cylinder blast
-
గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. #Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025 -
అమీర్పేట్లో పేలుడు.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్పేట్లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అమీర్పేట్లోని రీసెంట్ కేఫ్ బేకర్స్లో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కేఫ్లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
బాణాసంచా గోడౌన్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు
-
మాదాపూర్ పోలీసు స్టేషన్లో సిలిండర్ పేలుడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పేలుడు చోటు సంభవించింది. సీజ్ చేసిన సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరికొని మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలతో పోలీసు సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీసింది. సమీపంలో పేల్చిన టపాకాయల మంటలు సిలిండర్లపై పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పూలే విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం ఏంటీ? -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
China: గ్యాస్ బండ పేలి 31 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం. నార్త్వెస్ట్రన్ నగరం ఇంచువాన్లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న రెస్టారెంట్.. జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే యత్నం చేశాయి. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి. స్వయంప్రతిపత్తి ఉన్న నింగ్క్సియా రాజధాని ప్రాంతమే ఇంచువాన్. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కోసం మూడురోజులపాటు సెలవులు ప్రకటించారక్కడ. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చినవాళ్లే ఎక్కువగా మృతుల్లో ఉన్నారు. ఇంచువాన్లో ప్రమాదం జరిగిన ఓవైపు ఈ వీధిలో గ్లాస్ ముక్కలు, చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు.. మరోపక్క అయినవాళ్ల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న బంధువుల రోదనలతో హృదయ విదారకమైన దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఘటనపై అధ్యక్షుడు జీ జింగ్పిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని, ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 🇨🇳 | URGENTE: Al menos 31 muertos en una explosión en un restaurante en la ciudad de Yinchuan, en el noroeste de China.#yinchuan #China #URGENTE #ULTIMAHORA pic.twitter.com/ZMnLqI2VfF — eljournalnews.ec (@eljournalnewsec) June 22, 2023 Al menos 31 personas murieron después de una explosión de gas en un restaurante de barbacoa en #Yinchuan, capital de la Región Autónoma Ningxia Hui del noroeste de #China, la noche de este #miércoles, según informes de los medios locales citando a las autoridades pic.twitter.com/scC1QeJGWg — @UlisesMtv (@UlisesMtv) June 22, 2023 ఇదీ చదవండి: ఏం ఎండలురా భయ్.. మాడిపోతోందీ మనోళ్లే! -
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
నామాపై చీమలపాడు గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ ఆర్భాటంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంపై చీమలపాడు గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. తమ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ప్రమాదానికి కారకుడయ్యాడంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మండిపడుతున్నారు వాళ్లు. బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా రావడమే కాకుండా.. ప్రమాదంతో తమకు సంబంధం లేదని ప్రకటించడంపై రగిలిపోతున్నారు. బాణాసంచా కాల్చింది బీఆర్ఎస్ శ్రేణులు, నామా వర్గీయులు కాదా అని చీమలపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారీ పేలుడుతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అంత ఉలిక్కిపడి భయాందోళలనకు గురయ్యాం. పేలుడు దాటికి ఆరుగురికి పైగా కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. నామా చెప్తున్నట్లు కాకుండా.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న చీమలపాడు గ్రామస్తులు నిరసనలకు దిగారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చీమలపాడు బాధితులకు పరిహారం ప్రకటించింది. ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. అయితే చీమలపాడు గ్రామస్తులు మాత్రం.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో తమ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు.. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉందని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలింది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి వెళ్లడంతో గాయపడ్డారు. ఆ సమయంలో మేం స్టేజీ మీద ఉన్నాం. ఆరుగురు గాయపడ్డారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు వేరే ఆస్పత్రిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగాయి. ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఆస్పత్రిలో చేర్పించినవారికి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఒకరికి మాత్రం సీరియస్గా ఉందన్నారు. కలెక్టర్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలిన చెప్పాను. అవసరమైతే హైదరాబాద్కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. గుడిసెలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిలిండర్ పేలడానికి, మా మీటింగ్కు సంబంధం లేదు. 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. అలా అని తాము పట్టించుకోమని కాదు అని నామా మీడియాతో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో.. గుడిసెలో ఉన్న సిలిండర్ను వాళ్లు గమనించలేదు. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు. మరో వైపు ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్య నేతలకు సూచించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చీమలపాడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందటం లేదని క్షతగాత్రుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో పట్టించుకునే వారు దిక్కులేరని. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ముగ్గురు చనిపోయారని, ఆలస్యం చేస్తే మరో ముగ్గురు కూడా చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్,బిజెపి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు. -
పెళ్లిలో పేలిన సిలిండర్.. 32కు చేరిన మృతులు.. సీఎంపై బీజేపీ ఫైర్
జైపూర్: రాజస్థాన్ జోధ్పుర్లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. శుక్రవారం మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జోధ్పుర్లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్పుర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది. రూ.2 లక్షలు పరిహారం.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
Hyderabad: రాంగోపాల్పేటలోని అపార్ట్మెంట్లో పేలుడు
-
సికింద్రాబాద్లోని అపార్ట్మెంట్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు సందీప్, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్ లీక్ కావడంతో రూమ్ అంతా గ్యాస్ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్ వెలిగించడంతో సిలిండర్ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్పై నిర్మల ఫైర్ -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
బెలూన్లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి
నాగ్పూర్: బెలూన్లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆ చిన్నారి వ్యవసాయంలో ఉపయోగించే ఎద్దుల ప్రాముఖ్యతను తెలియజేసే తాన్హాపోలా పండుగ వేడుకలకు తన తాతాతో కలిసి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారికి తాతా ఒక బెలూన్ని కొనివ్వబోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగ్పూర్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్పూర్ తాలుకాలోని షిండే గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. అక్కడ బెలూన్లో గాలిని నింపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఆ చిన్నారి కాలిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు అచల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు) -
సిలిండర్ పేలుడు.. నలుగురి దుర్మరణం
ఘోర ప్రమాదంతో జమ్ము ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఓ దుకాణంలో సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జమ్ములోని నివాస సముదాయాల నడుమ ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్కారణంగా మంటలు చెలరేగాయి. అదే దుకాణంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని జమ్ము అదనపు డీజీపీ ముకేష్ సింగ్ వెల్లడించారు. అనుమతులకు విరుద్ధంగా షాపులో సిలిండర్ ఉంచిన విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారాయన. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. తీవ్రంగా గాయపడిన వాళ్లకు లక్ష, స్వల్ఫ గాయాలైనవాళ్లకు 25 వేల రూపాయలు ప్రకటించినట్లు గవర్నర్ అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. An ex-gratia of Rs.5 Lakh each to be given to the families of the deceased in Jammu LPG Cylinder blast incident. Ex gratia of Rs.1 Lakh to be given to the seriously injured and Rs.25,000 to those with minor injuries. — Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022 Deeply saddened by the loss of lives due to LPG cylinder blast at a scrap shop in Jammu. My condolences to the bereaved families & prayers for speedy recovery of the injured. Directed the district administration to provide all the necessary assistance. — Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022 -
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
అమరావతి రైతుల పాదయాత్రలో అపశ్రుతి
జరుగుమల్లి: అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఉప్పలపాడు నుంచి మండల పరిధిలోని చిర్రికూరపాడుకు పాదయాత్రగా బయలుదేరి వస్తుండగా చిర్రికూరపాడు గ్రామ పొలిమేరకు చేరుకునేసరికి బెలూన్స్కు గాలి నింపుతున్న సిలిండర్ పైప్ లీక్ అయ్యి సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో రోజువారీ కూలి కోసం విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చిన మేడా నవీన్ (21), షాకలబత్తుల భాస్కర్రావు (16), విన్నకోట రాఘవేంద్రరావు (60)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఎస్ఐ రజియా సుల్తానాబేగం వివరాలు సేకరించారు. రాఘవేంద్రరావుకు వెన్నుపూస విరిగిపోయి పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. పోలీసులు వెంటనే బెలూన్స్, సిలిండర్ ఉన్న ఆటోను పాదయాత్ర నుంచి తొలగించారు. ఈ పేలుడుతో పాదయాత్రకు వచ్చిన చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
పాకిస్తాన్లో వరుస సిలిండర్ల పేలుడు; వీడియో వైరల్
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ సిటీలో మంగళవారం భయానక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బర్కత్ మార్కెట్లో భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ఆ అడవి మహిళలకు మాత్రమే.. మగవాళ్లు వస్తే ఇక అంతే! డ్రోన్తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే #BREAKING : 🚨 Huge Cylinder Blast In Barkat Market, Garden Town Lahore, Pakistan.!! pic.twitter.com/HZNQlsv5Hp — NewsBox India🚨 (@Newsbox_India) June 29, 2021 شروع کی ویڈیو pic.twitter.com/zgZzWwVHjA — Ali hassan Rao (@Alihass68134141) June 29, 2021 -
విషాదం : ముంబైలో సిలిండర్ పేలుడు
ముంబై : ముంబైలోని లాల్బాగ్ ఏరియాలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన స్థలంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. -
భయానకం : జమ్మూ హైవేపై సిలిండర్ల పేలుడు
-
భయానకం : హైవేపై సిలిండర్ల పేలుడు
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. దాదాపు 45 నిమిషాల పాటు ట్రక్కులో ఉన్న డజనుకు పైగా సిలిండర్లకు మంటలంటుకొని బారీ శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడి స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అయింది. దీంతో పాటు రహదారికి ఇరువైపుల బారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉధంపూర్ ఎస్పీ రాజీవ్ పాండే మాట్లాడుతూ...' 300 సిలిండర్ల లోడుతో జమ్మూలోని బారీ బ్రాహ్మణ నుంచి నార్త్ కశ్మీర్లోని సోపోర్కు బయలుదేరింది. కాగా ట్రక్కు జమ్మూ కశ్మీర్ హైవేపై ఉన్న తిక్రి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా సిలిండర్లకు మంటలంటుకున్నాయి. కాగా 45 నిమిషాల పాటు 100 ఫీట్లకు పైగా సిలిండర్లు పైకి ఎగురుతూ కింద పడ్డాయి. ఈ సమయంలో దారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ట్రక్కు డ్రైవర్ ఉజ్జలసింగ్ సిలిండర్ల పేలుడు జరుగుతున్న సమయంలోనే ట్రక్కును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.' అత్యధిక ఉష్ణోగ్రతతోనే ట్రక్కులో సిలిండర్ల పేలుడు జరిగిందేమోనన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాజీవ్ పాండే తెలిపారు. -
గ్యాస్లీకై పేలుడు
కర్నూలు, వెల్దుర్తి: పట్టణ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇంటి గది పూర్తిగా ధ్వంసమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గొల్ల మురళి, భార్య లక్ష్మి (దివ్యాంగురాలు) రెండు సంవత్సరాలుగా.. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఎల్లకృష్ణ, పరశురాముడు ఉన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని కార్మికులకు నిర్మించిన గదిలోనే కుటుంబమంతా నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసుకుని, తలుపులు, కిటికీలు మూసుకుని నిద్రించారు. మురళి.. బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో నిద్ర లేచి లైట్ వేయడంతో అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. మంటలు వ్యాపించడంతో మురళితోపాటు నిద్రిస్తున్న అతని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి గది తలుపులు, కిటికీలతో సహా మూడు వైపులా ఉన్న ఇటుక గోడలు చెల్లాచెదురయ్యాయి. పైకప్పు కూలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మురళి, అతని భార్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెల్దుర్తి తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు ప్రమాదానికి కారణమేమి? కుటంబ సభ్యులు నిద్రిస్తున్న గదిలోనే వంట గది కలిసి ఉండడం, వంటకు ఉపయోగించే గ్యాస్ లీకై రాత్రంతా గదిలో వ్యాపించి, మురళి లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిద్రించే సమయంలో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతోపాటు, స్టవ్ నాబ్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడమా?, లేదా సిలిండర్, పైప్ లీకేజీనా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో కేవలం కుటుంబ సభ్యులకే మంటలు వ్యాపించడం, తక్కిన ఏ వస్తువులకూ ఏమీ కాకపోవడం, గదిలోనే ఉన్న గొర్రెపిల్ల క్షేమంగా ఉండడం బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావ్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పేద కుటుంబంలో తీవ్ర విషాదం గ్యాస్ ప్రమాదంలో గాయపడ్డ మురళి, భార్య లక్ష్మి 15 ఏళ్లుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమైనా ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన గదిలోనే తలదాచుకుంటూ తమ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఘోర ప్రమాదం..10 మంది మృతి
లక్నో : ఉత్తర ప్రదేశ్లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మవు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఇంట్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్రగాయాలు
సాక్షి, చిత్తూరు : మిట్టూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో శాంతి(55), సుకన్య(40), ఉమాదేవి(30), పూర్ణిమ(32), మధు(7), అను దీపిక(8) పూర్తిగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
-
చిరంజీవి సర్జా సినిమా షూటింగ్లో తల్లి, బిడ్డ మృతి
