గోడౌన్‌లో స్పృహ తప్పిన కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

గోడౌన్‌లో స్పృహ తప్పిన కార్మికుడి మృతి

Published Sat, May 25 2024 12:10 PM

-

తిరువళ్లూరు: గోడౌన్‌లో స్పృహ తప్పిన ప్రైవేటు సంస్థ కార్మికుడ్ని వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తూత్తుకుడి జిల్లా మాధులపురం గ్రామానికి చెందిన ఆళగర్‌స్వామి కుమారుడు సోలైస్వామి(40) మప్పేడు సమీపంలోని ఆళింజివాక్కంలో ఉన్న ఇన్‌స్టా మెక్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత 20వ తేదీన సంస్థలో పని చేస్తూ గోడౌన్‌కు వెళ్లిన సోలైస్వామి స్పృహ తప్పి పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన సహచర సిబ్బంది మప్పేడులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందించిన తరువాత తండలంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement