Travel
-
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్లోని ఈఫిల్ టవర్కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే.. -
గోల్డెన్ చారియట్ టూర్: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!
రత్నాల రాశులతో విలసిల్లిన నేల హంపి. కాఫీ తోటలతో విలసిల్లుతున్న చిక్మగళూరు. హొయసల వాస్తుశైలికి తార్కాణం హలేబీడు. బహు విశేషణాల మల్లిగ మాల మైసూరు. మైసూర్ పాలకుల బెంగళూరు ప్యాలెస్.మధ్యలో మృగరాజు గాండ్రించే బందీపూర్.చివరాఖరుకు అరేబియా తీరాన గోవా...ఒకే రైలుబండిలో మొత్తం తిరిగి వద్దాం. రాజమహల్లాటి గోల్డెన్ చారియట్ ట్రైన్ ఉంది. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్ ఉంది. మెనీ మెనీ థాంక్స్ టూ ఐఆర్సీటీసీ.గోల్డెన్ చారియట్ అనేది మనదేశంలో విలాసవంతమైన పర్యటన కోసం ఇండియన్ రైల్వేస్ డిజైన్ చేసిన రైలు ప్రయాణం. ఇందులో ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా, జ్యువెల్స్ ఆఫ్ సౌత్, గ్లింప్సెస్ ఆఫ్ కర్నాటక ప్యాకేజ్లున్నాయి. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్లో బెంగళూరు, నంజన్గుడ్, బందీపూర్ వైల్డ్లైఫ్ సాంక్చురీ, మైసూరు, హలేబీడు, చిక్మగుళూరు, హంపి, గోవాలు కవర్ అవుతాయి.1వ రోజుబెంగళూరు నుంచి నంజన్గుడ్కి ప్రయాణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటకులు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉదయం ఎనిమిదిన్నరకు ట్రైన్ ఎక్కి లో తమకు కేటాయించిన క్యాబిన్లో చెక్ ఇన్ అవుతారు. రైలు 9.45కి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. లంచ్ రైల్లోనే. మధ్యాహ్న ఒకటిన్నరకు నంజన్గుడ్ చేరుతుంది. రైలు దిగిన తర్వాత రోడ్డు మార్గాన బందిపూర్ వైల్డ్లైఫ్ సాంక్చురీకి ఒకటిన్నర గంట ప్రయాణం. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అడవిలో విహారం తర్వాత తిరిగి నంజన్గుడ్ స్టేషన్కు చేరి రైలెక్కాలి. ఎనిమిది తరవాత రాత్రి భోజనం. రైలు మైసూరు వైపు సాగుతుంది.బందీపూర్: ఇది దట్టమైన అడవి. పశ్చిమ కనుమలు అంటేనే పచ్చదనానికి పుట్టిల్లు. దట్టమైన అడవుల నెలవు. ఈ పర్వతశ్రేణుల్లో విస్తరించిన అడవి ఇది. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పులి ఠీవిగా రాజుగా సంచరిస్తుంటుంది. కానీ పగలు చూడలేం. సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ని మాత్రమే చూడగలం. మైసూర్– ఊటీ హైవేలో ఉంది. ఈ అటవీ ప్రాంతం ఏనుగులు, రకరకాల జింకలు, వందలాది జాతుల పక్షుల నిలయం. ఇక్కడ మహావృక్షాలను చూడడానికి తలెత్తి ఆకాశాన్ని చూడాల్సిందే. ఆకాశాన్నంటే మహావృక్షాలనే అతిశయోక్తి అలంకారం ఈ వృక్షాలను చూసే పుట్టిందేమో! వెదురు, టేకు, రోజ్వుడ్ వృక్షాలుంటాయి. చందనవృక్షాలను తాకి చేతిని వాసన చూసుకుని మురిసిపోవచ్చు. అడవిలో సఫారీకి పర్యటించడానికి జీపులు, మినిబస్సులున్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీ లేదు. ట్రెకింగ్ చేయవచ్చు. కానీ ఈ టూర్ ప్యాకేజ్లో అంత సమయం ఉండదు.2వ రోజుమైసూరు పర్యటన. ఉదయం రైల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రైలు దిగి మైసూరు ΄్యాలెస్కు రోడ్డు ప్రయాణం. మధ్యాహ్న భోజనం సమయానికి రైలెక్కాలి లేదా ఆ సమయంలో శ్రీరంగపట్టణం వెళ్లి రావచ్చు. ట్రైన్ శుభ్రం చేసుకోవడం కోసం ఆగుతుంది. రాత్రి భోజనం రైల్లోనే, బనావర్ రైల్వే స్టేషన్కు ప్రయాణం సాగుతుంది.మైసూరు: ఈ నగరానికి ఉన్నన్ని విశేషణాలు బహుశా మరే నగరానికీ ఉండక΄ోవచ్చు. హెరిటేజ్ సిటీ, సిటీ ఆఫ్ ΄్యాలెస్, ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్నాటక, సాండల్వుడ్ సిటీ, సిటీ ఆఫ్ జాస్మిన్...ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా ముఖ్యంగా పర్యాటకులు గుర్తుంచుకోవాల్సింది మైసూరు ఉచ్చారణ గురించి. ఇంగ్లిష్ స్పెల్లింగ్ ఆధారంగా మైసూర్ లేదా మైసోర్ అని పలికితే కన్నడిగులకు నచ్చదు. సౌమ్యులు కాబట్టి కోప్పడరు కానీ నొచ్చుకుంటారు. మైసూరు అనాల్సిందే. వడయార్లు నివసించిన మైసూరు ప్యాలెస్, మైసూరుకి ఆ పేరు తెచ్చిన చాముండి హిల్స్లో చాముండేశ్వరి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను చూసిన తర్వాత ఇక్కడ దొరికే మైసూరు మల్లిగె (మల్లెపూలు)లు కొనుక్కుని జడకు చుట్టుకుని మురిసి΄ోవాల్సిందే. అలాగే మైసూరు సిల్క్ చీరలు, మైసూర్ శాండల్ సోప్లు కూడా.3వ రోజుహలేబీడు, చిక్మగళూరుకు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత బణావర్లో రైలు దిగి హలేబీడుకు వెళ్లాలి. హలేబీడు సైట్సీయింగ్ తర్వాత రైలెక్కి మధ్యాహ్న భోజనం చేస్తూ చిక్మగుళూరుకు వెళ్లాలి. సాయంత్రం కాఫీ తోటల్లో విహారం, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత అక్కడే రాత్రి భోజనం పూర్తి చేసుకుని రైలెక్కి హోస్పేటకు సాగి΄ోవాలి.హలేబీడు... ఇది 11వ శతాబ్దంలో విలసిల్లిన హొయసల సామ్రాజ్యానికి తార్కాణం. ఢిల్లీ సుల్తానుల విధ్వంసం తర్వాత మిగిలిన శిథిలాలు నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలుసుకోవడానికి మిగిలిన ఆనవాళ్లు. ఏకరాతిలో చెక్కిన మహాశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. బారులు తీరిన ఏనుగులు, సింహాలతో ఆలయం గోడలంతా శిల్పనైపుణ్యమే. ఈ శిల్పాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే ఇందులో ఒక మహా చారిత్రక గ్రంథం దాగి ఉందని చెబుతారు చరిత్రకారులు.చిక్మగళూరు: విస్తారమైన కాఫీ తోటల మధ్య కాఫీ సువాసనను ఆఘ్రాణిస్తూ విహరించడం గొప్ప అనుభూతి. కాఫీ తోటల్లో చెట్ల సన్నని కొమ్మలు కాఫీ గింజల బరువుకు నేలకు వంగి΄ోతుంటాయి. ఆకు పచ్చ రంగు నుంచి ఎరుపు రంగుకు మారిన గింజలను కోసి బుట్టలో వేస్తుంటారు మహిళలు.టీ తోటల్లో టీ ఆకు సేకరించేవాళ్లు బుట్టను వీపుకు కట్టుకుంటారు. కాఫీ గింజలను సేకరణలో బుట్టను ముందుకు తగిలించుకుంటారు. కాఫీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి కాఫీ వాసన గాల్లో తేలుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోస్పేట జంక్షన్లో ట్రైన్ దిగి హంపిలోని పర్యాటకప్రదేశాల వీక్షణానికి తీసుకువెళ్తారు. లంచ్ సమయానికి తిరిగి రైలెక్కాలి. సాయంత్రం వరకు ఖాళీ సమయం. రాత్రి భోజనం తర్వాత గోవా వైపు ప్రయాణం సాగుతుంది. హంపి: తుంగభద్ర తీరాన 14వ శతాబ్దంలో విలసిల్లిన నగరం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తున్న ఆనవాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. కృష్ణదేవరాయలు పాలించిన నేల. రాయల కాలంలో రత్నాలు రాశులు పోసిన నేలలో ఇప్పుడు మనకు కనిపించేవి రాళ్లు మాత్రమే. విరూపాక్ష ఆలయం, ముస్లిం పాలకుల చేతిలో ధ్వంసమైన నిర్మాణాల శిథిలాల ఆధారంగా వాటి పూర్తి స్వరూపాన్ని మనోనేత్రంతో వీక్షించుకోగలిగితే నాటి శిల్పకారుల చాతుర్యానికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. హంపిని ఏటా సందర్శించే ఏడు లక్షల పర్యాటకుల్లో మనమూ ఉందాం. 5వ రోజుగోవాలో విహారం. బ్రేక్ఫాస్ట్ తర్వాత నార్త్ గోవాలోని చర్చ్ల వీక్షణం. తిరిగి స్టేషన్కి వచ్చి ట్రైన్లో లంచ్. ట్రైన్ మాద్గోవ్ వైపు సాగుతుంది. సాయంత్రం సౌత్ గోవాలో ఉత్సాహం ఉరకలు వేసే కార్యక్రమాలు, గాలా డిన్నర్ తర్వాత ట్రైన్ బెంగళూరు వైపు సాగుతుంది.గోవా అంటే మనకు అరేబియా తీరమే గుర్తు వస్తుంది. కానీ ఇది ఒక మినీ వరల్డ్. ప్రాచ్య పాశ్చాత్యాల కలయిక. పోర్చుగీసు పాలకులు నిర్మించిన కట్టడాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. చర్చ్ల నిర్మాణంలో వైవిధ్యత ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొన్ని హిందూ ఆలయాలు కూడా పాశ్చాత్యశైలిలో ఉంటాయి. హిందూ– క్రిస్టియన్ ఐకమత్యాన్ని చాటే శిల్పాన్ని తప్పకుండా చూడాలి. లీనింగ్ టవర్ ఆఫ్ పిసాను పోలిన నిర్మాణం ఉంది. అది మంగేషి ఆలయం. 6వ రోజుయశ్వంత్పూర్ స్టేషన్కు ట్రైన్ చేరుతుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు పలుకుతారు.ప్యాకేజ్ ఇలా...ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజ్లో డీలక్స్ క్యాబిన్ ట్విన్ షేరింగ్లో ఒకరికి 4,20,680 రూపాయలు. సింగిల్ సప్లిమెంట్ కేటగిరీ 3,15,950 రూపాయలు.రెండు పడకల క్యాబిన్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. టూర్లో అన్ని భోజనాలు, టీ కాఫీ, నీటి బాటిల్, కూల్ డ్రింకులతోపాటు వైన్, బీర్ వంటి ఇతర డ్రింకులురైలులో పారా మెడికల్ సర్వీస్, బట్లర్ సర్వీస్, స్టేషన్లలో పోర్టర్ సర్వీస్ గైడ్ సర్వీస్తోపాటు పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ ఫీజ్, స్టిల్ కెమెరా ఫీజ్.డీలక్స్ క్యాబిన్ బుక్ చేసుకున్న పర్యాటకులకు రైలు దిగి రోడ్డు మార్గాన ప్రయాణానికి వోల్వో బస్, వోక్స్వ్యాగన్ వంటి వాహనాలుంటాయి.లాండ్రీ ఖర్చులు, ప్యాకేజ్లో లేని ఇతర బేవరేజ్లు, పర్యాటక ప్రదేశాల్లో వీడియో కెమెరా ఫీజ్, ఇంటి నుంచి టూర్ మొదలయ్యే ప్రదేశానికి చేరడానికి, పర్యటన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి అయ్యే వాహన ఖర్చులు ఈ ప్యాకేజ్లో వర్తించవు. (చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం దూసుకునిపోతున్న వేళ.. ఇప్పటికీ కొన్ని దేశాలు పర్యాటక ఆంక్షలు వీడటం లేదు. వాటిలో ఉత్తరకొరియా, సౌదీ అరేబియా, భూటాన్, తుర్క్మెనిస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం ఉత్తరకొరియా. ఇక్కడ పర్యటించడానికి చాలా కఠినమైన నిబంధనలున్నాయి. కేవలం కొన్ని ప్రత్యేక పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. సౌదీ అరేబియాలో విదేశీ పర్యాటకం చాలా పరిమితంగా ఉండేది. ఆ దేశం 2019లో పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించినా, ఇప్పటికీ, కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వెళ్లడానికి అనుమతించడంలేదు. తుర్క్మెనిస్థాన్లో పర్యటించడానికి వీసా పొందడం చాలా కష్టం. ఇక భూటాన్ తమ దేశ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాల పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తోంది. (చదవండి: పరీక్ష భయాన్ని ఓడించే టెక్నిక్స్) -
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్నగర్ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం. దేవస్థానం చరిత్ర...పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం...మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. స్థలపురాణం... ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి..?బస్సు మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూల్ నుండి చేరుకోవచ్చు. మహబూబ్నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.సీజన్లో పెళ్లిళ్ల హోరు...అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బస...మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు. -
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..) -
బటన్తో భద్రతకు భరోసా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుళ్లు కూడా క్యాబ్లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో వారి భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోనుంది. మహిళలు క్యాబో.. ప్రైవేటు బస్సో ఎక్కినప్పుడు వేధింపులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వీటికి అదనంగా ప్రతి వాహనంలో ‘ప్యానిక్ బటన్’ను కూడా తప్పనిసరి చేయనుంది. మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సందేశం వెళ్లిపోతుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులు వాహనం వద్దకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ విధానం ఇప్పటికే అమలవుతోంది. త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించినా అమల్లోకి రాలేదు. కొన్ని క్యాబ్ సంస్థలు వేటికి అవే స్వయంగా ఏర్పాటు చేసుకున్నా మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రెండు లక్షల వాహనాల్లో.. – గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 8,000 లకు పైగా ప్రవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతో పాటు నేషనల్ పర్మిట్లపై టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. – బస్సులకు అదనంగా 1.2 లక్షల క్యాబ్లు, సుమారు 30 వేల మ్యాక్సీ క్యాబ్లు, మినీ బస్సులు, ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. మొత్తంగా దాదాపు రెండు లక్షల ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. – కొవిడ్ అనంతరం నగరంలో రకరకాల క్యాబ్ అగ్రిగేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిసార్లు వాహనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొన్న సమయంలో నమోదయ్యే వాహనం నంబర్కు, అందుబాటులోకి వచ్చే వాహనానికి సంబంధం ఉండడం లేదు. చివరకు ఏ క్యాబ్ వినియోగంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంటోంది. – శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సాగించే క్యాబ్లలోనూ డ్రైవర్ల తీరుపై మహిళా ప్రయాణికులు తరచుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికిల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.ఎలా పనిచేస్తుందంటే.. -
వండర్స్ ఆఫ్ వయనాడ్: కొండ కోనల్లో పడవ ప్రయాణం..!
పాత రాతియుగాన్ని చదువుకున్నాం... శిలాయుగాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ కట్టిన తిరునెల్లి ఆలయం ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని చూడాలంటే... అరక్కల్... అంబల్వాయల్ మ్యూజియాలకు కళ్లప్పగించాలి. ఎడక్కల్ గుహల్లో ఎనిమిదివేల ఏళ్ల నాటి బొమ్మలను తాకి చూడాలి. మోడరన్ హిస్టరీ చెప్పిన పాఠాలకు ఆనవాళ్లుగా... ఏమేమి ఉన్నాయి? డచ్ కట్టడాలు... పోర్చుగీసు నిర్మాణాలు... బ్రిటిష్ కాలపు టెలిఫోన్లు. వాటిని చూడాలంటే ఏం చేయాలి?... వయనాడుకు ప్రయాణమవ్వాలి. ఎరుపెక్కిన కళ్లతో కప్పడ్ బీచ్లో వాస్కోడిగామా స్మారకాన్ని చూడాలి. గాంధీజీ జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన కాల్పెట్టలో బస చేయాలి. ఫారెస్ట్కు అర్థవంతమైన నిర్వచనం చెప్తున్న కురువద్వీపంలో అడుగుపెట్టాలి. పూకోద్ సరస్సులో కలువల మధ్య పడవ ప్రయాణం చేయాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని గౌరవిస్తూ ముందుకుసాగాలి. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్’ ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.సెలవులు వస్తున్నాయి... కేరళలో పర్యటనకు ప్లాన్ చేసుకోండి.మొదటి రోజు..ఉదయం ఆరుగంటల సమయంలో 12789 నంబరు కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.రెండోరోజుఉదయం ఆరు గంటల సమయంలో రైలు కన్నూరుకు చేరుతుంది. రైలు దిగి రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన హోటల్కు చేరుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఉపహారం తిన్న తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. ఏంజిలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం చూసుకున్న తర్వాత ప్రయాణం వయనాడు వైపు సాగుతుంది. దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వయనాడు, కాల్పెట్టలోని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస అక్కడే.ఇక్కడికి గాంధీజీ వచ్చాడు!కన్నూర్ కోట (సెయింట్ ఏంజిలో ఫోర్ట్) పోర్చుగీసు, డచ్వాళ్ల పాలన సాగించిన ప్రదేశం. అరక్కల్ మ్యూజియం కన్నూరు సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. అరక్కల్ రాజవంశం నివసించిన ప్యాలెస్ అది. వాళ్లు ఉపయోగించిన ఫర్నిచర్ డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా సంపన్నవర్గాల ఇళ్లలో కనిపిస్తున్నాయి. బ్రిటిష్పాలన కాలంనాటి టెలిఫోన్ కూడా ఉంది. రాత్రి బస చేస్తున్న కాల్పెట్ట అందమైన హిల్స్టేషన్. దట్టమైన అటవీ ప్రదేశం కూడా. కేరళలో భారత జాతీయోద్యమం పురుడుపోసుకున్న ప్రదేశం ఇది. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినింపడానికి గాంధీజీ 1934లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. మూడోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. కురువ ద్వీప్, తిరునెల్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ చూసుకుని హోటల్కి చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.బ్రహ్మ కట్టిన ఆలయంకురువద్వీపంలో విహారం మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. కబిని నది ఉపనదుల ప్రవాహం మధ్యలో ఏర్పడిన వెయ్యి ఎకరాల దీవి ఇది. పచ్చదనాన్ని పుష్పగుచ్ఛంగా ఒకచోట రాశి΄ోసినట్లుంటుంది. ఇక్కడ అరుదైన పక్షులు కనిపిస్తాయి. తిరునెల్లి ఆలయం ఓ విశిష్టత. దీని గురించి చారిత్రక ఆధారాలేవీ దొరకట్లేదు. పౌరాణిక ఆధారాల ప్రకారం వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో విష్ణువు కోసం బ్రహ్మ భూమ్మీద నిర్మించిన ఆలయం అని తెలుస్తోంది. లొకేషన్ సెలెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు తన వాహనం హంస మీద భూమండలం అంతా పర్యటిస్తూ ఈ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడ్డాడని, ఇక్కడే ఆలయాన్ని నిర్మించాడని, ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరు రావడానికి కారణం అదేనని చెబుతారు. ఆలయాన్ని నిర్మించే వరకు తనతో తెచ్చిన విగ్రహాన్ని ఉసిరి చెట్టులో దాచడంతో ఈ ఆలయానికి నెల్లి అనే పేరుతో తిరునెల్లి ఆలయం అనే పేరు వచ్చింది. పది–పదకొండు శతాబ్దాల్లో చేరరాజు భాస్కర రవివర్మ పాలించిన నాటికే ఇది గొప్ప యాత్రాస్థలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నాటి గ్రామాల ఆనవాళ్లను కూడా చూడవచ్చు. ఆ తర్వాత చూడాల్సిన బాణాసుర సాగర్ డ్యామ్ రెండువేల అడుగుల పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఎర్త్డ్యామ్. జల విద్యుత్ తయారీ కేంద్రాన్ని కూడా చూడవచ్చు. నాల్గోరోజుబ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపారా జలపాతం, ఎడక్కల్ గుహలు, పూకోద్ సరస్సులో విహారం తర్వాత తిరిగి హోటల్కు చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.రాతియుగాన్ని చూసొద్దామా!ఇది వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, అంబలవాయల్ అనే ప్రదేశంలో ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇందులో రాతియుగం నాటి పదునైన రాతి ఆయుధాలు, 14 నుంచి 16వ శతాబ్దం నాటి శిల్పాలు, మృణ్మయపాత్రలు, టెర్రకోట శిల్పాలు ఉంటాయి. ఇక ఎడక్కల్ గుహలు కాల్పెట్టకు 25 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. వీటి వింత ఏమిటంటే... ఇవి నేలమీద విస్తరించిన గుహలు కావు. ఎవరూ పనిగట్టుకుని తొలిచినవీ కాదు. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహల్లో కనిపించే బొమ్మలు క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్ల నాటివని అంచనా. ఈ రోజు చివరగా పూకోద్ సరస్సులో పడవ విహారంతో సేదదీరడమే. ఈ సరస్సు దాదాపు ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో కొండల మీద ఏడెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షపునీరు కొండ కోనల నుంచి ఇక్కడికి చేరుతుంది. సరస్సు నిండిన తర్వాత నీరు కిందకు ప్రవహించి పనమారమ్ నదిగా మారుతుంది. ఈ నది కబిని నదిలో కలుస్తుంది. ఈ సరస్సులో కలువలు విరివిగా ఉంటాయి. అందుకే దీనికి పూలతీరం అనే అర్థంలో పూకోద్ అనే పేరు వచ్చింది. ఐదోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ప్రయాణం కోళికోద్ వైపు సాగుతుంది. దారిలో కప్పడ్ బీచ్ విహారం. సాయంత్రం ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఉంటుంది. షాపింగ్ తర్వాత కోళికోద్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలెక్కాలి. 12790 నంబరు మంగళూరు సెంట్రల్ – కాచిగూడ ఎక్స్ప్రెస్ రాత్రి 11.35 నిమిషాలకు బయలు దేరుతుంది. 24 గంటల తర్వాత ఆరవ రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుతుంది.వాస్కోడిగామా అడుగుపెట్టాడు!కప్పడ్ బీచ్ అంటే ΄ోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించి మన నేల మీద పాదం మోపిన ప్రదేశం. ఇది 1498లో జరిగింది. భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ 1934లో కాల్పెట్టలో అడుగుపెట్టడానికి కారణమైన సంఘటన అన్నమాట. కష్టంగా అయినా నిష్టూరంగా అయినా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే, వదిలేయడానికి వీల్లేదు. గుడ్లు పెట్టి పిల్లలను పొదగడానికి ఇక్కడికి వచ్చే తాబేళ్లను చూడడానికైనా కప్పడ్ బీచ్ని కవర్ చేయాలి. అలాగే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సముద్రతీరాన గడపడానికి ఇది మంచి ప్రదేశం. ఇక చివరగా కోళికోద్ పట్టణంలోని ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఇస్తారు. వాహనం దిగి మార్కెట్ అంతటా కాలి నడకన తిరగాలి. ఏం కొన్నా కొనక΄ోయినా కోళికోద్ హల్వా తప్పకుండా రుచి చూడాలి. బంధువులు, స్నేహితుల కోసం ఇంటికి తెచ్చుకోవాలి. దీంతో ఈ టూర్ తీపి జ్ఞాపకపు రుచి కలకాలం గుర్తుంటుంది.వండర్స్ ఆఫ్ వయనాడ్ (ఎస్హెచ్ఆర్ 098) ప్యాకేజ్లో...ఇవి ఉంటాయిస్టాండర్డ్ ప్యాకేజ్లో స్లీపర్ క్లాస్లో ప్రయాణం. కంఫర్ట్ ప్యాకేజ్లో థర్డ్ ఏసీలో ప్రయాణం. రైలు దిగిన తరవాత లోకల్ జర్నీ ఏసీ వాహనంలో ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. టోల్ ఫీజ్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజ్లోనే. రాత్రి బస చేసిన హోటల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.ఇవి వర్తించవుమధ్యాహ్నం, రాత్రి భోజనాలు. రైలు ప్రయాణంలో భోజనాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్ చార్జ్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి రిక్రియేషనల్ టికెట్ ఫీజులు, గైడ్ చార్జ్లు, ఇతర సర్వీసులు పర్యాటకులే భరించాలి. కొన్ని ప్రైవేట్ టూర్ ప్యాకేజ్లు ట్రీ హౌస్లో రాత్రి బస ఏర్పాటు చేస్తున్నాయి.వండర్స్ ఆఫ్ వయనాడ్ టికెట్ ధరలిలాసింగిల్ ఆక్యుపెన్సీలో (ఒక్కొక్కరికి ఒక్కో గది) కంఫర్ట్ ప్యాకేజ్ 37, 640 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్కి 34, 840 రూపాయలు.డబుల్ ఆక్యుపెన్సీలో (ఇద్దరికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 21,220 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 18,430 రూపాయలు.ట్రిపుల్ ఆక్యుపెన్సీలో (ముగ్గురికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 17,740 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 14,950 రూపాయలు. (చదవండి: ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..!) -
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్బీఎన్బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్బీఎన్బీలో భారతీయ మహిళా హోస్ట్లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్బీఎన్బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్లో ఎయిర్బీఎన్బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్లో దాదాపు 35% మహిళా హోస్ట్లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్బీఎన్బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్బీఎన్బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్బీఎన్బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..
ప్రకృతి మన తెలుగువాళ్లకు వెయ్యి కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. గుజరాత్కి మాత్రం 16 వందల కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. ఆ తీరమే ఆ రాష్ట్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. ఆ అరేబియా తీరమే విదేశీ వర్తకానికి దారులు వేసింది. ఆ తీరానే శ్రీకృష్ణుడు... మన జాతిపిత గాంధీజీ పుట్టారు. సోమనాథుడు వెలిశాడు... గోరీ మనదేశం మీద దండెత్తాడు. ఆ తీరం పర్యాటకపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వారక నుంచి సోమనాథ్ వరకు ప్రయాణమే ఈ వారం పర్యాటకం.అదిగో ద్వారక...బేట్ ద్వారక... ఇది ద్వారక తీరం నుంచి కనిపించే దీవి. సముద్ర తీరాన విహరించడంతోపాటు సముద్రం మధ్యలో పడవలో పయనించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కృష్ణుడి ద్వారకను చూసి ఆ నేల మీద నడిస్తే కలిగే పులకింతను మాటల్లో చెప్పలేం. పురాణకాలంలో కూడా ప్రజలు ద్వారక ప్రధాన పట్టణం నుంచి బేట్ ద్వారకకు పడవలో ప్రయాణం చేసినట్లు గ్రంథాల్లో ఉంది. చారిత్రక యుగంలో కూడా ద్వారక గురించి సింధు నాగరకత, హర΄్పా నాగరకత, మౌర్య సామ్రాజ్య రచనల్లో కనిపిస్తుంది. ఈ తీరం నుంచి రోమన్తో వర్తక వాణిజ్యాలు జరిగేవి. ఇక్కడి మ్యూజియాలలో ప్రశాంతంగా గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్ ΄్లాన్ చేసుకోవాలి. ఓఖా– బేట్ ద్వారకలను కలిపే బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ మీద ఆగి ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.అంబానీ సొంతూరుచోర్వాడ్ బీచ్... ఇది సోమనాథ్కు 40కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బీచ్ క్లీన్గా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి, చక్కటి ఫొటోలు తీసుకోవడానికి బాగుంటుంది. అరేబియా సముద్రం ఈతకు అనువైనదే. కానీ చోర్వాడ్ దగ్గర మాత్రం ఈత క్షేమం కాదు. ఇక్కడ బీచ్ విజిట్ పూర్తయిన తర్వాత దీరూబాయ్ అంబానీ ఇంటిని చూడడం మర్చిపోవద్దు. నిజమే... ఇది అంబానీల సొంతూరు. ఈ ప్రదేశానికి చోర్వాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం తొలుస్తూనే ఉందా? అరేబియా తీరం నుంచి విదేశీ వ్యాపారం విరివిగా జరిగేది. సముద్రంలో ఓడల్లో సరుకుల రవాణా జరుగుతోందంటే అసంకల్పిత చర్యగా ఆ సరుకును దొంగలించే దొంగలు కూడా సిద్ధమై ΄ోతారు. ఆ సముద్రపు దొంగలు నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం ఇది. దొంగల నివాస ప్రదేశం అనే అర్థంలోనే పేరు స్థిరపడి΄ోయింది. రుక్మిణి కల్యాణంమాధవ్పూర్ బీచ్... ఇది పోర్బందర్ నుంచి వెరావల్కు వెళ్లే హైవే మీద ఉంటుంది. సముద్ర తీరాన హైవే ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణిస్తూ అరేబియా సముద్రపు నీటి నీలం గాఢతను చూడవచ్చు. ఆకాశానికి– సముద్రానికి మధ్య రేఖ ఎక్కడో తెలుసుకోవడం ఓ పెద్ద పజిల్. అన్నట్లు ఇక్కడ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఉంది.స్థానికులను అడిగితే దారి చూపిస్తారు. పోర్బందర్ వరకు కొబ్బరి నీరు దొరకవు. కానీ మాధవ్పూర్ నుంచి సముద్ర తీరాన కొబ్బరి బోండాలు కనిపిస్తాయి. సముద్ర తీరాన కామెల్ రైడ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద వాళ్లు మొహమాట పడకుండా ఒంటె విహారాన్ని ఆస్వాదించాలి. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్లిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఓషో ఆశ్రమం కూడా ఉంది.ఓఖా– మాధీ బీచ్...ఇది ద్వారక వెళ్లే దారిలో వస్తుంది. హైవే మీద వాహనాన్ని ఆపుకుని దిగి ΄ావు కిలోమీటరు నడిస్తే ΄ాదాలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఇక్కడ వర్తక వాణిజ్యాలేవీ జరగవు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇతర ప్రమాదాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి సముద్రంలో స్నానం, స్విమ్మింగ్ సరదా తీరుతుంది. ఇక్కడ జనం రద్దీ తక్కువ. కాబట్టి ఏకాంతపు పర్యటనకు ఇది మంచి ప్రదేశం. సూర్యాస్తమయాన్ని వీక్షించడంతో΄ాటు రాత్రి బస ΄్లాన్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం.కృష్ణుడికి బాణం దెబ్బవెరావల్ బీచ్... ఇది సోమనాథ్కు నాలుగుకిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శ్రీకృష్ణుడు ప్రణత్యాగం చేసిన ప్రదేశం. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు జింక కాలుగా భావించి బాణం వేశాడని, కృష్ణుడు గాయపడి ప్రణత్యాగం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం భాల్క తీర్థంతో సందర్శన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ సంఘటన క్రీ. పూర్వం 3102, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీగా భావిస్తారు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమైందని, మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. వెరావల్ తీరంలో ప్రాచీన కాలం నుంచి వర్తక వాణిజ్యం జరిగేది.సౌరాష్ట్ర కశ్మీరంమహువా బీచ్... ప్రశాంతతకు మారు పేరు ఈ ప్రదేశం. ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళలో ఉన్నామా అనిపిస్తుంది. కొబ్బరిచెట్లు విస్తారంగా ఉంటాయి. ఈత చెట్లు కూడా. రెండు– మూడు గంటల కోసం వెళ్లడం కంటే రాత్రి బస ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సముద్ర తీరాన భవానీ మాత ఆలయం ఉండడంతో స్థానికులు భవానీ బీచ్ అంటారు.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ్ర΄ాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.గాంధీజీ పుట్టాడుచౌపాటీ బీచ్... ఇది పోర్బందర్లోని అరేబియా తీరం. ΄ోర్బందర్ అంటే మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. అంతకంటే ముందు పౌరాణిక కథనాలను చూస్తే ఇది శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ప్రదేశం కూడా. గాంధీజీ ఇంటితోపాటు సుధాముడి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో అటుకులను ప్రసాదంగా ఇస్తారు. పోర్బందర్ జిల్లాకేంద్రమే, కానీ పట్టణంలో పెద్ద హడావుడి ఉండదు. తీర ప్రాంతం మాత్రం అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. పోర్టు ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన ఫ్లెమింగోలు కూడా వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటాయి. వాటి కోలాహలాన్ని కూడా ఆస్వాదించవచ్చు.జ్ఞాపకాలు దండిదండి సత్యాగ్రహం గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండుగా బయలుదేరి ఈ ప్రదేశంలో సముద్రపు నీటిని సేకరించి మరిగించి ఉప్పు తయారు చేశాడు. ఆ సంఘటనకు చిహ్నంగా ఇక్కడ గాంధీజీ ఉప్పు రాశి పోస్తున్న విగ్రహం ఉంటుంది. ఈ తీరంలో విహరించడంతో΄ాటు దండి సత్యాగ్రహం సమయంలో గాంధీజీ బస చేసిన సైఫీ బంగ్లాను కూడా చూసి ఒక ఫొటో తీసుకోవచ్చు.గాయపడిన ఆలయంసోమనాథ్ బీచ్... ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం విదేశీ దాడులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. మహమ్మద్ గోరీ అనేకసార్లు మనదేశం మీద దాడులు చేశాడు. అరేబియా సముద్రం మీద వచ్చి ఈ తీరం నుంచే భారత భూభాగంలోకి అడుగుపెట్టేవాడు. ఆలయ సంపద దోపిడీతోపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం వంటివన్నీ చరిత్రపుటల్లో దాక్కున్నాయి. ఈ ఆలయం ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసుకుందో తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న మారు– గుర్జర శైలి నిర్మాణం నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ అనుమతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నం. అందుకే ఆయన గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో వల్లభాయ్ పటేల్ విగ్రçహాన్ని ప్రతిష్ఠించారు.అరేబియా సముద్రం చిరు అలలతో మంద్రమైన సవ్వడితో ఆలరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. అలలు వేగంగా వచ్చి ఆలయ గోడలను తాకుతుంటాయి.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ప్రాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. (చదవండి: యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్ఫ్రెండ్కు..!) -
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్సర్లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
National Tourism Day సోలో ట్రావెల్ సో బెటర్!
పర్యటనలకు మనదేశం పుట్టిల్లు. తీర్థయాత్రలు మన సంస్కృతిలో భాగం. పర్యటన... ఒక పాఠం... రచనకు అదే మూలం. జీవన వైవిధ్యత అధ్యయనానికి ఓ మాధ్యమం. పర్యటనలు ఒత్తిడి నుంచి సాంత్వన కలిగిస్తాయి.జీవితాన్ని కొత్తగా చూడడానికి కళ్లు తెరిపిస్తాయి.అణగారిన జీవితేచ్ఛను తిరిగి చిగురింప చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్తో టూర్లు... ఫ్యామిలీ టూర్లు... అలాగే... మహిళల సోలో ట్రావెల్స్ కూడా పెరిగాయి. మహిళలు ఒంటరిగా పర్యటనలు చేయడానికి సందేహించాల్సిన అవసరమేలేదిప్పుడు. ప్రపంచంలో మనుషులందరినీ కలిపే భాష ఇంగ్లిష్. మనదేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా ఇంగ్లిష్ భాష వస్తే చాలు. అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లేక΄ోయినప్పటికీ మనకు అవసరమైన సమాచారాన్ని అడగగలగడం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. సేఫ్టీ, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగిస్తే మహిళలు ఒంటరిగా ప్రయాణించినా సరే ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నారు రజని లక్కా.ఆత్మవిశ్వాసం ఉండాలి, కనీసం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించి తీరాలి. బిత్తర చూపులు చూస్తే మోసగించేవాళ్లు అక్కడిక్కడే ప్రత్యక్షమవుతారు. మరో తప్పనిసరి జాగ్రత్త ఏమిటంటే సహ ప్రయాణికులతో కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే పర్యటనను ఆస్వాదించాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సోలోగా పర్యటనకు వెళ్లిన వాళ్లు ఇంట్లో వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అయితే లైవ్ లొకేషన్స్ ఇతరులకు ఎవ్వరికీ షేర్ చేయవద్దు. సోషల్మీడియాలో లైక్ల కోసం తాపత్రయపడి టూరిస్ట్ ప్లేస్లో ఫొటోలు తీసుకుని గంటకో పోస్ట్ పెడుతూ ఉంటే మన కదలికలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంటాయి. మనల్ని ఎవరైనా రహస్యంగా వెంటాడుతున్నట్లయితే చేజేతులా వారికి దారి చూపించినట్లవుతుంది. పర్యటన వివరాలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్తో షేర్ చేయాలనుకుంటే పర్యటన పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో ఒంటరిగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు జెన్నిఫర్. మనవాళ్లకు అడ్వెంచర్ టూర్లు చేయడం కంటే నియమాలను ఉల్లంఘించడంలో సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఫొటోగ్రఫీ నిషేధం అన్న చోట ఫొటోలు తీసుకుంటారు. సెక్యూరిటీ కళ్లు కప్పి నిషేధిత ప్రదేశాల్లోకి, డేంజర్ జోన్లలోకి దొంగచాటుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరం మాత్రమే కాదు నేరం కూడా. పర్యటనను ఆస్వాదించడం కూడా ఒక కళ. ఎప్పటికీ వన్నె తగ్గని కళ. (టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)మనదేశం ప్రపంచానికి ప్రతీక కశ్మీర్లో తప్ప సోలో ట్రావెలర్గా మరెక్కడా నాకు ఇబ్బంది ఎదురుకాలేదు. తమిళనాడు ప్రజలు సింపుల్గా ఉంటారు. 76 దేశాల్లో పర్యటించిన తరవాత నాకనిపించిందేమిటంటే... ప్రపంచంలో ఉన్నవన్నీ మనదేశంలో ఉన్నాయి. మనదేశంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. గుజరాత్లోని కచ్ ప్రాంతం బొలీవియాను తలపిస్తుంది. మన దగ్గర ఎడారులు, హిమాలయాలు, బీచ్లు ఒక్కొక్కటి ఒక్కోదేశంలో ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్ను తలపిస్తాయి. ఆర్కిటెక్చర్ పరంగా తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ కోటలకు ప్రపంచంలో మరేవీ సాటి రావు.- పొనుగోటి నీలిమ, ట్రావెలర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదీ చదవండి: ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!ట్రావెల్ లైట్... ట్రావెల్ సేఫ్ ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా పర్యటించాను. ఏడు దేశాలు కూడా చూశాను. మనల్ని మనం మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది పర్యటన ద్వారానే. సోలో ట్రావెల్ అయితే మన అభిరుచికి తగినట్లు టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు పర్యటనలకు సౌకర్యాలు బాగున్నాయి. సోలో ట్రావెల్లో అన్నీ మనమే సమకూర్చుకోవడం కష్టం అనిపిస్తే టూర్ ΄్యాకేజ్లో వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో స్థానికులతో కలిసి΄ోతున్నట్లుగా ఉండాలి. మనల్ని మనం ఎక్స్΄ోజ్ చేసుకునే ప్రయత్నం చేయరాదు. ఆ ప్రదేశానికి సరి΄ోలని వస్త్రధారణ, మాటల ద్వారా ఇతరుల దృష్టి మన మీద సులువుగా పడుతుంది. ప్రమాదాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. సోలో ట్రావెల్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ విషయంలో మాత్రమే. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, డైరెక్టర్ సురక్షితంగా వెళ్లిరావచ్చు! ఒంటరి పర్యటనలు ఆస్వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. కెనడాలో మాంట్రియల్లో నేను ప్రయాణించిన టూరిస్ట్ బస్లో తొమ్మిది దేశాల వాళ్లున్నారు. అంతమందిలో ఇద్దరు మినహా అంతా సోలో ట్రావెలర్సే. అయితే వెళ్లే ముందు పర్యటనకు వెళ్లే ప్రదేశం గురించి ్ర΄ాథమిక వివరాలైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెంట్, జీపీఎస్ సౌకర్యాలున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ధైర్యంగా ఒంటరి ప్రయాణాలు చేయవచ్చు. భద్రంగా వెళ్లి, సంతోషంగా తిరిగి రాగలిన పరిస్థితులున్నాయి. – రజని లక్కా, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!) -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్సింగ్ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్స్టాగ్రామ్లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్కి ఇన్స్టాగ్రామ్లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్ల్యాండ్లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
స్లో.. & స్టడీ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది. స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా అర్థం చేసుకునేలా ‘స్లో ట్రావెల్’పేరుతో పర్యాటక ఉద్యమం ఊపందుకుంటోంది. స్లో ట్రావెల్లో పర్యాటక ప్రదేశాల పరిమాణం కంటే.. అందులోని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గజిబిజి జీవితాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రకృతి ఒడిలో మునిగిపోయేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం ‘స్లో ట్రావెల్’ఇయర్గా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రైళ్లకు జై కొడుతున్నారు2024లో 81శాతం మంది విశ్రాంతి కోసం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు స్లో వెకేషన్లకు వెళ్లినట్టు ‘ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్’పేర్కొంది. ఇందులో మూడొంతుల మంది సాంస్కృతిక, చారిత్రక అన్వేషణ, వారసత్వ ప్రదేశాల సందర్శనలకు విలువ ఇస్తున్నట్టు గుర్తించింది. స్లో ట్రావెల్లో భాగంగా అధిక శాతం మంది రైలు ప్రయాణాలకు జైకొడుతున్నట్టు తేలింది. సుదూర గమ్యస్థానాలకు విమాన, కారు ప్రయాణాలకు ఖర్చుతో కూడుకోవడం, ఒక్కోసారి రిమోట్ గమ్యస్థానాలను చేరుకోలేకపోవడంతో రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత సైక్లింగ్, బైక్ రైడ్లలో సోలోగా స్లో ట్రావెల్కు వెళ్తున్నారు. ఇటీవల కాలం నదీ అందాలను ఆస్వాదించేందకు క్రూయిజ్ల ప్రయాణాలను ఎంపికలు పెరిగాయి. అహ్మదాబాద్.. అగ్రస్థానంభారతదేశంలో అహ్మదా బాద్ నగరం సుదీర్ఘ సందర్శనలలో పాల్గొనే వారికి అగ్ర ఎంపికగా ఉద్భవించింది. గోవా, అయోధ్య తరువాత ఈ ప్రాంతంలో ఎక్కువగా గడిపేందుకు ప్రసిద్ధి చెందింది. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఆసియాలో థాయ్లాండ్లోని ఖావో లాక్, జపాన్లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియో ల్, మలేషియాలోని పెర్హెన్షియన్ దీవులు, వియత్నాంలోని హోచిమిన్ సిటీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అగోడా ప్రకటించింది.భారత్లో 10% వృద్ధి అంచనానిత్యం పని జీవితంలో ఒత్తిళ్లు తారస్థాయికి చేరుకోవడంతో సెలవులు తీసుకోవడం గతంతో పోలిస్తే విలువైనది మారింది. ఆఫ్బీచ్ వెకేషన్లు, కొత్త అన్వేషణల గమ్యస్థానాలకు ప్రయాణించడం మానసిక చికిత్సగా భావిస్తున్నారు. 2025లో అత్యధికులు ‘స్లో ట్రావెల్’కు జైకొడుతున్నారు. ఇది 2025లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని ట్రావెల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. చాలామంది పర్యాటకులు గమ్యస్థానాలను పూర్తిగా అస్వాదించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావడం కంటే స్థానిక సంస్కృతిలో లీనమవ్వడం, మరింత అర్థవంతంగా ప్రయాణాన్ని మార్చుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యం పిల్లలను పెంచడం, ఆఫీస్ సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలంటూ బిజీ షెడ్యూల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మానసిక విశ్రాంతి, ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆహారాన్ని రుచి చూడటం, కొత్త దృశ్యాలను కళ్లతో బంధిస్తూ విశ్రాంతిని పొందే ప్రదేశాలను కోరుకుంటున్నట్టు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్లోని దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024 -
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
రైలు ప్రయాణం హాయిగా సాగిపోవాలంటే..!
రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్లో తలదూర్చి లేదా పేపర్తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు. ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం. ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) (చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!) -
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్కి లేదా సంక్రాంతి వెకేషన్కి ప్లాన్ చేసుకోండి. -
మహిళల ఉచిత బస్సు పథకం రద్దుపై కర్ణాటక సీఎం క్లారిటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకంపై చర్చ జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. డీప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను లేను’అని అన్నారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని శివకుమార్ పేర్కొన్నారు. ‘‘ చూద్దాం, మేం దీనిపై కూర్చుని చర్చిస్తాం. మరికొంతమంది మహిళలు.. కొంత చార్జీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి, నేను ఈ అంశంపై పరిశీలన చేస్తాం’అని అన్నారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇక.. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో ‘శక్తి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి గరిష్ఠంగా 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే ఇది 2.6 శాతం అధికం. విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లేప్పుడు ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.ఆరోగ్య అత్యవసర పరిస్థితి కోసం..నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తూంటారు. వారికి వెళ్లినచోట ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.విభిన్న దేశాలు.. ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ పాలసీ అమలయ్యేలా ఒకే పాలసీని ఎంచుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.800-రూ.900 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: ఎక్కేద్దాం... ఎగిరిపోదాం! విమాన ప్రయాణికుల జోరుసామాగ్రి అందకపోయినా ధీమాగా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామాగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామాగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది. -
కార్పొరేట్ ట్రావెల్ 20.8 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్బాట్లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి. ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు.. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్ఫామ్లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది. -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్ను మించినది లేదు. కంచన్జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్ను చూస్తాం. కంచన్జంగ టూర్లో జెమూ గ్లేసియర్ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
పెరుగుతున్న ట్రావెల్ స్కామ్లు.. బాధితులు వీళ్లే..
దేశ విదేశాలకు ఇటీవల హాలిడే ట్రిప్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో యువత, టీనేజర్లే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలా హాలిడే ట్రిప్లకు వెళ్లేవారు ట్రావెల్ బుకింగ్ స్కామ్లకు గురవుతున్నారు. ఇలాంటి ట్రావెల్ స్కామ్లను అరికట్టడానికి ఎయిర్బీఎన్బీ (Airbnb), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్తో చేతులు కలిపింది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ యుగోవ్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. భారత్కు చెందిన మిలీనియల్స్ (1980, 90లలో పుట్టినవారు), జెన్ జెడ్ (1995-2010 మధ్య జన్మించినవారు) టీనేజర్లు ఎక్కువగా ప్రయాణ స్కామ్ల బారిన పడుతున్నారు. బాధితులు సగటున రూ.1,02,233 నష్టపోతున్నారు. డబ్బు ఆదా అవుతుందంటే చాలు దాదాపు సగం మంది భారతీయ ప్రయాణికులు హాలిడే బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తతను పట్టించుకోవటం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. 40 శాతం మందికిపైగా పరిమిత సమాచారంతోనే బుకింగ్ చేస్తుండటం వల్ల నష్టపోతున్నారని వెల్లడించింది.ఈ అధ్యయనానికి అనుగుణంగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీ తమ కస్టమర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్ల రక్షణ కోసం అనేక చర్యలను అమలు చేసింది. స్కామ్లు, ఆన్-ప్లాట్ఫారమ్ మెసేజింగ్ అరికట్టడానికి గెస్ట్ పేమెంట్ పేమెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక బృందాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా చెక్-ఇన్ తర్వాత 24 గంటల వరకు పేమెంట్ను నిలిపివేయడం ద్వారా యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది. -
ఫ్రీ బస్సు చిత్రాలు..
-
ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలం
న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ‘‘ట్రావెల్ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. ఎన్నో అనుకూలతలు.. అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్లైన్స్ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్ను పెంచుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. -
హైవే ఎక్కితే టోల్!
సాక్షి, హైదరాబాద్: హైవే మీద కాస్త దూరమే ప్రయాణించినా ఇకపై సదరు వాహనం సంబంధిత ఖాతా నుంచి టోల్ రుసుము కట్ కానుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లోంచి వాహనం వెళ్తేనే టోల్ చెల్లించాల్సి వస్తోంది. టోల్ బూత్ వచ్చేలోపు రోడ్డు దిగిపోతే చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. ఇకపై అలా కాకుండా హైవే ఎక్కితే చాలు రుసుము చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు. సెన్సార్లు, ఫాస్టాగ్లకు చెల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్తో అనుసంధానమై టోల్ వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్గా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న టోల్ ప్లాజాలనే వినియోగించుకుంటున్నారు. అక్కడి సిబ్బందికి నిర్ధారిత రుసుము చెల్లించి రశీదు పొందే పద్ధతి తొలగించి, సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్ను రీడ్ చేయటం ద్వారా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఖాతాను వాడకాన్ని బట్టి ఎప్పటికప్పుడు టాప్ అప్ చేసుకోవల్సి ఉంటుంది.కాగా దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో అనుసంధానమయ్యే కొత్త టోల్ వ్యవస్థను తీసుకొస్తోంది. టోల్ బూత్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. వాహనాలు టోల్ రోడ్ల మీద తిరిగిన దూరాన్ని ఉపగ్రహ సాయంతో గుర్తించి, ఆ మేరకు టోల్ను లెక్కిస్తుంది. ఆ వ్యవస్థతో అనుసంధానించిన ఖాతా నుంచి అంతమేర టోల్ రుసుము డిడక్ట్ అవుతుంది. వాహనాల బారులు ఉండవు గతంలో మాన్యువల్గా టోల్ వసూలు చేసినప్పుడు రద్దీ అధికంగా ఉండే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెచి్చంది. వాహనం టోల్ బూత్లోకి ప్రవేశిస్తుండగానే సెన్సార్లు ఫాస్టాగ్ను రీడ్ చేసి టోల్ను డిడక్ట్ చేస్తాయి. ఈ పద్ధతిలో వాహనాల బారులు ఉండవని భావించారు.కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాలతో రద్దీ సమయాల్లో ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలోనే క్షణాల్లో టోల్ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. దీంతోపాటు అసలు టోల్బూత్లే ఉండకపోవడంతో ఎక్కడా వాహనాలు వేచి చూడాల్సిన పరిస్థితి రాదు. ప్రభుత్వానికి 3 రెట్లు పెరగనున్న ఆదాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల మేర టోల్ వసూలవుతోంది. ఈ ఆదాయం పెరగనుంది. ఇప్పటివరకు టోల్ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం రావటం లేదు. కొత్త విధానంతో టోల్ రోడ్డుపై వాహనాలు స్వల్ప నిడివిలో ప్రయాణించినా టోల్ వసూలు చేసే అవకాశం ఉండటంతో టోల్ ఆదాయం కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. పైగా టోల్ బూత్ల నిర్వహణ భారం ఉండదు. ఇలా పనిచేస్తుంది.. టోల్ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రోడ్లపై ప్రత్యేక కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. ఇక వాహనాల్లో ఆన్బోర్డ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ, వాహనం టోల్ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందో కచి్చతంగా నిర్ధారిస్తాయి.వాహనదారు నిర్ధారించిన బ్యాంకు ఖాతాతో టోల్ వసూలు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్ రోడ్డుపైకి వాహనం చేరింది, ఏ ప్రాంతంలో అది హైవే దిగిందీ అన్న విషయాన్ని క్షణాల్లో నమోదు చేసి టోల్ను నిర్ధారించి, సంబంధిత ఖాతా నుంచి వసూలు చేసుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్ వే, హర్యానా లోని పానిపట్–హిస్సార్ జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తోంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
భారత్లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: అమెరికా
వాషింగ్టన్: భారత్లో ఉగ్రవాదుల కదలికలు అధికంగా కలిగిన మణిపూర్, జమ్ముకశ్మీర్, భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది.అమెరికా తాజాగా భారతదేశంలో పర్యటించే తమ దేశపౌరులకు పలు సలహాలు అందజేసింది. వీటిలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని నవీకరించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. నేరాలు, ఉగ్రవాదం, నక్సలిజం కారణంగా, భారతదేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెరికా సలహా ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పెరిగిందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, హింసాయుత పరిస్థితులు నెలకొన్న కారణంగా అక్కడికు వెళ్లాలనుకునేముందు అమెరికన్లు పునరాలోచించాలని సూచించింది.భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వారు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వివరించింది. -
ప్రమాదకరంగా మారనున్న జలపాతాలు
ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుతుపవనాలు ఉత్తరాఖండ్ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.ఉత్తరాఖండ్లోని ధోకనే జలపాతం నైనిటాల్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఉడ్ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.భాలుగాడ్ జలపాతం నైనిటాల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్ఫర్డ్, మెల్బోర్న్లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్తోనే’’ అంటూ ఫిన్టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్లో 26 శాతం, ఉత్తరప్రదేశ్లో 24 శాతం, బీహార్లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!
రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్లు సందర్శకులతో రౌండ్ ట్రిప్లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర. ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది. మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ, పాస్పోర్ట్, వీసా వగైరా చెకింగ్లు చేశారు. అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం. అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ ! వేముల ప్రభాకర్ (చదవండి: యూఎస్లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!) -
గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా..
దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణం చేశారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. 2023 ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.20 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.8% అధికం. ఈ ఏడాది జనవరిలో ప్రయాణించిన 1.31 కోట్ల మందితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. గత నెలలో విమానాల జాప్యం కారణంగా 1.55 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సర్వీసులు రద్దు చేయడంతో 29,143 మంది ప్రయాణికులపై ప్రభావం పడగా, సంస్థలు పరిహారంగా రూ.99.96 లక్షలు చెల్లించాయి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! ఫిబ్రవరిలో ఎయిరిండియా మార్కెట్ వాటా 12.2% నుంచి 12.8 శాతానికి పెరగ్గా.. ఇండిగో వాటా 60.2% నుంచి 60.1 శాతానికి, స్పైస్జెట్ వాటా 5.6% నుంచి 5.2 శాతానికి తగ్గింది. విస్తారా 9.9%, ఆకాశ ఎయిర్ 4.5%, ఏఐఎక్స్ కనెక్ట్ 6.1% వాటాలను పొందాయి. సమయానికి విమానాలు నడపడంలో ఎయిరిండియా 56.4%, స్పైస్జెట్ 59.1 శాతం పనితనాన్ని సాధించాయి. -
జర్మనీలో మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?
జర్మనీ వెళ్లారు మహేశ్బాబు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రధానంగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ప్రీప్రోడక్షన్ వర్క్స్ను ఈపాటికే మొదలుపెట్టారు రాజమౌళి. తాజాగా ఈ పనులు మరింత ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన లుక్, మేకోవర్ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించిన పనుల కోసం మహేశ్బాబు జర్మనీ వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను విజయేంద్రప్రసాద్ దాదాపు పూర్తి చేసేశారని, వేసవిలో షూటింగ్ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. -
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘ట్రావెల్ ఫర్ లైఫ్’
సాక్షి, అమరావతి : భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పర్యాటక విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే “ట్రావెల్ ఫర్ లైఫ్’ పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. దేశంలో పర్యావరణహిత, అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా జీ–20 ప్రెసిడెన్సీ రోడ్మ్యాప్ అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐదు కేటగిరీల్లో ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను పోటీలకు ఆహ్వానిస్తోంది. పర్యాటక రంగంలో ఆహ్లాదాన్ని అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరత, జీవ వైవిధ్యం పెంపు–రక్షణ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. స్థానిక సంఘాలు, ప్రభుత్వాలు, వ్యాపారులు, ఎన్జీవోలు, ఇతర స్టేక్హోల్డర్లను భాగస్వాములను చేయనుంది. అందుకే ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ కింద గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక ఎంఎస్ఎంఈ, డెస్టినేషన్ మేనేజ్మెంట్ వంటి ఐదు కీలక ప్రాధాన్యతలను ఎంపిక చేసింది. వీటిని పర్యాటక రంగంలో అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి కేస్ స్టడీల పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న లక్ష్యాల ప్రక్రియ, ఫలితాలు, వీడియో/ఫొటోలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. నామినేషన్లకు జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఏపీ పర్యాటకంలో సుస్థిరాభివృద్ధి వెలుగులు.. ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగాన్ని ప్రత్యేక వాహకంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ‘సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ సస్టైయినబుల్ టూరిజం’ దేశంలో సుస్థిరాభివృద్ధి ఆధారిత ప్రాజెక్టులను గుర్తించి మద్దతిస్తోంది. వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను విశ్లేషించి, ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పురోగతిని కనబరుస్తోంది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చర్యలు చేపట్టింది. ఇక పర్యాటక రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం టీటీడీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకునేలా పవన విద్యుత్ను ప్రవేశపెట్టింది. జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటుగా ప్రజలకు అటవీ జంతువుల రక్షణపై అవగాహన కల్పిస్తూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా స్థానిక గిరిజనులు, చెంచుల ప్రత్యేక శిక్షణనిస్తూ పర్యాటకుల రూపంలో జీవనోపాధిని పెంపొందిస్తోంది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమైన మ్యూజియాల్లో అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, కియోస్క్లు, డిజిటల్ యాప్స్ సాయంతో సందర్శకులకు సులభంగా, అర్థమయ్యేలా సమాచారాన్ని అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ‘పర్యాటక పోలీస్ స్టేషన్లు’ నెలకొల్పింది. ఇంధన శాఖ పరిధిలో అనేక రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయ పర్యాటకంగా మారుతున్న సేంద్రియ సాగు విధానాలు, ఆన్లైన్ విక్రయాల్లో ఏటికొప్పాక, కొండపల్లి కళాకృతులు, చేనేత, కలంకారి, సంస్కృతి, వారసత్వ వేదికల పునర్నిర్మాణం.. ఇలాంటి పర్యావరణ, సామాజికహిత కార్యక్రమాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బాటలు వేస్తోంది. ఇవన్నీ ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను ఏమాత్రం తీసిపోని విధానాలు కావడం విశేషం. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
గూగుల్లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్లో భారత్లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన గోవా ట్రిప్ యూత్ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్లు, చర్చ్లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్లాండ్ అందమైన ప్రకృతికి థాయ్లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..
ఇటీవలి మిచౌంగ్ తుపాను.. దేశంలోని దక్షిణాదిని అతలాకుతలం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూర్కు చెందిన మునుస్వామి(40) మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్ టెక్నీషియన్ అయిన మునుస్వామి.. క్యాన్సర్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలులు, భారీ వర్షం, వరదలతో నిండిన రోడ్లను సైతం లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మునుసామి.. దేశంలోని ప్రముఖ రక్త స్టెమ్ సెల్ దాతల ప్రభుత్వేతర సంస్థ డెట్రాయ్(డీఏటీఆర్ఐ)లో పని చేస్తున్నారు. ఈ సంస్థ రక్త రుగ్మతలతో బాధపడుతున్నవారికి సహాయం అందిస్తుంది. క్యాన్సర్ బాధితల శిశువుకు చికిత్సలో మూలకణాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ను అందించడానికి మునుస్వామి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ దాత బాధిత చిన్నారికి తన ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి వచ్చి, చెన్నై నగరంలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా డెట్రాయ్ ఇన్ఛార్జి సుమతి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ బోన్ మ్యారో డొనేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. బాధిత కుటుంబంలో వారి లేదా జన్యుపరమైన పోలిక కలిగిన వారి నుంచి దీనిని సేకించవచ్చు. అయితే ఆ రెండేళ్ల బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. తన బోన్ మ్యారోను దానం చేసేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చారన్నారు. వైద్య ప్రక్రియలో తాము రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధితులకు అవసరమైన మూలకణాలను సేకరించగలమని అన్నారు. ఇలా సంగ్రహించిన స్టెమ్ సెల్ ప్రాసెస్ చేశాక, దానిని బాధితులకు ఉపయోగిస్తామన్నారు. తుఫానుకు ముందు రోజున దాతకు మొదటి డోస్ ఇచ్చాం. తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన చెందాం. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ చిన్నారికి చికిత్స ఆలస్యమైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. దానిని గుర్తించినంతనే ఈ సాహసానికి దిగాను. మోటార్ సైకిల్పై ఇంటి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాను. జాతీయ రహదారులు ఎక్కడికక్కడ జలమయమంగా ఉన్నాయి. రోడ్లు కనిపించడం లేదు. పెరంబక్కం వైపు వెళ్ళాను. చెన్నైకి వెళ్లే హైవేలను కనెక్ట్ అయ్యేందుకు ఒక అండర్ పాస్ దాటాలి. ఇది జలమయంగా ఉండటంతో మరో మార్గంలో వెళ్లాను. శ్రీపెరంబుత్తూరు నుండి పూనమల్లి రోడ్డు మీదుగా చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించానని మునుసామి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా పాత పెరుంగళూరు రహదారిని కలిపే వంతెన జలమయం కావడంతో పోలీసులు అటువైపు వెళ్లడాన్ని అడ్డుకోవడంతో బైక్ని వంతెనపై ఆపి నడిచానని, అలా మూడు కిలోమీటర్ల నడిచి, తరువాత ఈదుకుంటూ చివరికి దాత ఇంటికి చేరుకుని, దాతకు ఇంజిక్షన్ ఇచ్చానని తెలిపారు. తరువాత దాత కుటుంబ సభ్యులు వర్షం తగ్గేవరకూ ఇంటిలోనే ఉండాలని కోరినప్పటికీ, మునుస్వామి తన ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆ మరుసటి కూడా రోజు దాతకు మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చాడు. కదంబత్తూర్లోని మునుస్వామి ఇంటి నుండి దాత ఇల్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం -
ప్రయాణ పాఠాలతో.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న యువకుడు!
ప్రయాణ ప్రేమికుడైన అనునయ్ సూద్ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్ సూద్. వ్లోగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు అందుకున్నాడు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్విట్జర్లాండ్ టూరిజం, విజిట్ సౌదీ, న్యూజిలాండ్ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... ‘నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్ సూద్. ఇంజినీరింగ్ చేసిన అనునయ్ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్ ఆర్గనైజింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్ లీడర్గా వ్యవహరించాడు. అనునయ్ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. ‘మెటా–సోషల్’ అనేది పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్ కంపెనీ. ‘ట్రావెలింగ్పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్ ‘ప్రాజెక్ట్ ఘర్’ పేరుతో హోమ్స్టే సర్వీస్ వెంచర్ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్పై ఫ్యాషన్ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్ ఫొటోగ్రఫీపై మనకు విజన్ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్ సూద్. కొత్తదారులలో... ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. – అనునయ్ సూద్ (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
వరవరరావు హైదరాబాద్కు వెళ్లొచ్చు
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది. ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్ 5–11 తేదీల మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్ నంబర్, షెడ్యూల్ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. -
విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్టాప్లిస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి. ప్రజాకర్షకంగా రూపకల్పన.. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి.. ఇక, విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్డ్ కెనాల్స్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది. -
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
టూర్స్ కోసం ఇండియన్స్ చేసే ఖర్చు ఇంతా..!
గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్కారణంగా కుంటుపడిన టూరిజం నుంచి వచ్చే రాబడులు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భయాలు తొలగి భారత్ నుంచి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్రణాళికలు వేస్తూ బిజీగా గడుపుతున్నారు. దాంతో దేశీయ పర్యాటక పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. కొవిడ్ ముందు కంటే కూడా టూరిజం రంగంలో వస్తున్న ఆదాయం పెరుగుతుంది. కొవిడ్ మునుపుకంటే ప్రస్తుతం 173శాతం అధికంగా టూరిజం కోసం ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి భారత ట్రావెలర్స్ దాదాపు 410 బిలియన్ డాలర్లు(సుమారు రూ.32లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారని అంచనా. దాంతో ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగో దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి. 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. గతేడాదికిగాను యూట్యూబ్ వీడియోలు చూసి తాము ట్రావెలింగ్ చేస్తున్నట్లు 91 శాతం మంది పర్యాటకులు చెప్పినట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు వెల్లడయింది. స్పోర్ట్స్, సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు సమాచారం. -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
టైరు పేలి.. మంటలు చెలరేగి..
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఎస్ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది. -
గ్యాస్ గ్రిల్తో.. పిక్నిక్లో వెరైటీ వంటలు వండేయొచ్చు
లాంగ్ డ్రైవ్లకు వెళ్లినప్పుడు, పిక్నిక్లకు తిరిగినప్పుడు.. మన వెంట ఈ మెగామాస్టర్ పోర్టబుల్ గ్యాస్ గ్రిల్ ఉంటే చాలు, వేళకు రుచికరమైన ఐటమ్స్తో కడుపు నింపుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాల వెరైటీలను చకచకా రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ గ్రిల్ డిజైన్ ప్రత్యేకంగా రూపొందింది. దీనిలో ఒకేసారి రెండు వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇది గ్యాస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని లోపల పాన్ ప్లేట్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ వేరువేరుగా ఉంటాయి. మూతకు అటాచ్ అయ్యి ఉన్న ఆ స్టీల్ స్టాండ్ మూతతో పాటు పైకిలేస్తుంది. క్లోజ్ చేస్తే.. దాని మీద ఆహారం లోపల పడిపోకుండా పోర్టబుల్గా మెషిన్లో అమరిపోతుంది. దీని బ్లాక్ అండ్ రెడ్ హ్యాండిల్కి ఆనుకుని ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేస్తే.. పాన్ ప్లేట్ కింద మంట పుడుతుంది. అలాగే ఇది నిలబడటానికి ఉపయోగపడే స్టాండ్స్ కూడా మడిచేందుకు వీలుగానే ఉంటాయి. మూత ఊడకుండా లాక్ చేసుకోవడానికి ప్రత్యేకమైన క్లిప్ ఉంటుంది. ఎక్కడికైనా తీసుకుని వెళ్లడానికి దీని హ్యాండిల్ చక్కగా పనికొస్తుంది. ఇందులో కట్లెట్స్, కబాబ్స్, హోల్ చికెన్ వంటివెన్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ డివైస్ ధర 79 డాలర్లు (రూ.6,535). -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్లు సాక్షి గులాటీ, నికిత మాథుర్లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్కు సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..