సాక్షి బెంగళూరు: నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా షూటింగ్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డా మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్ (5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు. నగరంలోని బాగలూరు వద్ద రణం సినిమా షూటింగ్ జరుగుతోంది. సుయేరా బాను తన ఐదేళ్ల చిన్నారితో కలసి షూటింగ్ చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను దర్శకుడు తీస్తున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా సిలిండర్ పేలింది. తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మరణించగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఘటనా ప్రాంతానికి బాగలూరు పోలీసులు చేరుకుని మృతదేహాలను యలహంక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించారు. రణం చిత్రంలో చిరంజీవి సర్జా, చేతన్ కుమార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కనకపుర శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వి.సముద్రం దర్శకత్వం వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న నటుడు చేతన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోగా పోలీసులు విచారణ చేపట్టారు. చేతన్ మాట్లాడుతూ సిలిండర్ పేలుడు ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సహాయం ఉంటుందని చెప్పారు. గడిచిన రెండు రోజులుగా షూటింగ్లో పాల్గొన్నానని, శుక్రవారం జరిగిన షూటింగ్లో తనకు సీన్లు లేవని చెప్పారు. కారు బ్లాస్ట్ సీన్ ఉందనే విషయం మాత్రం తనకు తెలుసునని, మరో చిన్నారి గాయపడిఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసిందని, తనని పరామర్శిస్తానని తెలిపారు. పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసి మిగిలిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయారు. చిరంజీవి సర్జా వేరొక చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు మైసూరుకు తరలివెళ్లారు. -
లాడ్జిలో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయవాడ: విజయవాడ బందర్ రోడ్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సిద్దార్థ మహిళా కళాశాల సమీపంలోని ఓ లాడ్జిలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ లాడ్జిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. -
సిలిండర్ పేలి కుటుంబం దుర్మరణం
సేలం: గ్యాస్ సిలిండర్ పేలి కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కొడైకెనాల్ కొండ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. దిండుకల్ జిల్లా కొడైకెనాల్ కీల్మలై ప్రాంతంలోని మంగళం కొంబు గ్రామానికి చెందిన రైతు గణేశన్ (51). ఇతని భార్య మంజుల (43). వీరి కుమార్తె విష్ణుప్రియ (9). గణేశన్ తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కుమార్తె విష్ణుప్రియ గ్రామానికి సమీపంలోని చిన్నాలంపట్టిలో ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. కుమార్తె చదువు నిమిత్తం గణేశన్ కుటుంబాన్ని ఇటీవల చిన్నాలంపట్టికి మార్చాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అప్పుడప్పుడూ మంగళం కొంబు గ్రామానికి వచ్చి వెళుతుంటాడు. ప్రస్తుతం విష్ణుప్రియకు అర్ధ సంవత్సర పరీక్షల సెలవులు ఇవ్వడంతో భార్య బిడ్డలతో గణేశన్ సొంతూరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే ముగ్గురు భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6గంటల సమయంలో మంజుల మేల్కొని కాఫీ పెట్టడానికి గ్యాస్ స్టౌ వెలిగించింది. అకస్మాత్తుగా భారీ శబ్దంతో గ్యాస్ స్టౌ పేలింది. ప్రమాదంలో గణేశన్, మంజుల, విష్ణుప్రియ సజీవదహనమయ్యారు. శబ్దం విని ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. సమాచారంతో తాండికుడి పోలీసులు సంఘటన స్థలానకి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ జీహెచ్కు తరలించారు. తాండికుడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగానే పేలుడు సంభవించినట్టు తెలిసింది. దంపతుల పంచ ప్రాణాలు కుమార్తె పైనే: గణేశన్, మంజుల దంపతులకు వివాహమైన ఏళ్లయినా సంతా నం కలగలేదని, దేవుళ్లకు ఎన్నో మొక్కులు మొక్కగా వరంగా విష్ణుప్రియ పుట్టిందని గ్రామస్తు లు తెలిపారు. అప్పటి నుంచి కుమార్తెనే ఆ దంపతుల పంచ ప్రాణంగా చూసుకుంటున్నా రన్నారు. కుమార్తె చదువు కోసం పుట్టి పెరిగి, జీవనం సాగిస్తున్న గ్రామాన్ని సైతం వదిలి వెళ్లడానికి గణేశన్ వెనుకాడలేదన్నారు. విష్ణుప్రియ వెళదామంటేనే ఇప్పు డు గ్రామానికి వచ్చారని. తమతోనే కుమార్తెను కూడా తీసుకుపోవడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. దంపతులు గణేశన్, మంజుల (ఫైల్) ధ్వంసమైన ఇల్లు -
ఫిలింనగర్లో సిలిండర్ పేలుడు
బంజారాహిల్స్: ఫిలింనగర్లోని బసవతారకానగర్లో ఆమ్లెట్లు వేసుకునేందుకు గ్యాస్పొయ్యి వెలిగిస్తుండగా అప్పటికే లీకవుతున్న గ్యాస్తో ఒక్కసారిగా మంటలు అంటుకొని సిలిండర్ పేలి ముగ్గురు పిల్లలు సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపినమేరకు.. బిహార్కు చెందిన అబ్దుల్(26), సాజిద్(28), ఎండీ నిసార్(28), ఎండీ ఇలియాస్(30)లు గురువారం రాత్రి విధులు ముగించుకొని బసవతారకనగర్లోని తమ ఇంటికి వచ్చారు. రాగానే నిసార్ ఆమ్లెట్ వేయడానికి గ్యాస్ పొయ్యి వెలిగించగా అప్పటికే గ్యాస్ లీకవుతుండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలి ఇంటి పైకప్పు రేకులు దూరాన ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్న ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమై మంటలు అంటుకున్నాయి. ఈ నలుగురితో పాటు పక్కింట్లో నివసిస్తున్న భార్యభర్తలు తిరుపతయ్య, బాలిదతో పాటు వారి పిల్లలు స్వామి, అనిల్, సంజయ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఐదుగురిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అబ్దుల్, సాజిద్, నిసార్, ఇలియాస్లు కూడా తీవ్ర గాయాలపాలవడంతో వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి రేకులు విరిగిపోయి గోడలు కుప్ప కూలడంతో చుట్టుపక్కల వారు భయాందోళలకు గురయ్యారు. హాహా కారాలతో ఆ ప్రాంతమందా హృదయవిదారకంగా మారింది. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన సిలిండర్
నందిపేట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం బస్టాండు సమీపంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రోడ్డున గల ఆరు దుకాణాలు (కోకాలు) పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిన్న సిలిండర్లు విక్రయించుకునే బుక లింబాద్రి డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో ఆయ న బయటకు పరుగులు తీశాడు. ఆయనను చూసి పక్క దుకాణాల యజమానులు సైతం పరుగులు పెట్టి బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే పెద్ద శబ్ధంతో సిలిండర్పేలి పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో గాలి వీయడం, చుట్టుపక్కల ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకా ణ యజమానులు తమ దుకాణాలలో గల సామగ్రిని కాపాడుకునేందుకు బయటకు విసి రేశారు. ఫైర్ ఇంజనుకు ఫోన్ చేసినా సమాయానికి రాలేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో మంటలు అంటుకున్న దుకాణాలను పక్కకు తొలగించారు. ఇతర దుకాణాలకు మంటలు అంటకుండా ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో సిలిండర్ దుకాణంతో పాటు చెప్పుల దుకాణం, కిరాణ షాఫు, పెస్టిసైడ్, బట్టల దుకాణం, పూల దుకాణం మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇందులో బిల్ల నారాయణ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణం, రాంబాబుకు చెందిన పెస్టిసైడ్, ఇతరుల చెప్పులు, బట్టల దాకాణాల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ. 30లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితులు వాపోయారు. అగ్రి ప్రమాదం సాయత్రం 5.15 గంటలకు జరుగగా సుమారు గంట ఆలస్యంగా అగ్ని మాపక సిబ్బంది వచ్చారు. వారు సకాలంలో వచ్చి ఉంటే నష్టం అంతగా జరిగేది కాదని స్థానికులు పేర్కొన్నారు. -
ముగ్గురిని బలిగొన్న వివాహేతర బంధం
ఆత్మకూరు(పరకాల) వరంగల్ : తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. క్షణికావేశంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనలో మహిళతోపాటు నిందితుడి తండ్రి, నానమ్మ కూడా మృతిచెందా రు. దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50), తన భార్య కౌసల్య, కుమారుడు, కుమార్తెతో హన్మకొండలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ప్లంబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కంఠాత్మకూరు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన వితంతువు పోతరాజు సుమలత(38)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు గతంలో హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కాగా భర్త మృతిచెందడంతో ప్రస్తుతం పైడిపల్లి సమీపంలో నివాసముంటోంది. ఈ క్రమంలో సుమలత, కుమారస్వామి పరిచయం పెరిగి తరచు కంఠాత్మకూరుకు వచ్చివెళ్తున్నారు. అప్పటి నుంచి అతడు హన్మకొండకు రాకుండా కుటుం బాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో కుమారస్వామి కుమారుడు కార్తీక్ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం అతడు తన తండ్రికి ఫోన్ చేయగా కంఠాత్మకూరులో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కార్తీక్ ఆగ్రహంతో వెంటనే కంఠాత్మకూరుకు బయల్దేరాడు. నేరుగా రాత్రి ఇంట్లోకి పెట్రోల్ డబ్బాతో ప్రవేశించాడు. ముందుగా సుమలతపై పెట్రోల్ పోస్తుండగా కుమారస్వామి అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో కుమారస్వామిపై కూడా పెట్రోల్ పడింది. వెంటనే సుమలతకు కార్తీక్ నిప్పంటించాడు. దీంతో కుమారస్వామి మంటలార్పే ప్రయత్నం చేయగా అతడిపై కూడా పెట్రోల్ ఉండడంతో అతడు కూడా అగ్నికీలల్లో దగ్ధమయ్యాడు. అదేసమయంలో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన జరుగుతుండగానే కుమారస్వామి తండ్రి లింగయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసుల అదుపులో నిందితుడు? నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీసీపీ సంఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటన వివరాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే.. వేరొక మహిళతో కుమారస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే కార్తీక్ సజీవ దహనానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదని, దీంతో కార్తీక్ తరచుగా ఇదే విషయంలో తండ్రితో గొడవపడేవాడని స్థానికులు వెల్లడించారు. -
సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనం
-
రంగారెడ్డి జిల్లాలో విషాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం నాన్దార్ఖన్పేట్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం టీ పెడుతుండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
నిజామాబాద్ జిల్లాలో పేలిన సిలిండర్
-
ఉపాధ్యాయుడి సాహసం.. తప్పిన ప్రమాదం
విశాఖపట్నం, గొలుగొండ (నర్సీపట్నం): పప్పుశెట్టిపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించి ఇద్దరు గాయపడ్డారు. ఉపాధ్యాయుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. మంటలు పాఠశాల గది స్లాబ్ వరకు దట్టంగా వ్యాపించడంతో చిన్నారులు హడలిపోయారు. వెంటనే ఉపాధ్యాయుడు శ్రీపాద లక్ష్మీనరసింహ (నాగు) పక్కనున్న గోనెను తీసుకొని మంటలను అదుపు చేస్తూ చిన్నారులను బయటకు పారిపోవాలని అరిచారు. చిన్నారులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు నాగుతోపాటు మరో విద్యార్థినికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పప్పుశెట్టిపాలెం పాఠశాలలో బుధవారం నుంచి గ్యాస్పై మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్, పొయ్యి సిద్ధం చేశారు. కొత్తగా కొనుగోలు చేసిన పొయ్యి ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ ఏర్పాటు చేసి వెలిగించారు. అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ 20 మంది విద్యార్థులు ఉండటంలో వారికి ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు నాగు పక్కన ఉన్న గోనెతో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ విద్యార్థులను అప్రమత్తం చేశారు. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఆ ఉపాధ్యాయుడి చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. శివజ్యోతి అనే విద్యార్థినికి స్వల్పగాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు నా గును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివజ్యోతిని తల్లిదండ్రులు గొలుగొండ పీహెచ్సీకి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చా రు. వాహనం వచ్చే సరికే గ్రామస్తులు ఇసుక, నీటితో మంటలు అదుపు చేశారు. గొలుగొండ ఎస్ఐ ఉమామహేశ్వర్రావు సంఘటన వివరాలు సేకరించారు. ఆర్డీవో జోక్యంతో వైద్యం నర్సీపట్నం: గ్యాస్ సిలెండర్ లీక్తో గాయపడిన ఉపాధ్యాయుడు నాగు మాస్టర్కు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. గాయ పడిన నాగును 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అప్పటికి సిబ్బంది మాత్ర మే ఉన్నారు. 2 గంటలకు తీసుకువచ్చిన ఉపాధ్యాయుడిని 3.30 వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విశాఖ కేజీహెచ్ తీసుకువెళ్ళాలని సి బ్బంది సూచించడంతో ఈ విషయాన్ని తోటి ఉపాధ్యాయులు పీఆర్టియు యూనియన్ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఉపాధ్యాయ నాయకులు జి.రమేష్, వరహాలనాయుడు సిబ్బందిని నిలదీశారు. యూనియన్ నాయకులు ఈ విషయాన్ని మంత్రి అయ్యన్న దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్డీవో కె.సూర్యారావు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధా శారదకు ఫోన్ చేసి రప్పించారు. ఆమె వెంటనే వైద్యులను రప్పించి నాగుమాస్టర్కు వైద్యం అందించడంతో వివాదం సద్దుమణిగింది. -
రాజంపేటలో ఇంట్లో పేలిన సిలిండర్
-
పేలిన సిలిండర్,ముగ్గురికి గాయాలు
-
పేలిన సిలిండర్: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ పాత సామాన్ల షాపులో సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
సిలిండర్ పేలి.. బేకరీలో భారీ అగ్నిప్రమాదం!
చెన్నై: నగరంలోని ఓ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోడుంగయుర్ ప్రాంతంలోని మీనంబల్ వీధిలో ఉన్న బేకరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే బేకరీలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 48మందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కిల్పాక్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని తమిళనాడు ముఖ్యంమంత్రి పళనిస్వామితోపాటు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం పళనిస్వామి హామీ ఇచ్చారు. -
స్వాగత్ గ్రాండ్లో సిలండర్ పేలుడు
హైదరాబాద్: కాప్రాసర్కిల్ ఏ.ఎస్.రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ సిలిండర్ పేలుడు విషయాన్ని హోటల్ యాజమాన్యం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది
ఢిల్లీ: మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అవే మంటలకు ఆహుతి అయ్యారు. ఈ ఘోర ప్రమాదం పశ్చిమ ఢిల్లీలోని ఫుడ్ స్నాక్స్ షాపులో సంభవించింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో షాపులో మంటలు చెలరేగాయి. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది షాపు షెట్టర్ ఎత్తడంతో అందులోఉన్న గ్యాస్ సిలీండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడికక్కడే హరి సింగ్ మీనన్ (55) హారిఓమ్ (56)లు మృతి చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ క్షతగాత్రులను పరామర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడం, గ్యాస్ లీకేజి గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రజలు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాదలు జరగకుండా అవగాహన కల్పించడం ఎంతో అవసరమని జైన్ పేర్కొన్నారు. -
సిలిండర్ పేలి మహిళ సజీవదహనం
విజయవాడ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన విజయవాడలోని మధురానగర్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ మంటలకు ఆహుతై సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హయత్నగర్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ రాఘవేంద్రనగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ పేలుడు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొడుగులవీధిలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడడంతో పాటు పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయం ఓ మహిళ ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించగా సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దాంతో ఆమె గాయపడింది. పేలుడు విన్న ఇరుగుపొరుగువారు పరుగున వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇరుగుపొరుగున ఉన్న పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయమే ఇళ్లలోని వారు కూలిపనులకు వెళ్లిపోవడంతో పెను ముప్పు తప్పింది. గాయపడిన మహిళను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది పూరిగుడిసెలు నేలమట్టం కావడంతో పేదలు సర్వస్వం కోల్పోయారు. -
గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం
గోదావరిఖని: కరీంనగర్జిల్లా గోదావరిఖనిలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దారా దాసు అనే రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ కుటుంబసభ్యలుతో కలిసి చర్చికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల యువకులు గమనించి వెంటనే మంటలు ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇంట్లో వంటకు ఉపయోగించే చిన్న సిలిండర్ ఒకటి పేలి పక్క ఇళ్లపై పడింది. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరో సిలిండర్ కూడా కాలిపోయింది. ఇంట్లో ఇంకా రెండు సిలిండర్లు కూడా ఉన్నాయని, అవి పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వన్ టౌన్ ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
నార్సింగిలో పేలిన సిలిండర్
హైదరాబాద్: రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిన్ తయారు చేస్తుండగా సిలిండర్ పేలిన సంఘటన మంగళవారం నార్సింగిలో జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. క్లూస్ టీం రంగంలోకి దిగి ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఐఎన్ఎస్ నిరీక్షక్లో పేలుడు: ముగ్గురికి గాయాలు
త్రివేండ్రం: భారత నేవీకి చెందిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిరీక్షక్లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ ఛార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నౌక విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్తుండగా త్రివేండ్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 16న నౌకలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక డైవర్, ఇద్దరు నావికులు గాయపడినట్లు కెప్టెన్ శర్మ బుధవారం వెల్లడించారు. -
బీర్కూర్లో పేలిన సిలిండర్: నలుగురికి గాయాలు
బీర్కూర్ : నిజామాబాద్ జిల్లాలో బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోచారం కాలనీకి చెందిన గంగవ్వ అనే మహిళ ఇంట్లో గ్యాస్ స్టవ్ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో గంగవ్వ(60) కు తీవ్రగాయాలు కాగా, పీరవ్వ(35), సాయికృష్ణ(40), గంగామణి(8) అనే ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవ దహనం
మదనపల్లి: చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మదనపల్లి నక్కలదిన్నె తండాలో రాజానాయక్ (28) ఒక్కడే ఇంట్లో ఉండగా, తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో, మంటల్లో చిక్కుకుని రాజానాయక్ మృతి చెందాడు. -
బేకరీలో పేలిన సిలిండర్
కర్నూలు : కర్నూలు నగరంలోని రాజ్విహార్ సెంటర్ మయూరీ బేకరీలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బేకరీలోని సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. దాంతో అగ్ని కీలలు భారీగా ఎగసి పడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. అగ్నిప్రమాదంలో బేకరీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం వల్ల రూ. 50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. -
ఇంట్లో పేలుడు : ముగ్గురు సజీవ దహనం
షాద్నగర్ (మహబూబ్నగర్ జిల్లా) : ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం పటేల్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పటేల్ రోడ్డుకు చెందిన యాదగిరి లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా అతను అక్రమంగా ఇంట్లో కిరోసిన్, పెట్రోలును నిల్వ ఉంచుతున్నాడు. అయితే ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నిద్రస్తున్న అతని భార్య జయ(50), కుమారులు చిట్టి(19), చరణ్(7)లు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన మరో కుమారుడు భరత్ షాద్నగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
-
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. -
పేలిన గ్యాస్ సిలిండర్..తప్పిన ప్రమాదం
మల్కాజిగిరి : వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సైదులు కథనం ప్రకారం..వసంతపురికాలనీకి చెందిన రావులపల్లి అంజయ్య(64) కార్పెంటర్ పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే బుధవారం తల్లి మూడో వర్ధంతి ఉండటంతో అంబర్పేట్ నుంచి వచ్చిన కూతురు ఉష వంట చేయడానికి గ్యాస్ స్టౌ వెలిగించగానే రెగ్యులేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ సంఘటనతో ఆమెకు చేతికి, కాలికి, తండ్రి అంజయ్య ముఖానికి గాయాలయ్యాయి. వారు వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చారు. ఆ వెంటనే ఒక్కసారిగా సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లో సామాన్లు కాలిబూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో తండ్రి, కూతురు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితమే సిలిండర్ తీసుకున్నామని గ్యాస్ లీకేజీని గమనించలేక పోయామని అంజయ్య తెలిపారు. -
సిలిండర్ పేలి దంపతులకు గాయాలు
-
రాజమండ్రిలో అగ్నిప్రమాదం
రాజమండ్రి క్రైం: రాజమండ్రి లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన రాజమండ్రిలోని ఆశోక థియేటర్ వెనక భాగంలో ఉన్న పూరింట్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసెకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున ఎగిసి పడటంతో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
లారీలో పేలిన సిలిండర్
నల్గొండ : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వద్ద ఓ లారీ క్యాబిన్లోని వంట సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న (ఏపీ25డీబీ 5468) లారీ వంట చేసుకోవడానికి వేములపల్లి వద్ద ఆగింది. వంట చేసుకోవడానికి లారీ క్యాబిన్లో ఉన్న చిన్న సిలిండర్ పొయ్యిని డ్రైవర్ నాగరాజు వెలిగించారు. అయితే అది ప్రమాదవశాత్తూ పేలింది. ఈ ఘటనతో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమయింది. క్యాబిన్లో ఉన్న రూ. 30 వేల నగదు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. (మిర్యాలగూడ) -
జవహర్ నగర్ పేలుడు ఘటనలో చిన్నారి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ జవహర్ నగర్లో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో గాయపడ్డ చిన్నారి తిరుత్తవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని వెస్ట్జోన్ డీసీపీ తెలిపారు. చిన్నారులు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో బండల కింద నుంచి పేలుడు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి కారణమైన వస్తువు ఏంటో తెలియటం లేదని, విచారణ అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు మొదట భావించారు. కాగా ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి నగరానికి వలస వచ్చినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. -
సిలిండర్ పేలుడు: చిన్నారులకు గాయాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, 108కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోని తల్లిదండ్రులు ఉదయమే కూలీ పనికి వేళ్లగా.... చిన్నారు స్టౌవ్ వెలిగించేందుకు యత్నాంచారని సమాచారం. ఆ దాంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇప్పడే ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. సిలిండర్ పేలుడుకు ఇళ్లు కూలిపోయింది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల వరుసగా 11, 9, 6 ఏళ్ల వయస్సు కలవారిని పోలీసులు తెలిపారు. -
విశాఖలో సిలిండర్ విస్ఫోటనం
పసిపాప దుర్మరణం, 18 మందికి గాయాలు సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. 23వ వార్డు రంగిరీజువీధిలోని కొప్పుల ఈశ్వరరావు ఇంట్లో కోట సత్యనారాయణ అద్దె ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాసన వస్తుండగా సత్యనారాయణ కోడలు గమనించి మామకు చెప్పింది. ఆయన సమీపంలోని పకోడి బండి వర్తకుడు కొల్లి సూరిబాబును పిలిచి సిలిండర్ పరిశీలించాల్సిందిగా చెప్పి బయటకు వెళ్లిపోయాడు. సూరి బాబు వచ్చి సిలిండర్కు ఉన్న పిన్ను సరిచేస్తుం డగా గ్యాస్ ఒక్కసారిగా లీకై పేలుడు సంభవిం చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఎదురుగా ఉన్న ఇంటి పైకప్పు రేకులు కూలి ఆ ఇంట్లో నిద్రిస్తున్న రెండు నెలల పసిబిడ్డపై పడడంతో ప్రాణాలు విడిచింది. పేలుడు జరిగిన ఇంట్లో ఒకే కుటుంబానికి చెం దిన కోట వరలక్ష్మి, బుజ్జి, పిల్లలు కోట పూజిత, కోట చందినీ(రెండున్నరేళ్లు), జయరాంతో పాటు గ్యాస్లీక్ను అరికట్టేందుకు వచ్చిన సూరి బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమా ని కొప్పుల ఈశ్వరరావుతో పాటు స్థానికులు 11మంది కూడా గాయాలపాలయ్యారు. వీరందిరినీ వెంటనే కేజీహెచ్కు తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విష యం తెలియగానే మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కేజీహెచ్కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫోన్ ద్వారా మంత్రి గంటాతో మాట్లాడారు. తీవ్రంగా గాయపడ్డ వారిని కేజీహెచ్ నుంచి సెవెన్హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, పేలుడు ధాటికి పరిసర భవనాల గోడలు విరి గిపడ్డాయి. ఇళ్లపైకప్పు రేకులు నేల కూలాయి. -
వివాహ వేడుకలో విషాదం
* సిలిండర్ పేలి వ్యాపించిన మంటలు * ఆరుగురి సజీవ దహనం సాక్షి, న్యూఢిల్లీ: వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చ ట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయి గా నవ్వుకుంటున్నారు. అయితే అంతలోనే ఈ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అసలేమి జరిగిందంటే... పెళ్లివారి ఇంటిలో గ్యాస్ సిలిం డర్ పేలడంతో ఆరుగురు మరణించారు. జసోలా గ్రామంలోని మసీదువాలీ గల్లీలో సి -13 ఇంటి సభ్యులంతా శుక్రవారం ఉదయం పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. అంతలోనే ఉదయం 11 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా బారాత్ కోసం బయటకు వెళ్లారు. మంటలు పొరుగున ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయని, వీధులన్నీ ఇరుగ్గా ఉండడంతో మంటలను ఆర్పడానికి అవస్థపడాల్సి వచ్చిందనిఅగ్నిమాపక విభాగం తెలిపింది. కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాలను దిగ్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రుల తగాదాలకు కన్నకొడుకు బలి