బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం | India won against Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

Published Wed, Oct 9 2024 10:51 PM | Last Updated on Wed, Oct 9 2024 10:51 PM

India won against Bangladesh

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్‌ గెలుపొందింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

తొలుత టాస్‌ ఓడి బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్‌ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.

హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ 10, అభిషేక్‌ శర్మ 15, సూర్యకుమార్‌ యాదవ్‌ 8, రియాన్‌ పరాగ్‌ 15, వరుణ్‌ చక్రవర్తి 0. సుందర్‌ 0 (నాటౌట్‌), అర్షదీప్‌ సింగ్‌ 6, మయాంక్‌ యాదవ్‌ ఒక్క పరుగు (నాటౌట్‌) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, తంజిమ్‌ హసన్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement