
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్గా మల్లాది సందీప్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు సందీప్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది పేర్కొన్నారు. కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని సందీప్కుమార్ తెలిపారు.
చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా