samara shankharavam
-
నేడే శంఖారావం
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): గ్రేటర్ పరిధిలోని లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సమర శంఖారావం పూరించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు సాయికిరణ్ యాదవ్, మర్రి రాజశేఖర్రెడ్డి, రంజిత్రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించేందుకు పార్టీ కేడర్ను కేసీఆర్ సమాయత్తం చేయనున్నారు. ఈ బహిరంగ సభకు మూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేసే బాధ్యతలను నగర మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు అప్పజెప్పారు. సభ నేపథ్యంలో గులాబీ జెండాలు, స్వాగత తోరణాలతో సిటీ గులాబీ వనమైంది. ఎల్బీ స్టేడియంలోనూ భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో మంచి ఊపుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లోనే అదే విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మహానగరంలోని మూడు లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ బహిరంగ సభతో ప్రచార హోరును పెంచనుంది. పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కొత్తవారు కావడంతో ప్రచారపర్వాన్ని సీనియర్ల భుజాలపై వేశారు. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్కు పార్టీ శ్రేణులకు ఈ బహిరంగ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళికలు, పూర్తిచేసిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు. గులాబీ బాస్ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటుందని, తమ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నేడు ట్రాఫిక్ మళ్లింపు.. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసు విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు వచ్చే జన సందోహం కోసం సభ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల మళ్లింపు ఇలా.. ♦ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు. ♦ అబిడ్స్, గన్ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు. ♦ బషీర్బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్లే ట్రాఫిక్ను హైదర్గూడ, కింగ్కోఠి మీదుగా పంపిస్తారు. ♦ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ను హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ♦ కింగ్కోఠి భారతీయ విద్యాభవన్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ను తాజ్మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు. ♦ లిబర్టీ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ను హిమాయత్నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు. ♦ సభకు వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించారు. పరిస్థితిని సమీక్షించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల సభ, ఆదివారం బీజేపీ బహిరంగ సభ ఉన్నందున ఆయా సభలకు ప్రముఖుల హాజరు, రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ గురువారం సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో అధిక సిబ్బందిని మోహరించడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఇలా.. ఎల్బీస్టేడియంలో నేడు జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి భారీగా వాహనాల్లో రానుండటంతో సాఫీ ట్రాఫిక్ నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు. ♦ శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి ఎల్బీ స్టేడియం వచ్చే వాహనదారులు అరాంఘర్, ఎన్పీఏ, బహూదూర్పురా, సిటీ కాలేజ్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా రావాలి. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే, అత్తాపూర్, మెహదీపట్నం, లక్డీకాపూల్ నుంచి ఎల్బీ స్టేడియం చేరుకోవచ్చు. అయితే భారీ వాహనాలకు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పై అనుమతి లేదు. ఫ్లైఓవర్ కింది నుంచి రావాలి. ♦ తాండారు, వికారాబాద్, చేవెళ్ల నుంచి వచ్చే వాహనాలు లంగర్హౌస్, మెహదీపట్నం, లక్డీకాపూల్ మీదుగా చేరుకోవాలి. ♦ శంకర్పల్లి నుంచి వచ్చే వాహనదారులు మోఖిలా, నార్సింగి, మెహదీపట్నం, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ మేడ్చల్, అల్వాల్, పేట్బషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు బోయిన్పల్లి, బేగంపేట, రాజ్భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ శామీర్పేట, అల్వాల్ నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ బస్టాండ్, బేగంపేట, రాజ్భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి స్టేడియానికి చేరుకోవాలి. ♦ దుండిగల్, జీడిమెట్ల, బాలానగర్ నుంచి వచ్చే వాహనదారులు ఫతేనగర్, బేగంపేట, రాజ్భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి. -
‘ముగ్గురు కలిసి హోదాను హత్య చేశారు’
-
లగడపాటి సర్వే దొంగ సర్వే
-
నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు
-
కాకినాడ : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
‘ముగ్గురు కలిసి హోదాను హత్య చేశారు’
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నడిగట్ల చింతలరావు అనే నాయకుడు ‘అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేసాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఈ మోసాలను ఎలా ఎదుర్కొవాలి’ అని వైఎస్ జగన్ను అడిగారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పండి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్నాం... ఆ తర్వాత చేసిన మోసం చూశాం. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఒక ప్రత్యేక హోదా అంశాన్నే తీసుకుంటే.. ఎన్నికల ముందు ప్రతేక హోదాపై ఉదరగొట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలేదు. ఇప్పుడు ఎన్నికలచ్చేసరికి మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. మనం వద్దనుకున్నా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసింది. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదు. అలా చేర్చుంటే కోర్టు ద్వారానైనా మనం హోదాను సాధించేవాళ్ళం. ఇచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రజలకు చెప్పండి. చంద్రబాబుకు ఓటేయ్యండి, బీజేపీకి ఓటేయ్యండని చెప్పిన పవన్ కల్యాణ్.. నాలుగేళ్లు వాళ్లతో కలిసి ప్రయాణించి.. మళ్లీ ఎన్నికలచ్చే సరికి కారణాలు చెబుతారు. చంపేటప్పుడు వీళ్లు ముగ్గురు భాగస్వామ్యులు. ఒకరు కత్తి ఇచ్చారు. ఒకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మరోకరు కత్తి తీసుకుని ఆ వ్యక్తిని పొడిచారు. ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదాను హత్య చేశారు. వాళ్లను నమ్మి నమ్మి మోసపోయాం. ఇకా ఎవరినీ నమ్మవద్దని చెప్పండి. 25కు 25 ఎంపీ సీట్లు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో గట్టిగా చుద్దామ’ని తెలిపారు. -
చంద్రబాబు సైబర్ క్రిమినల్: వైఎస్ జగన్
-
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
డేటా చోరీ.. టీడీపీని రద్దు చేయాలి: వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరశంఖారావం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్ క్రిమినల్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ యాప్ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్ తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఓట్ల తొలగింపులోనూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. దొంగ ఓట్లను చేర్పిస్తూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామంలోనూ వివరించాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
‘ఆ క్షణం కోసం యావత్ ఏపీ ఎదురుచూస్తోంది’
-
ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్
-
‘ఆ క్షణం కోసం యావత్ ఏపీ ఎదురుచూస్తోంది’
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీ రాజకీయాలకు రాజధాని వంటి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ జగ్గంపేట సమన్వయకర్త జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే వైఎస్ జగన్ తొలుత కాకినాడులో సభ నిర్వహించడం తమ జిల్లా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తమ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించితీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం మాట తప్పకుండా పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. హోదా వస్తే కార్మికులకు ఉపాధి దొరుకుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చంటిబాబు వివరించారు. ఏపీ అభివృద్ధి జరిగే విధంగా తమ నాయకుడి నిర్ణయాలు ఉంటాయిని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని యావత్ ఏపీ రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వైఎస్సార్సీపీ ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ అన్నారు. తమ పార్టీకి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరిని వైఎస్ జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు మనందరికీ దిశానిర్ధేశం చేయడానికి వైఎస్ జగన్ ఇక్కడి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడానికి నవరత్నాలు పథకంతో మనకు ప్రజా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
ఎన్నికల నగారా మోగించిన వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన అశేష జనసముహాన్ని ఉద్దేశించి జననేత వైఎస్ జగన్ ప్రసంగించారు. సమర శంఖారావం వేదికపై నుంచి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. రేపు వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తొమ్మిదేళ్లుగా మీరందరూ నాకు అండగా నిలిచారు అధికార పార్టీ మిమ్మల్ని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసు మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలింది అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తాం దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలి వైఎస్సార్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు. టీడీపీ అవినీతి పాలనపై, మేనిఫెస్టోలో ఇచ్చిన 600 మోసపూరిత హామీలపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి టీడీపీ ప్రభుత్వం ఇసుక నుంచి గుడి భూముల వరకు దేన్నీ వదలలేదు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతే చోటుచేసుకుంది. చంద్రబాబు రాక్షస పాలనపై గ్రామాల్లో చర్చ జరగాలి ఎల్లో మీడియాతో, లగడపాటి సర్వేలతో జాగ్రత్త పోలవరం ప్రాజెక్టు పనులు పునాది గోడలు దాటి ముందుకు కదల్లేదు. అమరావతి నిర్మాణంలో పిచ్చిమొక్కలు తప్ప ఏం కనబడటం లేదు. పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక పెట్టలేదు.. అంతా తాత్కాలికమే. చంద్రబాబు ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులను సలహాదారుడిగా పెట్టుకుంటారు. ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు. చంద్రబాబుకు కొన్ని పత్రికలు, ఛానల్స్ వత్తాసు పలుకుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అంటూ లగడపాటి చెప్పారు. లగడపాటి దొంగ సర్వేలపై, ఎల్లో మీడియా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు ప్రతి వ్యవస్థను నాశనం చేశారు ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు సైబర్ క్రిమినల్.. ఐటీ గ్రిడ్స్ డేటా చోరిపై విస్తృతంగా చర్చ జరగాలి ప్రజల డేటాను ప్రైవేటు సంస్థలు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలి ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు రెండ్హ్యాండెడ్గా దొరికారు. ఓట్ల తొలగింపులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఓటు భద్రంగా ఉందో తెలసుకోవాలి.. ప్రతి ఒక్కరు ఓటు భద్రంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలి. ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఫామ్-6 పూర్తి చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇందుకోసం ఎమ్మార్వో ఆఫీస్, బుత్ లెవల్ అధికారిని గాని కలవాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మనకు ఓట్ల తేడా కేవలం 5 లక్షలే. అందుకే ప్రతి ఓటు కీలకమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం ఉండదు. ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూస్తాం. చంద్రబాబు చెప్పని అబ్బద్దం, చేయని మోసం, వేయని డ్రామా ఉండదు.. ఇవన్నీ మనకు ఎల్లో మీడియాలో కన్పిస్తాయి. మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా. న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు.. ఫామ్-7 అంటే దొంగ ఓటుపై ఇచ్చే ఒక దరఖాస్తు. అలాంటి ఫామ్-7 మనవాళ్లు పెడితే బాబు అండ్ టీమ్ రివర్స్ అయింది. న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? పేదవాడికి వైఎస్ జగన్ భరోసా.. చదువుకు, పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా. మీ పిల్లల చదువుకోసం.. ఎన్ని లక్షల ఖర్చైనా నేను చదివిస్తా. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటే.. ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తాం. చిన్న పిల్లలను స్కూలుకి పంపిన తల్లులకు ఏడాది 15వేల రూపాయలు అందజేస్తాం. వైఎస్సార్ చేయూత కింద ప్రతి అక్కకు నాలుగు దఫాలుగా 75వేల రూపాయాలు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు నాలుగు దఫాల్లో మాఫీ రైతు భరోసా కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500 పింఛన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెంచుతాం. వచ్చేది రాజన్న రాజ్యమని చెప్పండి.. నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు చూస్తాం. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పండి. వచ్చేది రాజన్న రాజ్యమని.. వచ్చేవి అన్నీ మంచి రోజులని చెప్పండి. సీ-విజిల్ యాప్తో టీడీపీ అక్రమాలకు చెక్ చెప్పండి... ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సీ-విజల్ యాప్ ఉంటుంది. అందరు తమ తమ ఫోన్లలో సీ విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టీడీపీ నేతలు ఎక్కడైనా అన్యాయం చేసినట్టుగా కనిపిస్తే.. ఈ యాప్ ద్వారా రికార్డ్ చేసి ఎన్నికల అధికారులకు పంపండి. టీడీపీ అక్రమాలను అడ్డుకుని ప్రజల్లో చైతన్యం నింపండి. టీడీపీ అక్రమాలపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. -
పూర్ణకుంభంతో వైఎస్ జగన్కు స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాకినాడలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. పూర్ణకుంభంతో శివరామసుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వైఎస్ జగన్కు అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. వారందరినీ చిరునవ్వుతో జననేత పలకరించి ముందుకు సాగారు. వైఎస్సార్సీపీలోకి శివరామసుబ్రహ్మణ్యం ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ‘తూర్పు’... మార్పునకు నాంది -
కాకినాడ వేదికగా సమర శంఖారావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు నుంచే మార్పునకు నాంది పలుకుతున్నారు. సమర శంఖారావం వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించి కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడి నుంచే సమరశంఖం పూరించనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సమర శంఖారావం జరిగే వేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఊహకందని విధంగా ఎన్నికల తేదీ ఖరారైంది. పోలింగ్కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. ఇంకేముంది సమర శంఖారావం వేదికగా విజయ ఢంకా మోగించనున్నారు. తూర్పు మార్పుకు నాంది అని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో తమకో మంచి సంకేతమని, పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే వేదికగా కాకినాడ నిలవడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వైఎస్సార్సీపీ విజయానికి ఇక్కడ నాంది పలుకుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షలకుపైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్త శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులతో జరిగే సమావేశంలో ఎన్నికల సమరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచార సంగ్రామంలో మొదటి సభగా కాకినాడ కానుండటంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను తలశిల రఘురాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కర్రి వెంకటరమణ, పార్టీ నాయకులు కర్రి పాపారాయుడు తదితరులు పర్యవేక్షించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా శ్రేణులు తరలివస్తుండటంతో కాకినాడలో రాజకీయ సందడి కనిపిస్తోంది. -
‘తూర్పు’... మార్పునకు నాంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రణరంగానికి తెరలేచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని ఎన్నికల విశ్లేషకులు భావిస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయమేనని గోదావరి ప్రజల నమ్మకం. ఎన్నికల సమర శంఖారావం సభకు కాకినాడ వేదిక కావడం శుభసంకేతమని వైఎస్సార్సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం కాకినాడలో సోమవారం జరగనున్న వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. 40 లక్షలకు పైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై, వారిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. విశేషం ఏమిటంటే తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఏర్పాటును ప్రకటించారు. తాజాగా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచార సంగ్రామంలో పార్టీ తలపెట్టిన మొదటి కార్యక్రమం కావడంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు కాకినాడలో సమర శంఖారావం సభ ప్రాంగణంలో ఏర్పాట్లను ఆదివారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, చెల్లుబోయిన వేణు, దవులూరి దొరబాబు, అనంత ఉదయభాస్కర్ తదితరులు పరిశీలించారు. సమర శంఖారావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరగనుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని సర్పవరం జువెల్ మెడోస్ అపార్ట్మెంట్ వద్ద మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగే సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖీ నిర్వహిస్తారని చెప్పారు. సమర శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేసినట్టు రఘురామ్ వెల్లడించారు. -
11న కాకినాడలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం
తూర్పుగోదావరి, దానవాయిపేట, (రాజమహేంద్రవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 11వ తేదీ న (సోమవారం) కాకినాడలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్బేలో ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ, రాజమహేంద్రవరం, పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్ పలు నియోజవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సోమవారం కాకినాడలో నిర్వహించనున్న సమర శంఖారావం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సర్వేల పేరుతో సేకరించి ప్రైవేటు సంస్థకు అప్పగించారన్నారు. పౌరుల ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఒక ప్రయివేట్ సంస్ధ అయిన ఐటీ గ్రిడ్ వద్ద లభించడం ప్రజల వ్యక్తిగత వివరాల చోరీయే అవుతుందని ధ్వజమెత్తారు. డేటా చౌర్యం బయటపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్కు భయం మొదలయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని, సిట్ ఏర్పాటుతో టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రోగాం కో అర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ మార్గాని భరత్, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, దవులూరి దొరబాబు, ఆకుల వీర్రాజు, పొన్నాడ సతీష్, జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రీజినల్ పోలింగ్ బూత్ల కన్వీనర్ బి.వి.ఆర్ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి సబెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో సభా ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించారు. -
నెల్లూరు : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
-
ప్రజల వ్యక్తిగత డేటా చంద్రబాబు తన బినామీ కంపెనీలకు ఇచ్చారు
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా... ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంటకాగిన బాబు ఏనాడు హోదా ఊసెత్తలేదని.. ఇప్పుడు మాత్రం నల్లచొక్కాలు వేసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా హోదా కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని పేరొన్నారు. హోదా అంశంలో మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను, పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఓట్లు తొలగిస్తూ నాటకాలు ఆడుతున్న టీడీపీ మోసాలు అరికట్టేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీవిజిల్ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం నాటి సమర శంఖారావం సభకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజక వర్గాల ప్రజలు, బూత్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో జూలూరుపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రశ్నకు బదులుగా...దుగ్గరాజపట్నం పోర్టు కచ్చితంగా నిర్మిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామ సెక్రటేరియట్ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆ సంఘటన నన్ను కలచివేసింది.. నెల్లూరులో సాగిన పాదయాత్రలో భాగంగా మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా అని ఉదయగిరికి చెందిన సుబ్బారెడ్డి ప్రశ్నించగా... ‘పాదయాత్ర చేస్తున్నపుడు ఒక సంఘటన నన్ను కలచివేసింది. ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా. వారి గుడిసెలో ఒక ఫొటోకు దండవేసి ఉంది. ఈ విషయం గురించి గోపాలన్న చెబుతూ... ‘అన్నా ఫ్లెక్సీలో దండవేసి ఉన్న వ్యక్తి నా కొడుకు. మంచి మార్కులు వచ్చేవి. అందుకే ఇంజనీరింగ్లో చేర్పించాలని ఆశపడ్డా. మమ్మల్ని పైకి తీసుకువస్తాడనుకున్నా. అయితే ఆ చదువుకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చయ్యేవి. ఫీజు రీయింబర్స్మెంటు ద్వారా 30 నుంచి 35 వేలు మాత్రమే వచ్చేవి. రెండో ఏడాది అవి కూడా రాలేదు. దీంతో తన చదువు కోసం నేను అప్పులు చేయడం తట్టుకోలేక... నా కొడుకు కాలేజీకి వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అది నేను మరచిపోలేని సంఘటన. ఆరోజు నా కళ్లలో నీళ్లు వచ్చాయి’ అని వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. వారందరికీ హామీ ఇస్తున్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్... ‘గోపాల్ అన్నకు హామీ ఇచ్చినట్లుగా పేదరికం పోవాలంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అందుకోసం ఫీజు రీయింబర్స్మెంటుకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను చదివిస్తా. హాస్టల్లో ఉండే ప్రతీ పిల్లాడికి మెస్ చార్జీలకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలను స్కూలుకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయల సాయం చేస్తాం. అప్పులు చేయకుండానే తమ పిల్లలు చదువుకునే పరిస్థితి తీసుకువస్తా అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్
-
ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం మన సమాచారాన్ని అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలో 39 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల దగ్గర దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్ డేటా ఇదే తరహాలో చోరికి గురైంది. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఎన్నికల డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిది. ప్రజల సున్నితమైన డేటా చోరీ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తల్ని దూషిస్తారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తారు. మా సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి పరిస్థితులు నారా లోకేష్కు మాత్రం ఎదురుకావు’ అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన సమర శంఖారావ సభకు 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సభకు హాజరైన వైఎస్ జగన్ మొదట సభా ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అధికారంలోకి రాగానే కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. అధికార పార్టీ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగిస్తూ... ‘చంద్రబాబు నిర్వాకం వల్ల మీ బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆధార్ నంబర్లు ప్రైవేటు ఐటీ కంపెనీలైన బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ చేతుల్లో ఉన్నాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ను తయారు చేసింది కూడా ఈ కంపెనీలే. వీరి వద్దకు ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వెళ్లింది. ఇవి రెండూ చంద్రబాబు బినామీ కంపెనీలు. ఇలాంటి నేరం సాధారణ వ్యక్తి చేసి ఉంటే అతడిని దొంగ అంటాం. కానీ మన ఖర్మ ఏంటంటే డేటా దొంగిలించిన వ్యక్తిని మనం సీఎం అంటున్నాం. ఆయన కొడుకును ఐటీ మంత్రి అంటున్నాం’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్నకు ఆధార్, ఫొటో లిస్టు, బ్యాంకు అకౌంట్లు అనుసంధానం చేసి తమకు అనుకూలంగా లేని ఓట్లను టీడీపీ తొలగిస్తోంది. డేటా ఎలా బయటకు వెళ్లిందని ప్రశిస్తే బాబు వాటికి సమాధానం చెప్పట్లేదు. సెల్ఫోన్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ నేనే నిర్మించా అని పొంతన లేకుండా మాట్లాడతారు. తనకు తెలియని డేటానా అంటూ చిందులు వేస్తారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే తరహాలో తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఆంధ్రా కంపెనీలపై.. తెలంగాణ పోలీసుల దాడులు ఏంటని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు’ అని మండిపడ్డారు. నారాసుర పాలన చూస్తున్నాం.. ‘టీడీపీకి మద్దతు పలకని ప్రజలకు రేషన్ కట్ చేస్తున్నారు. పెన్షన్ తొలగిస్తున్నారు. పేదవాళ్లు కట్టుకున్న ఇళ్లకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. వెట్ల్యాండ్ పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతగా అధికార దాహం ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో ఓటు వేయలేదని మనుషులను చంపేయడం, గ్రామాలను తగలబెట్టడం కూడా చేస్తారేమో. ప్రస్తుతం రాష్ట్రంలో నారాసుర పరిపాలన చూస్తున్నాం’ అని వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు. రోజుకో కొత్త సినిమా... ఫ్లాపు సినిమాలు తీసే చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తుంటే ఓటమి భయంతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే... ‘గుంటూరు సభలో తాము పెన్షన్ రెండింతలు చేస్తామని హామీ ఇస్తే.. ఎన్నికల ముందు పెన్షన్ పెంచినట్టు సినిమా చూపిస్తున్నారన్నారు. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని.. ఆటోలకు, ట్యాక్సీలకు ఏడాదికి పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. అయితే ఇప్పుడే మేల్కొన్న చంద్రబాబు.. నిస్సిగ్గుగా మా పథకాలు కాపీ కొట్టారు. ఆటో డ్రైవర్ల కాకీ చొక్కా లాక్కొని ఫొటోలకు ఫోజులిచ్చారు. 2013లో బీసీ డిక్లరేషన్లో ఒక్క నిర్ణయం కూడా అమలు చేయని చంద్రబాబు... ఎన్నికల కోసమే రాజమండ్రిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు’ అని వైఎస్ జగన్ విమర్శించారు. బుల్లెట్ ట్రైన్ ఏమయ్యింది బాబు...? చంద్రబాబు తన మొదటి సినిమాలో భాగంగా... ‘2014 ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య అన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు.. ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు..15 ఏళ్ళు కావాలి. వాల్మీకి, కురువులను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా... గాండ్లను ఎస్సీలుగా.. మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తా. మూడేళ్ళలోనే పోలవరం పూర్తి చేస్తా. ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తా’ అని హామీలు ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా తన మ్యానిఫెస్టోలోని ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా.. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అంటూ ఎక్కడికక్కడ దోచేశారని మండిపడ్డారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగే వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకి వైఎస్ జగన్ బయలుదేరారు. సమర శంఖారావ సభకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ జరిగే ఎస్వీజీఎస్ మైదానం వద్దకు జగన్ చేరుకోనున్నారు. -
ప్రజలు ఏమాత్రం టీడీపీని నమ్మరు
-
‘సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలి’
సాక్షి, నెల్లూరు: ఈ నెల 19వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎన్నికల ముందు కీలక సమావేశం కానుందని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. అనంతరం నెల్లూరు వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సులో బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు. -
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
-
సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు
అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతి పోలీసు సోదరుడు సెల్యూట్ చేయాల్సింది తమ టోపీపై ఉన్న మూడు సింహాలకేనని, ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు కాదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో సోమవారం జరిగిన సమర శంఖారావం సభలో ఆయన పార్టీ బూత్ కమిటీల సభ్యులు, కన్వీనర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అధికార పార్టీ నేతలు పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఓ కార్యకర్త చెప్పగా.. ఆయన పైవిధంగా స్పందించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక విపక్ష కార్యకర్తలపై పెట్టిన దొంగ కేసులన్నింటినీ ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు దీక్షలు.. కరవు పరిస్థితులు, ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు.. తదితర అంశాలపై బూత్ కమిటీ సభ్యుల ప్రశ్నలకు జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు. సభ్యుల ప్రశ్నలను.. హిందూపురం పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ జగన్కు చదివి వినిపించారు. ప్రశ్న: నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో దొంగ దీక్ష చేస్తున్నారు. మన కార్యకర్తలు ఎలా ఎదుర్కోవాలి? – ఎం.నారాయణ (పుట్టపర్తి) జగన్: ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం చంద్రబాబు నోటి నుంచి మళ్లీ పుట్టుకొచ్చిందంటే దానికి కారణం మనమేనని గట్టిగా చెప్పండి. ఏపీ అసెంబ్లీలో ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ మాట్లాడాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుచేయండి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో చేస్తూ.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్న చంద్రబాబు మాటలను అందరికీ చెప్పండి. హోదా కావాలని ఎవరైనా అంటే వారిని జైళ్లల్లో పెట్టండి.. అని చంద్రబాబు హుకుం జారీచేసిన మాట నిజం కాదా.. అని చెప్పండి. ఈ రోజు ఎన్నికలొచ్చేటప్పటికి యూటర్న్ తీసుకుని, నల్ల చొక్కా వేసుకుని.. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అని అంటున్నారంటే.. దానికి కారణం మా జగనన్న అని గట్టిగా చెప్పండి. ప్రశ్న: కియా కార్ల ఫ్యాక్టరీకి మేం భూములిచ్చాం. భూములు పోయాయి.. కానీ మాకు ఉద్యోగాలు మాత్రం రాలేదు. మీ నుంచి మాకు భరోసా కావాలి. – సత్యనారాయణ (పెనుగొండ) జగన్: కియా ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు ఉచితంగా ఇచ్చాం. ఎంతో ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేశారు. రాయితీకి కరెంటు ఇచ్చారు. ఇంకా అనేక రాయితీలిచ్చారు. ఆ ఫ్యాక్టరీకి అన్నీ ఇచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మనం అడుగుతాం.. కానీ చంద్రబాబు హయాంలో ఐదు శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయని సత్యనారాయణ చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పిల్లవానికీ ఇదే చెబుతున్నా.. మరో మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొట్టమొదటి చట్టసభలోనే పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టం తెస్తాం. మరో మూడు నెలల్లో కంపెనీల వాళ్లు తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న ఉద్యోగులను వెనక్కి పంపి.. మన వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్న: టీడీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన జేబు సంస్థగా వాడుకుని మా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగజేస్తోంది. అంతే కాదు.. విపక్ష కార్యకర్తలను వేధిస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్ (అనంతపురం అర్బన్) జగన్: ప్రతి పోలీసు సోదరునికీ నేనిదే విజ్ఞప్తి చేస్తున్నా.. మనం సెల్యూట్ కొట్టాల్సింది మన టోపీ మీదున్న మూడు సింహాలకుగానీ.. ఆ టోపీ వెనకాల ఉన్న గుంట నక్కలకు కాదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక దొంగకేసులను ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా. ప్రశ్న: తీవ్రమైన కరవు పరిస్థితుల బారిన పడిన మా ప్రాంత రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారన్నా. ఆయన ఏ మాత్రం రైతులను ఆదుకోలేదన్నా.. – బోయ తిరుపాలు (ఉరవకొండ) జగన్: కరువు జిల్లా అయిన అనంతపురంలోని పార్టీ కార్యకర్తలందరికీ ఇదే చెబుతున్నా.. గ్రామాల్లో ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్నలందరికీ చెప్పండి.. ఇదే జిల్లాలో నేను పాదయాత్రకు వచ్చినప్పుడు పుట్టపర్తిలో శివన్న అనే రైతు నా దగ్గరకొచ్చి తన కష్టం చెప్పాడు. ఆయన ఓ పేద రైతు. వేరుశనగ పంట వేస్తే అది పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతలో చంద్రబాబు వస్తున్నారని అధికారులొచ్చారు. ఓ గుంత తవ్వి టార్ఫాలిన్లు కప్పారు. నాలుగు ట్రాక్టర్లతో వచ్చి నీళ్లు చల్లారు. చంద్రబాబు పిట్టల దొర మాదిరి వచ్చి ఆ గుంతలో రెయిన్గన్ పెట్టి ఓ బటన్ ఆన్చేశాడు. అలా అలా నీళ్లు చల్లి, ‘నీ పంటను కాపాడేశాను’ అని శివన్నతో చెప్పాడు. శివన్న కూడా తన పంట కాపాడారని సంతోషపడ్డాడు. చంద్రబాబు వెళ్లి పోయాక శివన్న కూడా ఇంటికి భోజనానికి వెళ్లిపోయాడు. సాయంత్రం మళ్లీ పొలానికి వచ్చి చూస్తే.. రెయిన్ గన్నూ లేదు.. టార్ఫాలిన్ పట్టా లేదు.. అధికారులు లేరు.. చంద్రబాబూ లేడు. ఆ తర్వాత ఆ పొలం ఎండిపోయింది. పాపం శివన్న ఇప్పుడు బొరుగులు (మరమరాలు) అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. తన అప్పులను చంద్రబాబు మాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసినందుకు.. తనకు ఈ పరిస్థితి వచ్చిందని శివన్న నాతో చెబుతూ.. ‘వద్దప్పా.. చంద్రబాబుతో సావాసం’ అని ఉసూరుమన్నాడు. శివన్న చెప్పిన ఈ మాటలు ఊర్లలో ప్రతి రైతన్నకూ చెప్పండి. హంద్రీ–నీవా ప్రాజెక్టు కడుతున్నారుగానీ అందుకు సంబంధించిన పిల్ల కాలువల నిర్మాణం అయిపోదు.. కాబట్టి మన భూముల్లోకి నీళ్లు రావు. చంద్రబాబు పుణ్యాన ఈ ఐదేళ్లల్లో ఆయనతో పాటుగా వచ్చిందేంటంటే.. కరువే అన్న సంగతి చెప్పండి. ఈ సంవత్సరమూ కరువొచ్చింది.. ఖరీఫ్ సీజన్లో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి అయినా ఇన్పుట్ సబ్సిడీగా మీకు వచ్చిందా.. అని రైతులను అడగండి. చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికే పుట్టాడు. ఈ మనిషి అధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఏ మేలు జరగదని వారికి గట్టిగా చెప్పండి. ప్రశ్న: ఈ జిల్లాకు వైఎస్సార్ చాలా మంచి పనులు చేశారు. మీరు కూడా అదే స్థాయిలో చేయాలన్నది మా కోరిక. – ఖాదర్ బాషా (కదిరి) జగన్: పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. జగన్ రెండడుగులు ముందుకేస్తాడని కచ్చితంగా హామీ ఇస్తున్నాను. రేపు మీ అందరి దీవెనలతో, దేవుడి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం వచ్చాక నాన్నగారి కన్నా గొప్పగా పరిపాలిస్తాను. నేను చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో నాన్నగారితో పాటు నా ఫొటో కూడా ఉండేంత గొప్పగా పరిపాలిస్తానని మీకు హామీ ఇస్తున్నా. -
అనంతపురం : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
టీడీపీ ఎలాంటి మోసాలు చేసిన సివిజిల్ యాప్కు పంపండి
-
నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడేమో నల్లచొక్కా వేస్తారు!
-
రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం : వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టిందే మోసం చేయడానికి అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. సోమవారం అనంతపురం సమర శంఖారావం సభలో అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘ అధికారంలో ఉన్న వాళ్లు ఎన్నో కష్టాలు పెట్టారు. తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారు. మరికొందరిని పథకాలను దూరం చేశారు. ఇంకొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు తగిలింది. 1280 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అందుకే అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటాం. ఎన్నికల షెడ్యూలు రాబోతుంది. వైఎస్సార్ సీపీ విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం కొనసాగిస్తూ... ‘ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయన మోసాలను, అబద్ధాలను మోసే ఎల్లో మీడియాతో మనం పోరాడాల్సి ఉంటుంది. అందుకే గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని అప్రమత్తం చేయాల్సిన అవశ్యకత ఉంది. అమ్మా.. అక్కా.. అన్నా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు పిల్లల్ని బడికి పంపిస్తే ‘అమ్మ ఒడి’ ద్వారా 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. చేయూత అనే పథకం ద్వారా ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, 4 దఫాలుగా 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల్లో అక్కాచెల్లెళ్ల రుణాలు 4 దఫాలుగా మాఫీ చేస్తాడని చెప్పండి. అవ్వా, తాతల.. పెన్షన్ రూ. 2 వేల నుంచి 3 వేలకు పెంచుతాడని అందరికీ చెప్పండి. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అవుతారు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. అన్న చూసుకుంటాడని చెప్పండి. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకి తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతీ అంశం అమలు చేస్తాడని చెప్పండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ దోచేశారు.. ఇప్పటికే మూడు ఫ్లాపు సినిమాలు తీసిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరిన్ని సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఆయన మొదటి సినిమా ‘2014 ఎన్నికల్లో’ భాగంగా...‘ రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య అన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు.. ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు..15 ఏళ్ళు కావాలి. వాల్మీకి, కురువులను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా... గాండ్లను ఎస్సీలుగా.. మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తా. మూడేళ్ళలోనే పోలవరం పూర్తి చేస్తా. ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తా’ అని చంద్రబాబు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్లుగా వీటిలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా.. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అంటూ ఎక్కడికక్కడ దోచేశారని మండిపడ్డారు. నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడేమో నల్లచొక్కా వేస్తారు! ‘ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు.. పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. బీజేపీతో చిలక-గోరింకల్లా కాపురం చేస్తారు. నాలుగేళ్ళు చంద్రబాబు బీజేపీ నేతలను, బీజేపీ నేతలు చంద్రబాబును పొగిడారు. ప్రత్యేక హోదా సంజీవనా? అని అడుగుతారు. హోదా పేరెత్తితే కేసులు పెట్టండని హుకుం జారీ చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కృతఙ్ఞతలు తెలుపుతారు. మోదీని పొగుడుతూ జనవరి 27, 2017న.. మన రాష్ట్రానికి చేసినట్టుగా ఏ రాష్ట్రానికైనా ఇంత సహాయం చేశారా? అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇన్ని విషయాలు మాట్లాడి.. నాలుగేళ్ళు బీజేపీ-పవన్ కల్యాణ్తో కాపురం చేసి.. ఇప్పుడేమో నల్ల చొక్కాలు వేసుకొని యుద్ధం, పోరాటం అంటారు. బీజేపీతో విడాకులు తీసుకొని.. ఢిల్లీకి పోయి.. పార్లమెంటు ముగిసిపోయిన తర్వాత దీక్ష చేస్తారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు-కుంకుమ అంటారు. రైతు రుణ మాఫీ ఇంకా పూర్తి కాలేదు. 4, 5వ విడత రుణాల సంగతి దేవుడెరుగు.. అన్నదాతా సుఖీ భవ అంటారు. రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టరు. రాజధాని ఎక్కడ అని అడిగితే బాహుబలి సినిమా చూశారా? సినిమాలో సెట్టింగులు బాగున్నాయా? అని ఎదురు ప్రశ్న వేస్తారు’ అని చంద్రబాబు తీరును వైఎస్ జగన్ ఎండగట్టారు. ఆనాడు జరిగిందే.. ఇప్పుడు జరగబోతోంది కేవలం వారం రోజుల ముందు చంద్రబాబు ఆరవ బడ్జెట్ అనే మూడో సినిమా విడుదల చేశారన్న వైఎస్ జగన్... ‘ఏ ముఖ్యమంత్రి అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెడతారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు.. రూ. 2 లక్షల 26 వేల కోట్లతో ఆరవ బడ్జెట్ ప్రవేశ పెట్టి.. జగన్ పథకాలను కాపీ కొట్టారు. అది కూడా సగం సగమే. కాపీ కొట్టే వాడిని కాపీ రాయుడు అనొచ్చు. ఈయనకు అది కూడా సరిగ్గా చేతకాదు. 1983లో ఎన్టీఆర్ కొత్తగా రాజకీయాల్లో అడుగు పెట్టి రూ. 2లకే కిలో బియ్యం ఇస్తానని ప్రకటించారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి.. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు రూ. 1.90కే బియ్యం ఇచ్చారు. అయినా ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారు. 55 నెలలు కడుపు మాడ్చి చివరి మూడు నెలలు అన్నం పెడతానన్న చంద్రబాబుకు కూడా ఇదే జరుగబోతోంది’ అని పేర్కొన్నారు. -
అనంతపురంలో నేడు ‘సమర శంఖారావం’
సాక్షి, అమరావతి/అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికి రెండు జిల్లాలు పూర్తి చేశారు. ఈ నెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్సార్ జిల్లాల్లో జరిగిన సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. సోమవారం అనంతపురం వేదికగా శంఖారావం పూరించడానికి సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకోనున్న జగన్ అక్కడ శ్రీ 7 కన్వెన్షన్ హాలుకు చేరుకుని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూమ్కు ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక క్రమ పద్ధతిలో జగన్ ప్రతి జిల్లాలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ వర్గాలతో స్థానిక సమస్యలు, సమాజంలోని ఇతర అంశాలపై సమస్యలను ఆసక్తిగా తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మేళ్లను వారికి వివరిస్తున్నారు. నవరత్నాల్లో ప్రకటించిన అంశాలపై కూడా వారికి వివరణ ఇస్తున్నారు. సభా ఏర్పాట్లను పార్టీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తదితరులు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. -
11న అనంతలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం
-
చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి
-
ఒక్క నెలలోనే సీపీఎస్ రద్దు చేస్తాం
ప్రశ్న : సీపీఎస్ విషయంపై ఉద్యోగులు అడిగితే మనం ఏం చెప్పాలి? – అహ్మద్ పాషా(లక్కిరెడ్డి పల్లె), రాయచోటి జగన్ : చంద్రబాబు సీపీఎస్ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఏమీ చేయలేదు. సీపీఎస్ కింద అన్ని వర్గాల ఉద్యోగులున్నారు. మూడు నెలల తర్వాత అన్న అధికారంలోకొస్తాడు.. అప్పుడు ఒక్క నెలలోపే సీపీఎస్ను రద్దు చేస్తాడని గట్టిగా చెప్పండి.. ప్రశ్న : టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పడకేసింది. మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా పటిష్టం చేస్తాం? – శ్రీనివాసరావు, బి.మఠం జగన్ : ఈ ఆరోగ్యశ్రీ పథకం మెరుగవ్వాలంటే.. అది దివంగత వైఎస్సార్ కుమారుడి వల్లనే అవుతుందని చెప్పండి. ఏ జబ్బయినా సరే.. ఏ ఆపరేషన్ అయినా సరే.. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు.. రూ.1,000 వైద్యం ఖర్చు దాటితే.. దానిని ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయిస్తామని జగనన్న చెప్పాడని పల్లెల్లో బూత్ కమిటీ సభ్యులు ప్రచారం చేయండి. రోగి విశ్రాంతి సమయంలో జగనన్న డబ్బులిస్తానన్నాడని కూడా చెప్పండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా రూ.10,000 పింఛన్ ఇస్తాననన్నాడని, పేదవాడు అప్పులపాలు కాకుండా మెరుగైన చికిత్స పొందాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు గట్టిగా చెప్పండి. ప్రశ్న : గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా పరిష్కరిస్తాం? – ఉదయ్, యర్రగుంట్ల (జమ్మలమడుగు) జగన్ : ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ చెప్పండి. రేపు జగనన్న అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాడని చెప్పండి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి చదువుకున్న పది మందికి వాటిలో ఉద్యోగాలిస్తాడని చెప్పండి. దీని వల్ల దాదాపుగా లక్షన్నర ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయని చెప్పండి. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను ఉద్యోగంలోకి తీసుకుంటారని చెప్పండి. ప్రతి ఫ్యాక్టరీ, ప్రాజెక్టులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం. రేపు జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా వచ్చాక ఉద్యోగాల విప్లవం వస్తుందని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రశ్న: ఉక్కు ఫ్యాక్టరీ గురించి జనానికి ఏం చెప్పాలి? – హనుమంతరెడ్డి (జమ్మలమడుగు) జగన్ : ఇప్పటి దాకా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయనగా ఉక్కు ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టాడు. ఓ రూ.50 కోట్లు డబ్బు కేటాయిస్తాడు. గ్రామాల్లో ప్రజలకు అన్న చెప్పమన్నాడని చెప్పండి.. కచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే అన్న ఆ ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తాడని చెప్పండి. మూడేళ్లలో ఆ ఫ్యాక్టరీని ప్రారంభింపజేస్తాడని చెప్పండి. ఆ ఫ్యాక్టరీ వల్ల పది వేల మందికి ఇక్కడే ఉద్యోగాలొస్తాయని చెప్పండి. ప్రశ్న : అన్నా.. చంద్రబాబు మన పథకాలు కాపీ కొడుతున్నారు.. మనం ప్రజలకు ఏం చెప్పాలి? – కిరణ్యాదవ్ (ప్రొద్దుటూరు) జగన్ : నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. జగన్ కొన్ని పథకాలు అమలు చేస్తానన్నాడు కాబట్టే.. ఇవాళ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకొస్తున్నాడని చెప్పండి. ప్రశ్న : హోదాపై చంద్రబాబు ధర్మపోరాట దీక్షలంటూ మోసం చేస్తున్నారు. వీటికి ఎలా సమాధానం చెప్పాలి? – రమణ (రైల్వే కోడూరు) జగన్ : ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే వైఎస్సార్సీపీని 25 లోక్సభ స్థానాల్లో గెలిపించండి.. అని ప్రజలను కోరండి. మనల్ని అన్ని పార్టీలూ మోసం చేశాయి. హోదా రాకపోవడానికి కాంగ్రెస్తో పాటు మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ప్రధాన కారణం. అందుకే వారెవర్నీ నమ్మొద్దని ప్రజలకు చెప్పండి.. మనం 25 లోక్సభ స్థానాలను గెల్చుకుంటే.. కేంద్రంలో ఎవరు హోదా ఇస్తామని సంతకం చేస్తారో వారికే మద్దతిస్తాం.. అని చెప్పండి. -
మార్పులో భాగస్వాములుకండి
వైవీయూ: ‘మీ పరిధిలో మీరంతా చేతనైన మేర మంచి చేస్తున్నారు.. మీ అందరినీ కలిసి మీ సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వచ్చాను. రాష్ట్రంలో ప్రస్తుతం ఎటువంటి పాలన సాగుతోందో మీరంతా చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చి మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తటస్థులను కోరారు. కడప నగరంలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థ ప్రభావితులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.. మీ పరిచయాలు.. సాన్నిహిత్యం జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశం ఒక్కసారితో అయిపోదు.. మీరు ఇవ్వదలచిన సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చు’ అని చెప్పారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. స్థానికులకు నైపుణ్యాలు లేవంటున్నారు మా ప్రాంతంలో పలు ప్రైవేట్ కంపెనీలొస్తున్నా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఉద్యోగాలిస్తున్నారు. స్థానికులకు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. మీకు నైపుణ్యాలు లేవంటున్నారు. – వెంకటశివ, రైల్వేకోడూరు, భౌతికశాస్త్ర పరిశోధకుడు, పాండిచ్చేరి యూనివర్సిటీ వైఎస్ జగన్ : మొదటి శాసనసభ సమావేశాల్లోనే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా చట్టం తెస్తాం. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఇంజినీరింగ్ విద్యా విధానంలో మార్పులు తెస్తాం. చదివిన విద్యకు తగిన ఉద్యోగం లభించేలా, జాబ్ ఓరియంటెడ్గా ఉండేలా చూస్తాం. మాజీ సైనికులకు కనీస గౌరవం లేదు దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయని మేము.. ప్రస్తుత ప్రభుత్వంలో లంచాలివ్వలేక, మా పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస గౌరవం కూడా లభించడం లేదు. – ప్రసాద్, మాజీ సైనికుడు, యర్రగుంట్ల వైఎస్ జగన్ : దేశం కోసం పోరాడుతున్న సైనికుల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక గౌరవం కలిగి ఉండాలి. వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మాజీ సైనికులు ప్రత్యేక గౌరవం పొందేలా చూస్తాం. లంచం ఇవ్వందే మాజీ సైనికులకే పనులు జరగడం లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. అందుకే అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తాం. వలంటీర్లు మీ వద్దకొచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అమలును ప్రత్యేకంగా సమీక్షిస్తాం. మన ప్రభుత్వం రాగానే పరిస్థితుల్లో వచ్చిన మార్పును మీరే గుర్తించి క్రెడిట్ ఇచ్చేలా చేస్తాం. రైతులకు మార్కెటింగ్ కల్పించాలి.. పండించిన పంటను తానే మార్కెటింగ్ చేసుకునేలా ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలి. ప్రస్తుత ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. రైతులకు ప్రత్యేకంగా ఐడీలు సృష్టించి.. పంటల సమాచారాన్ని ఆన్లైన్ చేసి, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. – లక్ష్మి, చైతన్య మహిళా మండలి వైఎస్ జగన్ : దళారీ వ్యవస్థకు కెప్టెన్గా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే డైరెక్టుగా వ్యాపారం చేస్తున్నాడు. గల్లా ఫ్రూట్స్, శ్రీని ఫుడ్స్, హెరిటేజ్ ఫుడ్స్ వంటి వాటికోసం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టేందుకు, రైతు సమస్యల పరిష్కారానికి ‘నవరత్నాలు’లో మార్గాలు చూపుతాం. అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థుల సేవలను వినియోగించుకుని మార్కెటింగ్పై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. దీనిని రైతులకు అనుసంధానం చేసి మేలు చేస్తాం. -
బాబు కుయుక్తులకు మోసపోవద్దు
చంద్రబాబు ప్రజలకు చెప్పిందేదిచేయలేదు. చేసిందేమిటో తెలుసా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేయడం.ఆ దోచిన సొమ్ములో నుంచి ఆ పెద్ద మనిషి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ►ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు ఎల్లో మీడియాను వాడుకుని లగడపాటితో దొంగ సర్వేలు కూడా చేయిస్తాడని మీకు చెబుతున్నా. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు. చంద్రబాబు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాటిన్నింటినీ తిప్పికొట్టేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. ► రెండు రోజుల కిందట విడుదలైన ఈయన గారి బడ్జెట్ సినిమా సూపర్ డూపర్ ప్లాప్. ఎన్నికల్లో ప్రజలు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు బడ్జెట్ ప్రవేశ పెడతారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన హయాంలోకి రాని ఆరవ బడ్జెట్ను రూ.2.26 లక్షల కోట్లతో ప్రవేశపెట్టి ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. ఈయన తీరు చూస్తుంటే మునుపటి కొకరు.. తల్లికి అన్నం పెట్టని వాడు అవసరం పడేసరికి చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట.. అన్నట్లుంది. కడప నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారని, ఆయన కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రకటిస్తున్నవన్నీ ఇదివరకే తాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్ల సభలో పాల్గొన్నారు. చంద్రబాబు అన్యాయమైన రణనీతిని,దుర్నీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఒక్కొక్క స్కీమ్ను ప్రకటిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మోసపూరిత విధానాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీరంతా అప్రమత్తంగా ఉండాలి ‘‘మనమంతా చంద్రబాబు అన్యాయమైన రణనీతిని చూశాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏమేం చేస్తున్నారో.. ఏమేం చేయబోతున్నారో మనందరికీ తెలుస్తోంది. గ్రామాలలో ఓటరు లిస్టులలో పేర్లను తొలగిస్తున్నారు. దొంగ సర్వేలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో వైఎస్సార్సీపీకి ఓట్లు వేసే వారిని వెతుకుతున్నారు. వెతికి తొలగించాలని ఆరాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఓటరు లిస్టుల్లో పేర్లు చూడండి. తొలగించిన పేర్లు వెంటనే నమోదయ్యేలా ఫారం–6ని పూర్తి చేసి అందించండి. మీరందరూ ఆ పనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్నికలు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు డబ్బులు పంపకం చేస్తారు. మూటలు, మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటరు లిస్టులో మన పేరు, మన వాళ్లందరి పేర్లు ఉండేలా చూసుకోవాలి. రెండో వైపు చంద్రబాబు రెండు ఓట్లు చొప్పున ఎక్కిస్తున్నారు. మనం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అక్షరాల 59,18,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశాను. ఎన్నికల వేళ రోజుకో స్కీమ్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి సీఎం చంద్రబాబు రోజుకొక స్కీమ్ ప్రకటిస్తారు. చంద్రబాబు నాటకాల గురించి మీకు తెలుసు. అబద్ధాలు చెప్పడంలో ఆయన్ను మించిన వారు లేరు. రోజుకొక సినిమా చూపించేస్తాడు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు, మోసాలన్నింటికీ ఆయన ఎల్లో మీడియా అండగా ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 చానళ్లు ఉన్నాయి. ఇవే కాదు ఇంకా ఏమేం ఉన్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. ఇవాళ మనం యుద్ధం చేసేది ఒక్క చంద్రబాబుతోనే కాదు...ఆయన్ను మోస్తున్న ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయబోతున్నాం. అందరికీ ఒకటే చెప్పండి. చంద్రబాబు మాటలను నమ్మవద్దని చెప్పండి. ఐదేళ్ల క్రితం చంద్రబాబుకు ఓటేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. 2014లో మోసం చేసిన ఆయన మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో మరో ఘరానా మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందరికీ చెప్పండి.. బాబు ఇచ్చే రూ.2 వేలు, రూ.3 వేలకు ఏ ఒక్కరూ మోసపోవద్దని ప్రతి అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితుడికి చెప్పండి. అమ్మా.. అన్నొస్తాడు.. అక్కా అన్నొస్తాడు.. చెల్లీ అన్నొస్తాడు.. అన్న వచ్చిన వెంటనే మన పిల్లలను బడికి పంపిస్తాడు.. సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి సంవత్సరం మే నెలలో రూ.12,500 రైతన్న చేతిలో పెట్టబోతున్నానని ప్రతి అన్నకు చెప్పండి. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు రూ.75 వేలు నాలుగేళ్లలో ఉచితంగా ఇస్తారని సగర్వంగా చెప్పండి. మహిళా సంఘాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలన్నింటినీ ఎన్నికల నాటికి ఎంత ఉంటే అంత నాలుగేళ్లలో మీ చేతికి ఇస్తారని చెప్పండి. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారని చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి.. ప్రతి తాతకు చెప్పండి.. చంద్రబాబు ఇస్తున్న రూ.2 వేలను చూసి మోసపోవద్దని. అన్న అంతకుమునుపే అధికారంలోకి వస్తే రూ.2 వేలు పింఛన్ ఇస్తానని చెప్పడంతోనే చంద్రబాబు భయపడి ఎన్నికలకు రెండు నెలలు ముందు ఇస్తున్నాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి కాగానే రూ.2 వేల నుంచి పెంచుకుంటూ పోయి రూ.3 వేలు చేస్తానని చెప్పండి. పిల్లలను చదువుకునేలా చేసి ఇంజనీర్లను, డాక్టర్లను చేసే బాధ్యత అన్న తీసుకుంటారని చెప్పండి. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడే పేద రోగులకు కేవలం వెయ్యి రూపాయలు దాటితే ఎన్ని లక్షలైనా అన్నే భరిస్తాడని చెప్పండి. నవరత్నాల్లో ఉన్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించండి. 2014లో చెప్పిందేదీ చెయ్యలేదు చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ప్రజలకు అది చేస్తాను.. ఇది చేస్తాను.. అని హామీ ఇచ్చి ఎన్నికలప్పుడు తొలి సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. బెల్ట్ షాపులు తొలగిస్తానన్నాడు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తానన్నాడు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ఏటా నోటిఫికేషన్ ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.2కే ఇస్తానన్నాడు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ఏవోవో చెప్పాడు. చివరికి ఏమీ చేయలేదు. మ్యానిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. తుదకు మోసం చేశాడు. చివరికి కాపులను బీసీలుగా చేస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు. చంద్రబాబు రెండో సినిమా ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసమనే సినిమా రెండోది. ఇది ఈ మధ్యకాలంలోనే తీశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. ఇప్పుడేమో పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే.. పునాది రాయితోనే జాతికి అంకితం చేసి చరిత్ర సృష్టించానంటాడు. ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడ లేదు. ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు నల్లచొక్కా వేసుకుంటాడు. తానే ధర్మపోరాటం చేస్తున్నానంటాడు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల రుణమాఫీ ఊసే ఎత్తడు. ఈ రుణాలు బాబు ముఖ్యమంత్రి కాకమునుపు రూ.14 వేల కోట్లు ఉంటే, ఇప్పటికి వడ్డీలపై వడ్డీలు పడి తడిసి మోపెడై అక్షరాల రూ.25 వేల కోట్లకు చేరాయి. అయినా చంద్రబాబు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. పైగా డ్రామాకు తెర తీస్తాడు. ఆ డ్రామా పేరు పసుపు – కుంకుమ. ఈ సినిమా గురించి అందరికీ చెప్పండి.. ఈ పెద్దమనిషి చంద్రబాబు 2014కు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. అందుకు సంబంధించి మ్యానిఫెస్టోలో బీసీ కులాలకు సంబంధించి 119 హామీలు ఇచ్చి వాటన్నింటినీ విస్మరించాడు. అంగన్వాడీలకు, ఆశ వర్కర్లకు, వీఆర్ఏలకు, హోం గార్డులకు జీతాలు పెంచాలనే ఆలోచన చేయడు. జగన్ పెంచుతాననేసరికి ఇప్పుడు వీళ్లంతా గుర్తుకొచ్చారు. బాబు తీరు చూస్తుంటే 57 నెలలు కడుపు మాడ్చి ఎన్నికలకు ముందు మూడు నెలలు అన్నం పెట్టే వారిని ఏమనాలో మిమ్మల్నే అడుగుతున్నా. చెప్పండి.. అన్నా అనలా? లేక దున్నా అనలా? 1983లో ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూ.2కు కిలో బియ్యం ఇస్తానని ప్రకటించారు. దాంతో ఎన్టీఆర్ గ్రాఫ్ పెరిగింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి ఆ వెంటనే రూ.1.90కే కిలో బియ్యం అన్నారు. ఆయన మాటలను ప్రజలు విశ్వసించలేదు. ఇవాళ చంద్రబాబు చేస్తున్నది కూడా ఇదే. ఒక రాక్షసుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టి రమ్మంటే వెళతామా? ’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు సి.రామచంద్రయ్య, సజ్జల రామక్రిష్ణారెడ్డి, మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, డా. ఖలీల్బాషా, మాజీ ఎంపీలు పి.వీ మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ గూడూరు రవి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, షేక్ బెపారి అంజద్బాషా, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మేయర్ సురేష్బాబు, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అ««ధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ముండ్ల వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప గడ్డ నాకు చాలా ఇచ్చింది ‘ఈ గడ్డ (కడప) నాకు, నా కుటుంబానికి చాలా ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా ఈ జిల్లా వాసులు రాజకీయంగా మా వెన్నంటే ఉన్నారు. 1978లో నాన్నగారు మొట్ట మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో చనిపోయారు. 31 సంవత్సరాలపాటు నాన్నగారిని ఈ జిల్లా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. నాన్నగారు తన జీవితంలో 5 సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009లో నాన్న చనిపోయినపుడు చాలా బాధనిపించింది. ఆ బాధలో నుంచి బయట పడటానికి నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీ గుండె చప్పుడు నుంచే వచ్చింది. నాన్న ఎక్కడికీ పోలేదు.. చనిపోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని ధైర్యం వచ్చింది. నాన్న గారు పోయిన తర్వాత జగన్ అనే నన్ను కొడుకుగా ఆదరించింది ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టే, దీవించి పంపారు కాబట్టే రాష్ట్రం వైపు నేను కన్నెత్తి చూడగలుగుతున్నా. ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా గ్రామ గ్రామాన.. అన్నా.. తోడుగా మేమున్నామంటూ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తామే తీసుకుంటున్నందుకు బూత్ కమిటీలకు.. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి సోదరుడు, స్నేహితునికి, అవ్వ తాతలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. మీకు తగిలిన దెబ్బ నా గుండెకూ తగిలింది.. పదేళ్లుగా మీరంతా ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. అవమానాలు సహించారు. కేసులు భరించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల ప్రాణాలు సైతం పోగొట్టుకోవడం చూశాను. ఈ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మీకు తగిలిన ప్రతి దెబ్బ నా గుండెకు కూడా తగిలిందన్న విషయాన్ని కచ్చితంగా చెబుతున్నా. రేపు పొద్దున దేవుడు, ప్రజలు ఆశీర్వాదిస్తారన్న నమ్మకం నాకుంది. నేను మీకందరికీ ఒకే మాట చెబుతున్నాను. మీ బాగోగులన్నీ నేను చూసుకుంటానని గట్టిగా చెబుతున్నా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు అంటారు.. కానీ వైఎస్సార్ సీపీలో ఉన్న మీరంతా నా కుటుంబ సభ్యులని చెబుతాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేద వాడికి అందించడంలో మీ అందరి పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటున్నారు. వైఎస్సార్ సీపీని గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. రాజధాని కడుతున్నట్లుగా బిల్డప్ ఐదు బడ్జెట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆరవ బడ్జెట్ ప్రవేశ పెట్టాడు. రానున్న కాలంలో మనకు కాని ఆరవ బడ్జెట్ను అధికారం లేని బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఏమంటాడో తెలుసా? ఐదు వేల కోట్లు రైతుల కోసం కేటాయిస్తున్నానంటాడు. రైతులకు వడ్డీలు కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ విషయంలో నాలుగు, ఐదు విడతల కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అందుకు సంబంధించే రూ.8,200 కోట్లు బకాయిలు ఉన్నా పెద్ద మనిషి పట్టించుకోలేదు. రాజధాని నగరమంటాడు. వేల ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు, బినామీలకు, అనుయాయులకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుంటాడు. రాజధాని కట్టడు.. కడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. నాలుగున్నరేళ్లుగా పిల్లలకు జాబు ఇస్తానన్నాడు జాడలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు లేవు. రాష్ట్రం విడిపోయేటప్పుడు 1.42 లక్షల జాబులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కాలంలో రిటైర్డ్ అయిన వారు 90 వేలకు చేరారు. మొత్తంగా 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నా ఎవరికీ ఇవ్వడు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు లేదు. ఎన్నికలకు ముందు మాత్రం రూ.వెయ్యి ఇస్తాడు. కోటి 70 లక్షల ఇళ్లకు భృతి ఇవ్వాల్సి ఉంటే.. తగ్గించి తగ్గించి 3 లక్షలకు తెచ్చాడు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నా పెన్షన్లు పెంచాలన్న ఆలోచన రాదు. మనం అధికారంలోకి వస్తే పెంచుతామన్న భయంతో మూడు నెలల ముందు రూ.2 వేలు ఇచ్చేస్తామని చెబుతాడు. జగన్.. రైతుల ట్రాక్టర్లకు, ఆటోలకు ట్యాక్సులు రద్దు చేస్తాడని, ప్రతి ఏడాది రూ.10 వేలు ఇస్తాడని గ్రహించి ఇంతలోపే బాబు ఏం చేశాడో తెలుసా? ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి ఖాళీ చొక్కా వేసుకుంటాడు. ఆటోవాలాలకు రోడ్డు ట్యాక్స్ లేదంటాడు. రైతు ట్రాక్టర్లకు ట్యాక్స్ లేదంటాడు. ప్రతి పేదవానికి సంబంధించిన సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు. -
కడప : సమర శంఖారావం సభలో అశేషజనవాహిని
-
చంద్రబాబు సినిమా సూపర్ డూపర్ ప్లాప్
-
బాబు రోజుకో కొత్త డ్రామా ఆడతారు..
-
చంద్రబాబు తాజా సినిమా ఫ్లాప్...
సాక్షి, కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సినిమా ‘ఆరో బడ్జెట్’ ఫ్లాప్ అయిందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన గురువారం మాట్లాడుతూ... తనది కాని బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి అన్నం పెట్టనివాడు... చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. బడ్జెట్ మాత్రమే కాదని, అన్ని విషయాల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కడప జిల్లా తమకు ఎంతో ఇచ్చిందన్న వైఎస్ జగన్...ఉక్కు ఫ్యాక్టరీ కట్టించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. (అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్) వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాజధాని కట్టడు..కట్టినట్లు బిల్డప్ ఇస్తాడు. ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తానని పాదయాత్రలో చెప్పాను. దాన్నే చంద్రబాబు ఖాకీ చొక్కా వేసుకుని కాపీ కొట్టాడు. 2013లో బీసీల కోసం 119 హామీలు ఇచ్చాడు. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్తో మోసం చేశాడు. 57 నెలలు కడుపు మాడ్చి... చివరి మూడు నెలలు అన్నం పెడతాననే వాడిని ఎలా నమ్మలి. చంద్రబాబును అన్న అనాలా? దున్నా అనాలా?’ అని ధ్వజమెత్తారు. (చంద్రబాబు కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి) -
చంద్రబాబు ప్రభుత్వంకు కేవలం ధనార్జనే ద్యేయం
-
జీవితాంతం వైఎస్ జగన్కు తోడుగా ఉంటాం
-
జగన్ అనే నన్ను కొడుకుగా ఆదరించారు: వైఎస్ జగన్
సాక్షి, కడప : ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. (అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్) గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘31 ఏళ్లుగా ఈ జిల్లా వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుంది. ఆయన అకాల మరణం తర్వాత నాకు, నా కుటుంబానికి అండగా ఉంది. జగన్ అనే నన్ను కొడుకుగా ఆదరించింది. మీ దీవెనలే నాకు కొండంత అండ. పదేళ్లుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాపై ఉంది. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందించడంలో మీ పాత్ర క్రియాశీలకం’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘చంద్రబాబు మోసాలు గుర్తించాలి. ఎన్నికలకు ముందే ఆయనకు ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుంది. మరేం ఫర్వాలేదు. ఎవరూ అధైర్యపడవద్దు. అన్న వస్తాడని చెప్పండి. పిల్లలను బడికి పంపిస్తే ఏటా 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. ప్రతీ మే నెలలో రైతుకు రూ.12,500 ఇస్తాడని చెప్పండి. అవ్వా, తాతకు నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తాడని చెప్పండి’ అని హామీ ఇచ్చారు. (వృద్ధాప్య పింఛన్ రూ.3,000) బాబు రోజుకో కొత్త డ్రామా ఆడతారు.. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా వెనుకాడరని వైఎస్ జగన్ విమర్శించారు. డబ్బు మూఠలతో గ్రామాల్లో చొరబడతారు.. ఓటుకు రూ. 2 వేలు. రూ. 3 వేలు అంటూ మభ్యపెట్టడానికి సిద్ధమవుతారని దుయ్యబట్టారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బాబులో ఆందోళన పెరుగుతోంది. ఓటర్ల లిస్టులో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పేర్లు తొలగిస్తున్నారు. దొంగ సర్వేలు చేసి వైఎస్సార్ సీపీకి ఓటు వేసే వాళ్లు ఎవరని ప్రశ్నిస్తున్నారు. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఓటరు లిస్టు చూసుకుని.. మన ఓటు తొలగిపోయినట్లైతే మరోసారి నమోదు చేసుకోవాలి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. తనకు అనుకూలంగా ఉండేందుకు దొంగ ఓట్ల కార్యక్రమానికి చంద్రబాబు తెరతీశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా రోజూ లగడపాటి దొంగ సర్వేలతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని విమర్శించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ. 10 వేలు తన ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో బద్వేలుకు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని తిరిగి ప్రజలకు ఎలా చేరువ చేస్తారని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్... ‘ ఈరోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్సు వచ్చే పరిస్థితి ఉందా. ఆరోగ్య సేవలు కొనసాగాలంటే ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు 8 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు జబ్బు ఏదైనా చేస్తే పెద్దాసుపత్రికి వెళ్లలేకపోతున్నారు. ఆరోగ్య శ్రీ పరిస్థితి మెరుగవ్వాలంటే వైఎస్ జగన్ రావాలని ప్రజలకు చెప్పండి. వెయ్యి రూపాయల ఖర్చు దాటితే దానిని ఆరోగ్య శ్రీ కిందకి తీసుకువస్తారని చెప్పండి. కుటుంబ పెద్ద జబ్బు పడితే ఆపరేషన్ చేయించంతో పాటు... రెస్టు పీరియడ్లో కూడా కుటుంబ సభ్యులకు అన్న అండగా ఉంటాడని ధైర్యంగా చెప్పండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి నెలనెలా 10 వేల రూపాయలు ఇస్తానని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పండి’ అంటూ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా, సీపీఎస్, నిరుద్యోగ సమస్య, ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ 25 ఎంపీ స్థానాలు గెలిస్తే ప్రత్యేక హోదా సాధించవచ్చు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం. 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు
-
తిరుపతి : వైఎస్ జగన్ ‘సమర శంఖారావం’ బహిరంగ సభ
-
చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఝలక్
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు‘ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం తిరుపతి సమీపంలో జరిగిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు. (చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదు) కాగా వైఎస్సార్సీపీ నవరత్నాల్లో.. వృద్ధాప్య ఫించన్ రూ.2 వేలు ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని, అలాగే వికలాంగులకు పింఛన్ రూ.3వేలు ఇస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు కూడా. అయితే నవరత్నాలను కాపీ కొట్టిన టీడీపీ సర్కార్ ఇటీవలే వృద్ధాప్య ఫించన్ను రూ.1000 నుంచి రూ.2వేలుకు పెంచింది. వైఎస్సార్ సీపీ తాజా నిర్ణయంతో కాపీ కొట్టడంకూడా సరిగా రాని చంద్రబాబుకు ఝలకే అని చెప్పుకోవచ్చు. (ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్ జగన్) -
అవ్వా,తాతలకు 3 వేల పింఛన్: వైఎస్ జగన్
-
ఎల్లో మీడియాతో జాగ్రత్త
సాక్షి, తిరుపతి : నాలుగున్నరేళ్లుగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న టీడీపీ సర్కార్.. ఎన్నికలు సమీస్తున్న వేళ కొత్త డ్రామాకు తెర తీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... రానున్న రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని, ప్రతి ఓటర్ ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదని ఎల్లో మీడియాతో కూడా పోరాటం చేయాలని అన్నారు. ఉన్నది లేనట్లుగా... లేనిది ఉన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోందన్నారు. (ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్ జగన్) చంద్రబాబు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసం’ మరో సినిమా చూపిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచాక మొదలైన బాబు కొత్త సినిమా కథ ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనేది’ ప్రతి కాంట్రాక్ట్లోనూ కమీషన్లే. ఇసుక, మట్టి, భూములు సహా దేన్నీ వదిలి పెట్టలేదు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు. పై స్థాయిలో చంద్రబాబు, కిందస్థాయిలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి. నాలుగేళ్లు పాటు బీజేపీ, పవన్ కల్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో పోరాటం చేస్తున్నట్లు నాటకాలాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండానే జాతికి అంకితం చేయడం చంద్రబాబు సినిమాలో చూశాం. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. హోదా కోసం పోరాటం చేస్తున్నవారిపై కేసులు పెట్టడమే కాకుండా, జైలుకు పంపుతామని బెదిరించారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటూ చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకుంటున్నారు. హోదా కోసం పోరాటం అంటూ ఘరానా మోసం చేస్తున్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదు. 14వేల కోట్లు రుణం ఉంటే... అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయి. పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేల ఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్లపాటు నిరుద్యోగులకు జాబులు ఇవ్వరు. 57 నెలలు మోసం చేసి... ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు. మన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ప్రకటించా. చంద్రబాబు ఇప్పుడు ఖాకీ డ్రస్ వేసుకుని కాపీ కొట్టారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75వేలు ఇస్తామని మనం చెప్పాం. ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతి కులానికి కార్పొరేషన్ అంటున్నారు. 2014కు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ చంద్రబాబుకు గుర్తుకు రాదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ బీసీలకు హామీలిస్తున్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచేందుకు బాబుకు మనసు రాదు. పాదయాత్రలో అంగన్ వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పాను. తాజాగా చంద్రబాబు నిన్ననే ఒక సినిమా తీశారు. చంద్రబాబు తనది కాని బడ్జెట్... ఆరో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా చంద్రబాబు బడ్జెట్ పెట్టారు. కాపీ కొట్టడం కూడా ఆయనకు సరిగా రావడం లేద’ని అన్నారు. -
ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడి సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘9 ఏళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డారు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్లే. మీ అందరి బాగోగులు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటా. రాజకీయంగా, సామజికంగా ఆదుకుంటా. చాలా గర్వంగా చెబుతున్నా మీరందరూ నా కుటుంబసభ్యులే. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ పథకాలు అందించడంలో మీ పాత్ర కీలకం. న్యాయానికి, అన్యాయానికి ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలంటే మీరంతా కీలక బాధ్యత తీసుకోవాలి. చాలాచోట్ల వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు చేయిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు.. రానున్న ఎన్నికలు ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలు. 2014లో చంద్రబాబు మొదటి సినిమా చూపించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారాన్ని గుర్తు చేసుకోండి. నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. ఆయనొస్తున్నాడు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. అక్కాచెల్లెమ్మలు తాకట్టు పెట్టిన బంగారం నెల రోజుల్లోనే ఇంటికొస్తుందని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామన్నారు. పేదవారికి ఇల్లు కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని డైలాగులు కొట్టారు. ప్రత్యేక హోదాను ఐదు కాదు.. పదికాదు... 15 ఏళ్లు తెప్పిస్తామన్నారు. హోదా తెస్తానని డ్రామాలు చేస్తూ...చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు నల్లచొక్కా వేసుకున్నారు. ఇక మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మోసం చేశారు. అలాగే పసుపు-కుంకుమ పేరుతో నాటకాలు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. ఇక ఎల్లో మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు’ అని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
చంద్రబాబుగారి ప్రభుత్వం వెంటిలెటర్పై ఉంది
-
‘చంద్రబాబుది నియంతపాలన’
సాక్షి, వైఎస్సార్: రేపు కడపలో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావంను విజయవంతం చేయాలని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ పాషా పిలుపునిచ్చారు. సభ ద్వారా జిల్లాలోని బూత్స్థాయి సభ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని వారు తెలిపారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నిపేందుకునే సమర శంఖారావంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలపై గతంలో విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవే పథకాలను కాపీ కొట్టారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి / హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించిన వైఎస్ జగన్ తిరుపతి వేదికగా సమర శంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో తటస్థులతో సమావేశమైన అనంతరం పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’ సభలో ఆయన పాల్లొంటారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచక, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలికే విధంగా ఎన్నికల పోరాటానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. చరిత్ర కానున్న ‘సమర శంఖారావం’ దాదాపు 45 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొననున్న ‘సమర శంఖారావం’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది. ఇంత భారీ ఎత్తున బూత్స్థాయి కార్యకర్తలతో నేరుగా సమావేశమవడం ఆంధ్రప్రదేశ్ చర్రితలో ఇదే తొలిసారి. తిరుపతిలో నేడు (బుధవారం) సమర శంఖారావం సభ అనంతరం పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్ జగన్ జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తారు. రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు. 11వ తేదీన అనంతపురం, 13వతేదీన ప్రకాశం జిల్లాల్లో జరిగే సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. సభా వేదిక, ఏర్పాట్లకు సంబంధించిన డ్రోన్ విజువల్స్, ఆకట్టుకుంటున్నాయి. -
రేపు తిరుపతిలో ‘సమర శంఖారావ సదస్సు’
-
సమర శంఖారావ సదస్సు; మీడియా మిత్రులకు ఆహ్వానం
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వర్యంలో బుధవారం జరిగే ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో తటస్థులు పాల్గొననున్నారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని పీఎల్ఆర్ గార్డెన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది. అనంతరం తిరుపతి వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ‘సమర శంఖారావ సదస్సు’కు మీడియా మిత్రులందరూ తప్పక హాజరుకావాలని మీడియా సెల్ మనవి చేసింది. తిరుపతిలోని యోగానంద్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమర శంఖారావ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. (వైఎస్ జగన్ నేతృత్వంలో సమర శంఖారావం సభ) -
‘పోలీసు వ్యవస్థను బాబు భ్రష్టు పట్టించారు’
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంల ద్వారా గెలిచిన చంద్రబాబు ఇప్పుడు వాటిని విమర్శించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ టాంపరింగ్ చేసి గెలిచాయి కాబట్టే ఇప్పుడు ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను బాబు భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన సామాజిక వర్గ పోలీసులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నిబద్దత గల పోలీసులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏనాడు పోలీసులను టార్గెట్ చేయలేదని పేర్కొన్నారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్... బుధవారం చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సమర శంఖారావం సదస్సు ప్రారంభిస్తారని బొత్స తెలిపారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భాగంగా పార్టీ బూత్ కమిటీ నాయకులతో ఆయన భేటీ అవుతారని బొత్స పేర్కొన్నారు. ఈ సదస్సులో ఓటర్ల తొలగింపు, డబ్బు, మద్యం పంపిణీ వంటి టీడీపీ అకృత్యాలు ఎండగడతామని తెలిపారు. సమర శంఖారావానికి జిల్లాకు 40 వేల మంది హాజరవుతారన్నారు. బీసీ సంక్షేమానికై ఏలూరులో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారని పేర్కొన్నారు. -
రేపు చిత్తూరు జిల్లాలో సమర శంఖారావం
-
తిరుపతి వేదికగా సమర శంఖారావం సభ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం తిరుపతి వేదికగా సమర శంఖారావం సభ జరగనుంది. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు ఈ సభలో పాల్గొననున్నారు. తిరుపతిలోని యోగానంద్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని పీఎల్ఆర్ గార్డెన్స్లో జరగనున్న తటస్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహం ఒంటి గంటకు సమర శంఖారావం సభకు వైఎస్ జగన్ హాజరవుతారు. -
ఫిబ్రవరి 4 నుంచి వైఎస్ఆర్సీపీ సమర శంఖారావం
-
రాష్ట్రప్రజల అభ్యున్నతే వైఎస్ జగన్ లక్ష్యం
-
‘వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమర శంఖారావం’
సాక్షి, తిరుపతి : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమరశంఖారావం సమావేశాలుంటాయిని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమరశంఖారావం పేరుతో పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్టీ సమావేశాలు ఉంటాయి. 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురంలో పార్టీ సమావేశాలుంటాయి. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే వైఎస్ జగన్ లక్ష్యం. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. సొంతంగా ఒక్క పథకానికైనా చంద్రబాబు రూపకల్పన చేశారా? రాజధానిలో పర్మినెంట్ పేరుతో ఒక్క బిల్డింగ్ లేదు. అన్నీ తాత్కాలికమే. చంద్రబాబు సుమారు రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారు. ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? కుట్రలో తన పాత్ర బయటపడుతుందనే బాబు భయపడుతున్నారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది ఎవరో ప్రజలందరికి తెలుసు. టీడీపీ ఓటమి ఖాయమని అన్నీ సర్వేల్లో వెల్లడైంది. ప్రజల మనోభావాలను బట్టి కేంద్రంలో పార్టీకి మద్దతిస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీకే మా మద్దతు ఉంటుంది' అని తెలిపారు. -
‘వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమర శంఖారావం’
-
మే 28న బీసీల సమర శంఖారావం: జాజుల
హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రం లో కూడా దామాషా ప్రాతిపదికన రిజర్వే షన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 50%నికి పెంచాలని, లేనిప క్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో బీసీల పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ విషయాలపై మే 28న నగరంలో బీసీల సమర శంఖా రావం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బీసీలంతా ఈ శంఖారా వానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని దేశోద్ధారక భవన్లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ప్రకారం రిజర్వే షన్లు పెంచాలని తాము పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మా విషయంలో చూపని తొందర మైనార్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు.