వనపర్తిటౌన్: జిల్లాలో శుక్రవారం పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగిన ప్రవేశ పరీక్షకు 93.0242 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కో–ఆర్డినేటర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 2,394 మంది విద్యార్థులు (బాలురు 1,263, బాలికలు 1,131) మందికి గాను 2,227 (బాలురు 1,182, బాలికలు 1,045) హాజరుకాగా.. 167 మంది (బాలురు 81, బాలికలు 86) గైర్హాజరయ్యారన్నారు. బాలురు 93.5867 శాతం, బాలికలు 92.3961 శాతం హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
93 శాతం విద్యార్థులు హాజరు