రచయిత్రి, ప్రముఖ ఆదర్శ మూర్తి 'సుధామూర్తి' (Sudha Murthy) గత కొంత కాలంగా తన ప్రేమ గురించి, పారిశ్రామిక వేత్త భర్తగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అనే చాలా వివరాలు వెల్లడించింది. కాగా ఇప్పుడు తాను ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, నాన్వెజ్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఇష్టపడుతుందా అనే వివరాలు తెలిపింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఖానే మే కౌన్ హై (Khaane Mein Kaun Hai) ఎపిసోడ్లో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతుందని వెల్లడించింది. శాఖాహారానికి, మాంసాహారానికి ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని.. ఆఖరికి గుడ్లు, వెల్లులి కూడా తినదని తెలిపింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని కూడా చెప్పింది. తన వద్ద కుకింగ్ బ్యాగ్ కూడా ఉందని, అందులో ఆహారాన్ని వండడానికి ఉపయోగించే చిన్న కుక్కర్ ఉంటుందని చెప్పారు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) కొన్ని సంవత్సరాల క్రితం సుధామూర్తి తన అమ్మమ్మతో.. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు మీ తినుబండారాలను మీతో తీసుకెళ్లకూడదు, బయట ఎందుకు తింటారు అని సరదాగా అడిగిందని.. చివరకు ఆ విధానాన్నే నేను అనుసరిస్తున్నానని సుధామూర్తి చెప్పింది. కావున ఇప్పుడు ఏ దేశానికీ వెళ్లినా దాదాపు తన ఫుడ్ తానే తీసుకెళుతుందని స్పష్టం చేసింది. -
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని.. ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ హోస్టెస్ను అసభ్యంగా తాకి.. గత ఏప్రిల్లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్హోస్టెస్తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు.. కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో.. గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ.. ఆ మధ్య అమెరికన్ ఎయిర్లైన్స్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్పోర్ట్ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు వీరే.. ప్రపంచంలో పాస్పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్ కింగ్, జపాన్ కింగ్, జపాన్ క్వీన్. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన క్వీన్ ఎలిజబెత్కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్పోర్టు అవసరమవుతుంది. ప్రముఖుల విషయంలో.. ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్పోర్ట్ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్ పాస్పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్ను పాటించాల్సివుంటుంది. భారత్ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్ పాస్పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్పోర్టు అవసరమవుతుంది. ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ.. -
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..! ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది. ఆ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. (చదవండి: కలియుగ శ్రవణుడిలా..తల్లిని భుజాలపై మోస్తూ..) -
పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 7 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. ఈ బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా.. ఆ దేశంలో భారత అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డునున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్నగర్లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, మన్యంకొండ వద్ద తొలిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ వాటర్ రివర్ ఫ్రంట్ను అధ్యయనం చేస్తున్నట్లు శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. -
ప్రయాణాల్లో కాఫీ తాగాలనుందా? ఈ మేకర్తో సులువుగా..
చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్లోకి చేరుతుంది. అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్లా మార్చుకుని బ్యాగ్లో వేసుకోవచ్చు. -
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
ఓయో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
-
Odisha Train Accident: ఆ తండ్రి నమ్మకమే కొడుకుని బతికించింది!
ఒడిస్సా బాలాసోర్లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్లోన హౌరాకు చెందిన హేలరామ్ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్ మాలిక్ని కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్ స్టేష్న్కు వచ్చాడు. కొడుకుని కోరమండల్ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్ ఓ అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్ దాస్తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు. సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్ కొడుకు బిస్వజిత్గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్లో బాలాసోర్ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి.. కటక్ మెడికల్ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్లోనే కోల్కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్ మెడికల్ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది. (చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు) -
ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం (జూన్ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి. వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. Just 2 days back, there was a train accident in Balasore, India. Too many died and a lot more had serious injuries. A bundle of love letters and poems were found amongst the debris on the tracks. A glimpse of a lost romance. A rarity in this age. Give this post a read. pic.twitter.com/MHUq8LplyD — Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023 -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. -
యాపిల్ స్పెషల్ ఫీచర్తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్ను చూశాం. తాజాగా టెంపరేచర్ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్లో ఫైండ్ మై యాప్కు సపోర్ట్ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్ను హాట్గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్లు
ముంబై: కరోనా వైరస్ ప్రభావం బలహీనపడిన తర్వాత పర్యాటక రంగంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విమాన ప్రయాణికుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో ఆన్లైన్ ట్రావెల్ స్కామ్లు (మోసాలు) కూడా పెరుగుతున్నట్టు మెకాఫీ కార్ప్ ‘సేఫ్ హాలిడేస్ ట్రావెల్’ నివేదిక వెల్లడించింది. పర్యాటకులు తమ విహారం కోసం ఆన్లైన్లో పలు సేవలను బుక్ చేసుకోవడం తెలిసిందే. ఇలా బుక్ చేసుకునే సమయంలో మోసపోతున్న కేసులు గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. దీనిపై ఓ సర్వే నిర్వహించి వివరాలను వెల్లడించింది. సర్వే వివరాలు.. తాము బుకింగ్ సమయంలో ఆదా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసపోయినట్టు 51 శాతం మంది చెప్పారు. వీరిలో 77 శాతం మంది సగటున ఒక్కొక్కరు వెయ్యి డాలర్లు (సుమారు రూ.82,000) నష్టపోయినట్టు తెలిపారు. మొత్తం 7,000 మందిని సర్వే చేయగా, అందులో భారత్ నుంచి 1,010 మంది ఉన్నారు. 27 శాతం మందిని చెల్లింపుల సమయంలో వేరే ప్లాట్ఫామ్లకు మళ్లించి మోసపుచ్చారు. 36 శాతం మంది గుర్తింపు చోరీకి గురైంది. ఇందులో 13 శాతం మంది పాస్పోర్ట్ వివరాలు పంచుకోగా, 27 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు వివరాలను నకిలీ సైట్లకు వెల్లడించారు. డిజిటల్ మోసాల ముప్పు ఎక్కువని 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. వైఫై నెట్వర్క్లకు కనెక్ట్ అవడం, ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్లలో ఉచిత యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వాడుకోవడం, డిజిటల్ అకౌంట్ను లాగవుట్ చేయకుండా వదిలివేయడం రిస్క్ను పెంచుతోంది. ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం! హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో.. -
ట్రెండ్ మారింది గురూ! ఏసీకి ఫ్యాన్స్! ఖర్చుకు తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటేనే హడావుడి. త్వరగా బయలుదేరి రైలు అందుకోవడం.. ఏ మూలనో కాసింత చోటు సంపాదించుకుని హమ్మయ్య అనుకోవడం.. రోజుల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చివరికి ఏదో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయితే చాలు అని ఆశపడటం ఇన్నాళ్లుగా కనిపించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సౌకర్యవంతమైన ప్రయా ణానికి జనం మొగ్గు చూపుతున్నారు. జనరల్, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీల కంటే.. ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. దూరంతో, కాలంతో సంబంధం లేకుండా వేసవిలోనైనా, చలికాలంలోనైనా.. ఏసీ కోచ్లో సీట్లు దొరికాకే ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఏదో ఒక బోగీలో ప్రయాణం చేసినా.. ఇంటిల్లిపాది కలిసి వెళితే మాత్రం ఏసీపై దృష్టిపెడుతున్నారు. థర్డ్ ఏసీకి ప్రాధాన్యం.. సాధారణ స్లీపర్ చార్జీలతో పోల్చుకుంటే ఏసీ ప్రయాణానికి చార్జీలు చాలా ఎక్కువే. ఫస్ట్, సెకండ్ ఏసీ బోగీలకైతే చాలా ఎక్కువ. అయితే అటు సౌకర్యం, ఇటు కాస్త అందుబాటులో ఉండటంతో థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణానికి జనం మొగ్గుచూపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ క్లాస్ చార్జీ రూ.450 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో రూ.1,100 వరకు ఉంటుంది. అయినా 12 గంటల పాటు ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇక ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షీట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత ఉంటుందనే భరోసా.. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటాయి. కొన్నిరైళ్లలో ఏసీ బోగీల్లో ఐఆర్సీటీసీ కేటరింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు 650 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో 230కిపైగా ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు లక్షకుపైగా థర్డ్ ఏసీ బెర్తులు భర్తీ అవుతున్నట్టు అంచనా. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ చార్జీలు బాగా ఎక్కువే అయినా.. దూర ప్రాంత ప్రయాణాల్లో సెకండ్ ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజూ సుమారు 30 వేల బెర్తులు భర్తీ అవుతున్నట్లు అంచనా. స్లీపర్ బోగీలు తగ్గిస్తూ.. అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నారు. గతంలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉంటే.. ఇప్పుడవి లక్షకు తగ్గినట్టు అంచనా. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్కు తగినట్టు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖ, బెంగళూరు, ముంబై, దానాపూర్, రెక్సాల్, భువనేశ్వర్ తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. ఈ రూట్లలో నడిచే రైళ్లలో స్లీపర్ బెర్తుల సంఖ్య సగానికి సగం తగ్గించినట్టు సమాచారం. ‘‘స్లీపర్ బోగీలకు డిమాండ్ లేదని చెప్పలేం. దిగువ మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు తమ బడ్జెట్లో ప్రయాణ సదుపాయాన్ని అందజేసేవి స్లీపర్ క్లాస్ బోగీలే. కానీ ఇటీవల కాలంలో ఏసీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ముందుఅన్నీ ఏసీ రైళ్లే.. రానున్న కాలంలో పూర్తిగా ఏసీ రైళ్లు మాత్రమే పట్టా లెక్కనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి పట్టణాలకు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. డిమాండ్ బాగుండటంతో తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్లో బోగీల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అలాగే ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు కూడా పూర్తి ఏసీ సదుపాయం ఉన్న వందేభారత్ రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే గణాంకాలివీ.. ♦ ప్రతి రోజు వచ్చే ఆదాయం: రూ.10 కోట్లు ♦ మొత్తం ప్రయాణికుల రైళ్లు: 650 ♦ రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 10.50 లక్షలు ♦ స్లీపర్ క్లాస్లో ప్రయాణించేవారు 2.50 లక్షలు ♦ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 1.50 లక్షలు ♦ థర్డ్ ఏసీ ప్రయాణికులు 1.10 లక్షలు ♦ సెకండ్ ఏసీ ప్రయాణికులు 30వేలు ♦ ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 10వేల లోపు -
కూర్గ్ అందాలు.. అక్కడ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే
వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సమ్మర్ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్ టూర్. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ ఒకటి. సౌత్ టూర్ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు. భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం. అబ్బే జలపాతం కూర్గ్ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నాగర్హొళె జాతీయ పార్క్ ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి. హనీ వాలి హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్ స్పాట్. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి. హొన్నమన కెరె లెక్ కూర్గ్ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు. సోమవారపేట్ సోమవారపేట్ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం. నామ్డ్రోలింగ్ ఆరామం ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్డ్రోలింగ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓంకారేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మడికెరి కోట బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. -
90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్లు.. టాప్ 4లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్–4లో హైదరాబాద్ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్ బీఎన్బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్–ఇన్లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి. టాప్ 10 నగరాలివే శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్ పూణె, మన హైదరాబాద్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వరుసగా టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని రాయ్ఘర్, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని నైనిటాల్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
సపరివార సమేతంగా..!
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు మాత్రమే అలవాటు పడిన భారతీయులు ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను సైతం ఫ్యామిలీతో కలిసి చుట్టేసేందుకు ఇష్టపడుతున్నారు. దేశంలోనూ ఇప్పుడు ఫ్యామిలీ పర్యటనల ట్రెండ్ నడుస్తోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో కొద్దిపాటి విరామం దొరికినా ఫ్యామిలీ టూర్లకు చెక్కేస్తున్నారు. సాక్షి, అమరావతి: చారిత్రక, సాంస్కృతిక నగరాలతో పాటు అందమైన బీచ్ల ఒడ్డున కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సేదతీరేందుకు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దేశంలోని గోవా వెళ్లేందుకు ఇష్టపడుతుండగా.. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్ కొనసాగుతోంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ ‘అగోడా’ సర్వే ప్రకారం పర్యాటకులు ప్రత్యేక థీమ్లతో కూడిన టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు. సౌకర్యవంతమైన బస, ఆకట్టుకునే ప్రదేశాలు, సముద్రపు తీరంలో సేద తీరడం, ఎకో పర్యాటకంలో ప్రశాంతంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బీచ్ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన గోవాను తొలి ఎంపికగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత చారిత్రక దర్శనీయ స్థలాలైన ఢిల్లీ, ముంబై, సాంస్కృతిక నగరాలు జైపూర్, పుదుచ్చేరి నగరాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా దుబాయ్తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సింగపూర్, మాల్దీవులు, బాలి (ఇండోనేషియా), ఫుకెట్ (థాయ్లాండ్)కు క్యూ కడుతున్నారు. అగోడా ఫ్యామిలీ ట్రావెల్ ట్రెండ్ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 14వేల కుటుంబాల నుంచి ప్రతిస్పంద నలను సేకరించింది. పర్యటనలు.. షాపింగ్ కోసమే ఎక్కువ ఖర్చు అమెరికన్ ఎక్స్ప్రెస్ నివేదిక కూడా 88 శాతం మంది భారతీయులు ఫ్యామిలీ పర్యటనలు, షాపింగ్ల కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదని చెబుతోంది. 2023లోనూ టూర్లు, పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తామని భారతీయులు స్పష్టం చేసినట్టు ఆ నివేదిక స్పష్టం చేసింది. 10 మంది పట్టణ భారతీయుల్లో 8 మంది సెలవుల సీజన్లో ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కొందరు పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్టు తేలింది. ఈ విధానం 2021తో పోలిస్తే భారీగా పెరిగినట్టు అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వే పేర్కొంది. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
40 ఏళ్ల వయసులో సరికొత్త ప్రయాణం.. గిన్నిస్ రికార్డు! ఇప్పుడేమో
సాహసయాత్రలు యాత్ర వరకు మాత్రమే పరిమితం కావు. మనలో కొత్త వెలుగును నింపుతాయి. కొత్త దారి చూపుతాయి. కొత్త విజయాలు సాధించేలా సంకల్పబలాన్ని ఇస్తాయి. సైకిల్పై ఎన్నో సుదూరయాత్రలు చేసి రికార్డ్లు సాధించిన ప్రీతి మస్కే తాజాగా ఇండియా నుంచి సింగపూర్కు సైకిల్యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతోంది... ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్గా గత సంవత్సరం నవంబర్ నెలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించింది పుణెకు చెందిన ప్రీతి మస్కే. 13 రోజుల 18 గంటల 38 నిమిషాలలో గుజరాత్ నుంచి అరుణాచల్ప్రదేశ్ సైకిల్యాత్రను పూర్తి చేసింది. గుజరాత్లోని కోటేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడు రాష్ట్రాల గుండా సాగి అరుణాచల్ప్రదేశ్లోని కిబితులో ముగిసింది. ఈ యాత్ర చేయగలనా? ‘ప్రతి ఒక్కరూ అస్సామ్, అరుణాచల్ప్రదేశ్లను చూడాలనుకుంటారు. అయితే సైకిల్పై యాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతారు. దీనికి కారణం అంతదూరం సైకిల్యాత్ర అంత సులువైన విషయం కాదు. ఈ యాత్ర చేయగలనా? అని మొదట్లో నేను కూడా సందేహించాను. కొద్ది సమయంలోనే ఆ సందేహం నుంచి బయటపడి సాహసయాత్రకు పూనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీతి. ‘యాత్ర కోసం యాత్ర’ అని కాకుండా తన యాత్రకు సామాజిక సందేశాన్ని కూడా జోడించింది. దారి పొడుగునా అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లింది. చిన్నప్పుడు ప్రీతికి ఆటలు అంటే ఇష్టం. హాకీ, బాస్కెట్బాల్ బాగా ఆడేది. అయితే స్కూలు చదువుల తరువాత తనకు ఆటలు దూరమయ్యాయి. 2017లో సరదాగా చేసిన సైకిలింగ్ తన జీవితాన్నే మార్చేసింది. ఎంతో సానుకూల శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. ఎన్నో కొత్త ద్వారాలు ‘ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత, నలభై ఏళ్ల వయసులో పిల్లలు, కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఏదీ తెలియని ప్రపంచంలోకి వెళ్లిపోతాం. సైకిలింగ్ నా కోసం ఎన్నో కొత్త ద్వారాలు తెరిచింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సాధించాల్సింది ఎంతో ఉంది అని చెప్పింది’ అంటుంది ప్రీతి. వెనక్కి చూడలేదు 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సోలోగా సైకిల్యాత్ర చేపట్టినప్పుడు చాలామంది భయపెట్టేలా మాట్లాడారు. అయితే ఆ భయంగొల్పే మాటలు ప్రీతిని వెనక్కి తీసుకువెళ్లకపోగా మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. పట్టుదలను పెంచాయి. అసాధ్యం అనుకున్న సైకిల్ యాత్ర విజయవంతం అయ్యేలా చేశాయి. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి చూడలేదు. సుదీర్ఘ సైకిల్యాత్రలు లేని సమయంలో ఆసక్తి ఉన్న వారికి సైకిలింగ్లో శిక్షణ ఇస్తోంది. స్విమ్ చేస్తోంది. శరీరం ఫిట్గా ఉండేలా రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తుంది. వారాంతాలలో 100 నుంచి 300 కి.మీ వరకు సైకిలింగ్ చేస్తోంది. ఎన్నో సుదూర సైకిల్ యాత్రలు పూర్తి చేసిన ప్రీతి ‘ప్రతి రికార్డ్ ఒక సవాలే. దేనికదే ప్రత్యేకమైనది’ అంటోంది. ఆప్యాయ పలకరింపులు ఒక మంచిపని, స్ఫూర్తిని ఇచ్చే పని చేస్తే, సాహసాన్ని తట్టిలేపే పనిచేస్తే సమాజం తనకు తానుగా ముందుకు వచ్చి భుజం తట్టి ముందుకు నడిపిస్తుంది. సైకిల్ యాత్రలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నోచోట్ల అపరిచితురాలైన తనను ఆప్యాయంగా పలకరించారు ప్రజలు. ఆతిథ్యం ఇచ్చారు. సైకిల్కు రిపేర్లు వస్తే బాగు చేయించారు. హైవే హోటళ్ల వాళ్లు కూడా మర్యాదగా పలకరించి తనకు ఆతిథ్యం ఇచ్చారు. సాధించిన దానితో సంతృప్తి చెంది అదే విజయం అనుకోవడం లేదు ప్రీతి. తాజాగా ఇండియా నుంచి సింగపూర్ సైకిల్ యాత్రకు సన్నద్ధం అవుతోంది. ‘సాధ్యం అవుతుంది’ అనడం తేలిక. ‘అసాధ్యం’ అనుకోవడం అంతకంటే తేలిక. అయితే అసాధ్యాలను, సుసాధ్యం చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ప్రీతీ మస్కే ఒకరు. చదవండి: Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు Kangana Ranaut: వారసత్వంగా మాకు అందిన చిట్కాలు.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
పేటీఎం ట్రావెల్ సేల్
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ‘ట్రావెల్ సేల్’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్, అమెక్స్ కార్డ్లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్కాస్ట్! యూత్కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానం దానిదే
కోవిడ్ టైమ్లో యూత్కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్కాస్ట్’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్కాస్టింగ్లో పాటలు ఒక భాగం మాత్రమే. ‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్ స్టోరీస్లాంటి ట్రావెల్ పాడ్కాస్ట్ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత. నాగ్పుర్కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్కాస్ట్ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్కాస్ట్కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యూత్కు దగ్గరైన పాడ్కాస్ట్ జానర్లలో ‘మెంటల్ హెల్త్’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్’ ‘ఎమోషనల్ ఫీల్’ ‘బుద్ధిస్ట్ సొల్యూషన్స్ ఫర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్’....మొదలైన పాడ్కాస్ట్లు వింటూ ఉంది. ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్కు స్ట్రెస్ బస్టర్గా పాడ్కాస్టింగ్ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్కాస్టింగ్ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! -
నెదర్లాండ్స్ అమ్మాయి.. వ్యాన్నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ!
మన దేశంలో బతుకు బాదరబందీ కోసం చాలామంది కష్టపడుతుంటారు. కాని నెదర్లాండ్స్కు చెందిన ఒక అమ్మాయి చాలా సింపుల్గా సంవత్సర కాలంగా జీవిస్తోంది. ఒక వ్యాన్నే ఇల్లుగా చేసుకొని దేశమంతా తిరుగుతోంది. సముద్రం ఒడ్డున బస... నక్షత్రాల కింద నిద్ర... చాలదా జీవితానికి అని ప్రశ్నిస్తుంది? తమిళనాడు మహాబలిపురం దగ్గర వ్యాన్ నిలబెట్టుకుని సముద్రంతో కబుర్లు చెప్పే ఈ అమ్మాయిని అంతా వింతగా చూస్తుంటారు. ఆమె అందరినీ వింతగా. ఎవరి బతుకు ఎవరికి వింత? చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం నుంచి ఇంకో ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మామళ్లపురం. చిన్న ఊరు అది. సముద్రం ఘోష. దాని ఒడ్డునే ఒక వ్యాన్ని చూడవచ్చు. పూలు, లతలు, మత్స్యకన్యలు గీసి ఆకర్షణీయంగా ఉండే ఆ వ్యాన్ గత సంవత్సర కాలంగా మారియా ఉండెరింక్ ఇల్లు. అదే ఆమె వాహనం కూడా. వ్యాన్ నెత్తి మీద సర్ఫ్బోర్డ్, స్కేట్బోర్డ్ను కట్టి ఉంచుకుంటుంది. వ్యాన్ లోపల పడుకునే స్థలం, పుస్తకాల ర్యాకు, బట్టలు పెట్టుకునే చోటు, పాటలు వినడానికి స్పీకర్లు... ఇవన్నీ ఉంటాయి. నెదర్లాండ్స్కు చెందిన మారియా సంవత్సర కాలంగా దేశంలో ఉంటోంది. రెండేళ్ల క్రితం ఆమె ‘జంపా క్రియేషన్స్’ పేరుతో చిన్న ఆన్లైన్ బిజినెస్ మొదలెట్టింది. ఆర్గానిక్గా తయారు చేసిన అగరు బత్తీలు, పరిమళ తైలాలు విక్రయిస్తుంది. వాటికేం ఆఫీసు అక్కర్లేదు కనుక ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లను కొరియర్ ద్వారా పంపిస్తుంది. వాటి మీద వచ్చే డబ్బులే ఆమె ఆదాయం. మరి మిగిలిన సమయమో? ఆమెనే అడుగుదాం. ఎక్కడ నచ్చితే అక్కడే సంవత్సరం క్రితం ఇండియా వచ్చిన మారియా మొదట చేసిన పని ఢిల్లీలో ఒక సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనడం. దానిని తనకు తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. ఆ తర్వాత దానిని తీసుకొని దేశం చూడటానికి బయలుదేరడం. ‘మొదట రాజస్థాన్ వెళ్లాను. అక్కడ చాలా రోజులు ఉన్నాను. ఆ తర్వాత గోవాలో కొన్నాళ్లు. ఈ ఊరిలో సర్ఫింగ్ పోటీలు ఉన్నాయంటే మొన్నటి జూలైలో వచ్చాను. పోటీలో సెమీ ఫైనల్స్ దాకా వెళ్లాను. గెలవలేదు. కాని నాకు ఈ ఊరు చాలా నచ్చింది. అందుకే ఇక్కడ ఉండిపోయాను’ అంటుంది మారియా. మామళ్లపురం బెస్తవాళ్లు ఆమెను వింతగా చూస్తారు తప్ప అంతరాయం కలిగించరు. తోచినప్పుడల్లా సర్ఫ్బోర్డ్ తీసుకొని సముద్ర అలల మీద తేలుతుంటుంది మారియా. లేదంటే వ్యాన్లో కూచుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ల్యాప్టాప్లో పని. కొన్ని జాగ్రత్తలు ప్రయాణంలో పెట్రోల్ బంకులనే తన కాలకృత్యాల కోసం ఉపయోగించుకుంటుంది. ఫోన్, ల్యాప్టాప్ చార్జింగ్ కావాలంటే ఏదో ఒక కాఫీ షాప్కు వెళుతుంది. మిగిలిన అన్ని పనులకు వ్యాన్ ఉంటుంది. ‘వ్యాన్ను ఎప్పుడూ నీట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే అది నేను ఉండాల్సిన చోటు కదా’ అంటుంది. వ్యాన్లో ఆమె అమ్మే వస్తువులు సువాసన వ్యాపింపచేస్తుంటాయి. ‘సోలార్ ప్యానల్స్ బిగించిన మెటాడర్ వ్యాన్ కొనుక్కోవాలని ఉంది. అదైతే ఇంకా సౌకర్యంగా ఉంటుంది’ అంటుంది మారియా. ‘జీవితం ఇలా బాగుంది. సింపుల్గా’ అంటుంది. ‘కొన్ని గ్రిల్ చేసిన కూరగాయల భోజనం. రాత్రిళ్లు నక్షత్రాల కింద పడక. ఇంతకు మించి ఏం కావాలి?’ అంటుంది మారియా. ఏం కావాలో తెలియక నాగరీకులు ఉదయం లేచి ఉరుకుల పరుగుల మీద అన్వేషిస్తూ ఉంటారు. వారికి మారియా ఒక వింత. వారు మారియాకు. చదవండి: Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్లో కుటుంబంతో కలిసి.. భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై! -
ఉత్తర కొరియా పర్యటనలు మరో ఏడాది పాటు నిషేధం!
వాషింగ్టన్: ఉత్తర కొరియా పర్యటన నిషేధం మరో ఏడాది పాటు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆగస్టు 31, 2023 వరకు ఉంటుందని అమెరికా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిషేధాన్ని అమెరికా 2017 నుంచి అమలు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నిషేధాన్ని పెంచుతూనే ఉంది అమెరికా. యూఎస్ పౌరులకు ఉత్తర కొరియా పర్యటన అత్యంత ప్రమాదకరమని వారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా యంత్రాంగం పేర్కొంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రత్యేకంగా ఆ పర్యటనకు ధృవీకరించనప్పుడే మినహా మరే ఏవిధంగాను అమెరికా వీసాలు చెల్లుబాటు కావని పేర్కొంది. 2017లో ప్రచార పోస్టర్ని దొంగలించాడనే ఆరోపణలతో అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్బియర్ని ఉత్తర కొరియా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఉత్తరకొరియా పర్యటనలను అమెరికా నిషేధించడం ప్రారంభించింది. (చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..) -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది, ఆమెకు లభించే ఇతర అలవెన్స్లు, విరమణ తర్వత పెన్షన్ వంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దాం. చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే 25న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము రాష్ట్రపతి భవన్లోకి మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి కాలం 24తో ముగియడంతో ఆయన ఢిల్లీలోని 12 జనపథ్ రోడ్డులో గల బంగ్లాలోకి వెళ్లనున్నారు. ► భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ►దేశంలో అత్యధిక జీతం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ►రాష్ట్రపతికి గృహ, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది. ►భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి ►ప్రెసిడెంట్ అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్గా పిలుస్తారు. ఇందులో 340 గదులు ఉంటాయి. ఇది 2 లక్చషల దరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ►రాష్ట్రపతికి మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. అక్కడికి సెలవుల నిమిత్తం వెళ్లవచ్చు. ఒకటి సిమ్లాలోని మషోబ్రాలో(వేసవి విడిది) ఉంది, మరొకటి హైదరాబాద్లోని బొల్లారంలో(శీతాకాల విడిది) ఉంది. ►రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. కస్టమ్-బిల్ట్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్600 (డబ్ల్యూ221)లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ కలిగి ఉంటుంది. బుల్లెట్, బాంబులు, గ్యాస్ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలవు. ►భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్ బాడీగార్డ్ రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో త్రివిధ (ఆర్మీ, వాయు, నావీ) దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. ►భద్రతా కారణాల దృష్ట్యా భారత రాష్ట్రపతి కార్ల వివరాలు ఎప్పుడూ వెల్లడించరు. ఈ కార్లకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. దీనికి బదులు జాతీయ చిహ్నం ఉంటుంది ►రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత నెలల రూ. 1.5 లక్షల పెన్షన్ వస్తుంది. అంతేగాక వారి జీవిత భాగస్వామికి నెలకు రూ. 30,000 సెక్రటేరియల్ సహాయం అందుతుంది. ►పెన్షన్ కాకుండా ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుంది. అయిదుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 60,000 లభిస్తుంది. జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. -
బ్లూ ఆరిజిన్ యాత్ర సక్సెస్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్షయాన సంస్థ బ్లూ ఆరిజిన్ తన ఐదో పర్యాటక యాత్రను విజయ వంతంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటల 26నిమిషాలకు వెస్ట్ టెక్సాస్లోని ప్రయోగకేంద్రం ఇందుకు వేదికైంది. న్యూ షెపర్డ్(ఎన్ఎస్–21) రాకెట్ ఒక మెక్సికన్ మహిళసహా ఆరుగురు ప్రయాణికులను 106 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లి సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. మెక్సికో మూలాలున్న ఒక మహిళ(కట్యా ఇచాజెరెట్టా) ఇలా అంతరిక్ష పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోకి వెళ్లి అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికన్గా నూ కట్యా (26) చరిత్ర సృష్టించింది. యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. -
చెప్తే వినలా.. 7000 మంది పురుషులు అరెస్టు!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ మహిళల భద్రతను సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో రైళ్లలోని మహిళలకు కేటాయించిన కోచ్లలో ప్రయాణిస్తున్న 7 వేల మంది పురుషులను అరెస్టు చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు. దీంతో పాటు మానవ అక్రమ రవాణా నుంచి 150 మంది అమ్మాయిలను కూడా పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. మే 3 నుంచి మే 31 మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు "ఆపరేషన్ మహిళా సురక్ష" కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు మెరుగైన వసతులు, వారి భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహణ జరిగింది. కాగా ఇందులో 283 పోలీసు బృందాలు మొత్తం 223 స్టేషన్లను కవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోజుకు 1,125 మంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసులు ఈ డ్రైవ్లో పాల్గొన్నట్లు చెప్పారు. వీటితో పాటు రైల్లో ప్రయాణిస్తున్న 2.25 లక్షల మంది మహిళలతో మాట్లాడి, వారి భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల ఆపరేషన్లో, ఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కదులుతున్న రైళ్లను ఎక్కేటప్పుడు, డీ బోర్డింగ్ చేస్తున్నప్పుడు జారిపడిపోతున్న ఘటనల్లోని 10 మంది మహిళల ప్రాణాలను కాపాడారని రైల్వే పోలీసులు తెలిపారు. చదవండి: ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్కు హార్దిక్ షాక్ -
Bermuda Triangle: మాయమైతే.. పైసలు వాపస్
న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్ మిస్టరీస్’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ‘బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనిపించకుండా పోతే మీ డబ్బు 100% వాపస్ ఇస్తాం’అనిప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నార్వేజియన్ ప్రిమా షిప్ న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్తోనే తయారైందని చెప్పింది. క్యాబిన్ టికెట్ ఖర్చు ఒక్కరికి 1830 డాలర్లపైనే అని తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలోని 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లిన 75 విమానాలు వందల సంఖ్యలో ఓడలు కనిపించకుండా పోయాయి. -
ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్
కరోనా తగ్గుముఖం పట్టి ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూరప్లో మరింత బాగా పాగా వేసే పనిలో ఉంది ఓయో. యూరప్కి చెందిన ట్రావెల్ టెక్ ఫర్మ్ డైరక్ట్ బుకర్ అనే సంస్థను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం ఓయో రూ. 40 కోట్లను వెచ్చించనుంది. డైరెక్ట్ బుకర్ ఓయో ఖాతాలో చేరడం వల్ల యూరప్లోని క్రోయేషియాలో కూడా ఓయో రూములు లభించే వెసులుబాటు కలుగుతుంది. యూరప్లో సుస్థిర స్థానం సాధించేందుకు ఓయో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బెల్విల్లా, ట్రామ్.. వంటి టెక్ ట్రావెల కంపెనీలు సొంతం చేసుకుంది. వీటి ద్వారా నెదర్లాండ్స్, డెన్మార్క్, బెల్జియం, జర్మనీ, ఆస్త్రియా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తుంది. కొత్త డీల్ ద్వారా క్రోయేషియా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 1.40 లక్షల హోం స్టోర్ఫ్రంట్స్ సాధించడం తమ లక్ష్యంగా ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ తెలిపారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్ల రాజ్యం -
సూపర్ హిట్స్.. స్విస్ టూర్ యాడ్స్..
యూరప్ దేశాల్లోని ప్లే గ్రౌండ్గా తరచుగా పిలవబడే స్విట్జర్లాండ్కు పర్యాటకం అత్యంత ప్రధానమైన ఆర్ధిక వనరు. అయితే యూరప్లోని మిగతా ప్రాంతాల్లానే... కరోనా ఆంక్షలు ఆ దేశపు ఆర్ధిక మూలాలపై దాడి చేశాయి. అంతర్జాతీయ పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపుగా 50శాతం పడిపోయింది. ఈ నేపధ్యంలో తమ పర్యాటకానికి పునర్వైభవం తెచ్చేందుకు స్విట్జర్లాండ్ టూరిజం సరికొత్త పంథాలో దూసుకెళుతోంది. స్విస్ టూరిజమ్ లాగే ఆ దేశపు పర్యాటక శాఖ ప్రచార చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం విశేషం. డీనీరో...ఫెదరర్ గత ఏడాది ఒక వినూత్న శైలి వీడియో రూపొందించింది. ఈ ఒకటిన్నర నిమిషాల వీడియోలో స్విట్జర్లాండ్కు బ్రాండ్ అంబాసిడర్, టాప్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, ఆస్కార్ అవార్డ్ విజేత రాబర్ట్ డీనీరోలు నటించారు. ఈ వీడియో లో ఉన్నది ఏమిటంటే.. స్విట్జర్లాండ్ గురించి ఒక ఫీచర్ ఫిల్మ్ రూపొందించమని ఫెదరర్ డీ నీరోని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే నువు పేర్కొంటున్న డెస్టినేషన్ మరీ పర్ఫెక్ట్గా ఉందనీ, అందులో ఏమీ డ్రామా లేదంటూ డీనీరో తిరస్కరిస్తాడు. ఈ పరోక్ష ప్రచారపు వీడియో చిత్రం 100 మిలియన్ల సార్లు వీక్షించబడి అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రంగా నిలిచింది. దాదాపు 13 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్న ఫెదరర్ పాప్యులారిటీ కూడా ఈ చిత్ర విజయానికి తోడ్పడింది. హాత్వే...ఫెదరర్... అదే విధంగా ఈ ఏడాది ప్రచారం కోసం ఫెదరర్తో పాటు అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ విజేత అన్నే హాత్వేని జత కలిపారు.. గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరుతో వీరి ప్రచార చిత్రం సాగుతుంది. ఈ ప్రచార చిత్రంలో నటించిన అన్నా హాత్వే స్వయంగా స్విట్జర్లాండ్కు అభిమాని కావడం విశేషం. ఆ దేశానికే కాకుండా ఫెదరర్కి కూడా తాను ఫ్యాన్ని అని ఆమె చెప్పారు. ఇది 2 నిమిషాల ప్రచార చిత్రం. ఏప్రిల్ 12న యూ ట్యూబ్లో విడుదలయ్యి ఒక్కరోజులోనే 3.5 మిలియన్ల వ్యూస్ని అందుకుంది. గత ఏడాది ప్రచార చిత్రంలాగే దీన్ని కూడా అత్యంత వినోదాత్మకంగా చిత్రీకరించారు. రోడ్ ట్రిప్...సాగేదిలా... గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరిట సాగే 9రోజుల 8రాత్రుల రోడ్ ట్రిప్... జ్యురిచ్లో ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఆ దేశపు అత్యంత ఆసక్తికరమైన విశేషాలను ప్రకృతి సౌందర్యాలను ఈ టూర్ అందిస్తుంది. దీనిలో భాగంగా 45 ఆకర్షణీయమైన ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తారు. మొత్తం 22 సరస్సులు, 5 అల్పైన్ పాసెస్, 13 యునెస్కో చారిత్రక కట్టడాలు ఇందులో ఉన్నాయి. మొత్తం టూర్ 1000 మైళ్ల వరకూ కవర్ చేస్తుంది. ఈ టూర్ ఆద్యంతం తమకు తామే గైడ్ చేసుకునేలా పర్యాటకుల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి బైక్ మీద గానీ, కార్ లో గానీ ప్రయాణించవచ్చు. పర్యాటక హితంగా ఈ టూర్ని రూపొందించారు. కాలుష్యరహితంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో పయనించేందుకు వీలుగా టూర్ సాగే ప్రాంతాలన్నింటా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా రైలులో కూడా టూర్ని ఎంజాయ్ చేసే వీలుంది. -
అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!
పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా అహ్లాదాన్ని అందించే ఐలాండ్స్ చాలానే ఉన్నాయి. కానీ తినగలిగే ఐలాండ్ గురించి మీకు తెలుసా? అవును అక్కడ మట్టిని బ్రెడ్లో సాస్లా, కూరల్లో మసాలాగా వాడతారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..? ఇరాన్ తీరానికి 8 కి.మీ. దూరంలో, పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుందది.పేరు హోర్ముజ్ ద్వీపం. అగ్నిపర్వత శిలలతో, మట్టి, ఇనుముతో నిండిన ఈ ఐలాండ్ చూడటానికి.. పసుపు, ఎరుపు, నీలం వంటి పలు రంగుల్లో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే దీన్ని రెయిన్బో ఐలాండ్గా పిలుస్తారు స్థానికులు. మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంపై 70కి పైగా ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. హోర్ముజ్ ఐలాండ్.. ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉప్పు గుట్టల్లా పేరుకుపోయి.. అగ్నిపర్వత అవక్షేపాలతో కలసి రంగు రంగుల దిబ్బలుగా మారిందని వారి పరిశోధనల సారాంశం. ఈ రంగురంగుల గుట్టలు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణమని తేల్చారు వాళ్లు. కాలక్రమేణా భూమిలోకి కిలోమీటర్ల మేర పాతుకుపోయిన ఈ గుట్టల్లోంచి తేలికైన ఉప్పు పొరలు పెల్లుబకడంతో గోపురాల్లా కనిపిస్తూ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయట. ఇక్కడ లభించే ‘గెలాక్’ అనే ఎర్రటి మట్టిని.. స్థానిక వంటకాల్లో వాడుతుంటారు. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన.. హేమటైట్ అనే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మట్టి నుంచే ‘సూరఖ్’ అనే సాస్ని కూడా తయారు చేస్తున్నారు. అది బ్రెడ్తో కలిపి తింటే భలే రుచిగా ఉంటుందట. అయితే ఈ మట్టిని వంటకాల్లోనే కాదు.. కాస్మెటిక్స్, డిజైనింగ్స్లో కూడా వాడుతున్నారు. (క్లిక్: 13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?) ఒక్కోవైపు ఒక్కో అందం ఈ ఐలాండ్కు నైరుతిలో బహుళవర్ణాలతో మెరిసే లోయ ఉంటుంది. దాన్నే రెయిన్బో వ్యాలీ అంటారు. మొత్తం ఐలాండ్ అంతా రంగురంగుల్లో మెరుస్తున్నప్పటికీ ఈ లోయ మరింత ప్రత్యేకం. సూర్య కిరణాల వెలుగుల్లోనే ఈ అందాలను చూడాలనేది పర్యాటకుల మాట. ఆ లోయ పక్కనే మరో లోయ.. శిల్పులు చెక్కిన శిల్పాల్లా ఎన్నో వింత ఆకారాలు దర్శనమిస్తాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేదంటే నమ్మబుద్ధి కాదట. వ్యాలీ ఆఫ్ స్టాచ్యూస్ (విగ్రహాల లోయ)గా పేరున్న ఈ లోయలో.. బర్డ్స్లా, డ్రాగన్స్లా వింతవింత రూపాలు మనల్ని మైమరిపిస్తాయట. అవన్నీ వేలాది సంవత్సరాలుగా ప్రకృతి కోతతో ఏర్పడిన అద్భుతాలే. ఇక ఐలాండ్కి పశ్చిమ దిక్కున కిలోమీటర్ మేర విస్తరించిన ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు వైద్య గుణాలున్నాయని, నెగెటివ్ ఎనర్జీని పారదోలే ఉప్పుదేవతని స్థానికులు విశ్వసిస్తారు. -
స్వల్ప బడ్జెట్తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!
అమ్మాయ్ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా.. ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది? మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది? కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్న నడుపుతూ స్వల్ప బడ్జెట్తో స్త్రీలకు లోకం చూపిస్తోంది. ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్ టూర్ టికెట్. కిచెన్లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా. ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా? ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది. ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా? ∙∙ దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్ ఆపరేషన్స్తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది. ‘మా నాన్న లారీ డ్రైవర్. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్రూమ్ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్ కొలిగ్స్తో ఒరిస్సా టూర్ ప్లాన్ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు. ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్బుక్లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్కి ప్లాన్ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్ ప్లాన్ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ. ∙∙ సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం. ‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్లో వెళ్లాలో పక్కా ప్లాన్ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ. అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్లతో టై అప్ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ. సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్బుక్ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్’ అని పోస్ట్ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్ ఓన్లీ టూర్లు ఆపరేట్ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు. రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ. -
కోవిడ్ తగ్గడం లేదూ.. ట్రావెల్ తప్పడం లేదు... మరి ఎలా?
ఓ వైపు కోవిడ్ తగ్గడం లేదు... మరోవైపు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ► అన్నిటికంటే ముందుగా రెండు విడతల్లో తాము వ్యాక్సిన్ డోసులను తీసుకున్నామని తెలిపే పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ► తాము వెళ్తున్న ప్రదేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... వాటిని ఆచరించాలి. ► తమకు ఏవైనా సమస్యలుంటే అవి కరోనా ఇన్ఫెక్షన్తో కలిసి కో–మార్డిడ్ (ప్రమాదానికి దారితీసే అవకాశాలున్న వ్యాధులు)గా పరిణమించే అవకాశం ఉన్నట్లయితే ఆ మేరకు అవసరమైన మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే వ్యవధికి అవసరమైన మేరకు మందులను సంసిద్ధం చేసుకోవాలి. (చదవండి: మొసళ్ల కన్నీళ్లు తుడిచారు.. మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు!) ► విదేశాలకు వెళ్లేవారు కరోనా పరీక్ష చేయించుకుని, తమకు కోవిడ్ లేదనే సర్టిఫికేట్ను వెంట ఉంచుకోవాలి. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ల విషయంలో వివిధ దేశాల నిబంధనలు వేర్వేరుగా ఉండవచ్చు. వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ► పిల్లల విషయంలో కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరగలేదు. అయితే విదేశాల్లోని కొన్నిచోట్ల 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకూ, 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు క్వారంటైన్ నిబంధలు వర్తించే అవకాశం ఉంది. అందుకే తమ గమ్యస్థానంలో పిల్లల విషయంలో ఉన్న కోవిడ్ నిబంధలను తెలుసుకున్న తర్వాతే ప్రయాణం నిర్ణయించుకోవడం అవసరం. ► ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా చెప్పే వీటిని ముందుగా తెలుసుకోవాలి. దాంతో మున్ముందు తాము పడబోయే ఇబ్బందులను తేలిగ్గా నివారించుకున్నట్లు అవుతుంది. (చదవండి: హైపో థైరాయిడిజమ్.. ఏం తినాలి? ఏం తినకూడదు!!) ► తాము బస చేయబోయే చోట కొందరు ‘పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. గతంలో తాము ప్రయాణం చేసివచ్చిన ఆయా ప్రాంతాలు ఒకవేళ కంటెయిన్మెంట్ జోన్లు లేదా నిషేధ ప్రాంతాలుగా ఉంటే... ఆ ప్రయాణికులను అనుమతించబోరు లేదా నిర్దేశిత సమయం కోసం వారిని క్వారంటైన్లో ఉంచవచ్చు. అందుకే తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఒకవేళ అక్కడ క్వారంటైన్లో ఉండాల్సి వస్తే ఆ మేరకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ► ప్రయాణం ఎలా చేసినప్పటికీ (బస్సు, ట్రైన్, విమానం) అక్కడ గుంపులు మనుషులు (క్రౌడ్) ఉన్నచోట మాస్కులు విధిగా ధరించడం, ప్రయాణంలోనూ తరచూ శానిటైజర్తోగానీ లేదా సబ్బుతోగానీ చేతులు శుభ్రం చేసుకవడం లాంటి తగిన కోవిడ్ నిబంధనల వల్ల ప్రయాణం చాలావరకు సురక్షితంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -డాక్టర్ ఆర్.వి. రవి కన్నబాబు, సీనియర్ కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్, విశాఖపట్నం . -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్లో జుమెయ్రా బీచ్కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
కేవలం 35 పైసలతో 10 లక్షల ఇన్సూరెన్స్! వివరాలివే..
Indian Railway IRCTC Passengers 10 Lakh Insurance For 35 Paise: దూర ప్రయాణాలు చేసేవాళ్లకు రైల్ రిజర్వేషన్ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ టికెట్ బుక్ చేసుకోవడం మొదలు.. నచ్చిన సీటును ఎంచుకోవడం, టైంకి తిండి, టైంకి జర్నీ, టాయిలెట్ సౌకర్యం.. ఇలా ఉంటాయి. అదే టైంలో మీ టికెట్ ఛార్జీలో కేవలం35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35 పైసలు.. అదీ జీరో ప్రీమియంతో రైలులో ప్రయాణించే వ్యక్తులకు రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రయాణికుల కుటుంబానికి ఆసరాగా నిలబడేందుకు కారుచౌకగా ఈ బీమాను అందిస్తోంది రైల్వే శాఖ. క్లిక్ చేస్తే చాలు! IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్ను బుక్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ను ఎంచుకుంటే బీమా కవర్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో PNR నంబర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. వేటికి వర్తింపు అంటే.. శాశ్వత పాక్షిక వైకల్యం, శాశ్వత వైకల్యం, రైలు ప్రమాదాల సమయంలో ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణ సమయంలో మరణం, మృతదేహాల రవాణా కోసం.. వర్తిస్తుంది. ఉగ్రదాడులు, దోపిడీ-దాడులు, కాల్పుల ఘటనలు, ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు ఒక కేటగిరీలో, రెండు రైళ్లు ఢీకొట్టినప్పుడు, రైలు ప్రయాణం మొదలైనప్పటి నుంచి గమ్యస్థానం చేరేలోపు రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఎంత బీమా పొందే అవకాశం ఉంటుంది? ఆసుపత్రిలో చికిత్సలకు రూ.2 లక్షల కవరేజీ, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ, మృత దేహాలను రవాణా చేసేందుకు రూ.10 వేల కవరేజీ, రైలు ప్రమాదం లేదా రైలు ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మరణించినా.. శాశ్వతంగా వైకల్యం బారినపడ్డా కూడా రూ.10 లక్షల కవరేజీ వర్తిస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి పొంచి ఉంటాయో ఊహించలేం. కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలబడవచ్చు. -
హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ నుంచి ఓ కుటుంబం డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్కు వచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా ఎక్కడికీ వెళ్లకుండా ఉండిపోయారు. కొద్ది రోజులుగా వివిధ దేశాల మధ్య ఆంక్షలను సడలించడంతో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉంటున్న ఆ కుటుంబం కూడా నగరానికి వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్కు వెళ్లి, చివరి వారంలో తిరిగి న్యూజిలాండ్కు చేరుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగించడంతో సందిగ్ధంలో పడ్డారు. ఇండియాకు వెళ్లి తిరిగి న్యూజిలాండ్కు చేరుకోగలమా లేదా అనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఉన్నపళంగా ఒమిక్రాన్ విజృంభింవచ్చనే భయాందోళన పట్టుకుంది. దీంతో వారు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చదవండి: మళ్లీ ఆంక్షల చట్రంలోకి..మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి పారిస్లోని ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డీడీ కాలనీకి చెందిన అనుపమ కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకొనేందుకు కొద్ది రోజుల పాటు సెలవుపై వచ్చిన ఆమెకు ఇప్పుడు తిరుగు ప్రయాణంపై ఆందోళన నెలకొంది. తిరిగి పారిస్కు వెళ్లే సమయానికి విమానాల రాకపోకలు ఆగిపోవచ్చనే భయంతో పాటు ఏదో ఒక విధంగా వెళ్లినా మరోసారి ఇండియాకు రావడం కుదరకపోవచ్చనే సందేహం నెలకొంది. హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.... ఈ నెల మొదటి వారంలో అమెరికా కోవిడ్ ఆంక్షలను సడలించి ప్రపంచ దేశాలకు స్వాగతం పలికిన అనంతరం పెద్దఎత్తున ఊరట లభించింది. యూరప్ దేశాలు సైతం ఆంక్షలను సడలించాయి. వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి .సొంత కుటుంబాలకు, సొంత ఊళ్లకు దూరంగా ఉంటున్న ఎన్నారైలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో చాలా వరకు ఆంక్షలను తొలగించి పర్యాటకులను సైతం ఆహ్వానించేందుకు పలు దేశాలు చర్యలు చేపట్టాయి. రెండేళ్లుగా కుదేలైన పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ప్రయాణాలపైన కేంద్రం సైతం ఆంక్షలను సడలించేందుకు సన్నద్ధం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐఆర్సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ, పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు రకరకాల ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ పిడుగులా వచ్చి పడడంతో అంతటా సందిగ్ధం నెలకొంది. డిసెంబర్ ప్రయాణాలు కష్టమే... హైదరాబాద్ నుంచి ప్రస్తుతం బ్రిటన్తో పాటు దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పర్యాటక దేశమైన మాల్దీవులుకు ప్రతి రోజు ఒక ఫ్లైట్ అందుబాటులో ఉంది. సాధారణంగా డిసెంబర్ నెలలో పర్యాటక ప్రయాణాలు బాగా పెరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల కోసం నగరవాసులు తమకు నచ్చిన పర్యాటక ప్రాంతానికి వెళ్తారు. రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రయాణాలు వచ్చే డిసెంబర్ నెలలో ఊపందుకోవచ్చని భావించారు. కానీ డిసెంబర్ నాటికి ప్రయాణాలు బాగా తగ్గవచ్చని పలు పర్యాటక సంస్థలు అంచనా వేస్తున్నాయి. -
ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!
-
150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
భారతీయ సంప్రదాయం ఉట్టిపడే ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకుని ఉంటారు. సైన్స్కు అంతుచిక్కని గుళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేవాలయానికి మాత్రం తాజ్మహల్కు ఉన్నంత చరిత్ర ఉంది. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహల్లో కైలాష్ దేవాలయం ఉంది. మీరు తెలుసుకోబోయేది ఈ దేవాలయం గురించే!! దాదాపు 4 లక్షల టన్నుల కొండను తొలిచి నిర్మించిన ఏకశిలా దేవాలయమట ఇది. ఈ దేవాలయం పూర్తి నిర్మాణానికి 18 యేళ్లు పట్టిందని ఆర్కియాలజిస్టుల నివేదికలు తెల్పుతున్నాయి. నిజానికి అప్పట్లో చాలా త్వరగానే ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేశారట. ఎందుకంటే అంత పెద్ద కొండను తొలచడం అంత మామూలు విషయం కాదు. 7 వేల కూలీలు 150 సంవత్సరాలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప అది సాధ్యంకాదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. ఇక్కడ ఒక్క పూజారి కూడా కనిపించడు. అసలింతవరకు ఇక్కడ పూజలే జరగలేదట కూడా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు హిమాలయాల్లో ఉన్న శివున్ని దర్శించుకోలేని వారు ఇక్కడి కేశవుడ్ని దర్శించుకున్నట్లేననే నమ్మకంతో నిర్మించినట్లు నానుడి. కాగా 1983లో ఈ దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
రాముడు మా ఊరొచ్చాడు.. 14 ఏళ్ల వనవాసం ఇక్కడే
ప్రకృతి పచ్చదనం మధ్య అచ్చంగా అడవి బిడ్డల ఆనందడోలికలలో సాగే వేడుక ఇది. చత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లో దసరా రెండున్నర నెలల పండగ. విజయదశమికి 75 ముందే మొదలవుతుంది. ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఈ పండగకు దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. ఆదివాసీలు రాముడిని తమ అతిథిగా భావిస్తారు. పద్నాలుగేళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతికులమతాల పరిధులేవీ లేని వేడుకలివి. రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాల కొత్త రథాన్ని తయారు చేస్తారు. రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను పత్ జాతర అంటారు. చదవండి: Beauty of Nature: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! పదవ రోజు మురియా దర్బార్తో వేడుకలు ముగుస్తాయి. బస్తర్ ప్రజలు దర్బారులో తమ సమస్యలను రాజుకు విన్నవించుకునే ఘట్టం అది. బస్తర్ దసరా వేడుకల్లో ఘోతుల్ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది యువతీయువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక. గుజరాత్ నవరాత్రి వేడుకలో గర్భా నాట్యంలాగ అన్నమాట. దసరా వేడుకల సమయంలో బస్తర్ యాత్రకు వెళ్తే ఆదివాసీ సంగీతవాద్యాలు, నాట్యరీతులు, వస్త్రధారణను చూడవచ్చు. ఆదివాసీ మహిళలు ఎర్రటి సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు. చదవండి: Chowmahalla Palace: ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?! -
పండగ సెలవులంటే ఫ్లైట్ కావాల్సిందేనంట!
దసరా దీపావళి పండగలు మన దగ్గర ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు సొంతూళ్లకు వెళితే మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఇక సంపన్నులైతే విదేశీ టూర్లకు వెళ్తుంటారు. అయితే ఈసారి ఇలా విదేశాలకు వెళ్తున్న వారితో ఛార్టర్ ఫ్లైట్స్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఆంక్షలు దేశీయంగా చాలా ప్రాంతాల్లో టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్, ఉత్తర్ఖండ్, కశ్మీర్, లదాఖ్ ఇలా టూరిస్టులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎటువంటి ఆంక్షలు లేని యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు, మాల్దీవ్స్, థాయ్లాండ్, రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఛార్టర్ ఫ్లైట్స్ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న సంపన్న వర్గాలు సాధారణ ప్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది సీట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ ఫ్లైట్స్ ఎక్కువగా బుక్ అవుతున్నాయని ప్రైవేట్ జెట్ ఆపరేటర్స్ అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా రెగ్యులర్ ఫ్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఫుల్ డిమాండ్ విదేశీ టూర్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్కి గిరాకీ పెరిగింది. ఇప్పటికే అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు వీకెండ్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దసరా , దీపావళి పండగ సెలవు రోజుల్లో రెట్టింపు ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియాకు వస్తున్నారు ఇక వ్యాపారం, ఉద్యోగ పనుల నిమిత్తం దుబాయ్లో ఉండిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది పండగని తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలనే సెంటిమెంట్ని ఎక్కువగా పాటిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయిన వారు ఈ సారి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీరు సైతం ప్రైవేటు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లకు జరుగుతున్న బుకింగ్స్లో 35 శాతం వరకు విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారికే ఉంటున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
Chikmagalur: చిక్మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం
మనం ఏదైనా చేస్తే అది ప్రత్యేకంగా ఉండాలి. అలాంటిది మరొకటి లేదనేటట్లు కూడా ఉండాలి. అంతేకాదు... నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి వస్తువూ పర్యావరణానికి హాని కలిగించనిదై ఉండాలి. ఆ మెటీరియల్ అంతా భవనాన్ని కూల్చినప్పుడు తిరిగి మట్టిలో ఇట్టే కలిసిపోయేదై ఉండాలి... ఇది కర్నాటక, చిక్మగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే చిక్మగళూరు, ఎఐటి కాలేజ్ రోడ్లో ఉన్న సన్యాట ఎకో రిసార్ట్. చూసి వద్దాం! సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎర్త్ టన్నెల్స్తో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఎకో రిసార్టు నిర్మాణంలో ఇటుకల నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా తయారు చేశారు. పిల్లర్లకు కూడా ఇనుము ఉపయోగించలేదు. వర్షపు నీటి నిల్వ కోసం భూగర్భంలో యాభై వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకు ఉంది. బాత్రూమ్లో వాడిన నీటిని శుద్ధి చేసి టాయిలెట్ ఫ్లష్కు, మొక్కలకు చేరే ఏర్పాటు... ఇలా ఒక ప్రయోగమే జరిగింది. నాచురల్ ఎయిర్ కండిషనర్గా రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్లో పదకొండు గదులున్నాయి. చిక్మగళూరు వాతావరణం వేడిగానే ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణంలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల మధ్యనే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో ఈ ఎకో రిసార్టు చిక్మగళూరు పర్యాటక ప్రదేశాల జాబితాలో ఒకటైంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ రిసార్టులో బస చేయగలిగింది కొందరే, ఎక్కువమంది పర్యాటకులు ఈ రిసార్టును చూడడానికే వస్తుంటారు. రిసార్టు ఆవరణలో చిక్మగళూరు చుట్టు పక్కల తయారయ్యే హస్తకళాకృతుల స్టాల్స్ కూడా ఉంటాయి. చిక్మగళూరు టూర్లో చూడగలిగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో! అవి ఎంతెంత దూరాన ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఉన్నాయి! ►బేలూరులో హొయసల రాజుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలను చూడవచ్చు. ఇది చిక్మగళూరుకి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. బేలూరు చూసిన వాళ్లు హలేబీడును చూడకుండా ఉండలేరు. ఇది బేలూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ►శృంగేరి మఠం... తుంగ నది తీరాన చిక్మగళూరుకు ఎనభై కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడే శారదా పీఠం కూడా ఉంది. మహాత్మా గాంధీ పార్క్. ఇది చిక్మగళూరు బస్స్టాండ్కు నాలుగు కిలోమీటర్ల దూరాన రత్నగిరి బోరెలో ఉంది. ►బల్లాలరాయన దుర్గ ఫోర్ట్... ఇది డెబ్బై కిలోమీటర్ల దూరాన కొండ మీద ఉంది. కర్నాటక– ద్రవిడ నిర్మాణశైలుల సమ్మేళనం ఈ కోట. కవికాల్ గండి వ్యూ పాయింట్... ఇది పద్దెమినిది కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి చిక్మగళూరులోని పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తాయి. ►ఝరీ వాటర్ ఫాల్స్... దాదాపు తొంబై కిలోమీటర్ల దూరాన అత్తిగుండి గ్రామంలో ఉంది. తెల్లగా ఉండే నీటి ధారలను పాలతో పోలుస్తూ జలపాతానికి పాలధారను ఉపమానంగా చెప్పడం తెలిసిందే. అయితే ఇక్కడి వాళ్లు ఈ జలపాతం నీటిని మజ్జిగతో పోలుస్తారు. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ►జెడ్ పాయింట్... ఇది అరవై కిలోమీటర్ల దూరాన పదిహేను వందల మీటర్ల ఎత్తు కొండ మీద ఉంది. ట్రెకింగ్ లవర్స్కు ఇది మంచి లొకేషన్. ►కాఫీ మ్యూజియం... ఆరు కిలోమీటర్ల దూరాన దాసరహల్లిలో ఉంది. చిక్మగళూరు వెళ్లిన వాళ్లెవరూ ఈ కాఫీ మ్యూజియాన్ని చూడకుండా రారు. ఘుమఘుమలాడే కాఫీ గింజల పరిమళాన్ని ఆస్వాదిస్తూ... కాఫీ మొక్క నుంచి కాఫీ తయారయ్యే వరకు ప్రతి ప్రక్రియనూ చూడవచ్చు. ►ఖుద్రేముఖ్ నేషనల్ పార్క్... ఇది వంద కిలోమీటర్ల దూరాన ఉంది. ట్రిప్లో ఒక రోజును ఈ నేషనల్ పార్క్ కోసమే కేటాయించుకోవాలి. ఏమి తినాలి? ఎక్కడ తినాలి? ►చిక్మగళూరులోని మహారాజా రెస్టారెంట్లో మటన్ బిర్యానీ రుచి చూడాలి. ►బ్రేక్ఫాస్ట్కి టౌన్ క్యాంటీన్ ప్రసిద్ధి. ఇందులో వెన్న రాసిన క్రిస్పీ దోశె తిని మంచి కాఫీ తాగడం మర్చిపోవద్దు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో గులాబ్ జామూన్ ఇస్తారు. ►మెసూర్ ఫుడ్స్లో... మైసూర్ మసాలా దోశె, మైసూర్ బజ్జీలు కన్నడదేశంలో పర్యటిస్తున్నామని గుర్తు చేస్తాయి. ►చిక్మగళూరులో మాంసాహారులు, శాకాహారులతోపాటు వేగాన్లకు కూడా ప్రత్యేక రుచులు ఉంటాయి. -
అమ్మ నాన్న వద్దన్నారు.. ‘వీగన్’గా అధిరోహించా
‘కిలిమంజారో అధిరోహణ నా జీవితంలో ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది’ అన్నారు కూరగాయల శారద. పర్వత ప్రపంచంలోని ఏడు శిఖారాలలో భాగమైన కిలిమంజారోను అధిరోహించిన మొదటి భారతీయ శాకాహారి (వీగన్)గా వార్తల్లో నిలిచారు ఆమె. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించడానికే ఈ ప్రయత్నం చేశానంటున్న నలభై నాలుగేళ్ల శారద స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. జంతు ఆధారిత ఆహార ఉత్పత్తులను దూరం పెట్టి ఐదేళ్లుగా వీగన్గా జీవిస్తున్న విధానాన్ని ఆమె ఇలా పంచుకున్నారు. ‘‘బలంగా ఉండాలంటే మాంసాహారం, గుడ్లు తినాలని, ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలనే ఆలోచన మనందరిలోనూ ఉంది. పర్వతారోహణ చేసేవారిలో శక్తికి ఇవన్నీ అవసరమే అనే ఆపోహ మనందరిలోనూ ఉంది. జీవ హింస చేయకూడదని, పూర్తి శాకాహారులు కూడా బలవంతులుగా ఉండవచ్చని నిరూపించడానికే కిలిమంజారో పర్వతారోహణ చేశాను. విదేశాల్లో వీగన్గా.. జర్నలిజంలో డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాద్లోని న్యూస్ చానెళ్లలో జర్నలిస్ట్గా ఉద్యోగం చేశాను. అవకాశం రావడంతో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాను. రేడియో మాధ్యమంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది శాకాహారుల(వీగన్)ను కలిశాను. మనదేశంలో వీగన్ ఫుడ్కి సంబంధించిన శోధన ఎంతో జరుగుతుంది. కానీ, పూర్తి శాకాహారులు అక్కడ పర్వతారోహణతో పాటు ఎన్నో వైవిధ్యమైన పనుల్లో చురుకుగా పాల్గొనడం చూశాను. వారితో కలిసి అవగాహనా సదస్సుల్లో పాల్గొన్నాను. జంతువులను హింసించి తయారు చేసే ఉత్పత్తులన్నింటికీ అప్పుడే స్వస్తి చెప్పాను. పాలు–పెరుగు వంటివి కూడా కొబ్బరి, బాదం మొదలైన ఉత్పత్తుల నుంచి తయారు చేసినవే వాడటం మొదలుపెట్టాను. ఐదేళ్లుగా కేవలం ప్రకృతి సంబంధిత ఉత్పత్తులతోనే నా జీవనం కొనసాగుతోంది. సౌందర్య ఉత్పత్తులు, ఇంటికి సంబంధించినవి ఏ వస్తువైనా జీవహింస ఏ మాత్రమూ లేకుండా తయారు చేసినవే వాడుతుంటాను. చాలావరకు వాటిని నేనే స్వయంగా తయారుచేసుకుంటాను. మొదట అమ్మానాన్నలే వద్దన్నారు చిన్ననాటి నుంచి శాకాహారిని ఏమీ కాదు. నా ఈ పద్ధతులను మొదట అమ్మానాన్నలే వద్దన్నారు. అలాంటి ఉత్పత్తుల ద్వారా బలం వస్తుందా అని వారి సందేహం. కిలిమంజారో ప్రపంచ ప్రసిద్ధ పర్వతాలలో ఒకటి. అలాంటి పర్వతాన్ని ఆరోహించడం ద్వారా నా బలమెంతో మా అమ్మనాన్నలకే కాదు మన దేశ ప్రజలకూ అర్థమైంది. ఫిట్నెస్కు సంబంధించిన అన్ని పరీక్షలు జరిపి, అప్పుడే పర్వతారోహణకు అనుమతినిస్తారు. ఆఫ్రికాలో ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలామంది వస్తుంటారు. కానీ, కొంతమంది బలవంతులు అనుకున్నవారు కూడా కొంత ఎత్తు అధిరోహించాక వెనుదిరిగిన వారున్నారు. స్పృహ తప్పి పడిపోవడం, వారిని రెస్క్యూ టీమ్ రక్షించడం వంటి సంఘటనలు కూడా చూశాను. ఈ పర్వతారోహణ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. మాంసాహారం తింటే బలం వస్తుందనడంలో అర్థం లేదు. జీవ హింస లేకుండా జీవిద్దాం. మూగజీవాలను ప్రేమిద్దాం’’ అని శాకాహారిగా తన అభిప్రాయాన్ని, పర్వతారోహణ అనుభవాలను తెలిపారు శారద. – నిర్మలారెడ్డి -
ఓయోతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది. హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ పరిశ్రమ కొత్త రూపు సంతరించుకునేలా క్లౌడ్ ఆధారిత ఆవిష్కరణలను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ను ఓయో ఉపయోగించనుంది. సెల్ఫ్–చెకిన్, డిజిటల్ రిజిస్టర్, ఐవోటీ ఆధారిత స్మార్ట్ తాళాలు, వర్చువల్ అసిస్టెన్స్ మొదలైన సర్వీసులను గెస్టుల కోసం రూపొందిస్తుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఓయో తెలిపింది. ట్రావెల్, ఆతిథ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఓయోతో భాగస్వా మ్యం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సుమారు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 37 కోట్లు) ఓయోలో ఇన్వెస్ట్ చేసింది. -
పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో.. ప్రకృతి విన్యాసం!
జమ్ము–కశ్మీర్ అంటేనే ప్రకృతి వైవిధ్యాలకు నిలయం. ఈ ప్రకృతి విచిత్రం కూడా అక్కడిదే. కశ్మీర్, లధాక్ రీజియన్లో ఉంది. లేహ్ నుంచి కార్గిల్కు వెళ్లే దారిలో కారులో ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఎటు చూసినా మనం ఎత్తులోకి ప్రయాణిస్తున్నట్లే అనిపిస్తుంది. రోడ్డు ఎంతో దూరం కనిపించదు. పైకి వెళ్తుంటే మన ముందు ఉన్న రోడ్డు కూడా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాలి కదా. కానీ ఓ వంద అడుగుల దూరం కంటే కనిపించదు. మన వాహనం ముందుకు వెళ్తుంటే మరో వంద అడుగులు మేర రోడ్డు కనిపిస్తుంటుంది. మనం పైకి వెళ్తున్నామా, కిందకు వెళ్తున్నామా అనే సందేహ నివృత్తి కోసం కారాపి గమనిస్తే కారు దానంతట అదే మెల్లగా ముందుకు సాగిపోతుంటుంది. అంటే మనం ప్రయాణిస్తున్నది కిందకే అన్నమాట. పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రకృతి విన్యాసం ఇది. విశ్వాసం!! ఈ విచిత్రం పర్యాటకులకు మంచి వినోదం. అయితే స్థానికులు మాత్రం ‘ఇది ఒకప్పుడు ఇది స్వర్గానికి వెళ్లే దారి’ అంటూ అందమైన కథనం చెప్తారు. ఇక్కడ మార్కింగ్ పాయింట్గా ఒక పసుపు రంగు బాక్స్ ఉంటుంది. వాహనాన్ని అక్కడ ఆపి ఈ ఫీల్ని ఆస్వాదించవచ్చు. ఈ విచిత్రం మనదేశానికే పరిమితమా లేక ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? అనే సందేహం రావడం సహజమే. ఆర్మీనియాలోని మౌంట్ అరాగాట్ కూడా ఇలాంటి విచిత్రాన్ని సొంతం చేసుకున్న పర్యాటక ప్రదేశం. సమీపంలో సింధునది మాగ్నటిక్ కొండకు పక్కనే సింధు నది ప్రవహిస్తోంది. ఇక్కడ పర్యటించడానికి జూలై నుంచి అక్టోబర్ వరకు అనువుగా ఉంటుంది. మాగ్నటిక్ హిల్ టూర్ను లధాక్ పర్యటనలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ ట్రిప్లో లధాక్, నుబ్ర, పాంగాంగ్ వంటి ప్రదేశాలను కూడా కవర్ చేయవచ్చు. బస: లేహ్లో హోటళ్లు ఉంటాయి. హోమ్స్టేలో కూడా బస చేయవచ్చు. డ్రైవింగ్ ఇష్టపడే వాళ్లు కారు అద్దెకు తీసుకుని మాగ్నటిక్ హిల్కు స్వయంగా నడుపుకోవచ్చు. ఆహారం: ఈ రూట్లో రెస్టారెంట్లలో చాయ్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆహారం లేహ్ లోనే ప్యాక్ చేయించుకుని వెళ్లడం మంచిది. -వాకా మంజులారెడ్డి -
కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి.. అంతలో
సాక్షి, కొడంగల్( వికారాబాద్): కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం పట్టణంలోని బస్టాండు సమీపంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం ఎక్మైయి గ్రామానికి చెందిన వెంకటయ్యగౌడ్ తన భార్యాపిల్లలతో కలిసి కర్ణాటకలోని యానగుంది పుణ్యక్షేత్రానికి సోమవారం ఉదయం బయలుదేరారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య ఈ క్రమంలో కొడంగల్ బస్టాండులో దిగి మూత్రం చేయడానికి బస్టాండ్ పక్కకు వెళ్లాడు. సమయం గడుస్తున్నా భర్త రాకపోవడంతో భార్య వెళ్లి చూసేసరికి వెంకటయ్యగౌడ్ కిందపడి ఉన్నాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటయ్యగౌడ్కు గతంలోనే హార్ట్ సర్జరీ జరిగినట్లు, లో బీపీ ఉన్నట్లు భార్య సుజాత తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలకిషన్ తెలిపారు. -
గోల్ఫ్ కోర్స్.. ఆకాశమంత ఎత్తు
అదితి అశోక్... ఒలింపిక్స్లో ఎవరూ ఊహించని విధంగా మౌనంగా పాయింట్లు తెచ్చుకుంది. దేశం దృష్టిని గోల్ఫ్ వైపు మళ్లించింది. మన దేశంలో గోల్ఫ్ ఇంతగా విస్తరించి ఉందా అనే సందేహాన్ని, నిజమేననే సమాధానాన్ని ఏకకాలంలో చెప్పింది అదితి. మరో విషయం... మన దేశంలో గిన్నిస్ రికార్డు సాధించిన గోల్ఫ్ కోర్స్ ఉంది. ప్రపంచంలో ఎత్తైన గోల్ఫ్ కోర్స్ సిక్కింలో ఉంది. పేరు... యాక్ గోల్ఫ్ కోర్స్. ఎంత ఎత్తులో అంటే... ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశమంత ఎత్తులో. కొలత వేసి చెప్పాలంటే పదమూడు వేల అడుగుల ఎత్తులో. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన గోల్ఫ్ కోర్స్ ఇది. ప్రపంచం మొత్తంలో ఇంతకంటే ఎత్తైన ప్రదేశంలో గోల్ఫ్ కోర్స్లు లేవా అనే సందేహం వచ్చినా కూడా తప్పు కాదు. పెరూలో ఒకప్పుడు పద్నాలుగు వేల అడుగులకు పైగా ఎత్తులో గోల్ఫ్ కోర్స్ ఉండేది. రికార్డు కూడా దానికే ఉండేది. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా గోల్ఫ్ క్రీడాకారులు ఆ గోల్ఫ్ క్లబ్ వైపు చూడడమే లేదు. అంత ఎత్తులో ఆల్టిట్యూడ్ సమస్యలు, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండడంతో అది ఇప్పుడు వాడుకలో లేదు. ఇప్పుడు రికార్డు మన సిక్కిమ్, యాక్ గోల్ఫ్ క్లబ్దే. పైగా ఇది పద్దెనిమిది హోల్స్ గోల్ఫ్ క్లబ్. దీనిని భారత ఆర్మీ నిర్వహిస్తోంది. ఈ పేరు ఎందుకు? సిక్కిమ్ వాళ్లు హిమాలయాల్లో సంచరించే యాక్ (జడలబర్రె) మీద ప్రయాణించడాన్ని గర్వంగా భావిస్తారు. దేవతల పూజల్లో ఉపయోగించే చామరాలను ఈ జడలబర్రె వెంట్రుకలతో తయారు చేస్తారు. ఇక్కడికి ఎవరికి వాళ్లుగా వెళ్లడం కంటే టూర్ ప్యాకేజ్లో వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది. సిల్క్ రూట్లోని ప్రదేశాలను కవర్ చేసే కొన్ని టూర్ ప్యాకేజ్లలో ఈ యాక్ గోల్ఫ్ కోర్స్ ఉంటుంది. -
హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్సీటీసీ ఎయిర్ప్యాకేజీలను అందజేస్తోంది. సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్ప్యాకేజీలు... గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది. ♦ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ♦ హౌస్బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ♦ రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్పూర్, పుష్కర్, ఉదయ్పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ♦ ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది. ♦ దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. -
మారిన టూర్ ట్రెండ్: ప్రయాణికులంతా ఆ దారిలోనే!
సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమాజాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సువరు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్ప్యాకేజీలు... ► గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి రూ.15,780 చొప్పున ఉంటుంది. ► స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ► హౌస్బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెపె్టంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ► రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్పూర్, పుష్కర్, ఉదయ్పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. రూ.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ► ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారతయాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారతయాత్ర, ఈ నెల 27 నుంచి సెపె్టంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో రూ.10,400 చొప్పున ఉంటుంది. ►దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. వివరాలకు: ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. ఫోన్ నెంబర్లు: 04027702407, 97013 60701 -
సోనూ సూద్ ‘ట్రావెల్’ యాప్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ పేరిట బిజినెస్–టు–బిజినెస్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్ఫాంను ఆవిష్కరించారు. ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నిర్వహించే రైళ్లు, దేశ..విదేశ రూట్లలో 500 పైచిలుకు ఫ్లయిట్లు, 10 వేల పైచిలుకు బస్సు ఆపరేటర్ల వాహనాల్లో టికెట్లతో పాటు హోటళ్లలో గదులను దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకునే వెసులుబాటు అంతగా లేదని, ఒక్కో దానికోసం ఒక్కో ఆపరేటరును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రావెల్ యూనియన్తో ఇలాంటి వాటన్నింటినీ చౌకగా ఒకే చోట పొందవచ్చని సోను సూద్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫాంలో చేరడానికి కట్టే నామమాత్రపు రుసుము రిఫండ్ అవుతుందని, తద్వారా ఉచితంగానే చేరినట్లవుతుందన్నారు. ట్రావెల్ యూనియన్లో సోనూ సూద్ రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
ఇండియాలోనూ మినీ స్విట్జర్లాండ్... ఎక్కడో తెలుసా!
ఇంటి మీద కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా కట్టిన ఏటవాలు పై కప్పు నిర్మాణాలు... బరువైన ఉన్నితో దేహాన్ని భారంగా కదిలించే గొర్రెలు... లేత ఆకుపచ్చని నేల...ముదురు ఆకుపచ్చని చెట్లు... పారాషూట్లో నేలకు దిగే అమ్మాయిలు... హార్స్ రైడింగ్కి సిద్ధమవుతున్న కుర్రాళ్లు... చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడిచే హనీమూన్ కపుల్. ఈ ప్రదేశం స్విట్జర్లాండేమో అనే భ్రమ కల్పిస్తోంది... కానీ ఇది ఇండియానే... ఇండియాలో ఉన్న మినీ స్విట్జర్లాండ్. ఖజ్జైర్ చిన్న హిల్ స్టేషన్. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆరువేల ఐదు వందల అడుగుల ఎత్తులో విశాలమైన ప్రదేశంలో ఓ సరస్సు, ఆ సరస్సు మధ్యలో నీటి మీద తేలుతున్న ఓ దీవి. ఎగిరి దూకినా సరే... దెబ్బ తగలని మెత్తటి పచ్చిక బయళ్లు... పిల్లలు ముచ్చపడడానికి ఇంకేం కావాలి. ఆహ్లాదకరమైన వాతావరణం కావడంతో హనీమూన్ కపుల్ మనసులను దోచుకుంటోంది. పదాలు రాని వాళ్ల చేత కవిత్వం చెప్పించగలిగించే అందమైన ప్రదేశం ఖజై్జర్. ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశాన్ని చూస్తూ దివి నుంచి భువికి దిగి వచ్చిన స్వర్గం అంటారు. మంచులో తడిసిన చెట్లను చూస్తూ... మంచు తివాచీ పరుచుకున్న తెల్లటి నేల మీద నడవాలంటే శీతాకాలంలో వెళ్లాలి. ఖజ్జైర్ సరస్సు నుంచి కొద్ది దూరం నడిస్తే బంగారు గోపురం ఉన్న పన్నెండవ శతాబ్దం నాటి ఆలయం కనిపిస్తుంది. చంబాను ఏలిన రాజు పృథ్వీసింగ్ కట్టించిన ఆలయం అది. ఖజై్జర్ నుంచి దైన్కుండ్ వరకు మూడున్నర కిలోమీటర్ల ట్రెకింగ్ పాథ్ ఉంది. ఇది దేహదారుఢ్యానికి పరీక్ష పెట్టే ట్రెకింగ్ కాదు. చాలా సునాయాసంగా పూర్తి చేయవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లిన వాళ్లు కూడా ప్రయత్నించవచ్చు. -
సువర్ణావకాశం.. పులి ఇంట్లో రెండ్రోజులు
కథల్లో విన్న పులిని చూడాలని ఉంటుంది. పులి కోసం కాన్హా నేషనల్ పార్కుకు వెళ్లాలని కూడా ఉంటుంది. దట్టమైన అడవిలో బస చేసి రాత్రిళ్లు పులి సంచారాన్ని స్వయంగా వీక్షించాలని సరదా పడితే... అది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న కాన్హా జంగిల్ స్టే ఎక్స్ రాయ్పూర్ (Sఏఏ069) టూర్ ప్యాకేజ్లో రెండు రోజులు కాన్హా అడవుల్లో బస చేయవచ్చు. పులులు సంచరించే జోన్లో విహరిస్తూ గంభీరమైన పులి నడకను, పాదముద్రలను చూడవచ్చు. మూడు రోజుల ఈ టూర్ ప్యాకేజ్లో రాయ్పూర్ ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని కాన్హా ఫారెస్ట్ టూర్ (రెండు రాత్రుల బస) పూర్తయిన తర్వాత మూడవరోజు రాయ్పూర్ ఎయిర్పోర్టు లో దించే వరకు ఐఆర్సీటీసీదే బాధ్యత. కాన్హా మధ్యప్రదేశ్లోని రెండు వేల చదరపు కిలోమీటర ్లకు పైగా విస్తరించిన దట్టమైన అటవీ ప్రదేశం. -
Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు
రెండు వందల అడుగుల పొడవు. నూట యాభై అడుగుల వెడల్పు. డెబ్బై అడుగుల ఎత్తు... ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఆ పరిమాణమే దీనిని గిన్నిస్ బుక్లో చేర్చింది. జటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న జటాయు నేచర్ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. అతడు ఫిల్మ్ మేకర్ కూడా. రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు. మన రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే టూర్ మధురానుభూతికి మినిమమ్ గ్యారంటీ. పక్షిలోపల మ్యూజియం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్ మ్యూజియం ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. జటాయు పార్కు సందర్శనలో పర్యాటకులు జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
ఆ అభిమానిని తప్పకుండా కలుస్తా : రష్మిక
'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. రష్మకి క్యూట్ లుక్స్కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రష్మిక నేషనల్ క్రష్గానూ మారిపోయింది. ఇటీవలె ఓ అభిమాని రష్మికను కలిసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్పేట అని తెలుసుకొని మరీ ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు హీరోయిన్ రష్మిక ఇంటిని మాత్రం కనిపెట్టగలిగాడు. అయితే రష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో ఆమెను కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ రష్మిక స్పందించింది. ఓ అభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు ఇప్పడే నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు బాధగా ఉంది. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు అతన్ని కలుస్తానన్న నమ్మకం ఉంది. అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ఇక రష్మిక ఇటీవలె ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ నేపథ్యంలో అక్కడకి షిఫ్ట్ అయినట్లు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న రష్మిక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తి కాకుండానే మరో బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది. Guys it just came to my notice that one of you had travelled super far and have gone home to see me.. Please don’t do something like that.. i feel bad that I didn’t get to meet you🥺 I really really hope to meet you one day❤️ but for now show me love here.. I’ll be happy! 🌸🥰 — Rashmika Mandanna (@iamRashmika) June 27, 2021 చదవండి : ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన రష్మిక చూపు కోల్పోయిన కత్తి మహేష్? -
Travel: వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట
రెడ్ఫోర్ట్... అనగానే స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించే ఢిల్లీలో ఉన్న ఎర్రకోట గుర్తుకు వస్తుంది. మన మెదడు అలా ట్యూన్ అయిపోయింది. కానీ ఆ ఎర్రకోట కట్టడానికి వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట ఆగ్రాలో ఉంది. మొఘల్ పాలకుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. యమునాతటి ఆగ్రా లాల్ఖిలాలోకి పర్యాటకులను అమర్సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో కట్టిన కోట ఇది. తాజ్మహల్, లాల్ఖిలా రెండూ యమునానది తీరాన ఉన్నాయి. ఈ కోటలోని అనేక ప్యాలెస్ల నుంచి తాజ్మహల్ కనిపిస్తుంది. తాజ్మహల్ దగ్గర యమునానది కొద్దిపాటి వంపు తిరుగుతుంది. ఆ వంపుకు అనుగుణంగానే ఈ కోట నిర్మాణం జరిగింది. షాజహాన్ నుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టడం, తాజ్మహల్ కనిపించేటట్లు ఖైదు చేయమన్న షాజహాన్ కోరిక కళ్లకు కడతాయి. షాజహాన్ పట్ల జాలిపడిన క్షణాలు గుర్తుకు వస్తాయి. అయితే షాజహాన్ అంత్యకాలంలో నివసించిన, మనం చెరసాల అని చెప్పుకున్న షా బుర్జ్ను చూస్తే... చిన్నప్పుడు అనవసరంగా జాలిపడ్డామేమో అనిపించకమానదు. షాజహాన్ జైలు జీవితం కోటలోని అందమైన ప్యాలెస్లోనే గడిచింది. గోడకు చెక్కిన తీగలు ఆగ్రాఫోర్ట్లో అందమైన కట్టడాలు, రాజ ప్రాసాదాలు లెక్కకు మించి ఉన్నాయి. పాలకులు సామాన్య ప్రజలకు దర్శనమిచ్చే దివానీ ఆమ్, మంత్రి వర్గ సమావేశాల హాలు దివానీ ఖాస్, రతన్సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్టబ్ ప్రత్యేకం గా చూడాల్సినవి. తాజ్మహల్లో ఉన్నట్లే పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్లలోనూ కనిపిస్తుంది. అలాగే పాలరాతి గోడల్లో చెక్కిన డిజైన్లలో అష్టభుజి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా... బ్లాక్ ప్రింటింగ్లో ఉండే ఒకదానితో ఒకటి అల్లుకున్నట్లుండే సన్నని లతలు తీగల డిజైన్లు గోడల మీద, పై కప్పు మీద కనిపిస్తాయి. ఇక్కడ ఒక పాలరాతి బల్లను చూపించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఈ కోటకు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నారని చెబుతారు గైడ్లు. అప్పటి వరకు కూర్చోవాలనే ఆలోచన లేని వాళ్లకు కూడా అప్పుడు కూర్చోవాలనిపిస్తుంది. ఆ బల్ల నుంచి ఫోర్ట్ వ్యూ బాగుంటుంది. కోట నుంచి తాజ్ ఆగ్రా ఎర్రకోటలో కనిపించే పాలరాతి నిర్మాణాల్లో ఎక్కువ భాగం షాజహాన్ కట్టించినవే. అప్పటి వరకు ఈ కోట ఎన్ని చేతులు మారినా ఎవరూ ముందున్న నిర్మాణాలను ధ్వంసం చేయలేదు. కానీ షాజహాన్ మాత్రం తాననుకున్న నిర్మాణాల కోసం పాత వాటిని కూల్చేశాడు. ఈ కోటలోపల ఉన్న ఆయుధాగారాన్ని అక్బర్ విజయాగారం అనవచ్చు. ఆగ్రా టూర్ అంటే ప్రధానంగా తాజ్మహల్ కోసమే అయి ఉంటుంది. ఆగ్రా కోసం కేటాయించుకున్న టైమ్లో తాజ్ మహల్ ను చూసేసి వెనక్కి రావడమే కాకుండా మరో రెండు–మూడు గంటలు కేటాయించుకోగలిగితే ఈ కోటను కూడా కవర్ చేయవచ్చు. తాజ్మహల్ను మరో కోణంలోనూ వీక్షించవచ్చు. లాల్ఖిలా ప్రధానద్వారం తాజ్మహల్కు రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ రెడ్ఫోర్ట్ 16వ శతాబ్దం తొలిరోజుల్లోనే ఉంది. బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోదీని ఓడించి రెడ్ఫోర్ట్లో అడుగుపెట్టాడు. హుమయూన్ కిరీటధారణ ఇక్కడే జరిగింది. పదేళ్ల తర్వాత హుమయూన్ ఈ కోటను షేర్షా సూరికి వదులుకున్నాడు. మరో పదిహేనేళ్లకు తిరిగి స్వాధీనం చేసుకుని మరో ఏడాదికే మళ్లీ చేజార్చుకున్నాడు. అక్బర్ దాదాపుగా తన హయాం మొత్తం ఈ కోట నుంచే పరిపాలన చేశాడు. కోటకు మరమ్మతులు కూడా చేశాడు. జహంగీర్ పాలన కూడా ఇక్కడి నుంచే సాగింది. షాజహాన్ ఢిల్లీలో పెద్ద ఎర్రకోటను కట్టి రాజధానిని ఢిల్లీకి మార్చేవరకు అన్ని రికార్డుల్లోనూ లాల్ఖిలా అంటే ఆగ్రాలోని ఎర్ర కోట మాత్రమే. ఈ కోట మధ్యలో జాట్లు, చౌహాన్ల అధీనంలోకి కూడా వెళ్లింది. చివరగా మరాఠాల నుంచి 19వ శతాబ్దంలో బ్రిటిష్ వశమైంది. – వాకా మంజులారెడ్డి చదవండి: నాగార్జునసాగర్లో మొదలైన లాంచీ ప్రయాణం -
కోవాగ్జిన్ను విదేశాలు గుర్తించడం లేదు: మమత
కోల్కతా: కోవాగ్జిన్ తీసుకున్న వారి విదేశీ ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు చూడాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ’కోవాగ్జిన్కు విదేశాల్లో అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నతచదువుల కోసం వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయి. కోవాగ్జిన్కు తమ దేశంలో గుర్తింపు లేదు కాబట్టి వారు వ్యాక్సిన్ తీసుకోనట్లుగానే ఆయాదేశాలు పరిగణిస్తున్నాయి. కోవాగ్జిన్ ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక... బ్రెజిల్, బంగ్లాదేశ్లలో సమస్యలకు కారణమైంది. కోవాగ్జిన్కు తక్షణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందండి లేదా ప్రపంచదేశాలు దీన్ని అంగీకరించేలా చర్యలు చేపట్టండి’ అని మమత పేర్కొన్నారు. కోవిషీల్డ్ తీసుకున్న వారికి విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదన్నారు. ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్వో చాన్నాళ్ల కిందటే అనుమతించింది. చదవండి: (కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు) -
పర్యాటకులకు గుడ్న్యూస్; సాగర్లో లాంచీ ప్రయాణం షురూ
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో పర్యాటక శాఖ నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీలను నడుపుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ జలాశయంలో జాలీ ట్రిప్పులు మాత్రమే తిప్పుతోంది. నాగార్జునకొండ (ఆర్కియాలజీ మ్యూజియం) ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో తెలంగాణ ఏర్పాటైన దగ్గరినుంచి ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలను నాగార్జునకొండకు అనుమతించలేదు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్రావు సోమవారం తెలిపారు. మ్యూజియం తెరుచుకుంటే లాంచీలను నాగార్జునకొండకు నడపనున్నట్లు వెల్లడించారు. నాగార్జునకొండకు వెళ్లడానికి పెద్దలకు టికెట్ ధర రూ.150, పిల్లలకు రూ.120లుగా ఉంది. చదవండి: మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి -
Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!!
ఎలిఫెంటా కేవ్స్ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర టికెట్ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్ను చేరేలోపు హార్బర్కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మామూలుగా అయితే అంతపెద్ద ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. సోమవారం సెలవు ఎలిఫెంటా కేవ్స్ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే గుహల దగ్గరకు తీసుకెళ్తాయి. శీతాకాలం ఫెర్రీ పై అంతస్తులో ప్రయాణించడం బాగుంటుంది. అరబిక్ కడలి చిరు అలలతో నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్ ఉన్న దీవి ఎత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అది పర్యాటకుల తప్పు కాదు. అమావాస్య, పౌర్ణముల్లో సముద్రం ఆటుపోట్లను బట్టి నీటి ఉపరితలం పైకి ఉబికినప్పుడు ఐలాండ్ ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో టాయ్ట్రైన్ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. అంతదూరం నుంచి మనం వదిలి వచ్చిన తీరాన్ని చూడడం, సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆ దారిలో ఉండే టూరిస్టు మార్కెట్లో చిరు వ్యాపారులను, వారు చెప్పే ధరలను చూస్తే దేశంలో వర్తకవాణిజ్య మేధావులంతా ఇక్కడే ఉన్నారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పర్యాటక ప్రదేశాల్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఐదు నుంచి పదిశాతం ధర ఎక్కువ ఉండడాన్ని ఆక్షేపించకూడదు. కానీ మన దగ్గర శిల్పారామంలో రెండు వందలకు అమ్మే హ్యాండ్బ్యాగ్కు అక్కడ పదిహేను వందలు చెప్పారు. గాయపడిన శిల్పాలు ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. తప్పిపోయేటన్ని గుహల్లేవు, మొత్తం ఏడు గుహలే. రెండు బౌద్ధగుహలు, ఐదు హిందూ గుహలు. గైడ్ లేకపోతే మనం ఏం చూస్తున్నామో అర్థం కాదు. ఏ శిల్పమూ దాని పూర్తి స్వరూపంతో లేదు. విధ్వంసానికి గురి కాని శిల్పం ఒక్కటీ కనిపించదు. ప్రతి శిల్పానికి ఏదో ఒక చోట గాయం, ఆ గాయాల వెనుక అధికార దాహమూ ఉన్నాయి. ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. అప్పుడు హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను కూడా చెక్కారు. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల అధీనంలోకి వచ్చింది. సమానత్వం కోసం ఓ ప్రయత్నం శైవం పతాకస్థాయిలో ఉన్న కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ గుహల్లో శిల్పాలను చెక్కించారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలోనే సమాజంలో స్త్రీపురుష సమానత్వం కోసం ఒక ప్రయత్నం జరిగిందిక్కడ. అర్ధనారీశ్వరుడిని రూపొందించడంలో ఉద్దేశం... సమాజంలో స్త్రీ పురుష సమానత్వ భావనను పాదుకొల్పడమే. అయితే ఆ ఉద్దేశాన్ని రూపుమాపడానికి అత్యంత లౌక్యంగా అది పార్వతికి మాత్రమే దక్కిన వరంగా మలిచేయడమూ అనతికాలంలోనే జరిగిపోయింది. ఏనుగు ఎక్కడ? గుహలన్నీ తిరిగి చూడడం పూర్తయినా సరే ఎక్కడా ఏనుగు ఆనవాలు కనిపించదు. ఈ గుహలకు ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగినప్పుడు గైడ్ చాలా సిన్సియర్గా గుహల వెలుపలకు తీసుకువచ్చి ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించి, ‘ఇక్కడ ఒక పెద్ద ఏనుగు శిల్పం ఉండేది. ఆ శిల్పం కారణంగానే పోర్చుగీసు, బ్రిటిష్ పాలనకాలంలో ఈ గుహలకు ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఆ ఏనుగును చూడాలంటే ముంబయి నగరంలోని జిజియామాత ఉద్యానవనానికి వెళ్లా’ లని చెప్పాడు. ఇక్కడ ఉండాల్సిన ఏనుగు అక్కడికి ఎందుకు వెళ్లిందటే... బ్రిటిషర్లు మన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయినట్లే ఏనుగు శిల్పాన్ని కూడా పెకలించుకుపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో అది విరిగిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు ఏనుగుకు మరమ్మతులు చేసి జిజియా మాత ఉద్యానవనంలో నిలబెట్టారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ బయటకు వచ్చేటప్పటికి ఫెర్రీలు నడిపేవాళ్లు ఎదురు చూస్తుంటారు. తిరుగు ప్రయాణానికి టైమ్ అయింది, ఫెర్రీ కదలడానికి సిద్ధంగా ఉంది ఇది వెళ్లిపోతే ఇక ఇప్పట్లో మరొకటి ఉండదని పిల్లల్ని భయపెట్టినట్లు చెప్పి బయల్దేరదీస్తారు. – వాకా మంజులారెడ్డి -
Mitra Satheesh: పద నాన్నా... దేశం చూద్దాం
ఇలా బహుశా ఏ తల్లీ చేయలేదేమో. కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ తన పదేళ్ల కొడుకు నారాయణ్ను తీసుకుని సొంత కారులో సొంత డ్రైవింగ్లో దేశం చూడటానికి బయలుదేరింది. ‘ఒరు దేశీ డ్రైవ్’ అని దానికి పేరు పెట్టిందికాని దూరం మాత్రం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఆ తల్లీ ఆ కొడుకు మార్చిలో బయలుదేరి మే 6 వరకూ సాహసోపేత దారుల్లో తిరిగి మళ్లీ కొచ్చి చేరుకున్నారు. ‘దేశం అంతా ఊళ్లల్లో ఉంది. ఆ ఊళ్లను చూశాం మేము’ అంటున్న మిత్రా ఈ కరోనా తగ్గగానే దేశాన్ని చుట్టేయమని చెబుతోంది. తోడుగా ఉన్నది ఒక మారుతి ఎస్–క్రాస్ మోడల్ కారు. 11 ఏళ్ల కొడుకు. దాదాపు 10 ఏళ్ల నుంచి కారు నడుపుతున్న ధైర్యం. అంతే. కొచ్చి (కేరళ)కు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ మార్చి 17, 2021న దేశం చూడ్డానికి బయలుదేరింది. ‘నా కొడుక్కి నా దేశం చూపించాలి. ప్రజలు ఎలా జీవిస్తారో వాడికి తెలియాలి. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించవచ్చని తెలియచేయాలి. పిల్లలు పుట్టాక ఇల్లు కదలలేరు అనే దానికి విరుగుడుగా పిల్లలనే తోడు తీసుకొని తిరగొచ్చు అని స్త్రీలకు చెప్పగలగాలి. అంతే కాదు... నేనొక ప్రయాణ ప్రేమికురాలిని. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. గ్రామీణ భారతంలోనే అంతా సౌందర్యం ఉంది అని చెప్పడానికి కూడా నేను ప్రయాణించాలి అని అనుకున్నాను’ అని ఈ సాహసోపేతమైన ప్రయాణం వెనుక తన లక్ష్యాలను వివరించింది మిత్రా సతీష్. 100 రోజులు 20 వేల కిలోమీటర్లు ‘ముందుగా నా భర్తకు కృతజ్ఞతలు. ఆయన మా అబ్బాయితో కలిసి ఈ యాత్ర చేయడానికి ప్రోత్సహించారు. మా అమ్మకు కూడా’ అంటుంది మిత్రా. మార్చి 17న బయలుదేరి 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని మిత్రా ప్లాన్. అందుకు తగ్గట్టు తన యాత్రకు ‘ఒరు దేశీ డ్రైవ్’ అని పేరు పెట్టుకుంది. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సరర్గా నిలిచింది. ఇక ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫాలోయెర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఆమె యాత్ర మొదలెట్టింది. ‘2019లో ఒంటరిగా భూటాన్ వెళ్లాను కారులో. అప్పుడు కాని అర్థం కాలేదు నాకు యాత్ర చేయడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు దారిలో తెలుసుకోవడం. కస్టమ్స్ కాస్ట్యూమ్స్ రెండు తెలియాలి జనానివి. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ ఒంటరిగా కారులో తిరిగాను. ఇప్పుడు నా కొడుక్కు దేశం చూపించాలనిపించింది. బయలుదేరాను’ అంది మిత్రా. అయితే ఆమె బయలుదేరిన సమయానికి కరోనా ఉధృతంగా లేదు. ఆమె యాత్ర సగంలో ఉండగా కేసులు, లాక్డౌన్లు మొదలయ్యాయి. అదీగాక డ్యూటీకి హాజరుకమ్మని ఆమెకు పిలుపు వచ్చింది. అయినప్పటికీ 51 రోజుల్లో దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగి ఆమె విజయవంతంగా స్వస్థలానికి చేరుకుంది. ఆత్రేయపురం పూతరేకులు కేరళ నుంచి బయలుదేరిన మిత్ర తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం, వరంగల్ జిల్లా చేర్యాల వంటి ఊళ్ల గుండా తన ప్రయాణం సాగించింది. ‘ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురం పూతరేకులు అద్భుతం. అలాగే చేర్యాల హస్తకళలు కూడా’ అని ఆమె చెప్పింది. తల్లీ కొడుకులు ప్రతిరోజూ ఉదయం 5 గంలకు ప్రయాణం మొదలెట్టి సాయంత్రానికి నిర్దేశిత ఊరికి చేరుకునేవారు. ‘మేము గ్రామాల్లో ఎవరినో ఒకరిని అడిగి వారి ఇళ్లల్లో ఉండేవాళ్లం. గ్రామీణులు ఎంతో అదరంగా మమ్మల్ని చూసేవారు’ అని ఆమె అంది. ఆదివాసీలతో ఈ ప్రయాణంలో తన కుమారుడికి ఆదివాసీ ల జీవనం చూపడం గురించి మిత్ర ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోరాపుట్ (ఒడిసా) బోండా ఆదివాసీలతో, కంగ్రపోడ్ (దక్షిణ ఒడిసా) లో గదబలతో, జగదల్పూర్ (చత్తీస్ఘర్)లో ధృవ తెగతో, అంజర్ (మధ్యప్రదేశ్)లో మడియా గిరిజనులతో మేము గడపడం వారి గూడేల్లో ఉండి వారు పెట్టింది తినడం మర్చిపోలేము’ అని మిత్ర అంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్త్రీలు ఎంతో ఆదరంతో పలకరించి ఎక్కడకు వెళ్లినా గౌరవ వస్త్రంతో స్వాగతం పలకడాన్ని ఆమె కృతజ్ఞతతో చెబుతుంది. ప్రమాదకరం ‘మేము వైష్ణోదేవి ఆలయం చూడాలనుకున్నాం. కాని దారి మూసేశారు. దాంతో హెలికాప్టర్లో వెళ్లాం. నాకు మా అబ్బాయికి కూడా హెలికాప్టర్ ఎక్కడం అదే ప్రథమం. అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ట్రిప్ కేన్సిల్ అయ్యింది. దాంతో 14 కిలోమీటర్లు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సగం దూరం గుర్రాల మీద వచ్చాం. ఆ సమయంలో మాత్రం చాలా భయం వేసింది’ అని మిత్ర అంది. ఈ మొత్తం ప్రయాణంలో కొడుకు ముందు నుంచి ఎదురు చూసింది జమ్ము, కశ్మీర్లను చూడటం గురించే. ‘వాడు మొదటిసారి మంచుమైదానాలను చూసి వెర్రెత్తి పోయాడు’ అని ఆమె పెద్దగా నవ్వింది. మామూలుగా మన దేశం పూర్తిగా చూడటానికి ఒక జన్మ చాలదని అంటారు. అన్ని విశేషాలు, జీవనాలు ఉంటాయి. మనలో చాలామందికి కార్లుంటాయి. కాస్త తిరగగలిగే వీలు కూడా ఉంటుంది. కాని ‘ఆరంభించరు అతి బీరువులు, బద్దకస్తులు’ అన్నట్టు భయం కొద్దీ, బద్ధకం కొద్దీ ఎక్కడికీ కదలం. ‘తెలిసిన ఊళ్లో ఉన్నవాడు ఏమీ తెలియనట్టే ఉండిపోతాడు. తిరిగినవాడు లోకం తెలిసి బాగుపడతాడు’ అని పెద్దలు అన్నారు. మనం, మన తర్వాతి తరం లోకాన్ని చూడకపోతే ఎలా? ముఖ్యంగా స్త్రీలు ఇంత అందమైన దేశాన్ని తిరిగి చూస్తే ఇల్లు విజ్ఞానవంతం అవదూ? పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పొచ్చు. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ కరోనా గిరోనా అంతా పోతుందని ఆశిద్దాం. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే. ఏమంటారు? – సాక్షి ఫ్యామిలీ -
Sanchi Stupa: అనగనగా.... ఓ బౌద్ధస్థూపం
రెండు వందల నోటు మీద గాంధీజీ ఉంటాడు. నోటును వెనక్కి తిప్పితే గాంధీ కళ్లద్దాలతోపాటు... ఓ పురాతన కట్టడం కూడా కనిపిస్తుంది. అదే... అశోకుడు కట్టించిన గొప్ప బౌద్ధ స్థూపం. రెండు వేల మూడువందల ఏళ్ల నాటి సాంచి స్థూపం. సాంచి బౌద్ధ స్థూపం పర్యటనకు వెళ్లే ముందు సాంచి స్థూపం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకోవాలి. సాంచి స్థూపాన్ని నిర్మించిన అశోకుడి భార్య పేరు విదిశ. ఆమె పేరు మీద సాంచికి పది కిలోమీటర్ల దూరాన ఒక పట్టణం కూడా ఉంది. అశోకుడితోపాటు విదిశ కూడా బౌద్ధాన్ని విస్తరింపచేయడంలో కీలక పాత్ర వహించింది. బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంక వెళ్లిన సంఘమిత్ర, మహేంద్రలు అశోకుడు– విదిశల పిల్లలే. అశోక స్తంభం బౌద్ధ ఆరామాలు సాధారణంగా నీటి వనరులకు దగ్గరగా ఒక మోస్తరు ఎత్తున్న కొండల మీదనే ఉంటాయి. అలాగే... నివాస ప్రదేశాలకు సుమారు కిలోమీటరు దూరానికి మించకుండా ఉంటాయి. సన్యాసులు ప్రశాంతంగా వారి జీవనశైలిని కొనసాగించడానికి, గ్రామంలోకి వచ్చి భిక్ష స్వీకరించడానికి అనువుగా ఉండేటట్లు నిర్మించుకునే వాళ్లు. సాంచి స్థూప నిర్మాణంలోనూ అదే శైలిని అనుసరించారు. స్థూపంలో చక్కని శిల్పసౌందర్యం ఉంది. బుద్ధుని జీవితంలోని ఘట్టాలను శిల్పాల రూపంలో చెక్కారు. ఈ స్తూపం వ్యాసం 120 అడుగులు, ఎత్తు 54 అడుగులు. స్థూపానికి నాలుగు వైపుల ఉన్న తోరణ ద్వారాల్లో దక్షిణ ద్వారానికి దగ్గరగా అశోకుని స్తంభం ఉంది. ఇది సాంచి అశోకుని స్తంభం అంటారు. నాలుగు సింహాలు నాలుగు దిక్కులను చూస్తున్న స్థూపం ఇది. మన జాతీయ చిహ్నంగా సింహాలను ఈ స్థూపం నుంచి తీసుకున్నారు. స్థూపం ఆవరణలో ఉన్న మ్యూజియంలో నమూనా స్థూపాన్ని చూడవచ్చు. మహాభిక్షపాత్ర సాంచి స్థూపం ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహణలో ఉంది. ఇక్కడ బౌద్ధ సాహిత్యం, సాంచి స్థూపం నమూనాలను కొనుక్కోవచ్చు. ఇక్కడి మ్యూజియంలో పెద్ద భిక్ష పాత్ర ఉంటుంది. అది రాతితో చెక్కిన పాత్ర. సాంచి పర్యటనకు వచ్చే వాళ్లు ఎక్కువగా భోపాల్లోనే బస చేస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీలంక మహాబోధి సొసైటీ ఆరామంతోపాటు అనేక దేశాల బౌద్ధ సన్యాసులు నిర్మించుకున్న ఆరామాలు కూడా ఉన్నాయి. సాంచి స్థూపం గురించి... సాంచి పట్టణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. పురాతన కట్టడాల అన్వేషణలో భాగంగా మనదేశంలో పర్యటించిన బ్రిటిష్ అధికారి జనరల్ టేలర్ 1818లో సాంచి బౌద్ధస్థూపం ప్రాముఖ్యతను గుర్తించాడు. తర్వాత 1881 నుంచి పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నెమ్మదిగా సాగిన మరమ్మత్తు పనులు 1912 – 1919 మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ స్థూపం 1989లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది. బౌద్ధ బంధం మయన్మార్ బౌద్ధ సన్యాసులను ఐదేళ్ల కిందట మనదేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు తీసుకు వెళ్లాను. ఆ సన్యాసులందరూ నాగార్జున యూనివర్సిటీలో మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్లో చదువుకోవడానికి మనదేశానికి వచ్చినవాళ్లు. కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొందరు రీసెర్చ్ కోసం వచ్చారు. బౌద్ధాన్ని ఆచరించే కుటుంబాలు తమ పిల్లల్లో ఒకరిద్దరిని ధర్మ పరిరక్షణ కోసం అంకితం చేస్తాయి. అలా వాళ్లు చిన్నప్పుడే బౌద్ధ సన్యాసులుగా మారిపోతారు. అశోకుడు– విదిశ తమ పిల్లలను బౌద్ధానికి అంకితం చేశారు. – డాక్టర్ బి. రవిచంద్రారెడ్డి, బౌద్ధ ఉపాసకులు Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం -
Travel: సింహం! సౌమ్యశీలి! ఆకలి కానంత వరకు..
సింహం సౌమ్యంగా ఉంటుంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం. ససాన్ గిర్... సింహాల నట్టిల్లు. ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ అడవిలో వందల రకాల పక్షులుంటాయి. వందల రకాల జంతువులూ ఉంటాయి. ఎందరు వచ్చినా ఆ రావడం సింహం కోసమే. సింహం మాత్రం... వేటాడ్డమే తెలియని సాధు జంతువులాగ వినమ్రంగా ఉంటుంది. అమితాబ్ బచన్ గిర్ సినిమా చూపించేశాడు. ఈ బాలీవుడ్ హీరో గుజరాత్ టూరిజమ్ ప్రమోషన్లో ససాన్ గిర్ అడవుల్లో తిరుగుతూ లెక్కలేనన్ని సింహాల్ని చూపించేశాడు. మనం ససాన్గిర్కు వెళ్తే అమితాబ్ చూపించినన్ని సింహాలు కనిపించవు, కానీ కొన్ని సింహాలనైతే చూడగలుగుతాం. విచిత్రం ఏమిటంటే... చిన్నప్పుడు కథల్లో విన్న ఘట్టాలతో మన ఇమాజినేషన్లో సింహం రౌద్రంగా ఉంటుంది. టూర్లో పగలు పర్యటిస్తాం కాబట్టి, సింహాలు సాధు జంతువుల్లా కనిపిస్తాయి. వాకిట్లోకి వచ్చి పర్యాటకులను ఆసక్తిగా చూస్తున్న సింహం పిల్ల, గిర్ ఫారెస్ట్లో సింహాల లోగో హ్యాట్తో అమితాబ్ బచన్ జూలో వచ్చినట్లు అడవిలో వేళకు ఆహారం రాదు, తమ ఆహారాన్ని తామే సేకరించుకోవాలి. అయినా సరే! ఆకలి వేసినప్పుడు తప్ప వేటాడవు కాబట్టి మనకు కనిపించే దృశ్యాలన్నీ చెట్టు కింద నిద్రపోతున్న సింహాలు, ఆకలి తీరి సేదదీరుతున్న సింహాలే. అయితే వాటికి ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియక అడవిలో మిగిలిన జంతువులన్నీ భయంభయంగా బతుకుతుంటాయి. అందుకు జింకల కళ్లే పెద్ద ఉదాహరణ. కవులు వర్ణించిన భీత హరిణేక్షి అనే విశేషణానికి అచ్చంగా సరిపోలుతుంటాయవి. అందమైన కళ్లలో బెరుకు అలా ఉండిపోవడానికి అడవిలోని క్రూరజంతువుల భయమే కారణం కావచ్చు. ససాన్ గిర్ ఎక్కడుంది? ససాన్ గిర్ గుజరాత్లో ఉంది. సోమనాథ్ నుంచి 75 కి.మీల దూరం. గంటన్నరలో చేరవచ్చు కానీ సోమనాథ్ దాటిన వెంటనే పచ్చటి అడవిలో ప్రవేశిస్తాం. గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే రెండు గంటలు పడుతుంది. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్తే కొద్దీ మన కళ్లు చెట్లను, పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి. సింహం కోసం వెతుకులాట మొదలవుతుంది. పెద్ద జంతువులు, సింహాలు సంచరించే ప్రాంతంలోకి మన వాహనాలను అనుమతించరు. సింహాలు సంచరించే ‘సింహసదన్’ ముఖద్వారం వన్యప్రాణి విభాగం వాహనాల్లోనే వెళ్లాలి. ఆ వాహనాల విండోలకు ఇనుప మెష్ ఉంటుంది. నీటి మడుగులో ఈదుతున్న జంతువులు, అప్పుడే నిద్రలేచిన సింహాలు... అడవిలోకి వచ్చే వాహనాలను చూస్తూ ‘ఇది మాకు అలవాటే’ అన్నట్లు నిరాసక్తంగా కనిపిస్తాయి. ఇవి కాకుండా కొన్ని సింహం పిల్లలు గదుల్లో తిరుగుతుంటాయి. ఒక్కో గదికి ఒక్కో సైజు ద్వారం ఉంటుంది. సింహం పిల్లలను పెద్ద జంతువులు చంపి తినకుండా ఉండడానికే ఈ ఏర్పాటు. అలాగే పెద్ద పిల్లల బారి నుంచి కూనల రక్షణ కోసం కొన్ని గదులకు పెద్ద పిల్లలు దూరలేని చిన్న ద్వారాలుంటాయి. గదులకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ నుంచి మనం పిల్ల సింహాలను, ఆ పిల్ల సింహాలు మనల్ని చూసుకోవచ్చు. వర్షాకాలం పరిమితులు! గిర్ అడవుల టూర్కి ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ డెన్స్ జోన్కి జూన్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు నిషేధం. అది సింహాల మేటింగ్ టైమ్. ఒక్కో ఏడాది వర్షాలు ఆలస్యమై సీజన్ ఆలస్యంగా వస్తే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా నిషేధం ఉంటుంది. ఇక్కడ ఆదివారం లయన్ షో ఉంటుంది. అడవిలో అమర్చిన కెమెరాల్లో క్యాప్చర్ అయిన సీన్లను ఈ షోలో ప్రదర్శిస్తారు. సింహాలు వేటాడే దృశ్యాలను కూడా ఈ షోలో చూడవచ్చు. గిర్ సాంక్చురీ, నేషనల్ పార్క్ జోన్లను కలుపుకుంటే మొత్తం ఫారెస్ట్లో సుమారుగా మూడు వందల సింహాలుంటాయి. సింహాలు పర్యాటకుల మీద దాడి చేసిన సంఘటన ఒక్కటీ లేదు. ఓ నాలుగు నెలల కిందట ఓ సింహం గిర్ అడవుల సమీపాన ఓ పెట్రోల్ బంకు దగ్గరకు వచ్చి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. – వాకా మంజులారెడ్డి -
నెల్లూరు: ఉదయగిరి కోట
ఉదయగిరి దుర్గం... రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన పయనంలో ఈ దుర్గం దాటిన మైలురాళ్లు ఒకటి కాదు రెండు కాదు. గజపతుల పాలనకు ముందు విజయనగర పాలకుల స్వాధీనంలో ఉండేది. పల్లవులు, కాకతీయులు, చోళులు, గోల్కొండ, ఆర్కాటు నవాబులతోపాటు బ్రిటిష్ పాలననూ చూసింది. ప్రతి పాలకులూ ఈ దుర్గంలో తమ ఆనవాళ్లను ప్రతిష్ఠించారు. సూర్యుడి తొలికిరణాలు కొండ మీద ప్రసరిస్తాయి కాబట్టి ఉదయగిరి అనే పేరు వచ్చింది. సుదీర్ఘ యుద్ధం చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది. సంజీవని కొండ ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం ‘ఉదయగిరి దుర్గం కథలు’లో ఉంది. సామరస్య సు‘గంధం’ ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు – ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు. -
Mount Abu: దిల్వాడా
శిల శిల్పం కావాలంటే... ఉలిదెబ్బలు తినాలి. పాలరాయిలో కలువలు పూయాలంటే... కరకుదేలిన ఉలితో ఎంత హింస పెట్టి ఉండాలి? పాలరాతిలో రూపుదిద్దుకున్న... సింహాలు... ఏనుగులు... సాలభంజికలు. ఒక ఆదినాథుడు... మరో నేమినాథుడు. ఇది ఊహకే అందని శిల్పనైపుణ్యం. చూసి తీరాల్సిన ఉలి చక్కదనం. మౌంట్ అబూ... ఎడారి ఇసుక తిన్నెకు ప్రకృతి అద్దిన ఆకుపచ్చ బుగ్గచుక్క. రాజస్థాన్లో విస్తరించిన ఆరావళి పర్వతశ్రేణులు రాష్ట్రానికి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఈ ఆరావళి శ్రేణులలో ఎత్తైన శిఖరం మౌంట్ అబూ. ఈ కొండ పాదాల దగ్గర విస్తరించిన పట్టణాన్ని అబూరోడ్ అంటారు. రైల్వేస్టేషన్కు కూడా ఇదే పేరు. ఈ కొండ మీద అర్బుదాదేవి ఆలయం ఉండడంతో అబూ కొండ అని అనే పేరు వాడుకలోకి వచ్చింది. అబూ పట్టణం 1,200 మీటర్ల ఎత్తులో ఉంది. మన తిరుమల గిరుల కంటే ఎత్తన్నమాట. అబూకి మూడు కి.మీల దూరంలో దిల్వారా టెంపుల్స్ ఉన్నాయి. ఏనుగుల బొమ్మలు మొదటి ఆలయం పేరు దిల్వాడా. చాళుక్య వంశపు రాజు మొదటి భీమదేవుడు నిర్మించాలనుకున్న అసలు ఆలయాలు ఆదినాథ, నేమినాథ, పార్శ్వ నాథ, మహావీర మందిరాలు లోపలున్నాయి. పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు కొనసాగింది వీటి నిర్మాణం. మొత్తం పాలరాతి నిర్మాణాలే. పాలరాయిని ఏనుగుల మీద కొండమీదకు తరలించారు. అందుకు గౌరవపూర్వకంగా హస్తిశాలను నిర్మించారు. ఇక ప్రధాన ఆలయాల్లో శిల్పచాతుర్యాన్ని వర్ణించడం కష్టం. దిల్వారా ఆలయాల స్తంభాలు, గోడలు, లోపలి విగ్రహాల కంటే పై కప్పు గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. అందమైన, లాలిత్యమైన పనితనం చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసారేమో అనిపిస్తుంది. తామర పూల రెక్కలు నిజమైన పూలరెక్కల్లాగే కోమలంగా కనిపిస్తాయి. విచ్చుకున్న పద్మాలు, తామరతూడులోని సన్నని ఈనెలు కూడా రాతిలో కనిపిస్తాయి. స్తంభాల మీదున్న రూపాలన్నీ ఒకేరకంగా ఉన్నట్లనిపిస్తాయి. కానీ గైడ్ చెప్పిన తర్వాత పరిశీలనగా చూస్తే ఏ ఒక్కటీ మరొక దానితో పోలి ఉండదు. కృష్ణుడు కూడా ఉన్నాడు ఈ జైనమందిరాల్లో గోడలు, పై కప్పు మీద హిందూ, జైన ధార్మిక సాహిత్యంలోని సన్నివేశాలు ఉంటాయి. సింహాలు, సంగీతకారులు, నాట్యకత్తెలు, యక్షిణులు, సాలభంజికలు, కాళీయమర్దన కృష్ణుడు, గోపికలతో కృష్ణుడు, నరసింహ స్వామి, హిరణ్య కశ్యపుడు, 360 మంది జైన సన్యాసుల విగ్రహాలున్నాయి. ఇక్కడ ఫొటోగ్రఫీ నిషేధం. మన కెమెరాలను బయటే వదిలి వెళ్లాలి. స్మార్ట్ఫోన్ను కూడా అనుమతించడం లేదు. ఐదు ఆలయాల సమూహం దిల్వాడా టెంపుల్స్ మొత్తం ఐదు. నాలుగు ఆలయాల నిర్మాణం తర్వాత మిగిలిపోయిన పాలరాయి, శిల్పాలు చెక్కినప్పుడు రాలిన పొడితో మరొక ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయాల సమూహంలో మొదట కనిపించేది అదే. శిల్పకారులు ఈ ఆలయ నిర్మాణానికి వేతనం తీసుకోలేదట. ప్రేమకొద్దీ చేసిన నిర్మాణం కాబట్టి దిల్వాడా అనే పేరు వచ్చింది. క్రమంగా దిల్వారాగా వ్యవహారంలోకి వచ్చింది. ఐదు జైన మందిరాల సమూహానికి అదే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయాలలోకి పర్యాటకులను మధ్యాహ్నం పన్నెండు నుంచి అనుమతిస్తారు. పూజలు క్రతువులు జరిగే అంతర మందిరంలోకి జైనులకు మాత్రమే ప్రవేశం. వనంలో విరిసిన చందమామ మూడవ మందిరం కారిడార్ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తే పచ్చటి దట్టమైన కొండల మధ్య తెల్లటి చందమామలాగ కనిపిస్తుంది టెంపుల్ కాంప్లెక్స్. ఎండాకాలం కూడా వేడి తీవ్రత ఉండదు. ఇక్కడ గైడ్లు విడిగా ఉండరు. పిల్లలు కంఠతాపట్టిన పాఠాన్ని చదివినట్లు, రెండవ ఎక్కం అప్పచెప్పినట్లు ఆలయ అర్చకులే గుక్కతిప్పుకోకుండా వివరిస్తారు. - వాకా మంజులరెడ్డి -
ఢిల్లీ ఐరన్పిల్లర్... తుప్పుపట్టని చరిత్ర
ఇది ఢిల్లీ ఐరన్పిల్లర్... ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు. వ్యాసం పదహారు అంగుళాలు. బరువు మూడు టన్నులకు పైమాటే. తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక. భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం. దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్మినార్ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్మిష్ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్ పాలకులే. లండన్ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్ చేసి, పిల్లర్ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్లో నిక్షిప్తమై ఉంటుంది. నిజమో! కాదో!! కానీ... ఈ పిల్లర్ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. మధ్యప్రదేశ్లోనే ఎందుకు? కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరామ్.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్లో నిక్షిప్తమై ఉంది. బ్రిటిష్ కాలంలో ఆర్కియాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సెప్ 1817లో ఈ పిల్లర్ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్ సర్ రాబర్ట్ హోడ్ఫీల్డ్ 1912లో రీసెర్చ్ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్లు, పుస్తకాలు వెలువరించారు. ఇది ఒక మెటలర్జికల్ వండర్ అని తేల్చేశారంతా. ఈ ఐరన్ పిల్లర్ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. – వాకా మంజులా రెడ్డి -
ఉదయ్పూర్ టూర్: క్రిస్టల్ గ్యాలరీ ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఉదయ్పూర్ టూర్లో... జగ్మోహన్ ప్యాలెస్... సిటీ ప్యాలెస్... జగ్మందిర్... దర్బార్ మహల్... పిచోలా సరస్సు... రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఒక రోజు సరిపోదని తెలుస్తుంది. చూసేవి కొన్ని టైమ్ సరిపోక వదిలేవి కొన్ని వాటిలో ఫతే ప్రకాశ్ ప్యాలెస్ ఉంటుంది. ఇందులోని క్రిస్టల్ గ్యాలరీని ఆసాంతం చూడాలంటే మూడు గంటలు పడుతుంది. అందుకే వదిలేసి వాటిలో తొలిస్థానంలో ఉంటుంది. కానీ చూడాల్సిన వాటిలో తొలి స్థానం దీనిది. ఉదయ్పూర్లో ఉన్న ప్రదేశాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఏ రెండింటినీ సరిపోల్చి... ఇది ఎక్కువ, ఇది మధ్యమం, ఇది తక్కువ అని వర్గీకరించలేం. దేనికదే వైవిధ్యం. వైవిధ్యానికి, నైపుణ్యానికి పరాకాష్ట ఫతేప్రకాశ్ ప్యాలెస్లోని క్రిస్టల్ గ్యాలరీ. ఇక్కడ ఫొటోలకు అనుమతి ఉండదు. టికెట్ కౌంటర్ దగ్గర పర్యాటకుల కెమెరాలు, స్మార్ట్ ఫోన్లను తీసుకుంటారు. ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ఫొటో ఐడీ కార్డు, ఒక ఫొటోకాపీ కౌంటర్లో ఇవ్వాలి. టికెట్తోపాటు పర్యాటకులకు ఒక ఆడియో డివైజ్ ఇస్తారు. చిన్న కాలిక్యులేటర్లా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజియంలో ఒక్కొక్క గదిలోకి వెళ్లినప్పుడు ఆ డివైజ్లో ఆ నంబర్ నొక్కాలి. ఆ గదిలో మనం చూస్తున్న కళాఖండాల గురించిన వివరాలు వినిపిస్తాయి. షాండ్లియర్ ప్రత్యేకం ఈ ప్యాలెస్లో పెద్ద షాండ్లియర్ ఉంది. అది మన దేశంలో ఉండే షాండ్లియర్లలో రెండవ అతిపెద్ద షాండ్లియర్, మొదటిది మన హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్లో ఉంది. ఫతే ప్రకాశ్ ప్యాలెస్ నుంచి చూస్తే లేక్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్టల్ గ్యాలరీ ఓ కొత్త లోకంలో విహరించిన అనుభూతినిస్తుంది. ఈ ఒక్క ప్యాలెస్కే ఏడు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకునేటప్పుడు టికెట్ ధర మరీ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వర్త్ సీయింగ్ అనే సంతృప్తితో బయటకు వస్తాం. కంచాలు... మంచాలు క్రిస్టల్లోనే క్రిస్టల్ గ్యాలరీలో ఒక్కో గదిని చూస్తూ పదిహేనవ గదిలో రాగానే ఒక మూలగా మెరూన్ కలర్ ముఖమల్ క్లాత్తో కుట్టిన కుషన్ చెయిర్ కనిపించింది. హమ్మయ్య కూర్చోవడానికి వెసులుబాటు ఉందని కూర్చోబోయేంతలో బారికేడ్ రిబ్బన్ అడ్డు తగిలింది. అది మామూలు కుర్చీ కాదు, క్రిస్టల్ కుర్చీ. క్రిస్టల్తో గ్యాలరీ అంటే ప్రదర్శనలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయనుకుంటాం. కానీ లోపలికి వెళ్తే కప్పులు, సాసర్లు, స్పూన్లు, గాజు ప్లేట్ల నుంచి సోఫాలు, కుర్చీలు, మంచాలు వరకు ఉన్నాయి. ఇవన్నీ మోజు కొద్దీ తయారు చేసి షో పీస్లలాగ అలంకరించుకున్నారా లేక ఉపయోగించారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ గ్యాలరీలోకి గైడ్కు అనుమతి ఉండదు. గ్యాలరీ విజిట్ పూర్తయిన తర్వాత ఆడియో డివైజ్ కౌంటర్లో వెనక్కి ఇచ్చేటప్పుడు అడుగుదామంటే వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. ఆడియో డివైజ్ వెనక్కి ఇచ్చిన తర్వాత మన ఐడీకార్డు ఇస్తారు. ఆరావళి కొండల్లో సూర్యోదయం ఉదయ్పూర్లో ఎయిర్పోర్టు ఉంది. కానీ ఒక వైపు జర్నీ అయినా రైల్లో చేస్తే బాగుంటుంది. ఆరావళి పర్వత సానువుల మధ్య కొండలను చుడుతూ సాగుతుంది ప్రయాణం. సూర్యుడితో దోబూచులాడాలంటే ఉదయానికి ఉదయ్పూర్ చేరే ట్రైన్ అయితే మంచిది. కొండల మధ్య ప్రయాణిస్తూన్నప్పుడు కొండ వాలులో నుంచి ఉదయిస్తున్న సూర్యుడు పలకరిస్తాడు. మనకున్న అనుభవంలో ఒకసారి ఉదయించిన సూర్యుడు సాయంత్రం వరకు కనిపిస్తూనే ఉంటాడు కదా అన్నట్లు పరాకుగా ఉంటాం. చూస్తున్నంతలోనే సూర్యుడు చటుక్కున మాయమైపోతాడు. మరో కొండ అడ్డు వచ్చిందన్నమాట. అలా రైలు కొండల మధ్య మలుపులు తిరుగుతున్నంత సేపూ ఈ ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. కొండల మధ్య సూర్యోదయాన్ని చూడడం కుదరకపోతే ఉదయ్పూర్ పర్యటనలో సూర్యాస్తమయం సమయంలో రోడ్డు జర్నీ అయినా ప్లాన్ చేసుకుని తీరాలి. సూర్యుడు ఒకసారి మనకు కుడివైపు కనిపిస్తాడు. వెంటనే మాయమై పోయి మరో ఐదు నిమిషాల్లో ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. ఈ విన్యాసాలకు ఆలవాలం ఆరావళి పర్వతశ్రేణులు. ఉదయ్పూర్ పర్యటనలో మిస్ కాకూడని ప్రకృతి సౌందర్యం. చదవండి: Jodeghat Museum: జోడెన్ఘాట్ వీరభూమి -
ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం!
విహారయాత్ర అంటే పిల్లలకు పెద్ద సరదా. మూడేళ్లు నిండిన పిల్లలను టూర్లకు ధైర్యంగా తీసుకెళ్లవచ్చు. అయితే పిల్లలతో ఒక రోజు ప్రయాణానికే ఓ పెద్ద సూట్ కేసు తయారవుతుంది. అలాంటిది టూర్కి వెళ్లేటప్పుడు మరికొంత జాగ్రత్తగా చెక్ లిస్ట్ పెట్టుకుని మరీ ప్యాకింగ్ మొదలు పెట్టాలి. టూర్లో జలుబు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే వేయడానికి డాక్టర్ సూచించిన మందులు దగ్గర ఉండాలి. రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ని కలిసి టూర్ కోసం ప్రిస్కిప్షన్ రాయించుకుని మందులు తీసుకోవాలి. టూర్ ఎన్ని రోజులనే దానిని బట్టి ఆహారం సిద్ధం చేసుకోవాలి. పాలపొడి లేదా మిల్క్ టెట్రా ప్యాక్లు తీసుకెళ్లాలి. టెట్రా ప్యాక్ అయితే పాలను మరిగించాల్సిన అవసరం కూడా ఉండదు. నూడుల్స్, ఫూడుల్స్ ఇన్స్టంట్ ప్యాకెట్లు దగ్గర ఉంటే... ప్యాకింగ్ టిన్లోనే మరిగే నీటిని పోస్తే నూడుల్స్, ఫూడుల్స్ రెడీ పిల్లలతోపాటు వాళ్లకు ఇష్టమైన ఒక్క బొమ్మనయినా టూర్కు తీసుకెళ్లాల్సిందే. టూరిస్ట్ ప్రదేశం నచ్చకపోతే విసిగించేస్తారు. అప్పుడే వాళ్లకు ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు, అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు గుర్తుకు వస్తారు. వాళ్ల దగ్గరకు ‘వెళ్లిపోదాం’ అంటూ మారాం చేస్తారు. బొమ్మ ఉంటే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. చదవండి: జోడెన్ఘాట్ వీరభూమి -
అడ్వెంచర్ టూర్.. హోగెనక్కల్ జలపాతం
కావేరీ జలపాతం కనిపించదు... వినిపిస్తుంది. కిలోమీటరు దూరం నుంచే జలపాతం సవ్వడి సందడి చేస్తుంటుంది. నీరు నేల మీదకు దూకుతున్న చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ మనం జలపాతం దగ్గరకు వెళ్తున్నామని అర్థం. జలపాతం దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది క్షణాల పాటు ఏమీ అర్థం కాదు. ఎటు చూసినా నీటి పాయలు... ఒకటి కాదు రెండు కాదు. పదుల సంఖ్యలో జలధారలు నురగలు చిమ్ముతుంటాయి. సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తు నుంచి నీటి ధారలు ఒక్కసారిగా నేల మీద పడుతుంటే ఆ దృశ్యాన్ని చిత్రీకరించడానికి మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లు సరిపోవు. నీటి తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తాయి. దూరానికి పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది. ఆకాశంలో మేఘాలతో మమైకమై కనిపిస్తుంది. ఇంతకీ ఇంత అందమైన జలపాతం ఎక్కడుంది? అంటే... తమిళనాడులో ఉందనే చెప్పాలి. ఎలా వెళ్లాలి అంటే! బెంగళూరు నుంచి వెళ్లాలని చెప్పక తప్పదు. మరో విషయం!! మనం చెప్పుకుంటున్న భారీ కావేరీ జలపాతం ఉన్నది హోగెనక్కల్ అనే గ్రామంలో. అందుకే హోగెనక్కల్ జలపాతం అంటారు. హోగెనక్కల్ వాళ్లు కావేరీ జలపాతం అంటారు. సాహసమే ఆనందం కావేరీ జలపాతం పాయలు మలిగెరె కొండల మధ్య, కొండలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంటాయి. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణమే పెద్ద సాహసం. పెద్ద వాళ్లు దూరం నుండి చూసి ఆనందిస్తారు, పడవలో నీటి అలల మీద తేలుతూ దగ్గరకు వెళ్లి కొండను తాకితే కలిగే ఆనందం మాటలకందదు. ఈ పడవలు వెదురుతో వలయాకారపు బుట్టలు. అడుగున తారు పూస్తారు. లోపలి వైపు పాలిథిన్ షీటు వేసి కుడతారు. జలపాతం దగ్గరకు వీటిలో వెళ్లడమే క్షేమమని చెబుతారు స్థానికులు. ఈ నీటిలో ప్రయాణించి ముందుకు పోతే ఇసుకతిన్నెలాంటి చిన్న ద్వీపాలకు వెళ్లవచ్చు. జలపాతం హోరు చూసి పర్యాటకులు కొండ దగ్గరకు వెళ్లడానికే భయపడతారు. ఆ ఊరి పిల్లలు కొండ అంచుల వరకు ఎక్కి ఒక్కసారిగా ప్రవాహంలోకి దూకుతారు. ప్రాణాలకు తెగించే డైవ్ చేయవద్దన్నా వినరు. పడవలోకే చిరుతిళ్లు పర్యాటకులు ఒక పడవలో వెళ్తుంటే చిరుతిళ్లు అమ్ముకునే వాళ్లు మరో పడవలో వచ్చి అందిస్తారు. చిన్న పెద్ద జలపాతాలన్నింటినీ చూడాలంటే ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జి మీదకు ఎక్కాలి. సరదాగా లెక్కపెడదామన్నా కూడా తెల్లటి నీటి ధారలను తదేకంగా చూడడంతో కళ్లు చెదురుతుంటాయి, జలపాతాల లెక్క తేలదు. పడవ విహారం ముగించి ఒడ్డుకు రాగానే చేపలను కాల్చి ఇచ్చేవాళ్లు సిద్ధంగా ఉంటారు. నీటిలో పట్టిన తాజా చేపలను పర్యాటకుల కళ్ల ముందే కాల్చి ఇస్తారు. ఈ ఊరు తమిళనాడు– కర్నాటక సరిహద్దులో తమిళనాడు, సేలమ్ పట్టణానికి 114 కి.మీల దూరాన ఉంది. ఇక్కడ ఎక్కువగా కన్నడమే మాట్లాడతారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదమే కాదు, కావేరీ జలపాతాల పర్యాటక వినోదం కూడా ఉంది. చదవండి: Jodeghat Museum: జోడెన్ఘాట్ వీరభూమి -
వరుస సెలవులు.. ఎంచక్కా చెక్కేద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన ఏడాదంతా దాదాపు ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్ నగర పౌరులు ప్రస్తుత రిలాక్స్ అయ్యేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కనీసం రెండు, మూడు రోజుల పాటైనా బిజీ, రొటీన్లైఫ్కు, నగర రణగొణ ధ్వనులకు దూరంగా గడపాలని గట్టిగా కోరుకుంటున్నారు. వరుసగా రెండు వారాంతాల్లో మూడేసి రోజులు సెలవులు రావడంతో ‘మినీ వెకేషన్’ప్లాన్ చేసుకున్నారు. 29న (సోమవారం) హోలీ ఉండటంతో ఈ వీకెండ్లో వరుస మూడురోజులు సెలవులు వచ్చాయి. అలాగే వచ్చే వీకెండ్లో కూడా... ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, 3న శనివారం, 4న ఆదివారం (ఈస్టర్) ఇలా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో పట్టణాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు. వేసవి కావడంతో హిల్స్టేషన్లు, చెట్లు చేమలతో పచ్చటి వాతావరణం ఉన్న ప్రదేశాలకు చెక్కేస్తున్నారు. తాముంటున్న పట్టణాలు, నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు కాకుండా తమ సొంత వాహనాల్లో వెళ్లి మూడు రోజుల గడిపేలా సమీపంలోని అహ్లాదకరమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం దేశంలోని పట్టణ ప్రజలు తమకు దగ్గరలోని విల్లాలు, రిసార్ట్లు, హాలిడే స్పాట్లు, హిల్స్టేషన్లు, తదితరాలను ముందుగానే బుక్ చేసుకున్నట్టుగా వివిధ రిసార్ట్స్, హాలిడే నిర్వహణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా తీసుకుంటే ప్రస్తుత ‘హోలీ, గుడ్ ఫ్రైడే వీకెండ్స్’లోనే అత్యధిక హాలిడే బుకింగ్లు వచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడెక్కడికి వెళుతున్నారంటే... ► నైనిటాల్, మనాలీ, గ్యాంగ్టక్, డార్జిలింగ్, లోనావాలా, రిషికేష్ వంటి హిల్స్టేషన్లను అత్యధికులు బుక్ చేసుకున్నట్టుగా మేక్ మై ట్రిప్ ప్రతినిధి తెలిపారు. ► మినీ వెకేషన్ల సందర్భంగా కరోనా వైరస్ బారినపడకుండా ఎక్కువగా రద్దీ లేని ప్రాంతాలు, హిల్స్టేషన్లు, పరిమితంగా అతిధులకు ఆతిధ్యమిచ్చే పర్యాటక కేంద్రాలను ఎంచుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ► లగ్జరీల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అకామిడేషన్స్, విల్లాలను ఎంచుకుంటున్నారు. ► ముందస్తుగా హాలిడే బుకింగ్ కోసం ఎంక్వైవరీ చేసే వారి సంఖ్య 50 శాతం పెరిగినట్టు యాత్ర డాట్ కామ్ తెలిపింది. ► గోవా, జైపూర్, పాండిచ్చేరి, షిమ్లా, నైనిటాల్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లోని హాలిడే స్పాట్లలో గడిపేందుకు ఉత్సుకత ప్రదర్శించినట్టు యాత్రా.కామ్ ప్రతినిధి శ్వేతా సింఘాల్ తెలిపారు. ► మహాబలేశ్వరం, కార్బేట్, ముస్సోరీ, కందాఘాట్, నాల్డెహ్రా, గోవా వంటి ప్రాం తాల్లోని రిసార్ట్లలో దాదాపు వందశాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చీఫ్ వర్కింగ్ ఆఫీసర్ వివేక్ ఖన్నా వివరించారు. ► స్విమ్మింగ్ పూల్స్, ఇతర అత్యాధునిక సదుపాయాలు, వసతులున్న పర్సనల్ విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగినట్టు థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ అధ్యక్షుడు రాజీవ్ కాలే తెలిపారు. ► కొందరు మాత్రం ఈ మినీ వెకేషన్ కోసం మరీ సుదీర్ఘ ఫ్లైట్ టైమ్ కాకుండా తక్కువ సమయంలో విమానంలో వెళ్లగలిగే అండమాన్ నికోబార్, శ్రీనగర్ వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్టు మేక్ మై ట్రిప్ వెల్లడించింది. -
Jodeghat Museum: జోడెన్ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్ఘాట్లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్ఘాట్కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్ఘాట్లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్వాటర్లో మ్యూజియం.. అదెక్కడంటే? -
షిల్లాంగ్ వేళ్ల వంతెన.. చూడాల్సిందే
ఇది కంప్యూటర్లో చేసిన గ్రాఫిక్ కాదు. ప్రకృతి చేసిన విన్యాసం. అక్వేరియంలో చేపలకు బదులు పడవ బొమ్మను వదిలినట్లు అనిపిస్తోంది కదూ! కానీ ఇది బొమ్మ పడవ కాదు, నిజమైన పడవ. అందులో ఉన్న మనుషులు ఆ సరస్సు సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు. ఆ సరస్సు పేరు ఉమియా లేక్. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది 220 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సు. ఈ సరస్సులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో పదాల్లో చెప్పాల్సిన పని లేదు, ఈ ఫొటో చెప్పేస్తోంది. ఉమియా సరస్సులో తేలుతున్న పడవ మెత్త చీపురు ఇక్కడిదే.. మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంట చేలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టు కుచ్చులా మెత్తగా ఉండే చీపురును మనం కొండ చీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే. వేళ్ల వంతెన మీద పర్యాటకుల సందడి చెట్ల వేళ్లతో వంతెన... టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో మన ఇంజనీర్లు చెరువుల మీద సస్పెన్షన్ బ్రిడ్జి కడుతున్నారు. వీటిని మనిషి మేధోవికాసానికి పరాకాష్టలుగా చెప్పుకుంటాం. షిల్లాంగ్ వాసులు మనసుతో వంతెనలు కట్టారు. ఉన్న వనరులను అవసరమైనట్లు మలుచుకోవడానికి మేధతోపాటు సున్నితమైన మనసు కూడా ఉండాలి. చుట్టూ అన్ని చెట్లు ఉన్నప్పటికీ చెట్లను నరికి వంతెన కట్టాలనే ఆలోచన చేయలేదు. మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయలేదు. కాబట్టి అవి చెట్టుకు బలాన్నిస్తూనే ఉంటాయి. మనుషులను చేరవేసే వాహకాలుగా కూడా పని చేస్తుంటాయి. పెద్ద చెట్లకయితే రెండు వరుసల వంతెనలు కూడా అల్లుతారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊయల ఊగినట్లు ఊగినా సరే పట్టు సడలవు. ఇదే మంచికాలం... మేఘాలయలో రోడ్లు ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వెళ్తే గతుకుల రోడ్ల తిప్పలు తప్పవు. ఏటా నవంబర్ నుంచి రోడ్డు పనులు మొదలై డిసెంబర్కి పూర్తవుతాయి. మేఘాలయ రాష్ట్రం మేఘాలమయం కావడంతో రాష్ట్రం మొత్తంలో ఒక్క ఎయిర్పోర్టు కూడా లేదు. షిల్లాంగ్ చేరాలంటే పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రం, గువాహటి ఎయిర్పోర్టులో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే ప్రయాణంలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కాబట్టి అస్సాంలో దిగడం ఏ మాత్రం వృథా కాదు. షిల్లాంగ్ టూర్లో బారాపానీ, నెహ్రూ పార్క్, నోహ్స్గితలాంగ్ జలపాతం, నోహ్కాలికాల్ జలపాతం, మావ్సమాల్ గుహలు, మావ్లాయ్నాంగ్ విలేజ్, ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్ చూడాల్సిన ప్రదేశాలు. -
ట్రావెల్.. ట్రెండ్స్: పర్యాటకంపై తగ్గని ఆసక్తి
కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో పర్యాటక ప్రేమికుల ప్రణాళికలకు అవాంతరం ఏర్పడిందే గానీ వారి అభిరుచులకు కాదు. తమ కలల తీరాలను చేరుకోవడానికి నగరంలోని టూర్ ‘ఇష్టులు’ ఆసక్తిగానే ఉన్నారు. బోట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ సర్వే ప్రకారం ఒక్కసారి కోవిడ్ ప్రభావం పరి సమాప్తం అవగానే తమ పర్యాటక ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి 63శాతం మంది ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయినప్పటికీ కొన్ని లాభాలనూ అందుకుందని విఎఫ్ఎస్ గ్లోబల్ రీజనల్ గ్రూప్ సిఒఒ వినయ్ మల్హోత్రా విశ్లేషిస్తున్నారు. కోవిడ్ నేపధ్యంలో ట్రావెల్ ట్రెండ్స్పై ఆయన ఏమన్నారంటే... సురక్షితమే...సముచితం.. కోవిడ్ లాక్ డౌన్ల నేపధ్యంలో పర్యాటకుల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సురక్షితమైన, నమ్మదగిన ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో ట్రావెల్ పరిశ్రమ కూడా వేగంగా డిజిటల్ మయం అవుతోంది. అలాగే ట్రావెల్ ప్లానింగ్ నుంచి కస్టమర్ ఎంగేజ్మెంట్ దాకా కాంటాక్ట్ లెస్ లావాదేవీలను పెంచుకుంటూ పోతోంది. ప్లానింగ్...కింగ్.. కేవలం ఒక బ్యాక్ ప్యాక్తో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా స్వల్ప దూరాలకు, ప్రాంతాలకు వెళ్లొచ్చేయడం వంటి ప్లానింగ్ లెస్ ట్రావెల్ ఇటీవల క్రేజీగా మారింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచనలు మార్చుకోక తప్పడం లేదు. తాము ఎక్కడ బస చేయబోతున్నాం, ఏం తినబోతున్నాం.. వంటి ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకుంటూ ముందస్తు ప్లాన్ చేసుకోవాలి. వ్యయ..ప్రయాణాలకు సై పర్యాటకాభిరుచి బాగా పెరిగిపోతున్న దశలో తక్కవ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలు చూడాలనే ఆలోచన.. వల్ల పెద్ద సంఖ్యలో సామూహిక ప్రయాణాలు, నాసిరకం విమానాలు, హాస్టల్స్, హోమ్ స్టే, గ్రూప్ టూర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్... వంటివి కూడా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా కోవిడ్ విస్తరణ పరిస్థితుల్లో ఇది ఆమోద యోగ్యంగా కాదు. వీలున్నంత వరకూ సోలో/లేదా చిన్న చిన్న బృందాలతో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తగినన్ని పారిశుధ్య ప్రమాణాలు పాటిస్తున్న చోట్ల బస చేయడం, చిన్న చిన్న దూరాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బుదులుగా క్యాబ్స్, సైకిల్స్, వాకింగ్.. వంటివి ఎంచుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా థామస్ కుక్ నిర్వహించిన ఎస్ఒటిసి హాలిడే రెడీనెస్ సర్వేలో తాము ఆపరేటర్స్, హోటల్స్ తమ ప్రయాణం మొత్తం ప్రముఖ బ్రాండ్స్కే ప్రాధాన్యమిస్తామని 72శాతం మంది చెప్పారు. తద్వారా తమకు ప్రయాణ ఖర్చులు గతంతో పోలిస్తే కనీసం 35శాతం వరకూ పెరుగుతున్నా పర్లేదని వీరు అంటున్నారు. నెంబర్ టూ.. త్రీలకే డిమాండ్ సాధారణంగా ప్రతీ దేశంలో బాగా పేరొందిన టూరిస్ట్ ప్లేస్గా ఏదో ఒక సిటీ/ ప్లేస్ తప్పక ఉంటుంది. సహజంగానే అలాంటి చోట్ల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే కోవిడ్ పరిస్థితుల్లో అటువంటి బాగా పాప్యులర్ టూరిస్ట్ ప్లేస్ల కన్నా... టాప్లో 2, 3 స్థానాల్లో ఉన్న వాటినే పర్యాటకులు ఎంచుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉండే సమూహాల నుంచి తప్పించుకోవచ్చునని భావిస్తూ.. వీలున్నంత వరకూ అత్యంత తక్కువ మందికే తెలిసిన పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్...ఫుల్ ప్రస్తుతం పర్యాటక పరిశ్రమ తమ వ్యాపార కార్యకలాపాల డిజిటలైజేషన్ను మరింతగా విస్తరించింది. కస్టమర్కి అవసరమైనవన్నీ క్లిక్ దూరంలోకి తెస్తోంది. ట్రావెల్ ప్లానింగ్ నుంచి వీసా అప్లికేషన్స్, ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్స్... వరకూ.. ఆసాంతం డిజిటల్ ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తోంది. ఆన్లైన్ ట్రావెల్ ప్రాసెస్, డోర్ స్టెప్ వీసా సర్వీస్, ఇ వీసా సర్వీసెస్, పాస్పోర్ట్ రిటర్న్ కు కొరియర్, ఎయిర్పోర్ట్స్లో సెల్ఫ్ చెక్ కియోస్క్లు.. వంటివి వాడుకలోకి వచ్చేశాయి. ట్రావెల్ కంపెనీలన్నీ డిజిటల్ టచ్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ముందుంది..పర్యాటక పండుగ సాధారణంగా వేసవి సీజన్ అనేది పర్యాటక శాఖలు సంస్థలకు చాలా ముఖ్యమైంది. దాదాపుగా వార్షిక వ్యాపారంలో కనీసం 60 నుంచి 65శాతం ఈ సీజన్లోనే అందుతుందని అంచనా. లాక్ డౌన్ తో 2020లో దీన్ని సంపూర్ణంగా కోల్పోయారు. అయితే మరోవైపు పర్యాటక ప్రాధామ్యాలనే ఇది మార్చేయడం, మరీ ముఖ్యంగా సురక్షితమైన పర్యాటక అనుభవాలపై అవగాహన పెరగడం వంటి పలు లాభాలూ ఒనగూరాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకల సందడి లేక ప్రస్తుతం పర్యాటక రంగం స్తబ్ధుగా కనిపిస్తున్నప్పటికీ... ఈ సీజన్ చివర్లో మళ్లీ పర్యాటకం బాగా ఊపందుకోవచ్చుననేది అంచనా. - వినయ్ మల్హోత్రా, రీజనల్ గ్రూప్ సిఒఒ, విఎఫ్ఎస్ గ్లోబల్ -
కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి
‘ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడి మధ్య ఏరడ్డు...’ అని కవి హృదయం స్పందించింది బహుశా ఇలాంటి చోటును చూసే కావచ్చు. కృష్ణానదికి ఆ ఒడ్డున ఒక రాష్ట్రం, ఈ ఒడ్డున మరొక రాష్ట్రం. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్నాటక మీదుగా తెలంగాణను పలకరించి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఓ విచిత్రం. కొంతదూరం కర్నాటక– తెలంగాణల మధ్యగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట్ జిల్లా (ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా), మక్తల్కు పది కిలోమీటర్ల దూరాన ఉంది ఈ విచిత్రం. ఇక్కడ కృష్ణానది మధ్యలో ఉన్న దీవి పేరు కురువపురం. విశాలమైన ఇసుక తిన్నెల్లాంటి శిలలతో మంచి వీకెండ్ డెస్టినేషన్ ఇది. హైదరాబాద్కు 190 కి.మీ.ల దూరం. పంచదేవ్ పహాడ్ తీరాన నేల మీద నుంచి నీటిలోకి అడుగుపెట్టాలి. వలయాకారపు తెప్ప... కృష్ణానదిలో పెద్ద పెద్ద శిలలుంటాయి. మరబోట్లలో ప్రయాణించడం కష్టం. వలయాకారపు తెప్పలే ఇక్కడ రవాణా సాధనాలు. ఒక్కో తెప్పలో పది నుంచి పదిహేను మంది ప్రయాణించవచ్చు. ఈ తెప్ప తెడ్డు వేద్దామని సరదాగా ప్రయత్నించవచ్చు. కానీ అది ఫొటో వరకే. ఆ తెడ్డును చెయ్యి తిరిగిన సరంగు వేయాల్సిందే. మనం తెడ్డు వేస్తే తెప్ప ఉన్న చోటనే గిరగిర తిరుగుతుంది తప్ప ముందుకు వెళ్లదు. స్థానిక సరంగులకు నీటి లోపల ఎక్కడ శిల ఉన్నదీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ శిలకు కొట్టుకోకుండా తప్పించి నడుపుతారు. నేల మీద నుంచి దీవి అరకిలోమీటరు దూరంలో ఉంది. తెప్ప ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే లోపే దీవి వచ్చేస్తుంది. దీవిలో దేవుడు... కురువపురం దీవిలో దత్తాత్రేయ దేవస్థానం ప్రసిద్ధ క్షేత్రం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తులు విశేషంగా దర్శిస్తుంటారు. పౌర్ణమి గురువారం మరింత విశిష్ఠమైనదిగా చెబుతారు. ఈ దీవిలో ఉన్న మఠంలో రాత్రి బస చేయవచ్చు, ఉచిత భోజనం ఉంటుంది. హోటళ్లు కూడా ఉన్నాయి. విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, తినుబండారాలు దొరకడం కష్టమే. కాబట్టి మక్తల్లో కొనుక్కుని వెళ్లడం మంచిది. ఇక్కడికి కర్నాటక వాళ్లు కూడా ఎక్కువగానే వస్తారు. రాయచూర్ ఇక్కడికి 30 కి.మీ.లు మాత్రమే. ఇప్పుడే కురిసిన మేఘమా... కృష్ణానదిలో శిలలు పైకి కొనదేలి ఉండవు. బల్లపరుపుగా ఇసుకతిన్నెలాగ ఉంటాయి. ఆ రాళ్ల మీద నిలబడి 360 డిగ్రీల కోణంలో తిరిగి చూస్తే ఎటు చూసినా పరవళ్లు తొక్కుతున్న నది అందంగా ఉంటుంది. నల్లమబ్బు అప్పుడే కరిగి నేల మీద జాలువారి ప్రవాహంగా మారినట్లు ఉంటుంది. ఈ దీవి నుంచి కొద్ది దూరం వెళ్తే నది రెండు పాయలుగా చీలిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. వర్షాలు కురిసేటప్పుడు ప్రవాహం ఉధృతిని బట్టి తెప్పలను ఆపేస్తారు. అలాగే వర్షాలు తక్కువగా పడిన ఏడాది ఎండాకాలంలో తీరం నుంచి దీవికి నడిచి వెళ్లవచ్చు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాబట్టి ఈ ఎండాకాలం కూడా హాయిగా తెప్పలో విహరిస్తూ దీవి పర్యటనకు వెళ్లవచ్చు. వీకెండ్ హాలిడేకి ఇది మంచి ప్రదేశం. -
పర్యాటకానికి సమ్మర్ బొనాంజా!
దేశీయ ప్రయాణ, పర్యాటక రంగానికి వేసవి కాలం కలిసి రానుంది. మన దేశంతో పాటు ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నింట్లోనూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దీంతో పర్యాటకులకు విశ్వాసం పెరిగిందని.. దేశీయ, విదేశీ పర్యాటక ప్రాంతాలకు డిమాండ్ ఊపందుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సమ్మర్తో పోలిస్తే ఈసారి అందుబాటులో ఉన్న ట్రావెల్, హోటల్స్ ధరలూ పర్యాటకులను రా..రమ్మంటు ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా ఈ వేసవి దేశీయ ప్రయాణ, పర్యాటక పరిశ్రమకు మంచి రోజులేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ ఏటా 2.7 నుంచి 3 కోట్ల వరకు భారతీయులు విదేశాల్లో ట్రావెల్ చేస్తుంటారు. కోవిడ్–19 వ్యాప్తి, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో గత ఏడాది కాలంగా వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుండటంతో పర్యాటకుల్లో నమ్మకం, విశ్వాసం ఏర్పడిందని, దీంతో టూరిస్ట్ ప్రాంతాలకు ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారని మేక్మై ట్రిప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ ప్రకాశ్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా దెబ్బతిన్న హోటల్స్, ట్రావెల్ వ్యాపారస్తులు ఈ వేసవి సెలవుల్లో దేశీయ ప్రయాణికుల నుంచి డిమాండ్ను ఎక్కువ పొందాలని ఆశిస్తున్నారు. ఈ ధోరణి పర్యాటక, ఆతిథ్య రంగానికి కొంత మేలవుతుందన్నారు. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు, ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన వాళ్లు కుటుంబంతో కలిసి ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో వేసవికాలం సెలవులలో విదేశాలకు లేదా దేశీయంగా ఉన్న హిల్ స్టేషన్లు, బీచ్లు, రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారని చెప్పారు. దీంతో టికెట్ల బుకింగ్స్, పర్యాటక ప్రదేశాల కోసం ఆన్లైన్ శోధన చేయడం పెరిగిందన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే రానున్న సమ్మర్ హాలిడేస్ కోసం మేక్మై ట్రిప్లో రోజుకు 70 శాతం బుకింగ్స్ పెరిగాయని విపుల్ ప్రకాశ్ తెలిపారు. నేటి ఎంక్వైరీలే రేపటి బుకింగ్స్.. గతేడాది వేసవికాలం ముందస్తు బుకింగ్స్తో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్ సీజన్లో ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్ (ఓటీఏ), హోటళ్ల ఎంక్వైరీలు పెరిగాయి. ఆయా శోధనలు బుకింగ్స్గా కచ్చితంగా మారతాయని ఓటీఏ, హోటల్స్ నిర్వాహకులు ధీమావ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జూన్ క్వార్టర్లో చాలా వరకు హోటల్స్ బుకింగ్స్, ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంచనా వేశారు. 2019 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ కంటే మెరుగైన బుకింగ్స్ ఉంటాయని హోటల్స్ పరిశ్రమ చెబుతుంది. డెహ్రాడూన్కు చెందిన లీజర్ హోటల్స్ గ్రూప్ వంటి లీజర్ లొకేషన్లో ఉన్న హోటల్స్, ట్రావెల్ కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని లీజర్ హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ విభాస్ ప్రసాద్ తెలిపారు. లీజర్ హోటల్స్కు చెందిన 90 శాతం ప్రాపర్టీలు పర్యాటక, విశ్రాంతి ప్రదేశాలలోనే ఉన్నాయని చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో ఆయా ప్రాపర్టీల ఆక్యుపెన్సీ 85-95 శాతానికి చేరుకుంటుందని ధీమావ్యక్తం చేశారు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ఉన్న లీజర్ గ్రూప్ పర్యాటక ప్రాపరీ్టలకు డిమాండ్ ఏర్పడిందని.. రానున్న రోజుల్లో మరింత పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. విదేశాల కంటే దేశీయ ప్రాంతాలకే.. పెద్ద హోటల్స్ చెయిన్స్లో కూడా బుకింగ్స్ డిమాండ్ ట్రెండ్ నమోదవుతుంది. శీతాకాలంతో పోలిస్తే సమ్మర్లో డిమాండ్ ఎక్కువగా ఉందని.. ఈ ఏడాది మొత్తం ఇదే ట్రెండ్ను కొనసాగుతుందని మారియట్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గోవిల్ తెలిపారు. ఈ సమ్మర్లో లీజర్ ట్రావెలర్స్ విదేశాలకు బదులుగా దేశీయ ప్రయాణాలకే ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశీయ ప్రయాణ, పర్యాటక రంగానికి పునరుత్తేజం సంతరించుకోనుందని తెలిపారు. 2019 వేసవితో పోలిస్తే ఈ సమ్మర్లో ప్రయాణ, పర్యాటక ఆక్యుపెన్సీ ధరలు తక్కువగా ఉంటాయని దీంతో ఆక్యుపెన్సీ 80-90 శాతం వృద్ధి చెందుతుందని సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎండీ అజయ్ భకయ తెలిపారు. గతేడాది చలికాలంతో పోలిస్తే ఈ ఏడాది వేసవిలో బుకింగ్స్ పెరుగుతాయని క్లియర్ట్రిప్.కామ్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రయాణ ఆంక్షలు లేనంత వరకూ ఈ డిమాండ్ ఇలాగే కొన సాగుతుందని పేర్కొన్నారు. క్లియర్ట్రిప్లో హోళి, గుడ్ ఫ్రైడే నేపథ్యంలో లీజర్ ట్రావెల్స్కు అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయని తెలిపారు. గోవా, శ్రీనగర్ వంటి దేశీయ పర్యాటక ప్రాంతాలు టాప్ డెస్టినేషన్స్ బుకింగ్స్లో నిలిచాయన్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి రెండు వైపుల బుకింగ్స్ 40 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం దేశీయ లీజర్ ట్రావెల్ ప్రీ-కోవిడ్ స్థాయిలో 60-65 శాతానికి చేరిందని చెప్పారు. చదవండి: పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి -
కొలనుపాక జైన మందిరాలు
జైన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం. కొలనుపాకలో జైన మందిరాన్ని ఒక ఎకరా విస్తీర్ణంలో నిర్మించారు. చుట్టూ ఉన్న ధర్మశాలలు ఇతర కట్టడాలన్నీ కలిపి ఈ మందిరం ఇరవై ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ మందిరాన్ని భరతుడు కట్టించాడని స్థానిక కథనం ఒకటి వ్యవహారంలో ఉంది. శకుంతల– దుష్యంతుల కుమారుడు భరతుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ‘భరతుడు కట్టించాడనే అనుకోవడానికి... మరి భారతదేశం రెండు వేల ఏళ్లకంటే ముందే ఉండేది కదా. ఈ మందిరం ఆవరణలో ఉన్న దాదాపు ఇరవై శాసనాలను బట్టి చూస్తే రాష్ట్రకూటుల చారిత్రక కాలానికి వర్తిస్తోంది. పురాతన మందిరాన్ని రాష్ట్రకూటులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఇక్కడ బౌద్ధం కూడా బాగానే విస్తరించింది. కానీ పర్యాటక ప్రదేశంగా జైనమందిరమే ప్రాచుర్యంలోకి వచ్చింది. వర్ధమానుడి విగ్రహం జైన తీర్థంకరులు రిషభనాధుడు, నేమినాథుడు, మహావీరుల విగ్రహాలతోపాటు ఆదినాధుడు, వర్ధమాన మహావీరుడి శిష్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో తెల్లటి పాలరాతి విగ్రహాలతోపాటు ఆకుపచ్చ పాలరాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. గడచిన శతాబ్దంలో ఈ మందిరానికి మరమ్మత్తులు చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పాలరాతి నిర్మాణాల్లో నిపుణులు వచ్చి మెరుగులుదిద్దారు. మహావీర సూత్రాలు ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ జైనమందిరం హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్ల దూరాన యాదాద్రి జిల్లాలో ఉంది. రైల్లే వెళ్లాలంటే ఆలేరు రైల్వేస్టేషన్లో దిగాలి. ఆలేరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. వారాంతపు సెలవుకు ఇది మంచి ప్రదేశం. రోజంతా ఆహ్లాదంగా గడపవచ్చు. చదవండి: మానా గ్రామం.. ఇది మన ఊరే! రంగులు మార్చే సూర్యుడు -
మానా గ్రామం.. ఇది మన ఊరే!
