తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నడిగట్ల చింతలరావు అనే నాయకుడు ‘అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేసాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు.