మదనాపురం మండలం కరివెనతండాలో కూలిన ఇంటి పైకప్పు రేకులు.. నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
మదనాపురం, ఆత్మకూర్ మండలాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగగా.. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మదనాపురం మండలంలోని కరివెనతండాలో బాబునాయక్, రాజునాయక్, అంబ్రేష్ నాయక్, శ్రీనునాయక్ ఇంటి పైకప్పు లేచిపోయాయి. పొలాల్లోని స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది. అలాగే ఆత్మకూర్లో ఈదురు గాలులకు భారీ వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టినా అర్ధరాత్రి వరకు పూర్తికాలేదు.
– మదనాపురం, ఆత్మకూర్
నేలకొరిగిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు