఆ దంపతులను మరణం కూడా వేరు చేయలేకపోయింది. మనోహరన్(70) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మరణించారు. ఆయనకు కొడుకు స్టీఫెన్, కూమార్తె ఉన్నారు. క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో మనోహరన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగానే ఆయన భార్య క్రిస్ట్రీ(67) కూడా ప్రాణాలు కోల్పోయింది. భర్త శవపేటికపై కుప్పకూలి ఆమె తుదిశ్వాస విడిచింది. మనోహరన్, క్రిస్టీ మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. -
బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య
సేలం: కుటుంబకలహాలతో విరక్తి చెంది ఇద్దరు బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో కొందలం గ్రామానికి చెందిన మునియప్పన్ (35) లారీడ్రైవర్. ఇతని భార్య మహేశ్వరి (30). వీరికి నరేంద్రప్రసాద్(11), కౌసల్య (9) ఇద్దరు పిల్లలు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మహేశ్వరి శనివారం రాత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మునియప్పన్ రాత్రి విషం తీసుకొచ్చి ముందుగా నరేంద్రప్రసాద్, కౌసల్యకు బలవంతంగా తాగించి, తరువాత తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పరమత్తి వేలూరు పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అక్కడ మునియప్పన్, నరేంద్రప్రసాద్, కౌసల్య శవాలుగా పడి ఉన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పిల్లలు ఇద్దరికి నయంకాని చర్మ సమస్య ఉండడం, భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా జీవితంపై విరక్తి చెంది పిల్లలకు విషమిచ్చి మునియప్పన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. -
నకిలీ కలెక్టరమ్మ అరెస్ట్
చెన్నై : ఓ నకిలీ కలెక్టరమ్మకు తమిళనాడు పోలీసులు అరదండాలు వేశారు. గత కొంతకాలంగా జిల్లా కలెక్టర్గా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువతిని (26) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే సేలంలోని ఈడపడి పట్టణంలో ఓ రహదారి విషయంలో జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి వారికి చికిత్స జరుగుతున్న ఆస్పత్రికి వెళ్లిన ఆమె...తాను జిల్లా కలెకర్ట్నంటూ ఫేక్ ఐడెంటిటీ కార్డు చూపించి.... అక్కడివారిని తన ప్రశ్నలతో హడలు కొట్టింది. ఈ సందర్భంగా అక్కడ వైద్యులతో అపాయం ఉందంటూ ఫిర్యాదు చేసింది. దాంతో ఆస్పత్రికి వర్గాలకు ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో నకిలీ కలెక్టరమ్మ బండారం బయటపడింది. కలెక్టర్గా చెప్పుకుంటూ ఆ యువతి పలువురిని మోసగించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలి భర్త ఓ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. -
రీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి, చెన్నై: సేలం, నామక్కల్లలో రీ పోలింగ్ శనివారం ప్రశాం తంగా జరిగింది. ఓ చోట ఏజెంట్ల పుణ్యమా అని ఓటింగ్ ఆలస్యం గా ఆరంభం అయింది. మరో చోట విద్యుత్ సరఫరా ఆగడంతో అగచాట్లు పడాల్సి వచ్చింది. రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలోని 40 లోక్సభ నియోజకవర్గాలకు గత నెల 24న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు సజావుగా ప్రశాంత పూరిత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత రెండు చోట్ల రీ పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. సేలం, నామక్కల్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్లలో ఈ పోలింగ్ జరగనున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే, దీన్ని అక్కడి అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు జరిగిన పది రోజుల అనంతరం రీ పోలింగ్కు చర్యలేమిటంటూ ప్రశ్నించారు. అయితే, ఈసీ మాత్రం తగ్గలేదు. ఆ బూత్లలో ఈవీఎం లు మొరాయించినట్టు, సాంకేతిక లోపం కారణంగానే రీ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు సూచించింది. రీ పోలింగ్ : రీ పోలింగ్కు ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. సేలం లోక్ సభ పరిధిలోని సెంగలనై రోడ్డులోని మునిసిపల్ స్కూల్ ఆవరణలోని 213 బూత్లో, నామక్కల్ లోక్ సభ పరిధిలోని కొట్ట పాలయం పంచాయతీలోని 37వ బూత్లో శనివారం ఎన్నికలు జరిగాయి. రీ పోలింగ్తో ఆ బూత్ల పరిధిలోని ఓటర్లను రప్పించేందుకు రాజకీయ పక్షాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాల్సి వచ్చింది. సేలంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ఆరంభం కావాల్సి ఉండ గా, గంట ఆలస్యం అయింది. ఇందుకు కారణం ఆయా రాజకీయ పక్షాల ఏజెంట్లు రావడంలో నెలకొన్న ఆలస్యం. ఎట్టకేలకు తొలి ఓటును పాప్పాతి అనే మహిళ నమోదు చేశారు. గట్టి భద్రత నడుమ ఈ కేంద్రంలో పోలింగ్ జరిగిం ది. ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు పన్నెండు గంటల కు ఆ పోలింగ్ బూత్లో అత్యధికంగానే ఓట్లు నమోదు అయ్యాయి. ఇక, నామక్కల్ లోక్ సభ పరిధిలోని బూత్లో ఉదయాన్నే విద్యుత్ కోత పోలింగ్కు ఆటంకం సృష్టించిం ది. ఎట్టకేలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో కాస్త ఆల స్యంగానే ఓటింగ్ ఆరంభం అయింది. నామక్కల్ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గాంధీ సెల్వన్, సుందరంలో ఓటింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. రీ పోలింగ్లో ఓట్లు వేసిన వారికి మధ్య వేలికి సిరా చుక్కను పెట్టారు. సేలం బూత్లో 76 శాతం, నామక్కల్ బూత్లో 89 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంలకు సీల్ వేసి తిరుచంగోడు వివేకానంద కళాశాలకు తరలించారు. -
సేలం రైల్వే డివిజన్లో పటిష్ట భద్రత
సేలం, న్యూస్లైన్ :చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుళ్ల సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతలు కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా సేలం రైల్వే డివిజన్లో ఉన్న సేలం, నామక్కల్, ఈరోడ్, కరూర్, తిరుప్పూర్, కోయంబత్తూరు రైల్వేస్టేషన్లలో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్లు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ప్రతి రైలులోను బాంబు స్క్వాడ్, డాగ్స్క్వాడ్ నిపుణుల సాయంతో పోలీ సులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలోకి వెళ్లే ప్రతి ప్రయాణికుని, లగేజీలను తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. రైల్వే స్టేషన్లకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే పార్శిళ్లల్లోను తనిఖీలు చేస్తున్నారు. -
దేశాన్ని పరిపాలించే సత్తా కాంగ్రెస్కే
సేలం, న్యూస్లైన్ : భారత దేశాన్ని పరిపాలించే సామర్థ్యం కాంగ్రెస్కు మాత్రమే ఉందని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం సేలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయలేదని తెలిపారు. ఆ పార్టీ శ్రేణుల్లో సఖ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సఖ్యత లేని పార్టీ దేశాన్ని ఎలా పరిపాలించగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు వల్ల కార్యకర్తలు, ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. శ్రీలంక తమిళల హక్కుల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉందని జీకే వాసన్ పేర్కొన్నారు -
తెలుగోళ్ల పార్టీ!
తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భావం తెలుగు సంక్షేమ లక్ష్యంగా తీర్మానాలు రాందాసు నేతృత్వంలోని కూటమిలో చేరిక తమిళనాడులోని తెలుగు వారి సంక్షేమం లక్ష్యంగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలుగు మక్కల్ కట్చి పేరిట ఆవిర్భవించిన ఈ పార్టీ తెలుగు వారి హక్కుల కోసం ఉద్యమిస్తుందని పీఎంకే నేత రాందాసు ప్రకటించారు. పీఎంకే నేతృత్వంలోని సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్(ఎస్డీఏ) కూటమిలోకి ఈ తెలుగు పార్టీ చేరింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విరుదునగర్, సేలం, దిండుగల్, తేని, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోని యాభై శాతం మేరకు తెలుగు సంతతికి చెందిన వారు ఉన్నారు. మదురై, కోయంబత్తూరు, నామక్కల్, కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, చెన్నై, తూత్తుకుడి, విల్లుపురం జిల్లాల్లో 30 శాతం మేరకు తెలుగు వారు నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో తమిళుల తర్వాత రెండో స్థానంలో తెలుగు వారే ఉన్నారు. ఇక్కడ స్థిరపడిన అనేక కుటుంబాలు తమిళులతో మమేకం అయినా, మాతృ భాషను మాత్రం మరవడం లేదు. తెలుగు చదవడం రాయడం రాకున్నా...అనేక చోట్ల తెలుగులోనే మాట్లాడుకునే కుటుంబాలు ఎన్నో. అయితే, రాష్ట్రంలో తెలుగు వారు అల్ప సంఖ్యాకులే. రాష్ర్టంలో తెలుగును రక్షించుకునే రీతిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అదే సమయంలో ఎన్నికల వేళ పార్టీలూ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగు వారి సంక్షేమ నినాదాస్త్రంతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఆవిర్భవించినా, తెలుగోళ్లకు ఒరిగింది శూన్యమే. తాజాగా అదే నినాదంతో మరో కొత్త పార్టీ తెర మీదకు వచ్చింది. ఎన్నికల వేళ కోయంబత్తూరు వేదికగా తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భవించింది. తెలుగు మక్కల్ కట్చి: రాష్ర్టంలోని కుల సంఘాలను, పార్టీలను కలుపుకుని సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్(ఎస్డీఏ) కూటమిని బలోపేతం చేసే పనిలో పీఎంకే నేత రాందాసు ఉన్న విషయం తెలిసిందే. నెల వ్యవధిలో అనేక సంఘాలను చీల్చి రాజకీయ పార్టీల ఏర్పాటులో రాందాసు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో రెండో జాబితాలో ఉన్న తెలుగు వారి మీద ఆయన దృష్టి పడ్డట్టుంది. తెలుగు వారి సంక్షేమాస్త్ర నినాదంతో కోయంబత్తూరు వేదికగా తన స్వహస్తాలతో తెలుగు మక్కల్ కట్చి జెండాను పరిచయం చేశారు. కోయంబత్తూరుకు చెందిన తెలుగు సంతతికి చెందిన సీజే రాజ్కుమార్ నేతృత్వంలో తెలుగు మక్కల్ కట్చిని ఆవిర్భవించారు. రాష్ట్రంలో తెలుగును రెండో అధికార భాషగా ప్రకటించాలని, తెలుగు వారి సమస్యల్ని పరిష్కరించాలని, పీఎంకే నినాదం సంపూ ర్ణ మద్య నిషేదం అమలు లక్ష్యంగా తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భావ వేడుకలో తీర్మానాలు చేశారు. రాం దాసు ప్రసంగిస్తూ, రాష్ర్టంలో తెలుగు వాళ్లు అత్యధికం గా ఉన్నారని గుర్తు చేశారు. పలు కులాల పేరిట ఇక్కడ తెలుగు వారు స్థిరపడి ఉన్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మేరకు తెలుగు వారు ఉన్నట్టు జనాభా లెక్కల్లో తేలిందన్నారు. అయితే, తెలుగు వారి అభివృద్ధికి పాలకులు చేసిందేమీ లేదని విమర్శించా రు. అల్ప సంఖ్యాకులుగా అనేక సమస్యలతో తెలుగు వారు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారుని వివరించారు. అందుకే తెలుగు సంక్షేమ నినాదంతో రాజకీయ బలం చేకూరే విధంగా ఈ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్టీ తమ కూటమిలోకి చేరినట్టు ప్రకటించారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. పిల్లల వైద్యుడి అరెస్టు
కేరళలో ఎండీ చదువుతున్న విద్యార్థినికి అసభ్య చిత్రాలు, మెసేజీలు పంపుతూ లైంగికంగా వేధిస్తున్న పిల్లల వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని సేలం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్ (46)ను తమిళనాడు మహిళల వేధింపుల చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఎ సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు సేలం నగర పోలీసు కమిషనర్ ఎ. అమల్రాజ్ తెలిపారు. మొదట్లో ఆమె ఇక్కడ చదివేదని, అప్పట్లోనూ అతడు వేధించినా.. పెద్దగా పట్టించుకోకుండా వదిలేసిందని కమిషనర్ చెప్పారు. తర్వాత ఆమె కాలికట్ వైద్య కళాశాలలో ఎండీ కోర్సులో చేరింది. ఇక ఇప్పటికే పెళ్లయ్యి.. పిల్లలు కూడా ఉన్న ఆ వైద్యుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ఆమెను లైంగికంగా వేధిస్తూ, మొబైల్ ఫోన్కు మెసేజీలు పంపడం కొనసాగించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సెంథిల్ కుమార్ను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
కార్పొరేషన్లుగా తంజై, దిండుగల్
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు కార్పొరేషన్లు బుధవారం ఆవిర్భవించాయి. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా బాసిల్లుతున్న తంజావూరు, దిండుగల్ పట్టణాలు కార్పొరేషన్లు అయ్యాయి. తంజావూరు కార్పొరేషన్ తొలి మేయర్గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పది కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, సేలం, తిరునల్వేలి, తిరుప్పూర్, ఈరోడ్, తూత్తుకుడి, వేలూరు ఆ జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి పథంలో ఈ కార్పొరేషన్లు దూసుకెళ్తోన్నాయి. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలతో పాటుగా న గరాల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లు అన్నీ అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరాయి. దీంతో నిధుల వరద కార్పొరేషన్ల అభివృద్ధికి పారుతున్నాయి. మరో రెండు: కార్పొరేషన్ల సంఖ్య 12కు చేర్చేందుకు ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన, అభివృద్ధి దృష్ట్యా మరో రెండు నగరాలను కార్పొరేషన్లుగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో తంజావూరు, దిండుగల్ను చేర్చా రు. జిల్లా కేంద్రాలుగా ఉన్న ఈ నగరాల్ని మరింత అభివృద్ధి పరచడం లక్ష్యంగా నగర పాలక సంస్థను కార్పొరేషన్గా తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం నిర్ణయించింది. తంజావూరు జిల్లా అంటే, అందరికీ గుర్తుకొచ్చేది పల్లవ రాజులు, మదురై, తంజావూరు నాయక రాజు లు, పాండియ, విజయనగర రాజుల వైభవాన్ని చాటే కళా ఖండాలు, నిర్మాణాలే. తంజావూరు పెయిటింగ్స్, బొమ్మలు ప్రపంచ ప్రఖ్యా తి గాంచి ఉన్నాయి. యునెస్కో గుర్తింపును సైతం పొందిన తంజావూరు డెల్టా జిల్లాలో ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వస్తున్నది. తంజావురుకు నిత్యం వస్తున్న పర్యాటకులను, అక్కడి జనాభాను పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం తంజావూరు పురపాలక సంస్థను కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఇక దిండుగల్ అంటే, అందరికీ గుర్తుకు వచ్చేది పళని సుబ్రమణ్య స్వామితోపాటు ప్రకృతి అందాలను తనలో ఇముడ్చుకున్న కొడెకైనాల్. రైల్వే జంక్షన్గా, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న దిండుగల్ను సైతం కార్పొరేషన్ జాబితాలోకి చేర్చేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను అసెంబ్లీలో మంత్రి కేపి మునుస్వామి గత ఏడాది చివర్లో దాఖలు చేశారు. ఆవిర్భావం: పనులన్నీ చక చకా సాగుతుండడంతో తంజావూరు, దిండుగల్ కార్పొరేషన్లుగా బుధవారం ఆవిర్భవించాయి. మునిసిపాలిటీ కార్యాలయాలను కార్పొరేషన్లుగా తీర్చిదిద్దారు. అందుకు తగ్గ మౌళిక సదుపాయాలు, కౌన్సిల్ హాల్, కమిషనర్, మేయర్, ఇతర ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక గదులు రూపదిద్దుకున్నారుు. కార్పొరేషన్ పరిధిలోకి జనభా ప్రాతిపదికన అనేక గ్రామాల్ని చేర్చారు. సకాలంలో అన్ని పనులు ముగియడంతో ఆ రెండు మునిసిపాలిటీలు బుధవారం నుంచి కార్పొరేషన్లుగా మారినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి అన్నాడీఎంకే నాయకులు సంబరాలు చేసుకున్నారు. అధికారులకు స్వీట్లు పంచి పెట్టారు. తంజావూరు తొలి మేయర్గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మునిసిపాలిటీ చైర్మన్గా ఉన్న ఆమెకు మేయర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక దిండుగల్ కార్పొరేషన్గా ఆవిర్భవించినా, తొలి మేయర్ ఎవర్నది తేలాల్సి ఉంది. ఇది వరకు మునిసిపాలిటీగా ఉన్న దిండుగల్కు చైర్మన్గా వి మరుతరాజ్ వ్యవహరిస్తున్నారు. ఆయనకే తొలి మేయర్ చాన్స్ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
ప్లస్టూ విద్యార్థి ఆత్మహత్య
సేలం, న్యూస్లైన్:ప్లస్టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కేసులో పాఠశాల కరెస్పాండెంట్ సహా ఐదుగురిని నామక్కల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నామక్కల్లో కురింజి మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఇందులో మదురైకు చెందిన వెంకటేశన్ (17), ప్లస్టూ చదువుతున్నాడు. శనివారం ఉదయం వెంకటేశన్ బస చేసి ఉన్న హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీ సులు పంచనామా నిమిత్తం వెంకటేశన్ మృత దేహాన్ని నామక్కల్ జీహెచ్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు జీహెచ్కు వచ్చిన వెంకటేశన్ తల్లిదండ్రులు కళాశాల నిర్వాహకులే హత్య చేశారని ఆరోపించారు. ఆ సమయంలో వెంకటేశన్ అన్న శివ చిదంబరం మాట్లాడుతూ కొత్త సంవత్సరాది సందర్భంగా వెంకటేశన్ టీచర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కారణంగా పాఠశాల నిర్వాహకులే హత్య చేసినట్లు వెంకటేశన్ స్నేహితులు ఫోన్లో తమకు తెలిపినట్లు చెప్పాడు. అంతేకాకుండా వెంకటేశన్ భౌతికకాయానికి పోస్టుమార్టం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయరాదని, మదురై ఆస్పత్రిలో చేయిస్తామని తెలి పారు. అనంతరం వెంకటేశన్ తండ్రి శ్రీనివాసన్ నామక్కల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి పాఠశాల కరెస్పాండెంట్ తం గవేల్తో సహా ఐదుగురు తన కుమారుడిని హత్య చేసినట్టు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టా రు. అనంతరం నామక్కల్ పోలీసులు అర్ధరాత్రి 302 సెక్షన్ కింద పాఠశాల కరెస్పాండెంట్ తంగవేల్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి వెంకటేశన్ మృత దేహానికి నామక్కల్ జీహెచ్లోని పోస్టుమార్టం నిర్వహించారు. -
సేలంలో 65 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం
సేలం, న్యూస్లైన్ : దేశంలోనే అత్యంత ఎత్తై 65 అడుగుల ఎత్తుగల ఏసు క్రీస్తు విగ్రహాన్ని సేలంలో ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కె.వి.తంగబాలు ఆదివారం ఆవిష్కరించారు. సేలం జిల్లా పుత్రకౌండంపాళయం ప్రాంతంలోని 13వ సింగరాయన్ ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగబాలు మాట్లాడు తూ ప్రేమ, ఆప్యాయత, దయాగుణాలకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయన బోధనలను అనుసరించి సన్మార్గంలో నడవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సేలం మరై మండలాధికారి సింగరాయన్, అనేక మంది క్రైస్తవ మత బోధకులు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఆకాశమంత ఎత్తులో దర్శనమిస్తున్న ఈ విగ్రహాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. -
పోలీస్ కస్టడీకి ఫకృద్దీన్, బిలాల్
సేలం, న్యూస్లైన్: బీజేపీ నేత, ఆడిటర్ రమేష్ హత్యకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీస్ ఫకృద్దీన్, బిబాల్ మాలిక్లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి విజయలక్ష్మి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. వేలూరు జైలులో ఉన్న తీవ్రవాదులు ఫకృద్దీన్, బిలాల్ మాలిక్లను పోలీ సులు ఆడిటర్ రమేష్ హత్య కేసులో బుధవారం అరెస్టు చేశారు. వారిని గురువారం సేలం జ్యుడీషియల్ మేజి స్ట్రేట్ నంబర్ 4 కోర్టులో హాజరు పరి చారు. ఈ కేసుపై న్యాయమూర్తి విజయలక్ష్మి విచారణ జరిపారు. ఫకృద్దీన్, బిబాల్లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారిని సే లం సూరమంగళంలో ఉన్న మహిళా పో లీసు స్టేషన్లో ఉంచి విచారణ చేయాలని, మూడు రోజులకు ఒక వారి న్యాయవాది పుగళేంది, జాహీర్ అహ్మద్లను అర గంట కలుసుకోవచ్చునని తెలిపారు. అనంతరం వారిద్దరినీ పోలీ సులు బయటకు తీసుకు వస్తుండగా సేలంలోని పత్రికలు, టీవీ చానళ్ల విలేకర్లు, ఫొటో గ్రాఫర్లు ఫకృద్దీన్, బిబాల్లను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిం చారు. విలేకర్లను,ఫొటో గ్రాఫర్లను పో లీసులు తోసేశారు. దీంతో కెప్టన్ టీవీ రిపోర్టన్ నారాయణన్, దినమలర్ వెబ్ టీవీ రిపోర్టర్ జ్యోతి కింద పడి గాయపడ్డారు. దీంతో విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ముందుఉన్న ఏర్కాడు మెయిన్ రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న సేలం సిటీ డెప్యూటీ కమిషనర్ ఏజీ బాబు ఏర్కాడు సెంటర్కు చేరుకుని విలేకర్లతో చర్చలు జరిపారు. అనంతరం విలేకర్లు అక్కడ నుంచి న్యా యమూర్తి మోహన్దాస్ను కలుసుకుని పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
బావిలో శవమై తేలిన బాలుడు
సేలం, న్యూస్లైన్ : సేలంలో సోమవారం కిడ్నాప్కు గురైన బాలుడు మంగళవారం బావిలో శవంగా తేలాడు. సేలం పల్లపట్టి మారియమ్మన్ కోయిల్ వీధిలో నివాసముంటున్న లారీ మెకానిక్ తంగదురై (35). ఇతని భార్య తేన్మొళి. వీరి కుమారుడు బాలాజీ (10) ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న బాలాజీ అకస్మాత్తుగా కనిపించలేదు. కుమారుడి కోసం గాలిస్తుండగా తంగదురై వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు ఖర్చు చేస్తే చిక్కుతాడని తెలిపాడు. దీంతో సందేహించిన తంగదురై ఆయన బంధువులు ఆ వ్యక్తి ని సూరమంగళం పోలీసు స్టేషన్లో అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు గోపిచెట్టిపాళయంకు చెందిన దామోదరన్ (27), సూరమంగళంకు చెందిన ప్రభు (18), శివదాపురానికి చెందిన సంతోష్ (30), మనకోట్టైకు చెందిన కార్తీ (26), ధర్మన్ నగర్కు చెందిన కలైవాణి (34)లను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలాజీ కిడ్నాప్కు వారికి సంబంధం లేదని విచారణలో తేలింది. ఈ స్థితిలో మంగళవారం వేకువజామున పల్లపట్టి మారియమ్మన్ ఆలయం సమీపంలో ఉన్న దిగుడు బావిలో అగ్నిమాపక సిబ్బంది గాలిస్తుండగా బాలాజీ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తొలుత పోలీసులు పిట్టగోడ లేని ఆ బావి వద్ద ఆడుకుంటున్న బాలాజీ అందులో పడి మృతి చెంది ఉండవచ్చని భావించారు. అయితే సోమవారం మధ్యాహ్నం బావిలో పడ్డ బాలాజీ మంగళవారం ఉదయం శవంగా తేలడంపై పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా బాలాజీ శవం ఉబ్బకుండా, సాధారణ స్థితిలోనే ఉంది. దీంతో బాలాజీని నీటిలో తోసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచీ ఆ ప్రాంత యువకులు బాలాజీ కోసం ఆ బావిలో మంగళవారం వేకువ జాము 1.30 గంట వరకూ గాలించారు. అయినా బాలుడి జాడ తెలియరాలేదు. రెండు గంటల తర్వాత అంటే మంగళవారం వేకువజామున 3 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి బాలాజీ మృతదేహం లభ్యమైంది. మంగళవారం వేకువజామున 1.30-3 గంటల మధ్య సమయంలో బాలాజీని ఎవరైనా నీటిలో పడవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బాలాజీ శవంగా తేలడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు ఆవేశంతో ఆందోళన చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న దిగుడు బావి శిథిలావస్థకు చేరుకుని ఉంది. బావిని శుభ్రం చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దానినిపూడ్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో మూడు రోడ్ల ప్రాంతంలో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు బావిలో శవమై తేలడంతో సేలంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
గోడకూలి ముగ్గురి మృతి
సేలం, న్యూస్లైన్: తిరుచ్చిలో గోడకూలి ముగ్గురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచ్చి సింగారతోపు సమీపంలోని మదురై రోడ్డులో కమలేష్ పటేల్ కొయ్యమిల్లు ఉంది. కమలేష్ ఆ మిల్లును తొలగించి ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది కార్మికులు భవనానికి కడగాలు తీసేపనిలో నిమగ్నమయ్యూరు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారు తవ్వుతున్న స్థలం పక్కన ఉన్న భవనం కాంపౌండ్ గోడ వారిపై కూలిపోయింది. ఆ సమయంలో ముగ్గురు కూలీలు అప్రమత్తమై తప్పించుకున్నారు. మిగిలిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో తిరుచ్చి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇందులో ఉమారాణి, కన్మణి, పూంగోదైలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం తిరుచ్చి జీహెచ్కు తరలించారు. అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది తిరుచ్చి సమీపంలోని మరుదూర్కు చెందిన వారుగా గుర్తించారు. కలెక్టర్ జయశ్రీ, మురళీధరన్, సిటీ పోలీసు కమిషనర్ శైలేష్ కుమార్ యాదవ్, తహశీల్దార్ బాలదండాయుధం తదితరులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. -
బస్సు బోల్తా : 40 మందికి గాయాలు
సేలం, న్యూస్లైన్: నామక్కల్ జిల్లాలో బుధవారం సాయంత్రం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని కలెక్టర్ దక్షిణామూర్తి పరామర్శించారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు నుంచి బుధవారం సాయంత్రం ఒక ప్రైవేటు బస్సు 50 మంది ప్రయాణికులతో రాసిపురానికి బయలుదేరింది. ఆ బస్సు తిరుచెంగోడును దాటుకుని కొంత దూరం వెళ్లగానే రోడ్డుపై అదుపు తప్పి మెయిన్రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఆ సమయంలో ప్రయాణికుల అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను తిరుచెంగోడు, నామక్కల్ జీహెచ్లకు తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ దక్షిణామూర్తి బుధవారం రాత్రి నామక్కల్ జీహెచ్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తిరుచెంగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
సేలం, న్యూస్లైన్: మదురై సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కేరళీయులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలో కోట్టాన్కోడు గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ కుటుంబ సభ్యులు తమిళనాడులోని దేవాలయాలను దర్శించేందుకు కారులో బయలుదేరారు. సురేంద్రకుమార్ (44), అనిల్ కుమార్ (40), సిబిరా జ్ (28), కచ్యూ (35), అరుణ్ (33), మధు (27), శ్రీజిత్ (29) తదితరులు కారులో ఉన్నారు. అందరూ మంగళవారం మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకని బుధవారం వేకువజామున రామేశ్వరానికి బయలుదేరారు.మదురై జిల్లా నల్లమనాయకన్పట్టి గ్రామం వద్ద వెలుతుండగా కారు టైరు పేలిపోయింది. దీంతో వేగంగా వెళుతున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు పల్లంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సిబిరాజ్, అరుణ్, మధు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సురేంద్రకుమార్, అనిల్ కుమార్, కచ్యూ, శ్రీజిత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు మదురై జీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న కల్లికుడి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను మదురై జీహెచ్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రుల్లో శ్రీజిత్ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. -
లారీని ఢీకొన్న బస్సు
ప్యారిస్, న్యూస్లైన్: సేలంలో ఉప్పులోడుతో వెళుతున్న లారీని ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ మృతి చెందాడు. డ్రైవర్తో సహా పది మంది గాయాలపాలయ్యారు. సేలం సమీపంలో మంగళవారం వేకువజామున ఉప్పు లోడును ఎక్కించుకుని వస్తున్న లారీ, నాగపట్నం నుంచి సేలంకు వస్తున్న ప్రభుత్వ బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కండెక్టర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్తో సహా పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాలు.. నాగపట్టణం నుంచి సేలంకు సోమవారం రాత్రి ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు బయల్దేరింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేకువజామున 3.30 గంటలకు సేలం సమీపంలోని పల్లూర్ బైపాస్ రోడ్డు వంతెనపై వస్తుండగా ముందు వైపు తూత్తుకుడి నుంచి మేట్టూరుకు ఉప్పు లోడుతో వెళుతున్న లారీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు పెద్దపెట్టున కేకలు పెట్టారు. ముందు సీట్లో కూర్చుని ఉన్న కండక్టర్ నాగపట్నం తిరుకువలైకు చెందిన శివపుణ్యం (52) మృతి చెందాడు. బస్సు డ్రైవర్ మైలాడుదురైకు చెందిన దిల్కుమార్ (36), శివగంగైలోని పుదువలైకు చెందిన శక్తివేల్ (48), పులిపాండి కొంబై మలయాండి (33), సేలం కొండలాంపట్టి పరమశివం (30), తిరుచ్చి పెరంబలూర్ రాజమాణిక్యం వివేక్ (29), తిరుపత్తూర్ కుమార్ (18), పట్టుకోట్టై స్టాలిన్ (31), పుదుకోట్టై రాజేంద్రన్ (30)లతో సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సేలం పోలీసులు కేసు నమోదుచేశారు.