Video: KTR Extends Help to Accident Victims NH44 At Chegunta Mandal - Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న కేటీఆర్‌.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపు

Published Mon, Jul 17 2023 4:25 PM | Last Updated on Mon, Jul 17 2023 4:43 PM

Video: KTR Extends Help to Accident Victims NH44 At Chegunta Mandal - Sakshi

సాక్షి, చేగుంట/ మెదక్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మెదక్‌ జిల్లాలో మంత్రి కళ్లెదుటే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట మండలం రెడ్డిపల్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

ప్రమాదాన్ని గమనించిన  కేటీఆర్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. తన వెంట ఉన్న వైద్యుడితో బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బాధితులను తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా కేటీఆర్‌ చూపిన చొరవకు అక్కడున్న వారు ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement