చీపురుపల్లి: ఎన్నికల సమయాల్లో ప్రజలు ముందుకు వచ్చి మాయమాటలు చెప్పే మోసకారులను నమ్మవద్దని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపేట, కుమ్మరికాలనీ, హడ్కోకాలనీ, వంగపల్లిపేట, కొత్త అగ్రహారం, జి.అగ్రహారం, ఆకులపేట, తదితర ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించి, ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఎంపీ బెల్లానకు మహిళలు హారతులు పడుతూ, విజయ తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, తదితరులున్నారు.