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమఠ్ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. చదవండి: రంగులు మార్చే సూర్యుడు భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి -
అసలు నా మరో పేరు ఆనంద విహారి
కేరళకు చెందిన నిధి కురియన్ ప్రస్తుతం కోల్కతాలో ఉంది. ఆమె తమిళనాడులో పొలంగట్లన నిలబడింది. ఆంధ్రాలో చేపల చెరువులను చూసింది. ‘ఈ దేశం స్త్రీలకు ఎంత భద్రత ఇవ్వగలదో తెలుసుకోవాలి’ అని ఒంటరిగా సొంత కారులో సొంత డ్రైవింగ్ చేసుకుంటూ దేశాటనకు బయలుదేరింది. అర్ధరాత్రి తర్వాత సంగతి పట్టపగలు తిరగడమే స్త్రీకి కష్టం అని చెప్పే ఈ దేశంలో ఇష్టమైన విహారం మనమూ చేయొచ్చు అని తన అనుభవాలను రికార్డు చేస్తోంది నిధి. 33 ఏళ్ల నిధి కురియన్ రాయబోయే పుస్తకం కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వస్తువు అలాంటిది. ‘ఈ దేశమూ... ఈ దేశ స్త్రీలూ’... ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉన్నారో తను తెలుసుకోదలిచింది. అయితే అందుకు కంప్యూటర్ ఎదురుగా కూచుని గూగుల్ చేయలేదు. కారు తీసుకొని బయలుదేరింది. దానికి ‘ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్’ అని పేరు పెట్టింది. సోలో ట్రిప్ నిధి కురియన్ది కొట్టాయం. కొచ్చిలో నివసిస్తోంది. ట్రావెల్కు సంబంధించిన బ్లాగ్ ద్వారా కొత్త కొత్త ప్రాంతాల గురించి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న యాత్రల కంటే ఒక భారీ యాత్ర చేయాలని నిశ్చయించుకుంది. దేశం మొత్తం తిరుగుతూ ఆ దేశంలోని ప్రదేశాలలో స్త్రీలు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో నలుగురితో పంచుకోవాలనుకుంది. పుస్తకం రాయాలనుకుంది. అనేక ఆలోచనల తర్వాత 100 రోజుల్లో 25 వేల కిలోమీటర్లు సొంత కారులో సోలో ట్రిప్ చేయాలనుకుంది. తనకు రెనాల్ట్ కారు ఉంది. ఆ కారులో ఫిబ్రవరి 7, 2021న బయలుదేరింది. తమిళనాడు మీదుగా కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి విశాఖ మీదుగా ఒరిస్సా చేరుకుని ‘పూరి’ దర్శించుకుని ప్రస్తుతం కోల్కతా చేరుకుంది. ‘తమిళనాడు పంటపొలాల్లో స్త్రీలను కలిశాను. విశాఖలో చేపల మీద ఆధారపడి జీవించే స్త్రీల కష్టాన్ని చూశాను. ఒరిస్సా ఆవాల చేలలో స్త్రీలు పిలిచి తాము తెచ్చుకున్న ఆహారంలో పెట్టింది తిన్నాను. ఒరిస్సాలోనే ఒక ఊరు ఊరు హస్తకళలు చేయడంలో నిమగ్నం కావడం గమనించాను. స్త్రీలే ఎక్కువగా ఈ కళాఖండాలు చేస్తున్నారు. వారే కుటుంబానికి ఆధారం’ అని చెప్పిందామె. పూరిలో ప్రసాదాలు తయారు చేసి పంచే స్త్రీలతో ఆమె సంభాషించింది. ప్రస్తుతం కోల్కతా దారుల్లో అనంతంగా కనిపించే స్త్రీలలో తాను ఒక స్త్రీగా తిరుగుతోంది. ఆ స్త్రీల ప్రతిధ్వని ఏదో ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని ఆమె తన పుస్తకంలో రాస్తుంది. టూర్ కాదు ట్రావెల్... టూర్ చేయడం అంటే ఏవో ముఖ్య ప్రదేశాలను చూడటం... ట్రావెల్ చేయడం అంటే జన జీవనంలో భాగమై కలిసి తిరుగుతూ ఆ ప్రదేశాలను అనుభూతి చెందడం అంటుంది నిధి. ‘ఈ ప్రయాణం ఒక ధ్యానం కంటే తక్కువ కాదు నాకు’ అంటుందామె. కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనం లోకాన్ని తెలుసుకుంటాము. స్త్రీలు ప్రయాణాలు చేయాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం... అంతే కాదు, మన అనుభవాలు మిగిలిన స్త్రీలతో చెప్పగలుగుతాం అంటుందామె. ప్రస్తుతం నిధి తెల్లవారుజామునే తన ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రానికి ఆ రోజుకు నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కువగా యూత్ హాస్టల్స్లో దిగుతోంది. లేదంటే ముందే బుక్ చేసుకున్న హోటళ్లలో. అయితే ఆమె తన డిక్కీలో ఒక చిన్న సిలిండర్, వంట సామాగ్రి కూడా పెట్టుకుంది. ‘నేను తినడానికి ఈ దేశ యాత్ర చేయడం లేదు. ఏదో అవసరమైనది వండుకుంటా. లేదంటే స్ట్రీట్ఫుడ్ తింటా’ అని చెబుతోంది నిధి. ఆమె తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తోంది. ‘నీ ప్రయాణాన్ని నీతోపాటు మేమూ చేస్తున్నాం’ అంటున్నారు ఆమె ఫాలోయెర్స్. నిధి ఇప్పుడు కోల్కతా నుంచి ఉత్తర భారతదేశంలోకి వెళ్లనుంది. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల మీదుగా ప్రయాణిస్తూ దేశం తిరుగుతుంది. ఆమె యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది. నిధిలా తిరిగే అదృష్టం అందరికీ లేకపోవచ్చు. కాని ఆమె యాత్ర సేఫ్గా సఫలం అవ్వాలనుకునే హృదయం మనందరికీ ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
రంగులు మార్చే సూర్యుడు
కబిని నది కేరళలో పుట్టి కర్నాటకలో ప్రవహిస్తూ కావేరి నదిలో సంగమిస్తుంది. నాగర్హోల్ నేషనల్పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్లకు మధ్యగా సాగుతుంది ఈ నది ప్రయాణం. పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ. ఏనుగులు గుంపులు గుంపులుగా పోతుంటాయి. మైసూర్ను పాలించిన వడయార్ల వేట వినోదానికి వేదిక నాగర్హోల్, ఇది బ్రిటిష్ పాలకుల వేసవి విహారకేంద్రం కూడ. ప్రకృతిమాత... కబిని తీరాన్ని సమతులంగా డిజైన్ చేస్తే, కర్నాటక టూరిజం పర్యాటకులకు సౌకర్యాలతో ముంచెత్తుతోంది. నది తీరాన వందలాది ఎకరాల్లో విస్తరించిన ఇసుల తిన్నెలు... నీటికి– నేలకు మధ్య అత్యాధునికమైన రిసార్టులతో పరస్పర వైవిధ్యభరితమైన కబిని తీరం మైసూర్ నగరానికి 80 కి.మీల దూరాన ఉంది. లాంతరు వెలుగులో గూడు పడవ విహారం జానపద సినిమాల్లో ఉన్నట్లు గూడు పడవలు, వెలుతురు కోసం గాజు చిమ్నీ బుడ్డిదీపాలు. కేన్ కుర్చీలు, అరోమాటిక్ క్యాండిల్ వెదజల్లే మంద్రమైన కాంతితోపాటు సువాసనలు. పురాతన నేపథ్యంలో అధునాతనమైన క్యాండిల్లైట్ డిన్నర్ చేస్తూ గూడు పడవలో విహారం... దీనికి దీటుగా స్వచ్ఛమైన నీటితో స్విమ్మింగ్పూల్, కనుచూపు మేరలో ఉన్నదంతా స్విమ్మింగ్ పూలేనేమో అని భ్రమకు లోను చేసే ఫ్లోర్... చూపు తిప్పుకోనివ్వవు. కబిని తీరంలో పర్యాటకుల కోసం ఏర్పాటైన రిసార్టులు రెల్లు గడ్డి, ఎర్ర పెంకు పై కప్పుతో పొదరింటిని పోలి ఉంటాయి. బయటకు గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఈ రిసార్టులు లోపల అటాచ్డ్ బాత్రూములతో విశాలమైన ఏసీ గదులు, రూమ్ హీటర్లు, ఫ్రెంచ్ కాఫీ మేకర్లతో అత్యంత ఆధునికంగా ఉంటాయి. రంగులు మార్చే సూర్యుడు ఉదయాన్నే నిద్రలేచి ఒళ్లు విరుచుకుంటూ కాఫీ మగ్గు చేత్తో పట్టుకుని కాటేజ్ బయట అడుగుపెడితే మరో ప్రపంచంలోకి ఊడిపడినట్లు ఉంటుంది. ఉదయాన్నే ఏనుగు నోటికి ఒక చెరకు గడ అందించి, పక్షుల కిలకిలరవాల ప్రతిధ్వనుల కోసం చెవి ఒగ్గి నేషనల్ పార్కులో ఎడ్ల బండిలో సవారీ చేయడం ఆధునిక జీవితానికి దొరికే అరుదైన సంతోషం. సూర్యుడు అస్తమించే క్షణాలు ఇక్కడ అత్యంత అపురూపం. క్షణక్షణానికీ రంగులు మారే సూర్యుడిని ఓపిగ్గా ప్రతిబింబిస్తుంది నది. ఆ విచిత్రాన్ని చూస్తున్న పిల్లలు ఆ రంగుల్లో షేడ్లకు పేర్లు పెడుతుంటే సూర్యుడు చెప్పా పెట్టకుండా నిశ్శబ్దంగా అస్తమిస్తాడు. నది మాత్రం అన్ని రంగులనూ తనలో శోషించుకుని ఇక ఏ రంగూ లేని తిమిరాన్ని ఆశ్రయిస్తుంది. ప్రకృతి సౌందర్యారాధనలో సాచురేషన్కెళ్లిన తర్వాత ట్రైబల్ డ్యాన్సులు ఆహ్వానిస్తాయి. వీటితోపాటు వైల్డ్లైఫ్ అంటే ఇదీ అని చూపించే డాక్యుమెంటరీ చిత్రం. పిల్లలతో వెళ్తే మాత్రం కబిని తీరాన ఏనుగు సవారీ చేయడం మర్చిపోకూడదు. నదిలో కోరాకిల్ రైడ్(వలయాకారమైన పుట్టి లాంటి పడవ) అన్ని వయసుల వారినీ అలరిస్తుంది. ఎక్కువ సమయం కేటాయించగలిగితే నేచర్ వాక్ను మిస్ కాకూడదు. కావేరమ్మ ఒడి చేరే కబిని కబిని నది కేరళ రాష్ట్రం, వయనాడు జిల్లాలోని పక్రమ్ తాలమ్ కొండల్లో పుట్టింది. కరోమి, వాలాడ్లలో మక్కియాద్, పెరియ నదులు కబినిలో కలుస్తాయి. తర్వాత పెయ్యంపల్లి దగ్గర పనమారమ్ నది కలుస్తుంది. వీటి సంయుక్త ప్రవాహం కొంతదూరం సాగాక కబిని నది పాయగా చీలుతుంది. ఈ పాయల మధ్య ఎత్తుగా ఉన్న నేల కురువ దీవి. వందల రకాల పక్షులకు, పూలకు నిలయం ఈ దీవి. ఇంతలో తిరెనెల్లి దగ్గర కబినిలో బ్రహ్మగిరి కొండల్లో పుట్టిన కాళింది నది కలుస్తుంది. వీటితోపాటుగా పాపనాశిని, తారక, నాగు వంటి చిన్న చిన్న నదులు కలుస్తాయి. ఈ ప్రవాహం మొత్తం కావేరి నదిలో కలుస్తుంది. చదవండి: దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం.. వరల్డ్ హెరిటేజ్ సైట్; హుమయూన్ సమాధి -
భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి
ఈ ఒక్క నిర్మాణం... పది గ్రంథాలకు సమానం. ఒక పూర్తి స్థాయి దృశ్యకావ్యం. వందలాది జీవితాలకు దర్పణం. భార్య ప్రేమకు నిదర్శనం. హుమయూన్ సమాధి... ఢిల్లీ పర్యటనలో చాలా మంది మిస్సయ్యే ప్రధానమైన పర్యాటక ప్రదేశం. ఢిల్లీ టూర్ అనగానే ఆగ్రాలోని తాజ్మహల్తో మొదలు పెట్టి, ఎర్రకోట, కుతుబ్మినార్, ఐరన్ పిల్లర్, ఇండియా గేట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్, జంతర్మంతర్, చాందినీ చౌక్, కన్నాట్ సర్కిల్, రాజ్ఘాట్, బిర్లాటెంపుల్, జమా మసీద్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్... అన్నీ కవర్ చేస్తారు. ఈ టూంబ్ గుర్తుకు వచ్చినా సరే... ‘అంతదూరం వెళ్లడం దేనికీ... ట్రైన్లో వెళ్లేటప్పుడు కనిపిస్తుంది. చూడవచ్చు’ అని తేల్చేస్తారు. ఇది మధుర రోడ్లో నిజాముద్దీన్ అనే ప్రదేశంలో ఉంది. ట్రైన్లో ఢిల్లీ స్టేషన్ చేరేలోపు కనిపిస్తుంది. ముందుగా తెలిస్తే తప్ప వెళ్లేటప్పుడు గమనించడం కుదరదు. తిరుగు ప్రయాణంలో గుర్తు పెట్టుకుని చూసినా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని పై అంతస్థును మాత్రమే చూడగలం. మనకు కనిపించని మరో అంతస్థు కూడా ఉన్నట్లు అప్పుడు తెలియదు కాబట్టి కనిపించినంతటితోనే సంతృప్తి చెందుతాం. కానీ... హుమయూన్ సమాధి కోసం కనీసం రెండు గంటల సమయం కేటాయించి చూస్తేనే నిర్మాణం గొప్పదనాన్ని, సునిశితమైన పనితనాన్ని ఆస్వాదించగలుగుతాం. హుమయూన్ సమాధి ప్రాంగణం భర్త కోసం హుమయూన్ సమాధి నిర్మాణ కౌశలాన్ని స్వయంగా చూసిన తర్వాత తాజ్మహల్ వంటివన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి చూస్తే సమాధి నిర్మాణం సుదూర తీరాన ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది పేరుకి సమాధే కానీ ముప్పై ఎకరాల్లో విస్తరించిన కట్టడం. విశాలమైన తోటల నడుమ ఉంటుంది. మోకాళ్లకు శ్రమ తెలియకుండా ఆరంగుళాల మెట్లను ఎక్కడానికి అలవాటు పడిన వాళ్లకు ఈ మెట్లు ఎక్కడం కొంచెం కష్టమే. మొఘలులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నిర్మించిన పెద్ద కట్టడాల్లో ఇది ముఖ్యమైనది. హుమాయూన్ భార్య హాజీ బేగం పర్షియా నుంచి ఆర్కిటెక్టులను పిలిపించి మరీ కట్టించింది. ఈ సమాధి నిర్మాణం హుమయూన్ మరణించిన తొమ్మిదేళ్లకు క్రీ.శ 1565లో మొదలైంది. పూర్తవడానికి ఏడేళ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన మిరాక్ మీర్జా మరణించడంతో అతడి కొడుకు సయీద్ ముహమ్మద్ పూర్తి చేశాడు. మొఘలుల తొలి చార్భాగ్ సమాధి ఇది. చుట్టూ నాలుగు తోటలతో జామెట్రికల్ లే అవుట్తో డిజైన్ చేశారు. ఏ దిక్కు నుంచి చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. కింది అంతస్థులో పదిహేడు ఆర్చ్లు కనిపిస్తున్నాయి. అన్ని వైపులా ఇదే కొలతలు, నమూనాతో ఆర్చ్లు ఉంటాయి. బ్రిటిష్ అధికారులు బహదూర్షాను అదుపులోకి తీసుకున్న చిత్రం నాటి తోటల్లేవు మొఘలుల కాలంలో వేసిన తోటలు ఇప్పుడు లేవు. మామిడి వంటి రకరకాల చెట్లతో తోటల ప్రాముఖ్యత మాత్రం తగ్గకుండా నిర్వహిస్తున్నారు. చారిత్రక నిర్మాణాల మరమ్మత్తు కత్తిమీద సాములాంటి పని. అప్పటి నిపుణుల నిర్మాణ కౌశలానికి భంగం కలగకుండా చేయాల్సి ఉంటుంది. హుమయూన్ సమాధి మరమ్మత్తులు కూడా పలుచటి సిమెంట్ పొరలతో అత్యంత నైపుణ్యంగా చేశారు. తోటల నిర్వహణ కోసం 128 భూగర్భజలాశయాలను కూడా పూడిక తీసి పూర్తి స్థాయిలో పని చేయిస్తున్నారు. ఇది పేరుకు హుమాయూన్ సమాధి నిర్మాణమే కాని, ఇందులో హుమయూన్ సమాధితోపాటు అతడి భార్యలు హాజీ బేగం, హమీదా బేగం సమాధులు, షాజహాన్ కొడుకు దారుషుకో సమాధి, ఇంకా మొఘల్ రాజ ప్రముఖుల సమాధులు కూడా ఉన్నాయి. నిర్మాణం నాటికి ఎవరూ ఊహించని మరో విషయం ఏమిటంటే... మొఘలు పాలనకు సమాధి కూడా ఇక్కడే జరిగింది. మొఘల్ చివరి పాలకుడు బహదూర్ షా అతడి సంతానాన్ని బ్రిటిష్ సైనిక అధికారి స్వాధీనం చేసుకున్నది ఇక్కడే. చదువరి ఇంతకీ హుమయూన్ ఎవరనే సందేహం కలిగితే... అందుకు సమాధానం అతడు అక్బర్ తండ్రి. భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్కు కొడుకు. సున్నిత మనస్కుడు, బాగా చదువుకున్న వాడు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు నమాజ్ సమయమైందని గుర్తుకు వచ్చి హడావుడిగా లైబ్రరీ మెట్లు దిగుతున్న సమయంలో మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు. తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అక్బర్ పుట్టే నాటికి రాజ్యం లేదు హుమయూన్ 23 ఏళ్లకే రాజయ్యాడు. వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని సోదరుల మధ్య విద్వేషాల కారణంగా పదేళ్లకే కోల్పోయాడు. కొన్నేళ్లపాటు కాందిశీకుడిగా గడిపాడు. హుమయూన్ హిందూ రాజులతో స్నేహంగా ఉండేవాడు. గర్భిణి అయిన భార్యను సింధు రాజు సంరక్షణలో ఉంచి యుద్ధానికి సిద్ధం కావడానికి ఎడారులకు వెళ్లిపోయాడు. అక్బర్ పుట్టినప్పుడు వర్తమానం తెచ్చిన వార్తాహరుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని ఆవేదన చెందాడు. బికారిగా కొడుకుకు ముఖం చూపించలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పదిహేనేళ్ల పోరాటం తర్వాత సింహాసనాన్ని 1555 జూలై నెలలో తిరిగి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలలకే 1556, జనవరి నెలలో తుది శ్వాస వదిలాడు. చదవండి: దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం.. కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే! -
పులి విహారం.. టూరిస్టు గైడ్లుగా మహిళలు
రెండువేల చదరపు కిమీల విస్తీర్ణం రెండు వందల రకాల పూల చెట్లు మూడు వందల పక్షిజాతులు వందకు పైగా పులుల ఆవాసం వేలాది పర్యాటకులకు వినోదం వందలాది మందికి ఉపాధి జీపు డ్రైవర్లు... టూరిస్టు గైడ్లుగా మహిళలు ఇది కాన్హా నేషనల్ పార్కు ముఖచిత్రం పులి విహారం పర్యాటకులు జీపులో ఎక్కిన తర్వాత జీపు నీటి మడుగులో నుంచి ప్రయాణిస్తుంది. జీపు టైర్లు శుభ్రం కావడానికన్నమాట. ఆ తర్వాత కొద్దిదూరంలో వాష్రూమ్లుంటాయి. అక్కడ ఆపుతారు. ఆ తర్వాత జీపు దిగకూడదు. అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇక ఏ అవసరం వచ్చినా జీపును ఆపరు. పులి కోసం మాటు వేసిన సమయంలో కూడా పర్యాటకులు జీపు దిగకూడదు. జీపు వేగం ఇరవై కిలోమీటర్లకు మించదు. జంతువులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికే ఈ నిబంధన. పర్యాటకులు డియోడరెంట్లు, ప్లాస్టిక్ కూడా వాడకూడదు. పులులు ఉదయం వేళల్లో పొదల్లో నుంచి ఆరుబయటకు వచ్చి నాలుగైదు గంటల సేపు విశ్రమిస్తాయి. కొంత సేపు విహరిస్తాయి కూడా. పులులు రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తాయి. కానీ, రాత్రి సఫారీలో వెళ్తే పులి రోడ్డు మీదకు వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. పొదల మాటున సంచరిస్తున్న పులిని చూడలేం. అందుకే మేము రెండుసార్లు కూడా పగటి పూట సఫారీనే ఎంచుకున్నాం. దట్టమైన అడవిలో రకరకాల జంతువులను చూడడం మనకు కొత్తగా ఉంటుంది. కానీ పర్యాటకులను చూడడం ఇక్కడి జంతువులకు బాగా అలవాటైపోయింది. పరిచయం లేని వాళ్లను చూసినట్లు ఒకసారి అలా చూసి తమ దారిన తాము వెళ్లిపోతుంటాయి. దట్టమైన అడవి. చిన్నప్పుడు విన్న కథల్లోని చీమలు దూరని చిట్టడవి, పాములు దూరని కారడవి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అడవిలో చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకున్న నల్లకొంగ, చిలుకలు, పాలపిట్టలు, గుడ్లగూబలు... ఇంకా పేర్లు తెలియని ఎన్నో పక్షులు. ఆ పక్షుల కువకువరవంలో తేడా వచ్చింది. జింకలు పెద్ద కళ్లను విప్పార్చుకుని బెదురు చూపులతో తమను దాచుకునే పొద కోసం చూస్తున్నాయి. నక్క దొంగచూపులు చూస్తోంది. ఈ అడవిలో గేదెను తలపించే ఆవులున్నాయి. నల్లగా పొట్టిగా ఉండడంతో గేదె అనుకుంటాం. కానీ అవి ఆవులే. అవి నిమిత్తమాత్రంగా చెవులు రిక్కించాయి. పక్షుల చూపులు, జంతువుల కదలికను బట్టి జీప్ డైరెక్షన్ మార్చుకున్నాడు డ్రైవర్. అంతలోనే గైడ్ పెదవుల మీద వేలిని ఉంచి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా సూచించాడు. అందరూ ఎదురు చూసిన అడవి పెద్ద ఠీవిగా నడుచుకుంటూ రానే వచ్చింది. రోడ్డు మీద అటూ ఇటూ తిరిగింది. చెట్ల పొదల్లో నడిచింది. గడ్డి మాటున దోబూచులాడి కొంతసేపటికి దూరంగా ఉన్న తటాకం వైపు వెళ్లి పోయింది. అప్పటి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి వదిలారు. ‘అమ్మో! పులిని చూడాలంటే చాలా ధైర్యం కావాలి’ అని నవ్వుకుంటూ మరోసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పులి పాదముద్రలు కాన్ హా నేషనల్ ఫారెస్ట్లో రకరకాల జింకలు కనిపిస్తాయి. నలభై వేల జింకలుంటాయని అంచనా. బారా సింఘా అనేది ఒక రకం జింక. మన దగ్గర మనుబోతు అంటారు. చిత్తడి నేలల్లో తిరిగే జింక ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. పులులైతే వందకు పైగా ఉన్నాయట. మన చేతి వేళ్ల మీద గీతల్లాగ పులుల పాదముద్రలు వేటికవే ప్రత్యేకం. పులి పాద ముద్రల ఆధారంగా వేసిన లెక్క అది. పాదముద్రల ఆధారంగా పులులను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు. పులి పిల్లల్లో ఆడపిల్లలు తల్లితోనే ఉంటాయి. మగ పిల్లలు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుని సొంత టెరిటరీని ఏర్పరుచుకుంటాయి. ఈ పర్యటనలో ఉత్కంఠ అంతా మన సఫారీ టైమ్లో పులి బయటకు వస్తుందా లేదా అనేదే. పర్యాటకులను నిరాశ పరచకుండా పులిని చూపించి పంపించాలనే చిత్తశుద్ధితో పని చేస్తారు గైడ్లు. ఒక్కోసారి ఎంతగా అన్వేషించినా పులి కనిపించకపోవచ్చు. మొత్తానికి ఈ పర్యటన ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లి తీరుతుంది. రడ్యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్ని టీవీలో చూశాం. కాన్ హా నేషనల్ పార్క్లో పర్యటన అంటే జంగిల్ బుక్లోని అడవిని లైవ్లో చూడడమే. శ్రవణుడి సరస్సు కాన్హా నేషనల్ పార్క్ టూర్లో ప్రధాన ఆకర్షణల్లో శ్రవణ్ తాల్ ఒకటి. శ్రవణుడు అనే మునికుమారుడు ఈ సరస్సులో నీళ్లు ముంచుతున్నప్పుడు ఆ శబ్దాన్ని ఏనుగుగా భావించి దశరథ మహారాజు బాణం వేసినట్లు రామాయణలో ఉంది. ఆ సరస్సును ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. ఎండాకాలంలో పులులు ఈ సరస్సులో సేదదీరుతాయి. వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్లు, ఆర్నిథాలజిస్టులతో ఫారెస్ట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వనసౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు, ఇక్కడి మనుషులను కలవడం కూడా సంతోషాన్నిచ్చింది. చాలా నిరాడంబరులు, స్నేహపూర్వకంగా ఉన్నారు. దారి కోసం గూగుల్ని నమ్ముకోవడం కంటే మనుషులను నమ్ముకోవడం బెస్ట్ అనిపించింది. ఫారెస్ట్ లోపల ఫోన్ సిగ్నల్స్ అందవు. మేము రూట్ను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ టూర్లో ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ప్రకృతితో సహవాసం చేయవచ్చు. – శశాంక్, హారిక కాన్ హా నేషనల్ పార్కు పర్యాటకులు అడవి మధ్య ప్రయాణం కాన్ హా నేషనల్ పార్కుకు వెళ్లడానికి హైదరాబాద్ నుంచి జబల్పూర్కి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. మేము హైదరాబాద్ నుంచి కారులో తెల్లవారు జామున నాలుగన్నరకు బయలుదేరాం. కాన్ హా నేషనల్ పార్కు చేరేటప్పటికి సాయంత్రం ఆరైంది. అడవి మధ్యలో ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ రాత్రికి టూరిజం ప్యాకేజ్ బసలో విడిది. తెల్లవారి ఉదయం ఆరున్నర గంటల సఫారీలో పులి కోసం అన్వేషణ మొదలు పెట్టాం. కాన్ హా నేషనల్ పార్కులోకి ప్రధానంగా ‘ఖటియా గేట్, ముఖీ గేట్, సర్హీ గేట్’ అని మూడు గేట్లున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి సఫారీలుంటాయి. హాలిడే సఫారీ తీసుకుంటే రోజు మొత్తం అడవిలో విహరించవచ్చు. -
ముగ్గురు మిత్రుల సాహసయాత్ర!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో చాలా టెక్ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. దింతో చాలా మంది ఉద్యోగులు తమ స్వంత గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగులు ఈ కరోనా భయం తగ్గే వరకు సెలవులు తీసుకున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మాత్రం చాలా కొత్తగా అలోచించి తమకు నచ్చిన సైక్లింగ్ యాత్ర చేస్తూ మధ్య మధ్య పని చేసుకున్నారు.(చదవండి: భూగర్భంలో గోల్కొండ షో!) ఈ మహమ్మారి కారణంగా దొరికిన సమయాన్ని వారు మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇటు ఆఫీస్ పని చేసుకుంటూనే వారు యాత్రను ఎంజాయ్ చేసారు. బక్కెన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్ అనే ముగ్గురు స్నేహితులు ఉద్యోగం చేస్తూనే సైకిల్పై ముంబయి నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు. ఎలాగూ ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు కాబట్టి.. పనిచేస్తూ ఎక్కడికైనా సైకిల్పై విహార యాత్రకు వెళ్తే బాగుంటుందని బక్కెన్ మొదట నిర్ణయించుకున్నాడు. గతంలో బక్కెన్కు సైకిల్యాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ సారి ఉద్యోగం చేస్తూనే కన్యాకుమారి వరకు వెళ్లాలని బక్కెన్ నవంబర్ లో నిర్ణయించుకున్నాడు. తరువాత అతను తన ఇద్దరు స్నేహితులను ఒప్పించాడు. హోటళ్లే ఆఫీసులు ఈ యాత్రలో భాగంగా వారికీ కావాల్సిన ల్యాప్టాప్, మొబైల్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వెంటపెట్టుకున్నారు. వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 11 గంటల వరకు సైకిల్ యాత్ర చేపట్టేవారు. తర్వాత మార్గం మధ్యలో కనిపించే దాబా లేదా హోటల్ వద్ద ఆగేవారు. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆఫీస్ విధుల కోసం ల్యాప్టాప్లో లాగిఇన్ అయి.. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకునేవారు. ఇలా వీరు 26 రోజుల్లో 1,687కి.మీ ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నారు.(చదవండి: ఇదే హవా ఉంటే మూడోసారి ప్రధాని పీఠంపై) వారాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారు అని జోసెఫ్ పేర్కొన్నాడు. వీరు మార్గం మధ్యలో కోవిడ్ ఆంక్షల కారణంగా బస చేయడానికి కొన్ని సమస్యలు ఏర్పడేవని పేర్కొన్నారు. ఈ ప్రయాణం కోసం ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం బస, భోజనానికి ఖర్చు అయ్యాయని తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో భాగంగా పని చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడం తమకు బాగా నచ్చిందని వారు తెలిపారు. -
నా కూతురు లోకం చూడాలి
నాలుగేళ్ల క్రితం కూతురు పుట్టింది ఆమెకు. ‘అమ్మో.. అమ్మాయి పుట్టింది... ఇప్పటి నుంచే పెళ్లికి ఏదైనా దాచి పెట్టు’ అనడం మొదలెట్టారు అత్తామామలు. తల్లి సిల్కీ పూరి తన కూతురికి డబ్బు బదులు ప్రపంచాన్ని ఇవ్వదలుచుకుంది. ‘నా కూతురు లోకం చూడాలి’ అని నాలుగేళ్లు వచ్చేలోపు ఆరుదేశాలు చూపించింది. ఇక దేశంలో ముఖ్య టూరిస్ట్ ప్లేసులు కూడా చూపెట్టింది. ‘నేను నా కూతురి కోసం రూపాయి దాచను. దాచాల్సిన డబ్బుతో సమానంగా లోకం చూపిస్తా. ఆడపిల్లకు లోకం తెలియాలి.’ అంటుంది సిల్కీ పూరి. భర్త గగన్ కూడా ఇదే అంటున్నాడు. సిల్కీ పూరి తన కుమార్తెతో తిరిగే ప్రదేశాల డైరీని ఇన్స్టాగ్రామ్లో ‘మమ్మీ ట్రావెల్ స్టోరీస్’ పేరుతో రాస్తోంది. పిల్లల పెంపకంలో ‘పర్యటన కూడా పాఠమే’ అని చెబుతున్న సిల్కీ పూరి ఆలోచనలు... ‘నా కూతురు ఏ ప్రాంతానికీ చెందదు. ఏ భాషకూ చెందదు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలూ తనవే. అన్ని భాషలూ తనవే’ అంటుంది సిల్కీ పూరి. 32 ఏళ్ల ఈ కార్పొరేటర్ ప్రొఫెషనల్ నాలుగేళ్ల క్రితం కూతురు పుడితే ‘ఖ్వాయిష్’ అని పేరు పెట్టుకుంది. ఖ్వాయిష్ అంటే ఇచ్ఛ అని అర్థం. లోకం చూడాలనే ఇచ్ఛ తన కూతురికి ఉండాలి అని సిల్కీపూరి అనుకుంది. అందుకే నాలుగేళ్లు వచ్చేసరికి ఆరు దేశాలు చూపించింది. ఇంకా చూపుతాను అంటోంది. ఆడపిల్లకు ఇచ్చే ధనం గుర్గావ్ (ఢిల్లీ)కి చెందిన సిల్కీ పూరికి కూతురు పుట్టాక అంతవరకూ ఆమెకు సలహాలు పెద్దగా ఇవ్వని అత్తా మామలు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘ఆడపిల్ల పుట్టింది. ముందు ముందు చాలా ఖర్చు ఉంటుంది. కొంత ఆ అమ్మాయి పేరున దాచి పెట్టు’ అనడం మొదలెట్టారు. ఇదే విషయాన్ని సిల్కీ తన భర్త గగన్కు చెప్పింది. ఇద్దరికీ ఈ ఆలోచన నచ్చలేదు. ‘ఇద్దరం అమ్మాయి పేరున రూపాయి కూడా దాచొద్దు అనుకున్నాం. దాచాలనుకున్న డబ్బుతో లోకాన్ని చూపిద్దాం అని నిశ్చయించుకున్నాం’ అంటుంది సిల్కీ పూరి. ఆమె తనకు కాన్పయిన రెండు నెలలకే భర్తను, కుమార్తెను తీసుకున్న మిగిలిన డెలివరీ లీవులోని రోజులను సద్వినియోగం చేయడానికి దుబాయ్ వెళ్లింది. ‘చంటి పిల్లలతో విదేశీ యాత్రలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని చంటి పిల్లలతో దుబాయ్ వంటి ప్రాంతాలు తిరగడం చాలా సులువు. అన్నీ చోట్లా బ్రెస్ట్ ఫీడింగ్ రూములు దొరుకుతాయి. పాప రెండు మూడు గంటల పాటు తిరిగినా కిక్కురు మనేది కాదు’ అంటుంది సిల్కీ. ఎన్నో ప్రశ్నలు తల్లులు అందరూ పిల్లలకు బర్త్డే ప్రెజెంటేషన్లు ఇస్తుంటారు. కాని సిల్కీ పూర్తి టూర్ టికెట్లను ప్రెజెంట్ చేస్తుంది. ‘మేము ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నాం. అద్దె ఇంట్లో ఉంటూ డబ్బు ఖర్చు చేస్తూ ఈ తిరుగుళ్లు ఎందుకు అంటారు ఎందరో. కొంతమంది ఇంత చిన్న వయసులో తిరిగితే పిల్లలకు ఏమీ గుర్తుండవు అని కూడా అంటారు. కాని నాకు తెలుసు. నా కూతురు మిగిలిన వారికి ఎంత భిన్నమో. ఈ కూతురు ఐఫిల్ టవర్ చూసింది పీసా టవర్ ఎదుట ఫొటో దిగింది. హిమాచల్ ప్రదేశ్లో గడ్డ కట్టే మంచులో ఉంది. కేరళ బ్యాక్ వాటర్స్ పడవ మీద తిరిగింది. ఇప్పటికే ఆరు దేశాల ప్రజలను చూసింది. వారి రకరకాల భాషలు వింది. లోకం చాలా ఉంటుంది అని తెలుసుకున్న నా కూతురు మిగిలిన పిల్లల కంటే భిన్నంగా నిలబడుతుంది. తన వొకాబులరీ అద్భుతంగా ఉండటం మేము గమనిస్తున్నాం. తనకు చాలా విషయాలు తెలుసని కూడా అనిపిస్తూ ఉంటుంది’ అంటుంది సిల్కీ. ‘ఇంతకు మించిన పిల్లలకు ఇవ్వదగ్గ పెంపక పాఠం ఏముంటుంది?’ అంటుంది సిల్కీ. భర్తతో కలిసి ‘నా భర్త నేను పర్యటనలంటే ఇష్టపడే బృందాలలోనే పరిచయమయ్యాం. అతనికి కూడా యాత్రలు ఇష్టం. పెళ్లయ్యాక కూడా తిరగాలి అనే పెళ్లి చేసుకున్నాం. సాధారణంగా భారతీయ స్త్రీలు పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఇక తమ కలలు ముగిసినట్టే అనుకుంటారు. నేను మాత్రం నా కలలను నా కుమార్తెతో పాటు కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. ఆడపిల్లకు లోకం తెలియాలి. నా కూతురు ఇలా విహారాల వల్ల అన్ని రకాల ప్రాంతాలకి, ఉష్ణోగ్రతలకి, వాతావరణాలకి తట్టుకుని నిలబడే శక్తి పొందింది. భిన్న ఆహారాలకు మెల్లగా అలవాటు పడటం నేర్చుకుంది. పెద్దయితే తను ఎలాగైనా ఎక్కడైనా బతకగలదు ఇలాంటి ఎక్స్పోజర్ వల్ల’ అంటుంది సిల్కీ. చిన్న పిల్లలతో పర్యటనలను చాలామంది తల్లులు వద్దనుకుంటారు కాని సిల్కీ కొన్ని బేసిక్ ఆహార పదార్థాలను తనతో పాటు తీసుకెళుతుంది. వంట గది ఇచ్చే గదులనే బుక్ చేసుకుంటుంది. కొద్దిపాటి ఆహారం వండుకుంటుంది. అంతే కాదు అన్ని చోట్ల దొరికే ఉడకబెట్టిన గుడ్ల వంటి పదార్థాలని కూతురికి అలవాటు చేసింది. కనుక పాప ఆకలి సమస్య పెద్దగా ఉండకుండా చూసుకుంటుంది. ‘లుఫ్తాన్సా, ఎమిరేట్స్ వంటి ఫ్లయిట్లు పిల్లలు లోపల ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ ఇస్తాయి. అలాంటి ఫ్లయిట్స్లో ప్రయాణం పెట్టుకుంటాను. పాప నిద్రను దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట ఫ్లయిట్లే తీసుకుంటాను. దిగే హోటల్కు దగ్గరగా పార్కులు ఉంటే పాపను తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. పిల్లలకు మనం చెప్పేది అర్థం కాదనుకుంటాం కాని వాళ్లు అర్థం చేసుకుంటారు. మనం ప్రయాణం చేస్తున్నాం అని చెప్తే సహకరిస్తారు’ అంటుంది సిల్కీ. పెద్దలు తాము ఎక్కడో ఆగిపోయి పిల్లలను ముందుకు పంపించాలని చూస్తారు. కాని సిల్కీ పూరి వంటి తల్లులు నిరంతరం తాము, తమ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చలనంలో ఉండాలని భావించడం ఒక వినూత్న విషయంగా అనిపిస్తుంది. ప్రయాణాలు చేసే శక్తి ఉన్నా దేశంలోని మూడు నాలుగు ప్రదేశాలు కూడా చూడని పిల్లలు ఉంటారు మన దగ్గర. వారి ఎక్స్పోజర్ను మనం నిరోధిస్తున్నట్టే. సిల్కీ చెబుతున్న కొత్త పెంపక పాఠం పెద్దలు కూడా వినొచ్చేమో చూడండి. – సాక్షి ఫ్యామిలీ -
లోకల్ రైళ్లల్లో పిల్లలకు నిషేధం
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లల్లో చిన్న పిల్లలతో కలసి ప్రయాణం చేయడంపై రైల్వే నిషేధం విధించింది. అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం ప్రారంభించిన లోకల్ రైళ్లలో, ప్రస్తుతం పలు విభాగాలకు చెందిన ప్రయాణికులందరినీ ప్రయాణం చేసేందుకు అనుమతించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో చిన్న పిల్లలతో లోకల్ ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను రైళ్లల్లో అనుమతించబోమని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు మాత్రమే లోకల్ రైళ్లల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఇకపై ముంబైలోని రైల్వే స్టేషన్లో గేట్ల వద్ద ఆర్పీఎఫ్ జవాన్లను మోహరించనుంది. -
నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి
-
మూడేళ్లలో పర్యాటక రంగానికి ప్రాణం
సాక్షి, న్యూఢిల్లీ : కోవడ్–19 కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ పర్యాటక పరిశ్రమ కోలుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి కనీసం మూడేళ్లు పడుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ ‘ఫ్లైట్ సెంటర్’ సీఈవో గ్రహం టర్నర్ తెలిపారు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం విమానాలు ఎక్కడానికి ముందు, ఆ తర్వాత 15 రోజుల చొప్పున క్వారంటైన్లో ఉండాలని, ఈ నిబంధనను సడలిస్తే అంతర్జాతీయ పర్యాటక రంగం వేగంగా పుంజుకోవచ్చని ఆయన చెప్పారు. క్వారంటైన్లో అన్ని రోజులు ఉండడమే కష్టమైతే, విమానం ఎక్కడానికి ముందు, దిగిన తర్వాత 15 రోజుల చొప్పున 30 రోజుల పాటు క్వారంటైన్లో ఉండేందుకు ఎవరు ఇష్ట పడరని ఆయన అన్నారు. ప్రపంచ పర్యాటక పరిశ్రమ 70 శాతం కోలుకోవడానికి 18 నెలల నుంచి రెండేళ్లు పడుతుందని, అదే పూర్తిగా కోలుకోవడానికి మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వస్తోందని టర్నర్ అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ కారణంగా ‘ఫ్లైట్ సెంటర్’ ప్రపంచవ్యాప్తంగా 16 వేల మంది సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. వర్జిన్ అండ్ క్వాంటాస్ అనే ట్రావెల్ ఏజెన్సీ కూడా వేలల్లో వైమానిక సిబ్బందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సిబ్బంది ఉపాది కోల్పోకుండా ఉండాలంటే పర్యాటకులు, టూరిజం ఆపరేటర్లు చొరవ తీసుకోవాలని టర్నర్ పిలుపునిచ్చారు.