నెల్లూరు రూరల్‌ను శ్రీధర్‌రెడ్డి అభివృద్ధి చేయలేదు | Sakshi
Sakshi News home page

నెల్లూరు రూరల్‌ను శ్రీధర్‌రెడ్డి అభివృద్ధి చేయలేదు

Published Thu, May 9 2024 4:45 AM

నెల్లూరు రూరల్‌ను శ్రీధర్‌రెడ్డి అభివృద్ధి చేయలేదు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు సిటీ: ‘2014 నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అందుకే నాపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడు. దౌర్జన్యాలు చేసే శ్రీధర్‌రెడ్డి కావాలా? అభివృద్ధి చేసే నేను కావాలా?.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ పిండి శాంతి, డివిజన్‌ ఇన్‌చార్జి పిండి సురేష్‌ తదితరులతో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే వందల కోట్ల రూపాయలు తెచ్చి రూరల్‌ను రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్ది చూపిస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్‌ స్రవంతి, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షుడు మాళెం సుధీర్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు మల్లు సుధాకర్‌రెడ్డి, నాయకులు లంకా రామశివారెడ్డి, సీహెచ్‌ హరిబాబు యాదవ్‌, ఏసునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement