గార: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డీపీ దేవ్, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి
Published Fri, Apr 19 2024 1:30 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement