TS: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
Published
Mon, Dec 11 2023 8:24 PM
| Last Updated on Mon, Dec 11 2023 9:35 PM
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలిచ్చారు.
‘‘ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ సదరు సమీక్షలో అన్నారు. రాష్ట్ర ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రైతులకు నిధులు చెల్లించాలని అధికారులకు చెబుతూనే.. అదే విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీపై కార్యారచణ ప్రారంభించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment