నకిరేకల్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు, డ్రైవర్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సదరు డ్రైవర్ పోలీస్స్టేషన్ ఎదుట బస్సును నిలిపి గొడవ చేసిన ప్రయాణికులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరింది. హైదరాబాద్లోనే మహిళా ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. మార్గమధ్యలో నకిరేకల్కు చేరుకున్నాక బస్సులోనుంచి కొంత మంది ప్రయాణికులు దిగిపోయారు. అందులో నలుగురు మహిళా ప్రయాణికులు బస్సును కొద్ది సేపు ఆపండి.. తమ బంధువులు వస్తున్నారని డైవర్ను కోరారు. కొద్దిసేపు బస్సు ఆపినప్పటికీ వారు రాకపోవడంతో డ్రైవర్ బస్సును కదిలించడంతో డ్రైవర్తో మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్కు ప్రయాణికులకు మధ్య గొడవ ముదరడంతో సదరు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లి నిలిపివేశారు. విధి నిర్వహణకు ప్రయాణికులు ఆటంకం కలిగించారని ప్రయాణికులపై పోలీస్స్టేషన్లో డ్రైవర్ ఫిర్యాదు చేశారు. అనంతరం డ్రైవర్కు, ప్రయాణికులకు పోలీసులు సర్దిచెప్పి పంపించడంతో సమస్య సద్దుమనిగింది.
ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు
Published Sat, May 25 2024 2:40 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
- ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
- ఇంగ్లండ్తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్కు చోటు
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
Advertisement