సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్‌ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’ | Bengal Raj Bhavan objects to Mamata gives shelter to Bangladeshi People | Sakshi
Sakshi News home page

సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్‌ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’

Published Tue, Jul 23 2024 12:35 PM | Last Updated on Tue, Jul 23 2024 12:44 PM

Bengal Raj Bhavan objects to Mamata gives shelter to Bangladeshi People

కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్‌ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.

‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ  ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది.  సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్‌ మీడియా సెల్ ‘ఎక్స్‌’లో పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement