ఢిల్లీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు | Delhi coaching centre deaths: NHRC issues notices to Delhi Government, Municipal Commissioner | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

Published Wed, Jul 31 2024 5:09 AM | Last Updated on Wed, Jul 31 2024 7:01 AM

Delhi coaching centre deaths: NHRC issues notices to Delhi Government, Municipal Commissioner

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో సివిల్స్‌ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. 

నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్‌ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్‌ నగర్‌ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్‌ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూమోటోగా స్వీకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement