![బంగారు తాపడం పనులకు విరాళం](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/24/23viw51-310144_mr.jpg.webp?itok=pqJwOyAW)
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు గురువారం హైదరాబాద్కు చెందిన భక్తులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ మేడ్చల్ చెంగిచర్లకు చెందిన అనంతాల శంకర్ గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కేఎస్ రామరావును కలిసి బంగారు తాపడం పనులకు విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈవో రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.