YSR Telangana Party
-
టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి కాంగ్రెస్కు చేరింది. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో చెప్పలేం కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహకారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలలో చేరి రాజకీయాలు చేయడం కొత్తకాదు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ఇచ్చిన ఆఫర్ల గురించి కూడా వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని, ఏపీసీసీ అధ్యక్షురాలు, లేదా స్టార్ కాంపెయినర్గా వ్యవహరించాలని కోరుతున్నట్లు ఆమె తెలియచేశారు. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీచేసే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్లో చేరినా తెలంగాణకే పరిమితం అయితే మంచిదే. కానీ, రాజకీయం ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. సహజంగానే ఆమెను రాజకీయంగా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తులు తప్పుదారి పట్టించే యత్నాలు కూడా ఉంటాయి. ఇప్పటికే షర్మిల, ఆమె భర్త అనిల్ ఒక తెలుగుదేశం మీడియా యజమాని రాజకీయ ట్రాప్లో ఉన్నారు. ఆయన సహాయ సహకారాలు తీసుకుంటున్నారంటేనే చంద్రబాబు కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నారనే అభిప్రాయం కలుగుతుంది. అందుకు తగినట్లుగానే షర్మిల భర్త అనిల్ టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి కలిపారని అనుకోవచ్చు. షర్మిల ఒకప్పుడు వైఎస్ జగన్కు అండగా ఉన్న మాట నిజం. ఆయన కూడా ఆమె పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. అయినా రాజకీయం ఎంతటి వారి మధ్య అయినా బేధాలు సృష్టిస్తుంటుంది. కారణం ఏమైనా ఆమె తెలంగాణ రాజకీయ మార్గం ఎంచుకున్నారు. అలా చేయవద్దని సీఎం జగన్ చెప్పి చూశారు. కానీ, ఆమె అంగీకరించలేదు. దీంతో, రాజకీయాలలో ఆమె దారి ఆమెది అని సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పేసి, తన పనిలో తాను పడ్డారు. షర్మిల కూడా చిత్తశుద్దితో తెలంగాణ రాజకీయాలు చేయాలని అనుకున్నారు. సొంతంగా పార్టీని నిలబెట్టడానికి యత్నించారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీకి వెళ్లాలని భావించి తగు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పాదయాత్ర జరిపారు. ఆ క్రమంలో నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలతో ఒక పెద్ద వివాదం కూడా జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాద్లో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ఎదురొడ్డి కారులో నుంచి దిగకుండా ఉండడం, దాంతో టోల్ వెహికిల్ ద్వారా ఆ కారును పట్టుకువెళ్లే యత్నం జరిగింది. అప్పుడు ఆమె నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె తెలంగాణలో పార్టీని వ్యవస్థాపరంగా అభివృద్ది చేసుకోలేకపోయారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేసుకోలేకపోయారు. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు ఏర్పడటంతో పలువురు నేతలు తమదారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్తో కలిసి రాజకీయం చేయాలని భావించారు. కానీ, అప్పటికే టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె కొన్నిసార్లు రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని అనుకున్నా, ఆమె ఏ కారణం వల్లనైతేనేమీ చేయలేకపోయారు. ఈలోగా ఆమెను కాంగ్రెస్లోకి తీసుకు వచ్చి ఏపీ రాజకీయాలలో ప్రవేశపెట్టాలని కొందరు ప్రయత్నాలు చేశారు. బహుశా ఆమె కూడా దీనిపై మల్లగుల్లాలు పడి ఉండవచ్చు. తొలుత అంత సుముఖత చూపలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం చేసిన సంప్రదింపుల పర్యవసానంగా ఆమె తన పార్టీని విలీనం చేయడానికి ఒకే చేశారు. కానీ.. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఏమన్నారో చూడండి. షర్మిల ఆరునెలలుగా కాంగ్రెస్లో విలీనం చేస్తానని అడుగుతున్నారని చెప్పారు. దీనిని బట్టి కాంగ్రెస్ వారు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకోవచ్చు. షర్మిలకు ఏ పదవి ఇస్తారో అది వేరే విషయం. ఆమెను ఎలాగైనా ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి, ఆమె సోదరుడు అయిన సీఎం జగన్ను ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్, టీడీపీలోని కొందరి లక్ష్యం. కొద్ది రోజుల క్రితం బెంగుళూరు ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య జరిగిన ఏకాంత చర్చలలో షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చిందని రాజకీయవర్గాలలో ప్రచారం జరిగింది. ఈ ఉదంతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా యజమాని ఒకరిని ప్రయోగించి ఉండవచ్చు. ఈ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీ రాజకీయాలలో కూడా ట్విస్ట్ వస్తుందని చెప్పడం గమనార్హం. అప్పుడే కాంగ్రెస్ కుట్రలకు శ్రీకారం చుట్టిందన్న అనుమానం వ్యక్తం అయింది. అది నిజమే అన్నట్లుగా ప్రస్తుత పరిణామాలు సాగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం జగన్ గతంలో సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి ఎన్ని కష్టాల పాలు చేసింది తెలిసిందే. ప్రస్తుతం ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకపోయినా, ఎన్నికలలో తెలుగుదేశంకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్దం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్పై విరుచుకుపడ్డ షర్మిల, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై కూడా నిపులు చెరిగారు. ఆ విషయాలను పక్కనబెట్టి ఆమె కాంగ్రెస్లో చేరడం కాస్త ఆశ్చర్యమే అయినా, రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకోండి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇంటిలో చంద్రబాబు పెట్టిన చిచ్చు గురించి జ్ఞప్తి చేసుకోండి. రామారావును ఆయన అల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసి అవమానించారు. ఆ పరాభవం భరించలేక ఎన్టీఆర్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో పోల్చితే షర్మిల కాంగ్రెస్లో చేరడం అన్నది పెద్ద విషయమే కాదు. ఆమె ఎప్పుడో ఏపీ రాజకీయాలకు దూరమై.. తాను తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె ఏపీలో కూడా చేస్తే చేసుకోవచ్చు. అందులో పెద్ద ఆక్షేపణ ఏమీ లేదు. ఆమె వైఎస్సార్సీపీలో ఉండి అన్నకు వ్యతిరేకంగా, అంటే చంద్రబాబు తన మామపై చేసినట్లు కుట్రలు చేస్తే తప్పు కానీ, ఆమె నేరుగా రాజకీయాలు నడుపుకుంటే విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే కాంగ్రెస్, టీడీపీల కుట్రలో ఆమె పావు అవుతున్నారేమో అన్నదే డౌటు. చంద్రబాబు నాయుడు అప్పట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, తన కుట్రలో భాగస్వామిని చేసి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపించారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణది అదే పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు మంత్రిని చేశారు. తీరా ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు. దాంతో ఆయన సొంతంగా అన్నాటీడీపీ పేరుతో పార్టీని పెట్టుకుని కొంతకాలం నడిపారు. చంద్రబాబు తన ఆధ్వర్యంలోని టీడీపీ ఓడిపోయిన తర్వాతే తిరిగి హరికృష్ణతో రాజీ చేసుకుని ఎంపీ పదవి ఇచ్చారు. అయినా హరికృష్ణ ఆయనను నమ్మేవారుకారు. అప్పట్లో హరికృష్ణ ఒక నక్కను పెంచుకునేవారట. దానికి ఎవరి పేరు పెట్టుకున్నారో తెలుసా! వద్దులే.. చెబితే బాగుండదు. ఇక జూనియర్ ఎన్టీఆర్కు ఎన్ని చేదు అనుభవాలు జరిగాయో చెప్పనవసరం లేదు. ఆ ఘట్టాలతో పోల్చితే షర్మిల ఉదంతం చాలా ఫెయిర్గా ఉన్నట్లు లెక్క. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి తనభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి కాంగ్రెస్లో ఎందుకు చేరారు?. చంద్రబాబు ఇంటికి వెళ్లిన దగ్గుబాటిని అవమానించడం అవాస్తవమా!ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలో ఎందుకు ఉన్నారు. 2019లో దగ్గుబాటి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తే, పురందేశ్వరి బీజేపీ తరపున పోటీ చేశారు. పురందేశ్వరి సోదరుడు బాలకృష్ణ టీడీపీలో చంద్రబాబు వెంట ఎలా ఉన్నారు?. చంద్రబాబుకు అత్త అయ్యే లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్లో క్రియాశీల పదవిలో ఉన్నారు. అవేవి తప్పు కానప్పుడు షర్మిల తన ఇష్టం వచ్చిన విధంగా రాజకీయం చేసుకుంటే తప్పు ఏమి ఉంటుంది?. ఇవన్ని ఎందుకు! చంద్రబాబు నాయుడిని తన సోదరుడు రామ్మూర్తి నాయుడు 1999లో ఎంత తీవ్రంగా విమర్శించింది, కాంగ్రెస్లో చేరి కుప్పంలో పోటీచేయడానికి సిద్దపడింది గుర్తు లేదా!. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు ఎలా గొడవలు పడుతున్నాయి? వారి కుటుంబంలో చంద్రబాబే చిచ్చుపెట్టారన్న విమర్శకు సమాధానం ఏమిటి?. అన్నదమ్ములు, సోదరి, సోదరులు, చివరికి తల్లి, కొడుకులు వేర్వేరు పార్టీలలో ఉన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రాజమాతగా పేరొందిన విజయరాజే సింధియా బీజేపీ నేత అయితే ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఇందిరాగాంధీ కోడళ్లు సోనియాగాందీ కాంగ్రెస్ నేత అయితే మేనకా గాంధీ బీజేపీ నేతగా ఉన్నారు. 1952లోనే తిరువూరు నియోజకవర్గంలో తండ్రి, కుమారులు పేట బాపయ్య, పేట రామారావులు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల తరపున పోటీ పడ్డారు. ఇప్పటికిప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి ఏదో ఊపు వస్తుందనుకుంటే భ్రమే అవుతుంది. సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీయలేరన్నది ఎక్కువ మంది భావన. షర్మిలవల్ల ఏవైనా ఓట్లు వస్తే అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయి కాని, ముఖ్యమంత్రి జగన్ అనుకూల ఓట్లు అవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జగన్ చెల్లి వేరే పార్టీలో ఉన్నారని చికాకు పెట్డడానికి ప్రత్యర్ధులు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప ఆమె వల్ల వైఎస్సార్సీపీకి నష్టం ఉండదు. చివరిగా ఒక మాట.. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ ఇంటివద్దకు వెళితే ఆయన కనీసం వీరి ముఖాలు చూడడానికి ఇష్టం పడలేదు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చిన చెల్లెలు వైఎస్ షర్మిలను సీఎం జగన్ సాదరంగా స్వాగతించి రాజకీయాలతో సంబంధం లేకుండా మర్యాద చేసి పంపించారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
కాంగ్రెస్లో చేరిన షర్మిల
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల. న్యూఢిల్లీలోని AICC కార్యాలయానికి భర్త అనిల్తో వచ్చిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. షర్మిల ఏమన్నారంటే.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉంది ఈరోజు నుంచి కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ ఒక భాగం దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు నాలో కూడా విశ్వాసం నింపింది సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్లో చేరినందుకు గర్వపడుతున్నాను. ఇక, వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. ఈరోజు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. షర్మిల చేరిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు హాజరయ్యారు. Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm — Congress (@INCIndia) January 4, 2024 AICC కార్యాలయంలో చేరిక అనంతరం సోనియా నివాసానికి వెళ్లారు షర్మిల, అనిల్. సోనియాను కలిసి పార్టీలో స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయమని సోనియా చెప్పారని, దేశమంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం పని చేస్తానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లో అన్నిటికీ సమాధానం చెప్తానని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని చెప్పారు. -
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని శుక్రవారం ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని, ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు... తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని చెప్పారామె. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఆమె.. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. -
వైఎస్సార్టీపీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ బైనాక్యులర్ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇది కూడా చదవండి: ఫైనల్ స్టేజ్కు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఐదు స్థానాలపై టెన్షన్! -
TS: బీఆర్ఎస్లోకి ప్రజాగాయకుడు సోమన్న
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఝలక్ ఇస్తూ.. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారు అయ్యింది. ఈ మేరకు చేరికకు ముందర ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారాయన. సోమన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్.. సదరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన వైఎస్సార్టీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన షర్మిల వెంట నడుస్తూ వస్తున్నారు. ఏపూరి సోమన్న నిన్నటి దాకా వైఎస్సార్టీపీ తరపున తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీకి ఝలక్ ఇస్తూ.. టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ సమక్షంలో ఇవాళ కేటీఆర్ను కలిశారు. సోమన్న అంతకు ముందు ఆయన కాంగ్రెస్లోనూ పని చేశారు. ఆ టైంలో రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. రేవంత్ పాదయాత్రలోనూ పాల్గొని సోమన్న తన గళం వినిపించారు. కాంగ్రెస్ను వీడి.. వైఎస్సార్ టీపీలో చేరే సమయంలో ‘‘నియంతృత్వ భావజాలం ఉన్న ప్రభుత్వాన్ని(బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి..) ఎదుర్కొనేందుకే వైఎస్సార్ టీపీలో చేరుతున్నాన’’ని ప్రకటించారాయన. ఇక సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. -
షర్మిల పార్టీపై రేపే నిర్ణయమా?
గురువారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల రేపు(శనివారం) కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలను ఈ సందర్భంగా షర్మిల సోనియాకు వివరించినట్టు YSRTP వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ట్వీట్ను కూడా పార్టీ చేసింది. Yesterday,Hon’ble Party President @realyssharmila garu met Hon’ble Sonia ji & @RahulGandhi ji and had a very constructive discussion about state of Telangana and the problems faced by its people.They had an elaborate discussion on the need to bring a positive change in Telangana. pic.twitter.com/yXeT77AgrF — YSR Telangana Party (@YSRTelangana) September 1, 2023 తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలిచ్చింది షర్మిల. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా YSRTPని విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వర్థంతి సందర్భంగా రేపే పార్టీ విలీనం చేస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ షెడ్యుల్ బిజీగా ఉండటంతో విలీనం ప్రక్రియ వాయిదా పడవచ్చని మరికొందరు చెబుతున్నారు. తాను తెలంగాణను ఎంచుకున్నానని, తెలంగాణలోనే రాజకీయం చేస్తానని ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే షర్మిల రాజకీయ భవిష్యత్పై సోనియా హామీ ఇచ్చినట్టు, జాతీయస్థాయిలో ఓ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. చదవండి: గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్ షర్మిలతో చర్చలకు సంబంధించి ఆపరేషన్ అంతా బెంగుళూరు కేంద్రంగా డీకే శివకుమార్ చేపట్టినట్టు కాంగ్రెస్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల రావడం ఇష్టం లేని నాయకులతో చర్చించే బాధ్యత కూడా శివకుమార్కే పార్టీ అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో శివకుమార్ చర్చించిన్నట్టు సమాచారం. ఈ చర్చల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సమావేశం కోసమే రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లారని సమాచారం. అయితే మొదటి నుంచి తెలంగాణలో షర్మిల రాజకీయానికి విముఖత చూపుతున్న రేవంత్ రెడ్డి.. తన అభ్యంతరాలను ఈ సమావేశంలో తెలిపినట్లు కనిపిస్తోంది. అవసరమైతే ఎన్నికల తర్వాత షర్మిలను చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించిట్టు సమాచారం. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్కు అస్త్రంగా మారొచ్చని, పైగా తాను పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిందని రేవంత్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అసలు షర్మిలకు చెక్ పెట్టేందుకే తుమ్మలను రేవంత్ తెరపైకి తెచ్చినట్టు కాంగ్రెస్లో ప్రచారం ఉంది. -
సోనియా, రాహుల్ గాంధీని కలిశాను: షర్మిల
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆమె బ్రేక్ఫాస్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా నిరంతరం పనిచేస్తా. కేసీఆర్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది అని భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో తెలిపారు. ఈ సమావేశంలో సోనియా, రాహుల్తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంతో పాటు హస్తిన వెళ్లి పెద్దల్ని కలిసి వచ్చారు. ఆ మధ్య ఢిల్లీ నుంచి తిరిగి వస్తూ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఆమె కనిపించారు. ఆ టైంలో షర్మిలను కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు కూడా. అయితే విలీన ప్రస్తావనపై షర్మిల మాత్రం పెదవి విప్పలేదు. అయితే తాజా చర్చలతో ఆ ప్రక్రియలో ముందడుగు పడినట్లయ్యింది. ఇదీ చదవండి: నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు -
లోటస్పాండ్లో వైఎస్ షర్మిల దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా, వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా? -
కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. షర్మిల మౌనం!
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ కావడం.. రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్తో పాటు లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడం.. తాజాగా హస్తిన పర్యటనతోనూ దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్లోకి వస్తే లాభమే జరుగుతుందని చెబుతూనే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభ నిరవధిక వాయిదా పడడంతో.. హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిల సైతం ఆయన వెంట ఉండడం గమనార్హం. ‘‘షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి?. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు కదా!. షర్మిలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్సార్ కూతురిగా ఆమెకు ఎప్పుడైనా కాంగ్రెస్లోకి ఆహ్వానం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె కాంగ్రెస్లోకి వస్తే లాభమే జరుగుతంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా లాభమే. ఒకరినొకరు కలుపుకుని బలపడాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీది’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల మౌనం.. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల. ఈ క్రమంలో కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా స్పందన కోరగా.. ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ఢిల్లీ పరిణామాలపై తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయని ఆమె వర్గీయులు చెబుతున్నారు. Warm congratulations to Sree @RahulGandhi ji on being reinstated as the Member of Parliament. While your unwavering grit continues to rekindle hopes among millions of people across the nation, justice took its course and delivered a verdict that gladdened many hearts. I am now… — YS Sharmila (@realyssharmila) August 8, 2023 ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాసగౌడ్పై కోర్టు ఆగ్రహం -
లక్షలోపు రుణమాఫీ ఉత్తమాటేనా?
సాక్షి, హైదరాబాద్: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్షణం సీఎం కేసీఆర్కి లేదన్నది స్పష్టమవుతోందన్నారు. రైతులకు విడతల వారీగా రూ.90 వేలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.37 వేల లోపు రుణాలు ఉన్న వారికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు. 5.66 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన ద్రోహంతో రాష్ట్రవ్యా ప్తంగా దాదాపు 31లక్షల మంది రైతులు బ్యాంకర్ల వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబె ట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
రాహుల్ గాంధీకి షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎందులోనూ విలీనం చేయబోనని ప్రకటిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారామె. ఇవాళ(జూన్ 19) రాహుల్ గాంధీ 53వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్లో.. రాహుల్ గాంధీ గారు.. మీకు సంతోషకరమైన, అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. మీ హృదయపూర్వక ప్రయత్నాల ద్వారా వాళ్లకు సేవ చేస్తూ ఉండండి. గొప్ప ఆరోగ్యం, ఆనందంతో సమృద్ధిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing Shri @RahulGandhi ji a very happy and a wonderful birthday. May you continue to inspire the people with your perseverance and patience, and serve them through your sincere efforts. Wishing you great health, happiness, and success in abundance. — YS Sharmila (@realyssharmila) June 19, 2023 తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతరేకంగా ఆమె 3వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసిరావాలంటూ విపక్షాలకు సైతం ఆమె పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీని ఆమె విలీనం చేస్తారని, ఈ మేరకు సోనియాగాంధీతోనూ ఆమె చర్చలు జరిపారంటూ ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. ఈలోపు ఆమె కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ను కలవడం, పార్టీలోని కీలక సభ్యులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల హామీతోనే ఆమె కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాల నడుమ తాజా పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదీ చదవండి: పీసీసీ సర్వే.. ట్విటర్లో రాములమ్మ! -
పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుకు తట్టెడు మట్టి మోయని సీఎం కేసీఆర్.. తానే జలకళ తెచ్చి నట్టు గప్పాలు కొట్టుకుంటున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. కష్టం ఒకరిదైతే.. ప్రచారం మరొకరిదనే సామెత ఆయనకు సరిపోతుందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు నాడు మహానేత వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులేనని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి కమీషన్లు దండుకు న్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా సాగునీరు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదని నిందించారు. మహానేత హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన ఎట్టి మైగ్రేషన్ వైపే మళ్లేలా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమె త్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా వలసలు ఆగలేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులను నిండా ముంచి.. రైతు దినోత్సవమా!
సాక్షి, హైదరాబాద్: రైతులను నిండా ముంచిన కేసీఆర్ ఓట్ల కోసం ‘రైతు దినోత్సవం’జరుపుతున్నారంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతు దినోత్సవం’కంటే ‘రైతు దగా దినోత్సవం’అంటేనే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శించారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని, అసలు ఏం సాధించారని ఈ రైతు దినోత్సవాలని షర్మిల నిలదీశారు. ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. వందల ఎకరాలున్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు. వడ్లను కొనకుండా ముప్పుతిప్పలు పెట్టి, కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగేలా చేశారని విమర్శించారు. వ్యవసాయం అంటే మహానేత వైఎస్సార్ కాలంలో పండుగని, కానీ కేసీఆర్ కాలంలో దండగలా మారిందని వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన 15 లక్షల ఎకరాలకు వారం రోజుల్లో పరిహారం ఇవ్వాలని, మిగిలిపోయిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. -
ఉద్యమ ఆకాంక్షలు కనుమరుగు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు, సకినాలు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం ‘తెలంగాణ‘అని, అది కూడా నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే వచ్చిందని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో పోరాటం జరగాలన్నారు. ఈ సర్కారు మారితేనే బతుకులు మారుతాయన్నారు. వ్యవసాయం పండుగ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కావాలన్నా వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే.. ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించిందని గుర్తుచేశారు. -
YS Sharmila: డీకే శివకుమార్తో వైఎస్ షర్మిల భేటీ
బెంగళూరు: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ కుంపటిపై హస్తినలో హీట్ -
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు. ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు. కేసీఆర్కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్కు చేతనైంది. కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్కు వెళ్లారా? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్ ఎస్టేట్, కుమార్తె లిక్కర్స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది. తాలిబన్లలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! -
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
‘ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు’
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా.. 104 పథకాన్ని మూసేయడమా.. లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా.. కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం JHS, EHS స్కీములను పాతరేయడంతో పాటు పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొడుతోందంటూ విమర్శించారు. కేసీఆర్ హామీ ఇచ్చిన జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు.. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవని, హెల్త్ టవర్ లేదని ఎద్దేవా చేశారు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదని, పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దవాఖాన్లలో సిబ్బంది లేకపోయినా పట్టించుకోరు.. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేని ప్రభుత్వం ఇదేనంటూ ఫైర్ అయ్యారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని వ్యంగాస్త్రాలు సంధించారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. -
ప్రతిపక్ష నాయకులకు వైఎస్ షర్మిల లేఖలు..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడేందుకు కలిసి రావాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్షాలకు లేఖలు రాశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఇప్పుడు చారిత్రక అవసరమని తెలిపారు. ఈ మేరకురేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, కోదండరాం, అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కూనంనేనీ సాంబశివరావు, ఎన్.శంకర్ గౌడ్లకు లేఖలు రాశారు. ప్రముఖ పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా ఉంటూ.. ప్రజాసమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి చేస్తున్న మీ పోరాటాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహలలో చిక్కి, గుండెలు మండి, కడుపుకాలి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నియంత, మోసపూరిత ప్రభుత్వం చేసిన ద్రోహానికి కొన్ని తరాలు మొత్తం ఆహుతి అవబోతున్నాయి. తొమ్మిదేండ్లు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా, భర్తీలు పూర్తిచేయకుండా కేసీఆర్ సర్కారు చేస్తున్న నీచ నాటకాలు మీకు తెలియనిది కాదు. ఇప్పుడు పేపర్ లీకేజీ స్కాంతో విడుదల చేసిన నోటిఫికేషన్లపై కూడా ఆశ అడుగంటిపోయింది. ఈ కఠిన సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వారి వారి రాజకీయ విభేదాలను మరిచి, చేతులు కలిపి ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అత్యవసర పరిస్థితిగా ఏర్పాటు చేసి పోరాటాల వ్యూహాలన్నీ అమలుపర్చాలి. ఒక తాటిపైకి వచ్చి, చేతులు కలిపి తెలంగాణ యువత కోసం నిలబడాల్సిన సరైన సమయం ఇదే. ఏ యువకులు, విద్యార్థులు త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరిందో, ఏ యువత తమ రక్తాన్ని చిందించి తెలంగాణ తల్లికి అభిషేకం చేసారో, ప్రాణాలను నైవేద్యంగా అర్పించుకున్నారో, వారికోసం మన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన సమయం ఇదే. తెలంగాణ భవిత కోసం, యువత కోసం కలిసి నడుద్దాం, నిలిచి పోరాడదాం’ అని వైఎస్షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. -
నేనామైనా క్రిమినల్నా.. నాపై ఎందుకింత కక్ష: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో వైఎస్సార్టీపీ శ్రేణులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, వైఎస్సార్టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేపర్ లీక్లో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నేను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని బయటకు వచ్చాను. ఒక హోటల్ రూమ్లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారు. నేను క్రిమినల్నా అని ప్రశ్నించారు. -
హైదరాబాద్: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. ట్యాంక్ బండ్పై బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. అంతకు ముందు.. రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్ వన్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. .. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. కేసీఆర్కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు. కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె. -
రాష్ట్రపతి పాలనకు ఉమ్మడి పోరాటం
సాక్షి, హైదరాబాద్: అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకు విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దీన్ ఓవైసీ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందక్రిష్ణ మాదిగలకు ఆమె లేఖలు రాశారు. ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని విపక్ష నేతలకు వినమ్రంగా విన్నవించుకుంటున్నానని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఈ రోజున దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, నోరు విప్పితే పాలకులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ దారుణ హింసకు దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజున నోరు తెరవటానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జెండాలను పక్కన పెట్టి, ఒక్కటై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందనీ. ఈ పరిస్థితుల్లో మనమంతా ఏకమై, ఒక గళంగా మారాలని పిలుపునిచ్చారు. -
జలయజ్ఞం ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని, నీళ్ల కష్టాలు లేవంటూ మంత్రి కె.తారకరామారావు పచ్చి అబద్దాలు చెప్తున్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు తప్పితే..రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ లో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే విధంగా 33 ప్రాజెక్టులకు మహానేత వైఎస్సార్ శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు.పెండింగ్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. -
కేసీఆర్కు మహిళలంటే గౌరవం లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు మహిళలంటే అసలు గౌరవమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళల పట్ల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆమె తెలంగాణ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని, మహిళల్ని జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులపై బీఆర్ఎస్ మహిళ నేతలు కనీసం మాట్లాడరని మండిపడ్డారు. గవర్నర్ తమిళి సైను సైతం అసభ్య పదజాలంతో దూషించారని, కేసీఆర్ సర్కార్ను నిలదీస్తే తనను నానా మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దూషణలు చేసిన వ్యక్తుల పేర్లతో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తననే కాదు.. ఓ ఐఏఎస్ మహిళా అధికారి చెయ్యి పట్టుకున్నారని, అలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఇక్కడ న్యాయం జరక్కపోతే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు: షర్మిల
-
మహబూబాబాద్ జిల్లా: వైఎస్ షర్మిల అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర రద్దు అయింది. ఎమ్మెల్యే శంకర్నాయక్పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెను హైదరాబాద్ తరలించారు. చదవండి: బహిరంగ చర్చకు సిద్ధమేనా -
బహిరంగ చర్చకు సిద్ధమేనా
సాక్షి, మహబూబాబాద్: ‘నేను మీపై చేసిన ఆరోపణలను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా.. మీ నిజాయితీని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా’? అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. షర్మిల పాదయాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారునుంచి సాగింది. ఈ సందర్భంగా నెల్లికుదురు, మడిపెల్లిలో ఆమె మాట్లాడారు. వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆడదానివి కాబట్టి ఉపేక్షిస్తున్నారని మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అవుతాపురంలో వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన వారిపై మంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ తనయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదని, ఆయన తనను అడ్డుకుంటే వైఎస్ఆర్ అభిమానులు తడాకా చూపిస్తారని అన్నారు. మార్చి 5న షర్మిల పాదయాత్ర ముగింపు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర మార్చి 5వ తేదీన ముగియనున్నదని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం జనం మధ్యలోనే ఉంటూ అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ నెల 20న డోర్నకల్ నియోజకవర్గం మీదుగా షర్మిల పాదయాత్ర పాలేరులో అడుగుపెడుతుందన్నారు. ఆ నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే సభతో పాదయాత్ర ముగుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘షర్మిలమ్మ అడ్రస్ ఈరోజు పాలేరు అయింది. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా చెప్పుకునే అడ్రస్ అవుతుంది ఈ కార్యాలయం’అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్నగర్లో పాలేరు నియోజకవర్గ వైఎస్సార్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను, మీతో ఉంటాను అని.. పాలేరు ప్రజలకు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేసిన షర్మిలమ్మను ఆశీర్వదించాలి’అని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదనే వారికి ఆమె ప్రేమ.. తెలంగాణలో షర్మిలమ్మ ఉనికి పోయిందనే వారికి ఆమె మానవత్వమే జవాబు చెబుతుందని పేర్కొన్నారు. వైఎస్ది జగమంత కుటుంబం పాలేరు నియోజకవర్గం వేదికగా నిర్మిస్తున్న పార్టీ కొత్త కార్యాలయం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ప్రారంభించనున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ తన కుటుంబాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించారని ఆమె చెప్పారు. ఆయనది జగమంత కుటుంబమని, రాజశేఖరరెడ్డి కుటుంబం అంటేనే ప్రజల కుటుంబమని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రయత్నం చేస్తోందని అన్నారు. షర్మిలమ్మ పాలేరులో పోటీకి నిర్ణయించుకోవడం యాదృచ్ఛికం కాదని, అది దైవేచ్ఛగా భావిస్తున్నామని తెలిపారు. తమకు పులివెందుల ఎలాగో.. షర్మిలకు పాలేరు కూడా అలాగేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘దయాకర్రావు ఎంతకు అమ్ముడుపోయారు’
సాక్షి, మహబూబాబాద్: ‘మంత్రి దయాకర్రావు టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు అని మాట్లాడారు.. ఇప్పుడు ఆయన కేసీఆర్కు ఎంతకు అమ్ముడుపోయి ఆయన పార్టీలో చేరారు’అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురంలో పాదయ్రాత కొనసాగించారు. 3,800 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుని నాంచారి మడూరు మీదుగా తొర్రూరు చేరుకున్నారు. సాయంత్రం తొర్రూరు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఐదో తరగతి చదివిన దయాకర్రావు మంత్రి అయ్యారని, పీజీలు, పీహెచ్డీలు చేసిన బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీపరుడినని చెప్పే మంత్రి 680 ఎకరాల భూమిని ఎలా సంపాదించారని ప్రశ్నించారు. -
వైఎస్ఆర్టీపీ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
-
డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రంట
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: ‘పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రి అంట’అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉద్దేశించి వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పడు కేసీఆర్ను రాక్షసుడు అన్న మంత్రి దయాకర్రావు.. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కేసీఆర్ దేవుడు అయితే మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఇదే నియోజవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా పాదయాత్ర చేస్తున్నారని, ఆయనది పాదయాత్ర కాదు కారుయాత్ర అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్లో గెలిచిన వారందరూ కేసీఆర్కి అమ్ముడుపోయారని అన్నారు. కాగా, పాదయాత్రలో భాగంగా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం వద్ద కల్లుగీత కార్మికుడు గూడ రవిగౌడ్ కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు. -
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు కట్టిస్తా: షర్మిల
లింగాలఘణపురం: ‘రాజశేఖరరెడ్డి బిడ్డను మాట ఇస్తున్న ఆశీర్వదించండి.. వైఎస్సార్టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తా’ అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హామీనిచ్చారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల నుంచి 236వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం జనగామ–సూర్యాపేట రోడ్డులో ఉన్న గుడిసెవాసుల వద్దకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే భూమిలో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తానని, అంతవరకు ఖాళీ చేయవద్దని వారితో చెప్పారు. నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేదని గుడిసెవాసులు మొరపెట్టుకోగా వెంటనే రూ.15 లక్షలతో సోలార్ విద్యుత్కు ఏర్పాటు చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. -
పథకాల పేర్లతో మోసం చేస్తున్నారు
జనగామ: రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే సీఎం కేసీఆర్... బొంకుడు మాటలు మాట్లాడేది ఎవరో చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్పై అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. పథకాల పేరు చెబుతూ... ప్రజలను మోసం చేసేది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి బొంకుడు మనిషి అయ్యారా? అటువంటి బొంకుడు మాటలు చెప్పే అలవాటు నీకే ఉందని కేసీఆర్పై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ దేవుడిగా నిలిచిపోతే... కేసీఆర్ను దెయ్యమని పిలుచుకుంటున్నారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిది పాదయాత్రనో.. దొంగయాత్రనో అర్థం కావడంలేదని విమర్శించా రు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, కేసీఆర్ చేతిలో పిలకగా మారిన రేవంత్.. ప్రజల గురించి మాట్లాడతాడంటే మనం నమ్మొచ్చా అని ప్రశ్నించారు. షర్మిల వెంట నేతలు ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య ఉన్నారు. -
గజ్వేల్లో ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు: షర్మిల
జనగామ: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్న సీఎం కేసీఆర్.. ఆయన ఇలాకా గజ్వేల్లో ఎన్ని గంటల విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన పాదయాత్ర సందర్భంగా జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపూర్ క్యాంపు వద్ద ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కరెంటు మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కేసీఆర్, రూ.50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా కూరుకుపోయాయో చెప్పాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
గొత్తి కోయలకూ ‘పోడు’ పట్టాలివ్వాలి
నర్మెట: పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతర ఎస్టీలతోపాటు గొత్తి కోయలకు కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొత్తి కోయలు అటవీ అధికారులను హత్య చేయడాన్ని తాను సమర్థించడం లేదని, అయితే వారు కూడా చాలా కాలం నుంచి పోడు చేసుకుని జీవిస్తున్నందున వారికి కూడా పట్టాలివ్వాలని అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జనగామ జిల్లా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా నర్మెట మండలం ఆగాపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, తన కుటుంబ సభ్యులే భూకబ్జాలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ నోరు మెదపడంలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నేతల కబ్జాలకే ఉపయోగపడిందని మండిపడ్డారు. వైఎస్సార్ పాలనలో 9 రకాల నిత్యావసర సరుకులను పేదలకు రేషన్ద్వారా అందిస్తే.. కేసీఆర్ బెల్ట్షాపులను ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర 3,700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా తరిగొప్పులలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
ఆదివాసీలను కించ పర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిల
-
రైతులను బర్బాద్ చేస్తున్న సర్కారిది
రఘునాథపల్లి: ‘అబ్కి బార్ కిసాన్ సర్కార్ కాదు.. తెలంగాణలో రైతులను బర్బాద్ చేస్తున్న సర్కారు మీది’.. అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె రఘునాథపల్లి సబ్స్టేషన్ ఎదుట వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ కోతలు లేని పాలన అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. -
కొత్త సీసాలో... పాత సారా
చిల్పూరు/ఐనవోలు: ఆర్థికమంత్రి హరీశ్రావు కొత్త సంవత్సరం బడ్జెట్ కదా అని కొత్త సీసాను మామ కేసీఆర్ ఉంటున్న ఫామ్హౌస్కు తీసుకెళ్తే.. అందులో పాత సారా పోసి పంపినట్లు ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నా రు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం జనగా మ, హనుమకొండ జిల్లాలో సాగింది. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చేరుకోవడంతో షర్మిల యాత్ర 3,600 కిలోమీటర్ల మార్క్కు చేరు కుంది. అంతకుముందు జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి నైట్ పాయింట్ వద్ద ఉదయం విలేకరులతో, ఆయాచోట్ల పాదయాత్రలో ఆమె మాట్లాడారు. గత బడ్జెట్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు, దళితబంధుకు రూ.17 వేల కోట్లు కేటాయించారని, ఈసారి బడ్జెట్లో గత బడ్జెట్ను కాపీ పేస్ట్ చేశారన్నారు. హామీలు నెరవేర్చని కేసీఆర్ 420 అని విమర్శించారు. అంతకుముందు ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరించారు. -
Paleru: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?
ఖమ్మం జిల్లాలో పాలేరు పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు వామపక్షాల బలం సైతం ఇక్కడ బాగానే ఉంది. అయితే పాలేరు కాంగ్రెస్కు కంచుకోట అనే చెప్పాలి. 1962లో పాలేరు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలిచాయి. గతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009లో జనరల్ సీటుగా మారింది. ఒకప్పుడు వారికి కంచుకోట నియోజకవర్గంలో మొత్తం 2,15, 631 ఓటర్లున్నారు. 2009, 2014లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అనారోగ్యంతో వెంకటరెడ్డి మరణించడం వల్ల జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి రామిరెడ్డి సుచరితరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటికే ఎమ్మెల్సీ కోటలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును అధికార TRS పార్టీ పోటీ చేయించగా ఆయన 45 వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు పై 7 వేల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలానికే కందాల హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. తుమ్మల చుట్టే రాజకీయాలు ఈ సారి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు YSRTP నుంచి వైఎస్ షర్మిల, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, CPI నుంచి సీనియర్ నాయకుడు మౌలానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే పాలేరు సీటుకే అధిక డిమాండ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ టీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకు కలిసొస్తుందని అంటున్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు కూడా షర్మిలకు మరో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయి కేసులు పెట్టుకోవడం..ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం..వ్యతిరేక సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి ఘటనలు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తుమ్మల లేదా కందాలలో ఎవరికైనా ఒక్కరికే గులాబీ పార్టీ సీటు ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్గా రెండో వ్యక్తి ప్రత్యర్థిగా మారే పరిస్థితులుంటాయి. పార్టీలోని వర్గ విభేదాలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందుతోంది. పోలోమంటూ షిఫ్టింగ్లు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశం సొంత డబ్బుతో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్, నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం, రైతులు వెళ్లేందుకు డొంక రోడ్ల మరమ్మతులు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు విరాళం అందించడంతో కొంత సానుకూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా సీపీఎం సైతం పాలేరు టిక్కెట్ ను ఆశిస్తున్నప్పటికీ గులాబీ పార్టీ మాత్రం టిక్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తుమ్మల సైతం బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీపై అసంతృప్తితో ఉన్న తుమ్మలను బీఆర్ఏస్ ఆవిర్భావసభ నేపథ్యంలో దగ్గరికి తీసుకుంది. మంత్రి హరీష్ రావ్ తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో తుమ్మల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను సైతం చూసుకున్నారు. పార్టీ కూడా తుమ్మలకు ప్రాధాన్యతను పెంచింది. దీంతో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటి ఇచ్చారు తుమ్మల. అయితే తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల కీలక భూమిక పోషించబోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసీటిలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు తుమ్మల. అటు వైఎస్ షర్మిల సైతం కర్ణగిరి సమీపంలో క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా స్వగ్రామం తెల్దారుపల్లిలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. అసంతృప్తి రాగాలు సామాజిక వర్గాల వారీగా చూస్తే..పాలేరులో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లే. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలనే ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ప్రారంభించిన రోడ్ల పనులు మాత్రం పూర్తి చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోవడంతో వారిలో నిరాశ కనిపిస్తోంది. భక్త రామదాసు ప్రాజెక్ట్ క్రింద ఇంకా 10 గ్రామాలకు త్రాగు నీరు అందించాల్సి ఉంది. అది కూడ త్వరగా నేరవేర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు తేలేకపోవడంతో పాటు పార్టీ మారడం..పార్టీలో గ్రూప్ తగాదాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు అక్కడి పబ్లిక్. కొందరు అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నేత అయితే షాడో ఎమ్మేల్యేగా వ్యవహరిస్తూ ఎమ్మేల్యే ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంట్రవర్సీ నేతలను కంట్రోల్ లో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేకు మైనస్గా మారే ప్రమాదం ఉందని లోకల్ గా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పాలేరులో కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ఉండగా.. బీజేపీ నుంచి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పోటీ చేసేవారి జాబితాలో ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరులో ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
జర్నలిస్టులు, ప్రజలే బీఆర్ఎస్కు టార్గెట్
పర్వతగిరి: బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం జర్నలిస్టులు, ప్రజలే టార్గెట్గా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు, పోలీసులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఆ పార్టీకి అమ్ముడుపోయారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చని సమయంలో వాటిని ఎత్తిచూపుతున్న ఏకైక వ్యక్తిగా తానే ఉన్నానన్నారు. తనను అడ్డు తొలగించుకునేందుకు పర్వతగిరిలో దాడులు నిర్వహించినా.. వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటివరకు నోరు మెదపడం లేదన్నారు. వారు అన్ని రంగాల్లో వాటా తీసుకుంటున్నారని, కమీషన్లకు కక్కుర్తిపడి ప్రతిపక్ష హోదాను మర్చిపోయారన్నారు. వాటిని ఎత్తిచూపుతున్న మీడియా, సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. అలాంటి దాడులకు భయపడేది లేదని, దాడులు చేస్తే ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చల్లా అమరేందర్రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో శుక్రవారం తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, రైతు రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి మాటతప్పారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంతకం చేస్తానని, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిషేధిస్తామని అన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు లేక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి చల్లా అమరేందర్రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా?
నర్సంపేట: ‘చెప్పుల దుకాణం యజమానిలా మాట్లాడుతున్నావు, కేసీఆర్కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా?’అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఉద్దేశించి అన్నారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నోటి దురుసు తగ్గించుకోవాలని హితవుపలికారు. వైఎస్.రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేశారని, కానీ ఇలా చిల్లర మాటలు ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. నిరాధారమైన, అసత్యమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. -
‘కోర్టు మొట్టే వరకు కేసీఆర్ బుర్ర పనిచేయలేదు’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్కు బుర్ర పనిచేయలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తూ.. కోర్టుల్లో అడ్డంగా దొరికిపోయారని ఆమె పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఈసారి భంగపాటు కు గురయ్యారని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ఆమోదానికి గవర్నర్ను ఆదేశించాలని కోర్టుకెళ్లే ఆయన.. నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో మాట్లాడే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ముందు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని చదవాలని షర్మిల హితవు పలికారు -
అతికినట్టు చెప్పినా.. అబద్ధాలు నిజాలయిపోవు
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు అతికినట్లు చెప్పినా.. అవి నిజాలు అయిపోవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మెటర్నిటీ మరణాలను ఆపలేని ప్రభుత్వానికి.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డైడ్’ అన్నట్లుందని వ్యాఖ్యానించారు. 300 మంది సిబ్బంది ఉండాల్సిన జిల్లా ఆసు పత్రిలో 30 మందితో వైద్యం అందించ డం అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. ఎక్స్రే, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్లు లేక ఎన్నో ఆసు పత్రుల్లో మూలకు పడ్డాయన్నారు. మహానేత హయాంలో అద్భుతంగా అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారని మండిపడ్డారు. -
TS: వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి
సాక్షి, వరంగల్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తిరిగి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు ఆమెకు వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతి షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది నవంబర్ 28వ తేదీన వరంగల్ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షరతులు.. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. -
అందుకే రేవంత్రెడ్డి ముందస్తు ప్రచారం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్కు తెలంగాణ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తన పాదయాత్రను ఆపడమే వాళ్ల ఉద్దేశమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని ఆమె ప్రకటించారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తా. ఫార్మాలిటీ ప్రకారం పోలీసుల అనుమతి కోరతాం. ఒకవేళ అనుమతి ఇవ్వకున్నా యాత్ర చేస్తా అని ప్రకటించారామె. అలాగే టీపీసీసీ రేవంత్రెడ్డిపైనా వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్రెడ్డి. పబ్లిసిటీ కోసమే రేవంత్ ముందస్తు ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. ముందస్తు పేరు చెబితేనే పీసీసీ పదవి కాపాడుకోవచ్చనేది రేవంత్ ఆలోచన అని ఆమె ఆరోపించారు. అలాగే.. ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ.. ‘బీజేపీతో మాకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి, పొత్తు ప్రస్తావనే లేదు అని ఆమె స్పష్టం చేశారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తును చక్కదిద్దే గురువులు పిల్లాపాపలతో ప్రగతి భవన్ ముందు ఆర్తనాదాలు చేయాల్సిన దుస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో కేసీఆర్ సైకోలా వ్యవహరిస్తున్నారని సోమ వారం ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ గడీ దాటి బయటకు వచ్చి బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. -
కేసీఆర్ ఈసారైనా నిజాలు మాట్లాడతారని భావిద్దాం
సాక్షి, హైదరాబాద్: పాత అబద్ధాలను ప్రచారం చేస్తూ, కొత్త అబద్ధాలతో ప్రజలను నమ్మించే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఖమ్మం సభలోపు అయినా నిజాలు మాట్లాడతారని భావిద్దామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. భవిష్యత్తేలేని బీఆర్ఎస్ ఎజెండాను దేశంపై రుద్దేందుకు తమ స్వార్థ రాజకీయాలను దేశవ్యాప్తం చేయడానికి ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించడం హాస్యాస్పదమని వై.ఎస్.షర్మిల విమర్శించారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పది సమస్యలపై టీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్కు మంగళవారం వై.ఎస్.షర్మిల బహిరంగ లేఖ రాశారు. -
వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పైకిమాత్రం ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం.. లోపల మాత్రం అప్పుల బెడద అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. పావలా వడ్డీకే రుణాలిచ్చి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడైతే.. వడ్డీ లేని రుణాలని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఓట్ల కోసం ఉచిత వడ్డీ అని ఆశ చూపి, లోన్లు ఇచ్చి.. ఆ తర్వాత ముఖం చాటేశారంటూ గురువారం ట్వీట్ చేశారు. సర్కారు నుంచి వడ్డీ బకాయిలు రాకపోవడంతో.. బ్యాంకులు ముక్కుపిండి మరీ 12 శాతం నుంచి 13.7 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు కూడా అన్యాయమే జరుగుతోందని షర్మిల ధ్వజమెత్తారు. -
‘2023 తెలంగాణ.. కేసీఆర్ ఫ్రీ’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ‘వైఫల్యాల, మోసాల’పాలనను ట్విట్టర్ హ్యాష్ట్యాగ్ వేదికగా ‘2023 తెలంగాణ కేసీఆర్ ఫ్రీ’ద్వారా ప్రపంచమంతా గమనించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎండగట్టింది. గత ఎనిమిదేండ్ల పాలనలో, ప్రస్తుత బీఆరెస్ సర్కారు వల్ల తెలంగాణ ఎన్ని విధాలా దెబ్బతిందో, జాతీ య స్థాయిలో ఎన్ని రంగాల్లో, ఎన్ని సూచీల్లో అట్టడుగు స్థానానికి పడిపోయిందో, వీటన్నిటినీ నెటిజన్ల ముందుంచి కేసీఆర్కు తేరుకోలేని షాకిచ్చింది. దేశంలోనే టాప్ ట్రెండింగ్లో ఈ కేసీఆర్ ఫ్రీ కొనసాగుతోంది. దీనిపై స్పందించిన వైఎస్ షర్మిల కొత్త సంవత్సరం మొదటి రోజు కేసీఆర్కు తమ పార్టీ షాకిచ్చిందని ట్వీట్ చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ (ఇప్పటి బీ ఆర్ఎస్) అవినీ తి, అహంకార, అసమర్థ పాలన వలన విద్య, వైద్య, శాంతిభద్రతలు, పారిశుధ్యం, ఇంకా ఎన్నో రంగాలలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకంటే చివరి స్థానంలో నిలుస్తోందన్నారు. దుబారా ఖర్చులతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పులో ముంచిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హాష్టాగ్ ద్వారా యువత ఆత్మహత్యలు, అన్న దాత అప్పు లు, కౌలు రైతుల దారుణ స్థితి తదితర అంశాలలో తెలంగాణ పనితీరు, పురోగతి ఎంత చెత్తగా ఉందో ప్రపంచానికి సునిశితంగా వివరించే ప్రయత్నం చేశామన్నారు. తమ పార్టీ పోరాటం బీఆర్ఎస్ మీద కొనసాగుతుందని పేర్కొంటూ ఈ సంవత్సరం కేసీఆర్ చెత్త పాలనకు చివరి సంవత్సరమని వైఎస్ షర్మిల జోస్యం చెప్పారు. -
కేసీఆర్పై చర్య తీసుకునే దమ్ముందా? : షర్మిల
సాక్షి, హైదరాబాద్: ‘నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా’.. చందంగా బీజేపీ–బీఆర్ఎస్ యవ్వారం ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా చర్యలు తీసుకునే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతిని బయటపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. జైలుకు పంపుతామంటూ బండి సంజయ్ ప్రగల్భాలు పలకడం తప్పించి చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ నాయకుల మాటలు ఢిల్లీ కోటలు దాటుతయ్.. కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమ య్యాయని పేర్కొన్నారు. -
కోమాలో ‘ఆరోగ్యశ్రీ’ : షర్మిల
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్యానికి సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అద్భుత పథకమని, దీనిని తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని ఆయన నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడంలేదని, సర్కారు నిధులు ఇవ్వనందున డబ్బులు కట్టి చేరాలని పేదల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
సర్పంచుల రాజీనామా కేసీఆర్కు చెంపపెట్టు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: అసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 18 మంది సర్పంచులు చేసిన రాజీనామా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు చెంపపెట్టు అని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే చైతన్యం రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్టీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను దొంగచాటు గా కాజేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టు ఉంది కేసీఆర్ తీరు’ అని ఎద్దేవా చేశారు. నిధులు విడుదల చేయక ఇప్పటికే రాష్ట్రంలో 11 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఏంటో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఏంటో జర చెప్పాలని బీఆర్ఎస్, కేసీఆర్ను వైఎస్సార్టీపీ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా రైతుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఆమె ఆక్షేపించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థా నంలో పెట్టడం రైతుకు భరో సానా అని నిలదీ శారు. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం బీఆర్ఎస్ నినాదమా అని షర్మిల ఎద్దేవా చేశారు. -
రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు: వై.ఎస్. షర్మిల
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. రాష్ట్రంలో కల్లాలపైనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, పురుగుమందు తాగి నురగలు కక్కి చచ్చిపోతున్నా..పట్టించుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దొరకు పంజాబ్, హరియాణా రైతులే కనబడతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్లు కాదని, కే అంటే ‘కన్నీళ్లు’, సీ అంటే ‘చావులు’, ఆర్ అంటే ‘రోదన’లు అని, బీఆర్ఎస్ అంటే రైతులకు భరోసా ఇవ్వని బందిపోట్ల రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. భూస్వాములకు రూ.లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిదని, బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. -
అప్పులు.. ఖర్చులపై శ్వేతపత్రం: షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం తెచ్చిన అప్పులు, ఖర్చు చేసిన మొత్తంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో పోటీ పడాల్సిన కేసీఆర్ ప్రభుత్వం.. అప్పులు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, మానవ అక్రమ రవాణాలో పోటీ పడుతోందని దుయ్యబట్టారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఎనిమిదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరిని ఉద్ధరించారు దొరా? అని ఆమె నిలదీశారు. గురువారం ట్విట్టర్ వేదికగా.. రెండేళ్లలోనే మీరు చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడికి పోయిందని షర్మిల ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు దొర ఖజానా దాటి బయటకు రావు. రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏ ఇంటికైనా రూ.4 లక్షల ప్రయోజనం జరిగిందా?.. పోనీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? లేక రైతుల రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ అండ్ కో కోసం చేస్తున్న అప్పులు ప్రజల నెత్తిన గుదిబండగా మారాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. -
900 మందికి ఒకే టాయిలెట్టా..!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తొమ్మి ది వందల మంది చదివే ఓ ప్రభుత్వ కళాశాలలో ఒక్క బాత్రూం ఉండటమా? అదీ విద్యా శాఖ మంత్రి ఇలాకాలోనా? ఇలా టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుది దరిద్రపు పాలనని చెప్పేందుకు ఇదొక్కటిచాలని మంగళవారం తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పిల్లలకు కనీసం బాత్ రూంలు కూడా కట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?..విద్యాశాఖ మంత్రి ఊడితే ఎంత అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా టాబ్లె ట్ వేసుకుంటున్నామన్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నామని నిలదీశారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాస్తంత భరోసా ఇవ్వలేరా అని సీఎం కేసీఆర్ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘పండుగ లేదు, పబ్బం లేదు, రోజూ పనిచేస్తున్నారు. అయినా వారు కాంట్రాక్టర్ల వేధింపులకు గురవుతున్నారు’అని వాపోయారు. గ్రామీణ జనానికి నీళ్లు అందిస్తున్న 15 వేల మంది మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల చట్టబద్ధ హక్కులను కాలరాస్తూ, వారికి కనీసవేతనాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్ కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రగతిభవన్ సారుకు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్న సోయి లేదా అని షర్మిల ప్రశ్నించారు. -
పోలీస్ రాజ్యం నడుస్తోంది: వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల పేర్కొన్నారు. -
అపోలో ఆస్పత్రి నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, షర్మిలకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు నిన్నటి బులిటెన్లో వైద్యులు తెలిపారు. -
కోర్టు ఆదేశాలంటే గౌరవం లేకుండాపోయింది: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందుతున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్ అనుకుంటున్నారు. అది ఆయన తరం కాదు’అని స్పష్టం చేశారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలంటే గౌరవంలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారని మండిపడ్డారు. లోటస్పాండ్ చుట్టూ బారికేడ్లు, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారని, ఆ ప్రాంతంలో అకారణంగా కర్ఫ్యూ విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వ్యాన్లలో ఎక్కించి దారుణంగా కొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లో బీపీతో ఆస్పత్రిలో చేరిక లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించారని వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్తో బాధపడుతున్నట్టు తెలిపారు. తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ–రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, సోమవారం ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2–3 వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. -
YS Sharmila: ‘సర్కార్ దిగొచ్చేదాకా దీక్ష ఆపను’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్పాండ్లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్ను పోలీసుల దిగ్బంధించారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అక్కడ. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇంకోవైపు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అంటూ ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి కారణాలేవీ లేవని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నార’’ని ఆమె మండిపడ్డారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల దీక్ష చేపట్టిన సందర్భంగా మండిపడ్డారు. -
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: షర్మిల
కవాడిగూడ/హైదరాబాద్: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్టీపీ చేపట్టిన మహాప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ వరంగల్ పోలీసులు నిరాకరించడం వెనక కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ షర్మిల శుక్రవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.అక్కడే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో షర్మిలను, పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు శాంతియుతంగా 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, వ్యక్తిగతంలో తాను ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని, ఎవరినీ కించపర్చలేదని అన్నారు. పోలీసులను కేసీఆర్ జీతగాళ్లుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన షర్మిలను పోలీసులు లోటస్పాండ్కు తరలించారు. షర్మిల కన్నీటిపర్యంతం: రోడ్డుపై దీక్ష చేస్తున్న షర్మిలని సోలీసులు బలవంతంగా దీక్ష ప్రాంగణం మీదకు తీసుకువచ్చారు. ఈ చర్యతో షర్మిలకు, పార్టీ నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల వైఖరితో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకుంటే ఏంటి’అని ప్రశ్నించారు. మా వాళ్లందరినీ విడుదల చేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను’అని హెచ్చరించారు. -
YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్పై ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను ఎందుకు నొకేస్తున్నారంటూ సీఎం కేసీఆర్పై షర్మిల మండిపడ్డారు. తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్పాండ్కు తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యాలయం ముందు దీక్షకు దిగారు. రోడ్డుపైనే షర్మిల దీక్ష చేస్తున్నారు. కోర్టు అనుమతిచ్చినా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకూ, షర్మిలకూ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అన్నారు. వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. షర్మిలకు భయపడి పాదయాత్రను అడ్డుకుంటున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. పాదయాత్రకు స్పందన చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుందనిపిస్తుందని విజయమ్మ అన్నారు. -
బీజేపీ పావుగా షర్మిల
మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి లను బీజేపీ పావుగా వాడుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్, వైద్య కళాశాల పనులను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన చట్టంలోని హమీల అమలు కోసం సీఎం కేసీఆర్ అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించని ప్రధాని మోదీ.. వార్డు మెంబర్గా కూడా గెలవని షర్మిల విషయంలో స్పందించడం వెనుక ఉన్న ఆంతర్యమేమింటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇదంతా చూస్తుంటే షర్మిలను బీజేపీ పావుగానే భావించాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని, ఆ విషయంలో సహించేది లేదని హెచ్చరించారు -
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి నోటి మాటలేనా?
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీఆర్ఎస్ నేతల హామీలు నోటి మాటలేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శించారు. హామీలకు మించి 2.25 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 2021 పీఆర్సీ కమిటీ రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ శాఖ ల్లో 39% మేరకు ఉద్యోగులే లేరని చెప్పిన విష యాన్ని గుర్తుచేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం గత ఎనిమిదేళ్లలో 35 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు స్పష్టమవుతుందని షర్మిల ట్వీట్ చేశారు. -
నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘నాకు ప్రాణహాని ఉంది.. అది కేసీఆర్.. ఆయన గూండాలతోనే ముప్పు పొంచి ఉంది. కేసీఆర్కి నా భయం పట్టుకుంది. అందుకే పాదయాత్రను సాగనివ్వడం లేదు. ఆడవారు లిక్కర్ స్కాంలో ఉండొచ్చు.. కానీ రాజకీయాలు చేయకూడదా. షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది నాకు కాదు.. కేసీఆర్కు ఇవ్వాలి’వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ పాదయాత్ర చేసి లోపాలు ఎత్తి చూపుతుంటే మింగుడు పడటం లేదని చెప్పారు. ఆదివారంలో హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారని, అందుకే పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. తాను పాదయాత్రలో ఉండగానే ముగ్గురు ఏసీపీలు తమ వద్దకు వచ్చి పాదయాత్రను ఆపాలని చెప్పారన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో రిమాండ్ కోరారని చెప్పారు. మూడోసారి కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పాదయాత్రను అనుమతించడం లేదన్నారు. మమ్మల్ని కొట్టి మేమే తప్పు చేశామంటే.. తమని కొట్టి తామే తప్పు చేశామంటున్నారని షర్మిల మండిపడ్డారు. పాదయాత్ర ఆపడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామంటున్నారని వాపోయారు. ‘నా బస్సును నేను తగల బెట్టుకున్నానా? మా వాళ్లను కొట్టడంతోపాటు కార్లను పగలగొట్టింది ఎవరు? ఇవన్నీ టీఆర్ఎస్ చేస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులు మా బస్సులను తగలబెట్టడమే కాకుండా మా కార్యకర్తలను కొట్టారు. అయినా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు’అని షర్మిల చెప్పారు. షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది తనకు కాదని, ఎంతమంది బిడ్డలు చనిపోయినా విలువ ఇవ్వని కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోందని, మరి తన పాదయాత్రను ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. షోకాజ్కు బదులు చెబుతాం వైఎస్సార్టీపీ లీగల్ సెల్ చైర్మన్ వరప్రసాద్ షర్మిల చేపట్టిన పాదయాత్రపై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు బదులు చెబుతామని ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్, న్యాయవాది వరప్రసాద్ తెలిపారు. పాదయాత్రపై కోర్టు ఇచ్చిన అనుమతి రద్దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్నామని ముందుగా పోలీసులకు చెప్పామని, ఇప్పటికే డీజీపీకి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఈ నెల 3న పాదయాత్ర రూట్ మ్యాప్ను వివరిస్తే.. ఒక రోజు సమయం కావాలని పోలీసులు అడిగారన్నారు. -
ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటాం
నాంపల్లి (హైదరాబాద్): నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. శనివారమిక్కడ గన్పార్కు వద్ద శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి బిడ్డ మరణాన్ని స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ బిడ్డ ఉందని, రియల్ ఎస్టేట్ స్కామ్లో కొడుకు, కమీషన్ల స్కామ్లో కేసీఆర్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఈడీ, ఐటీ సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల పాదయాత్రపై షోకాజ్ నోటీసు వరంగల్ క్రైం: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి క్రాస్ నుంచి ఆదివారం పాదయాత్రను పునఃప్రారంభించేందుకు అను మతి కోరుతూ షర్మిల చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దంటూ పోలీసులు షోకా జ్ నోటీసులు జారీచేశారు. పాదయాత్రకు మొదటిసారి అనుమతి ఇచ్చినప్పుడు సూచించిన నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణకు పాల్పడటం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని అందులో పేర్కొన్నారు. -
పాదయాత్రను, పార్టీని ఆపడం ఎవరితరం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న తన పాదయాత్రను టీఆర్ఎస్ గూండాలు అడ్డుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల దుయ్యబట్టారు. అయితే తన పాదయాత్రను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి తన పాదయాత్రను ఆగిన చోటు (వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం) నుంచే తిరిగి ప్రారంభిస్తున్నానని, ఈ నెల 14 వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు కేవలం అధికార పార్టీకి మాత్రమే మిత్రులుగా ఉంటున్నారని... ప్రతిపక్షాలపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ వారు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరడానికి శుక్రవారం డీజీపీ కార్యాలయానికి పార్టీ నేతలు గట్టు రాంచందర్రావు, పిట్టా రాంరెడ్డి తదితరులతో కలసి వచ్చిన షర్మిల... డీజీపీ లేకపోవడంతో అదనపు డీజీకి వినతిపత్రం అందచేశారు. పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని సైతం అందించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి నేను దత్తపుత్రికను అని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్ బీజేపీకి పెళ్లాం అని అనాలా? నేను నిలదీసినట్లుగా బీజేపీని ఎవరు నిలదీస్తున్నారు? నన్ను నల్లి మాదిరిగా నలిపేస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు.. తాలిబాన్లు. రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోంది. కేసీఆర్ ఈ తాలిబాన్లకు అధ్యక్షుడు. ఏమి చేసుకుంటారో చేసుకోండి. వైఎస్సార్ బిడ్డ దేనికీ భయపడదు. ఈ బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాల్సిన సమయం వచ్చింది’అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటా. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెచ్చే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు లోటస్పాండ్లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవలి రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ వ్యవహారశైలి, పోలీసు నిర్బంధాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు, పాదయాత్ర కొనసాగింపుపై విస్తృతంగా చర్చించారు. -
ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్కేనా?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నేను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశా’ అని వైఎస్ షర్మిల తెలిపారు. పోలీసులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసులనే ప్రచారం కేవలం టీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తుందని, మిగతా పార్టీలకు కాదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్న ఆమె.. ప్రజల దృష్టిలో చులకన కావొద్దని పోలీసులకు సూచించారు. ఒకప్పుడు ఉదమ్యపార్టీగా ఉన్న టీఆర్ఎస్.. నేడు గుండాల పార్టీగా మారిందన్నారు ఆమె. ఇది తాలిబన్ల రాజ్యం అనడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పారు. వీళ్లు(టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి..) తాలిబన్లు కాదా? కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడు కాదా? అంటూ విమర్శించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక్కడుంది రాజశేఖర్ బిడ్డ. ఎక్కడైతే మీరు పాదయాత్రను ఆపారో.. అక్కడి నుంచే మొదలుపెడతానని స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. అలాగే రాజశేఖర్రెడ్డిగారి సంక్షేమ పాలన తీసుకొచ్చేంత వరకు ఆగేది లేదు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారామె. ఇక ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తానని ఆమె స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించాలని తెలంగాణ ప్రజానీకాన్ని ఆమె కోరారు. ఆదివారం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని, ఈ నెల 14వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. షర్మిల అరెస్టును బీజేపీ నేతలు ఖండించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న ‘తామరపువ్వులు’’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. దీనికి వైఎస్ షర్మిల సైతం కవితాత్మకంగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కాని పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవలేదు’అని తిరుగు సమాధానం ఇచ్చారు. ‘అమ్మా.. కమల బాణం, ఇది మా తెలంగాణం, పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజాగణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు, నేడు తెలంగాణ రూటు, మీరు కమలం కోవర్టు, ఆరెంజ్ ప్యారెట్టు. మీలాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను, రాజ్యం వచ్చాకే రాలేదు నేను, ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ’కవిత’ను’అంటూ ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు. నేడు రాజ్భవన్కు వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్భవన్కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలవనున్నారు. 2 రోజులుగా టీఆర్ఎస్ వర్గాల దాడుల నేపథ్యంలో షర్మిల రాజ్భవన్కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
ఆద్యంతం ఉద్రిక్తత, ఉత్కంఠ.. షర్మిల అరెస్ట్.. బెయిల్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం, ఫ్లెక్సీలు తగులబెట్టడం, ఆమె కారవాన్కు నిప్పంటించడం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం..హైదరాబాద్ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు..ఆమె లోపల ఉండగానే కారును క్రేన్ సాయంతో పోలీస్స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం, ఇతర ఆరోపణలతో మరో పీఎస్లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, షర్మిల విడుదల కోరుతూ వైఎస్ విజయమ్మ నిరాహార దీక్షకు దిగడం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. షర్మిలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు... బందోబస్తు తప్పించుకుని.. నర్సంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో షర్మిలను అదుపులోకితీసుకున్న పోలీసులు హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం వైఎస్సార్ విగ్రహానికీ నిప్పుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల మంగళవారం పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉదయం 10 గంటల నుంచే లోటస్ పాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ షర్మిల తొలుత సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంచిన ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎంను కలుస్తానంటూ ప్రగతి భవన్కు బయలుదేరారు. అయితే పోలీసులు షర్మిల వాహనాన్ని అడ్డుకుని కిందకు దిగాలని కోరగా ఆమె నిరాకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు డ్రైవింగ్ సీటులో ఉన్న ఆమెతో సహా కారును క్రేన్ సాయంతో ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో కూర్చున్న షర్మిల... బలవంతంగా కారు డోర్ తెరిచి.. ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల అంగీకరించలేదు. దీంతో పోలీసులు మారు తాళాలు తయారు చేసే వ్యక్తిని తెచ్చి కారు డోర్ను తెరిచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అధికారులు కారు ఎడమ వైపు ముందు డోర్ను ప్లాస్టిక్ లాఠీల సాయంతో తెరిచారు. కారులో ఉన్న నలుగురు పార్టీ నేతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా కిందకు దింపి ఠాణా లోపలకు తీసుకువెళ్లారు. ఈలోగా షర్మిలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ విజయమ్మ బయలుదేరారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను లోటస్ పాండ్లోనే గృహ నిర్భంధం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ, షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్న షర్మిల పలు సెక్షన్ల కింద కేసు షర్మిలపై 143, (గుమిగూడటం) 341 (అక్రమ నిర్బంధం), 506 (బెదిరింపులు), 509 (మహిళ లను దూషించడం), 336 (ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం), 353 (పోలీసు విధులకు ఆటంకం కలిగించడం), 382 (దొంగతనం), 149 (అక్రమ సమావేశం), 290 (పబ్లిక్ న్యూసెన్స్, దూషించడం) సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె పీఆర్ఓ శ్రీనివాస్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్సార్నగర్ ఠాణాకు వచ్చిన ప్రభుత్వ వైద్యులు షర్మిలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని 14వ ఏసీఎంఎం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ విధించాలని కోరారు. అయితే షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. న్యాయమే గెలిచింది: విజయమ్మ షర్మిలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన తర్వాత వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయమే గెలిచిందని, తాము చట్టాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. ఎస్సార్నగర్ పీఎస్కు బ్రదర్ అనిల్ షర్మిలను పరామర్శించేందుకు ఆమె భర్త అనిల్ ఎస్సార్నగర్ పీఎస్కు వచ్చారు. సమస్యలపై పాదయాత్ర చేస్తున్న షర్మిలపై దుర్మార్గంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యకర్తలపై లాఠీచార్జి షర్మిల అరెస్టు వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు యువకులు స్టేషన్ ఎదురుగా ఉన్న భవ నంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా లాఠీచార్జి చేశారు. షర్మిల అరెస్టును ఖండించిన కిషన్రెడ్డి షర్మిల అరెస్టును కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాహనంలో ఉండగానే క్రేన్తో లాక్కెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆఎస్ఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కారవాన్కు నిప్పంటించిన వారిపై కేసు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా శివారులో షర్మిల కారవాన్ను అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లీ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తొగరు చెన్నారెడ్డితో పాటు మరికొంత మందిపై 427, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది: షర్మిల అంతకుముందు ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ వద్ద షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్పై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు గూండాల్లా మారారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలా పని చేస్తుందో టీఆర్ఎస్కు పోలీసులు అదే విధంగా పని చేస్తున్నారు. టీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఒక ఆడ పిల్లను ఈ విధంగా అరెస్టు చేయించడం సీఎం కేసీఆర్కు తగునా? నన్ను బలవంతంగా ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు చెప్పాలి. అసలు నాపై ఎందుకు దాడి చేస్తున్నారు. పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్ ఆందోళన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాల పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల అరెస్టు తీరు పట్ల, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్ పేర్కొన్నారు. -
వైఎస్ షర్మిలను విడుదల చేయాలంటూ YSRTP కార్యకర్తల ఆందోళన
-
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?: వైఎస్ విజయమ్మ
సాకక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ విజయమ్మను ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మరొకవైపు వైఎస్ షర్మిలను ఎస్ఆర్నగర్ పీఎస్లోనే ఉంచడంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. ‘ కుమార్తెను చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటారా?, షర్మిల చేసిన నేరమేంటి?, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?, పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా?, ప్రజల కోసం నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు. ప్రజా సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోంది. షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తా’ అని విజయమ్మ మీడియాకు తెలిపారు. ఎస్ఆర్నగర్ పీఎస్కు బ్రదర్ అనిల్ షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు. కాగా, నిన్న(సోమవారం) టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి షర్మిలను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారు. మరోవైపు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్కు షర్మిల అనుచరులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనం పైకి ఎక్కి వి వాంట్ జస్టిస్ అంటూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిలా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. చదవండి: హైదరాబాద్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
ధ్వంసమైన కారుతో వైఎస్ షర్మిల
-
హైదరాబాద్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజు టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్కు ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం కారు డోరు తెరిచి బలవంతంగా ఆమెను కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు ఆమెను తరలించారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా?. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?