womens T20 world cup
-
ఫైనల్ బెర్త్ కోసం...
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తూ అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ టైటిల్ నిలబెట్టుకునే అర్హత కోసం సెమీఫైనల్స్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఒక ఎత్తయితే... ఈ రోజు ఆడే మ్యాచ్ ఒక ఎత్తు! ఎందుకంటే ఇన్నాళ్లు లీగ్ దశలో, సూపర్ సిక్స్లో తన గ్రూపులోని ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత్ ఇప్పుడు అసలైన సెమీఫైనల్ సవాల్కు రె‘ఢీ’ అయ్యింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ ఆడుతుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ టీనేజ్ సంచలనం గొంగడి త్రిష ఫామ్ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. బౌలింగ్లో వైజాగ్ సీమర్ షబ్నమ్ సహా ఆయుష్ , మిథిల, వైష్ణవి నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడుతున్న ప్పటికీ భారత్ను నిలువరిస్తుందో లేదో చూడాలి. చదవండి :తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు -
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్లో (పాక్పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్కు ఈ మ్యాచ్కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్వాష్లు, ఆటగాళ్ల ఫిట్నెస్లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!
మహిళల టీ20 వరల్డ్కప్-2024 తొలి మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్కప్లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల అనంతరం వరల్డ్కప్లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్కప్లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు.An emotional win 💯Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చదవండి: బోణీ బాగుండాలి -
ఫాతిమా ఆల్రౌండ్ షో
షార్జా: కెప్టెన్ ఫాతిమా సనా ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మహిళల టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.ఫాతిమా (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... నిదా దర్ (23; 1 సిక్స్), ఉమైమా సోహైల్ (18; 1 ఫోర్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, ప్రబోధిని, సుగంధిక తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి ఓడిపోయింది.విష్మి గుణరత్నె (20), నీలాక్షిక సిల్వా (22) రెండంకెల స్కోరు చేయగా... కెపె్టన్ చమరి ఆటపట్టు (6) విఫలమైంది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3... ఫాతిమా, ఉమైమా, నష్ర తలా రెండు వికెట్లు తీశారు. ఫాతిమా సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
టీ20 వరల్డ్కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్వైట్లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
మహిళల టీ20 వరల్డ్కప్-2024 సన్నాహాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్ల్లో భారత జట్టు అదరగొట్టింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్ధులను భారత్ చిత్తు చేసింది. మంగళవారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్తో తలపడనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
మంచి తరుణం
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా. సమతూకంగా జట్టు... అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్లలో ఆడిన అపార అనుభవం ఉంది.ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా... ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం. జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్లలోనూ హర్మన్ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా. -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్లో రన్నరప్గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్లలో ఫైనల్కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్కప్లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్తో కలిసి హర్మన్ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్కప్లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్డౌన్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
ఈసారి టీ20 వరల్డ్కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్తో తొలి మ్యాచ్కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్లోనూ ఇంగ్లండ్తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న న్యూజిలాండ్తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడనున్న టీమిండియా... ఆసీస్తో జరిగే ఆఖరి మ్యాచ్ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్ -
టీ20 వరల్డ్కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్గా ఇది తొలి వరల్డ్కప్. గత టీ20 ప్రపంచకప్లో సూన్ లస్ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరింది. అనంతరం సూన్ లస్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్ లస్, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్సెన్ వంటి యువ ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వరల్డ్కప్ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్కప్ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్కప్కు ముందు పాకిస్తాన్తో జరిగే మూడో మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొంటుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16-20 వరకు జరుగనుంది.వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరుగనుంది. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్ లస్, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్కప్లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరుగనుంది. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్కప్ కోసం విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
మహిళల టీ20 వరల్డ్కప్ కోసం వెస్టిండీస్ జట్టును నిన్న (ఆగస్ట్ 29) ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్కు చోటు కల్పించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తిరిగి జట్టులో చేరింది. మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు డొట్టిన్ పేరిట ఉంది. విండీస్ జట్టుకు హేలీ మాథ్యూస్ సారథ్యం వహించనుంది. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన జట్టులో నాలుగు మార్పులు చేశారు విండీస్ సెలెక్టర్లు. డొట్టిన్తో పాటు అష్మిని మునిసర్, మ్యాండీ మంగ్రూ, అన్క్యాప్డ్ ప్లేయర్ నెరిస్సా క్రాఫ్టన్లను కొత్తగా జట్టులోకి వచ్చారు. శ్రీలంక టూర్లో ఆడిన చెర్రీ ఫ్రేసర్, రషాదా విలియమ్స్, షబిక గజ్నబీ, కేట్ విల్మాట్ స్థానాల్లో వీరికి అవకాశం లభించింది.కాగా, 2016 ఎడిషన్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్.. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. విండీస్.. అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్తో తమ వరల్డ్కప్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది.వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్బెల్, ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్, చెడీన్ నేషన్, చినెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కరిష్మా రామ్హారక్, మ్యాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్, క్వియానా జోసఫ్, షమీలియా కానెల్, స్టెఫానీ టేలర్, జైదా జేమ్స్ -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్లు ఆడిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్తో హర్మన్ బృందం తొలి మ్యాచ్లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు ఆల్రౌండర్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్లో భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయంతో రన్నరప్తో సరిపెట్టుకున్న భారత జట్టు నుంచి ఉమా ఛెత్రీ తప్ప మిగిలిన ప్లేయర్లందరూ టి20 ప్రపంచకప్నకు ఎంపికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆసియా కప్ సందర్భంగా వేలికి గాయమైన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్తో పాటు మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ యస్తిక భాటియాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరిద్దరూ ఫిట్నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్లనున్నారు. టాపార్డర్లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానుండగా... హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. దీప్తి శర్మ, ఆశ శోభన, రాధ యాదవ్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండగా... రేణుక సింగ్, అరుంధతి రెడ్డి పేస్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా పూజ వస్త్రకర్ జట్టులో చోటు దక్కించుకుంది. ‘ఇది సమతూకమైన జట్టు. యస్తిక, శ్రేయాంక గాయాల నుంచి కోలుకొని టోర్నీ ఆరంభానికి సిద్ధమవుతారు’ అని భారత మాజీ కెపె్టన్ డయానా ఎడుల్జీ పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసీస్ అడ్డంకిని అధిగమిస్తేనే! ఐసీసీ టోరీ్నల్లో టైటిల్ నెగ్గలేకపోతున్న భారత జట్టు ఈసారైనా అడ్డంకులు అధిగమించి ముందడుగు వేయాలని భావిస్తోంది. 2020 టోర్నీ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్...తుది పోరులో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తే... అందులో ఆరుసార్లు ఆస్ట్రేలియానే జట్టు విజేతగా నిలిచిందంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి హర్మన్ బృందం చాంపియన్గా నిలవాలంటే ముందుగా లీగ్ దశలో ఆసీస్ను ఓడించాలి. తుది పోరులోనూ ఆ జట్టుపై పైచేయి సాధించాలి. భారత టి 20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక , పూజ , అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన. ట్రావెలింగ్ రిజర్వ్లు: ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్, సైమా ఠాకూర్. -
వేదిక మార్పు మా ఆటపై ప్రభావం చూపదు: దీప్తి
ముంబై: మహిళల టి20 ప్రపంచకప్ వేదిక మార్పు తమ సన్నాహాలపై ప్రభావం చూపదని భారత జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చింది.ఈ నేపథ్యంలో దీప్తి మాట్లాడుతూ.. ‘టోర్నీ ఎక్కడ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. వేదిక మార్పు వల్ల సన్నద్ధతపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో అటు బంతితో ఇటు బ్యాట్తో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నా. యూఏఈలోని పిచ్లు ఎలా స్పందిస్తాయనే దానిపై కొంచెం అవగాహన ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండాఆటను ఆస్వాదిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది. ఇక ఇటీవల లండన్లో జరిగిన హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తి... సీజన్ ఆసాంతం రాణించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులోనూ సత్తా చాటిన దీప్తి భారీ సిక్సర్తో లండన్ స్పిరిట్ జట్టుకు తొలి హండ్రెడ్ టైటిల్ను కట్టబెట్టింది. -
యూఏఈలో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్లో అక్కడ జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో హింస చెలరేగగా... ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్ జరగనుంది. ‘మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చి0ది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టి20 వరల్డ్కప్ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్కప్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డైస్ తెలిపారు. -
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్కప్..!?
బంగ్లాదేశ్లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్కప్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్లో భారత్లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్ను బీసీసీఐ తిరస్కరించింది.అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. -
BCCI: ప్రపంచకప్ నిర్వహణకు ‘నో’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ తిరస్కరించింది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, హింసాయుత వాతావరణం వల్ల వేదిక మార్పు అనివార్యమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇచి్చన ఆఫర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నో చెప్పింది. వచ్చే ఏడాది భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. దీంతో పాటు ఈ అక్టోబర్ నెల వరకు వర్షాకాలం తీవ్ర స్థాయిలో ఉంటుంది. వరుస వరల్డ్కప్లతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ‘మహిళల మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వాల్సిందిగా ఐసీసీ మమ్మల్ని కోరింది. అయితే ఇది సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పాం’ అని జై షా చెప్పారు. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సిన మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టిసారించింది. శ్రీలంక లేదంటే యూఏఈలలో ఒక వేదికను ఈ నెల 20వ తేదీకల్లా ఖరారు చేసే అవకాశముంది. బంగ్లాలో కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ అమ్మాయిల ప్రపంచకప్ను సురక్షితంగా నిర్వహించడం ఐసీసీకి క్లిష్టతరం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎప్పటికప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి తాజా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తోంది. బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు త్వరలో భారత్లో పర్యటించాల్సి ఉంది. బంగ్లా ప్రస్తుతం పాకిస్తాన్ టూర్లో ఉంది. అక్కడ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఈ నెల 21న మొదలవుతుంది. అనంతరం వచ్చే నెల భారత పర్యటనలో రెండు టెస్టులతో పాటు మూడు మ్యాచ్ల టి20ల సిరీస్లో బంగ్లాదేశ్ పాల్గొంటుంది. -
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి
వెస్టిండీస్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విండీస్ మహిళ క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది. కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.అయితే ఈ ఏడాది ఆక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్కప్ దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి. -
టీ20 ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన శ్రీలంక బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్
Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్లో విండీస్కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్లకు చేరుకున్నారు. ఆల్రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా (ఫొటోలు)
-
ఆసీస్ అమ్మాయిల ‘సిక్సర్’
ఎదురే లేని ప్రదర్శనతో, ఓటమెరుగని జైత్రయాత్రతో కంగారూ సేన ఆరో సారి విశ్వ విజేతగా నిలిచింది. అన్ని రంగాల్లో రాణించిన ఆ్రస్టేలియా అమ్మాయిలు ఈ టి20 ప్రపంచకప్ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ ‘తొలిసారి’ ఫైనల్ చేరిన మురిపెం రన్నరప్గానే ముగిసింది. సొంతగడ్డపై తమ మద్దతుదారుల మధ్య బౌలింగ్లో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా... బ్యాటింగ్ వైఫల్యంతో ప్రపంచకప్ కలను సాకారం చేసుకోలేకపోయింది. కేప్టౌన్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మరో ‘హ్యాట్రిక్’తో టి20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్... 2016 మెగా ఈవెంట్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020, 2023లలో ప్రపంచకప్ల హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మెగ్ లానింగ్ సేన 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు అర్ధ సెంచరీ సాధించగా, ఆష్లే గార్డ్నర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడింది. సఫారీ బౌలర్లలో షబ్నెమ్ ఇస్మాయిల్ (2/26), మరిజన్ కాప్ (2/35) కంగా రు పెట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం వృథా అయ్యింది. టోర్నీలో 110 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసిన ఆసీస్ ఆల్రౌండర్ గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. బెత్ మూనీ సూపర్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో గొప్ప మెరుపులేమీ లేవు. కానీ ఒక్క బ్యాటర్ మూనీ ఆ్రస్టేలియాను 20 ఓవర్ల పాటు నడిపించింది. ఓపెనర్గా క్రీజులోకి వచ్ఛిన ఆమె కడదాకా క్రీజులో నిలిచింది. పిచ్ నెమ్మదించిన సమయంలో... ప్రత్యర్థి సీమర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న తరుణంలో వికెట్ను కాపాడుకొని... కష్టమైనా సరే పరుగుల్ని సాధించిపెట్టింది. మరో ఓపెనర్ అలీసా హీలీ (20 బంతుల్లో 18; 3 ఫోర్లు) పవర్ ప్లే వరకైనా నిలువలేదు. అయితే టాపార్డర్లో ఆష్లే గార్డ్నర్తో మూనీ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్కు కీలకంగా మారింది. ఇద్దరు రెండో వికెట్కు 46 పరుగులే జత చేసినప్పటికీ... తర్వాత పిచ్ పరిస్థితుల దృష్ట్యా అదే మెరుగైన భాగస్వామ్యం అని చెప్పొచ్చు. తర్వాత గ్రేస్ హారిస్ (10), కెపె్టన్ మెగ్ లానింగ్ (10), ఎలైస్ పెరీ (7), వేర్హమ్ (0) సులువుగానే దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పడిపోయారు. షబ్నెమ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని మూని 6, 4గా బాదింది. అయితే మూడో బంతికి ఒక్క పరుగు మాత్రమే రాగా... వరుస బంతుల్లో షబ్నెమ్ రెండు వికెట్లతో ఆసీస్ను కట్టడి చేసింది. రాణించిన వోల్వార్ట్ సొంతగడ్డపై కాస్త కష్టపడితే ఛేదించే లక్ష్యమే ఎదురుగా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ఆ పని చేయలేకపోయింది. ఆసీస్ చేసింది పెద్ద స్కోరేం కాకపోవడంతో బౌలర్లు తొలి ఓవర్నుంచే పట్టుబిగించారు. దీంతో తొలి 5 ఓవర్లలో సఫారీ వికెట్ నష్టానికి 17 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్వర్ట్ ధాటిగా ఆడటంతో కుదుట పడుతున్న దక్షిణాఫ్రికాకు మరో బ్యాటర్ సహకారం లేకపోవడంతో ప్రపంచకప్నే మూల్యంగా చెల్లించుకుంది. టాపార్డర్లో బ్రిట్స్ (10), మరిజన్ కప్ (11) సహా, మిడిలార్డర్లో కెప్టెన్ సునే లూస్ (2), నదిన్ డి క్లెర్క్ (8), అనెకె బాస్చ్ (1) ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోయారు. క్లొయె ట్రియాన్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్)లాంటి బ్యాటర్ ఇంకొక్కరు జతయినా సఫారీ కొత్త చరిత్ర సృష్టించేది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) డిక్లెర్క్ (బి) మరిజన్ 18; బెత్ మూనీ నాటౌట్ 74; ఆష్లే గార్డ్నర్ (సి) లూస్ (బి) ట్రియాన్ 29; గ్రేస్ (బి) ఎమ్లబా 10; మెగ్ లానింగ్ (సి) ట్రియాన్ (బి) మరిజన్ 10; ఎలైస్ పెరీ (సి) బ్రిట్స్ (బి) షబ్నెమ్ 7; జార్జియా (బి) షబ్నెమ్ 0; తాహ్లియా నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–36, 2–82, 3–103, 4–122, 5–155, 6–155. బౌలింగ్: ఎమ్లబా 3–0–24–1, షబ్నెమ్ 4–1–26–2, మరిజన్ కాప్ 4–0–35–2, అయబొంగ ఖాకా 4–0–27–0, నదిన్ డిక్లెర్క్ 3–0–27–0, క్లోయె ట్రియాన్ 2–0–15–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లారా వోల్వార్ట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షట్ 61; బ్రిట్స్ (సి) మెక్గ్రాత్ (బి) బ్రౌన్ 10; మరిజన్ (సి) బ్రౌన్ (బి) గార్డ్నర్ 11; లూస్ రనౌట్ 2; ట్రియాన్ (బి) జొనసెన్ 25; డి క్లెర్క్ నాటౌట్ 8; బాష్ రనౌట్ 1; జాఫ్త నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–17, 2–46, 3–54, 4–109, 5–121, 6–122. బౌలింగ్: మేగన్ షట్ 4–0–23–1, ఆష్లే గార్డ్నెర్ 4–0–20–1, డార్సి బ్రౌన్ 4–0–25–1, పెరీ 1–0–5–0, జెస్ జొనసెన్ 3–0–21–1, జార్జియా 2–0–21–0, తాహ్లియా మెక్గ్రాత్ 2–0–17–0. -
దక్షిణాఫ్రికాతో తుది పోరు.. తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆసీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2023 ఫైనల్కు రంగం సిద్దమైంది. తొలి సారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికా.. పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, సునే లూస్(కెప్టెన్), అన్నెకే బోష్, సినాలో జాఫ్తా(వికెట్కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, ఆయబొంగ ఖాకా, మ్లాబా ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్గ్రాత్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాసెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ చదవండి: IND vs AUS: 'ఆసీస్ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
T20 WC 2023: సఫారీల కల నెరవేరేనా?
దక్షిణాఫ్రికా దేశం మొత్తం ఆదివారం మునివేళ్లపైకి రానుంది. పునరాగమనం తర్వాత అటు పురుషుల క్రికెట్లో గానీ, ఇటు మహిళల క్రికెట్లో గానీ ఏ ఫార్మాట్లోనైనా సాధ్యంకాని రీతిలో ఈసారి టీమ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. స్వదేశంలో సత్తా చాటి తుది పోరుకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావిస్తోంది. అయితే అటువైపు ఉన్నది సాధారణ జట్టు కాదు. ఐదుసార్లు చాంపియన్ కావడంతో పాటు ప్రొఫెషనలిజంతో ప్రత్యర్థులకు పాఠాలు చెప్పగల ఆ్రస్టేలియా. ఇలాంటి నేపథ్యంలో తమ అభిమానుల ముందు సఫారీ మహిళల కల నెరవేరగలదా? కేప్టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే ఈ పోరులో తొలిసారి ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికా తలపడనుంది. టోర్నీ లో ప్రదర్శన, గత రికార్డు చూస్తే ఆసీస్దే పైచేయిగా కనిపిస్తున్నా... సెమీస్లో ఇంగ్లండ్పై చూపిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే సఫారీ టీమ్లో కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా ఉంది. ఈ స్థితిలో పోరు ఏకపక్షమా, హోరాహోరీగా సాగుతుందా చూడాలి. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తుది పోరుకు చేరడంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. సమష్టితత్వంతో... టోర్నీ లో ఆసీస్ ఆటతీరు చూస్తే ఆ జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడలేదు. ప్రతీ ఒక్కరు పరిస్థితులకు తగినట్లుగా ఆడారు. బ్యాటింగ్లో అలీసా హీలీ, బెత్ మూనీ చెరో రెండు అర్ధ సెంచరీలతో ముందు వరుసలో ఉండగా... తాలియా మెక్గ్రాత్, కెప్టెన్ మెగ్ లానింగ్ కీలక సమయాల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లతో జట్టును నిలబెట్టారు. బౌలింగ్లో మెగాన్ షుట్ (9 వికెట్లు), డార్సీ బ్రౌన్, వేర్హమ్ (చెరో 6 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇద్దరు ఆల్రౌండర్లు గార్డ్నర్, ఎలీస్ పెర్రీ ఆసీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. వారిద్దరే కీలకం... టోర్నీ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. అమ్మాయిలంతా తీవ్ర విషాదంలో మునిగిపోగా, సొంత అభిమాలు కూడా ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఆ తర్వాత జట్టు ఆట ఒక్కసారిగా మెరుగైంది. ముఖ్యంగా తజ్మీన్ బ్రిట్స్ (176 పరుగులు), లౌరా వాల్వార్ట్ (169) బ్యాటింగ్ భారాన్ని మోశారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టు బలహీనతను చూపిస్తోంది. దీనిని ఫైనల్లో ఎలా అధిగమిస్తారనేది చూడాలి. బౌలింగ్లో ఖాకా, మరిజాన్ కాప్, షబ్నెమ్ ప్రదర్శన కూడా దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 6 ఇరు జట్ల మధ్య 6 టి20లు మ్యాచ్లు జరగ్గా, అన్నీ ఆ్రస్టేలియానే గెలిచింది. 19 గత 20 అంతర్జాతీయ టి20ల్లో ఆ్రస్టేలియా 19 గెలిచింది. -
మహిళల వరల్డ్కప్: ఇంగ్లండ్కు షాక్.. ఫైనల్లో దక్షిణాఫ్రికా
కేప్టౌన్: మహిళల టీ20 వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా ఫైనల్లో ప్రవేశించింది. పటిష్టమైన ఇంగ్లండ్పై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబర్చిన దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది. తన 164 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగునున్న మెగా ఫైట్లో అమీతుమీ తేల్చుకోనుంది సౌతాఫ్రికా. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్కు మంచి ఆరంభమే లభించింది. ఐదు ఓవర్లు ముగిసేసరికే 53 పరుగులు చేసి శుభారంభం దక్కించుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు డానియెల్లీ వ్యాట్(34), సోఫియా(28)లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. కాగా, ఆరు ఓవర్ తొలి బంతికి సోఫియా ఔటైన తర్వాత ఆపై బంతి వ్యవధిలో అలైస్ క్యాప్సే(0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దాంతో ఇంగ్లండ్ 53 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అటు తర్వాత నాట్ స్కీవర్ బ్రంట్(40) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. 34 బంతుల్లో ఐదు ఫోర్లు సాయంతో 40 పరుగులు చేసింది.కెప్టెన్ హీథర్ నైట్(31) ఫర్వాలేదనిపించింది. కాగా, అటు తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లండ్ 6 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసి పరాజయం చవిచూసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయాబోంగా ఖోకా నాలుగు వికెట్లతో రాణించగా, షబ్నిమ్ ఇస్మాలి మూడు వికెట్లతో ఆకట్టుకుంది. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 165 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఓపెనర్లు వాల్వార్ద్త్(53),టాజ్మిన్ బిట్స్(68)లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో పాటు మారిజిమ్మే క్యాప్(27) అజేయంగా నిలవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. -
'మ్యాచ్కు అదే టర్నింగ్ పాయింట్.. లేదంటే విజయం మాదే'
ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకోవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరైపోయాయి. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటిముఖం పట్టింది. అయితే కీలక సమయంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ రనౌట్గా వెనుదిరగడంతో ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ స్పందించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హర్మన్ మాట్లాడుతూ.. "నా బ్యాట్ అలా ఇరుక్కుపోయి ఉండకపోయింటే.. ఆ పరుగు ఈజీగా వచ్చేంది. ఆఖరి వరకు క్రీజులో నేను ఉండి ఉంటే, మా జోరు మ్యాచ్ను ఒక ఓవర్ ముందే ఫినిష్ చేసేవాళ్లం. అయినప్పటకి నా తర్వాత దీప్తి శర్మ, రిచా ఘోష్ ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉండేది. రిచా గత కొన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ నేను ఔటైన తర్వాత ఏడెనిమిది డాట్ బాల్స్ వచ్చాయి. అదే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఇక నేను జెమిమా క్రీజులో ఉన్నప్పుడు సులువైన బంతులను బౌండరీలుగా మలచాలని అనుకున్నాం. మాకు మొదటి నుంచి ఓవర్కు 8 పరుగులు అవసరం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము బ్యాటింగ్ చేశాం.జెమిమా అద్భుతంగా ఆడింది. నాన్-స్ట్రైకర్గా ఉన్న భాగస్వామి నుంచి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇక రనౌట్ కూడా ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఆస్ట్రేలియాను 170కి పరిమితం చేస్తే చాలు అని మేము ముందే అనుకున్నాం. ఆ స్కోర్ను మేము చేధిస్తామని మాకు నమ్మకం ఉండేది. కానీ నా రనౌట్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది" అని ఆమె పేర్కొంది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' -
'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'
మహిళల టీ20 ప్రపంచకప్-2023 టీమిండియా కథ ముగిసింది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం భారత్ పక్షానే నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ ఈ మ్యాచ్లో తీవ్రంగా శ్రమించింది. అయితే కీలక సమయంలో హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్గా వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. ఇక ఈ మ్యచ్ అనంతరం హర్మన్ప్రీత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యంది. మైదానంలోనే హర్మన్ కన్నీరు పెట్టుకుంది. భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఇక మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్గ్లాసెస్ పెట్టుకుని హర్మన్ కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రెజెంటేటర్ అద్దాలు ఎందుకు ధరించారని హర్మన్ను ప్రశ్నించాడు. అందుకు బదులుగా.. "నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము కచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను" అని హర్మన్ప్రీత్ సమాధానమిచ్చింది. చదవండి: ENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా! -
అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్! దురదృష్టం అంటే టీమిండియాదే?
మహిళల టీ20 ప్రపంచకప్-2023 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు భారత్ అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (2) శుభారంభం అందించలేకపోయారు. అనంతరం యస్తిక భాటియా (4) రనౌట్ అయ్యింది. దీంతో కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్ను చేరింది. అనంతరం హర్మన్ తన దూకుడును ఏ మాత్రం తగ్గంచకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓ దశలో భారత్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అటువంటి సమయంలో దురదృష్టం టీమిండియాను వెంటాడింది. 15వ ఓవర్లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఆపింది. అనంతరం కీపర్ హీలీకి త్రో చేసింది. ఇదే సమయంలో హర్మన్, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. దీంతో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్గా వెనుదిరిగింది. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇక జ్వరంతోనే బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ హర్మన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. హర్మన్ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా హర్మన్ రనౌట్ను 2019 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్తో పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్లోనూ భారత్ ఈ విధంగానే సెమీస్లో ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ధోని కూడా హర్మన్లాగే దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీను పెవిలియన్కు పంపాడు. దీంతో మ్యాచ్ కివీస్వైపు మలుపు తిరిగింది. ఆ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ధోని,హర్మన్ జర్సీ నెం ఏడు కావడం గమానార్హం. చదవండి: T20 WC 2022: టీమిండియా కొంపముంచిన రనౌట్.. పాపం హర్మన్! వీడియో వైరల్ Ms Dhoni and harmanpreet Kaur!🥺#indiavsaustralia #indvsaus #indvaus #t20worldcup #worldcup #T20WomensWorldCup #T20WorldCup2023 pic.twitter.com/EErB3dZbwo — RVCJ Sports (@RVCJ_Sports) February 23, 2023 Heartbreak💔💔💔 pic.twitter.com/W5uBYHci3q — Abhishek Sandikar (@Elonmast23) February 23, 2023 -
టీమిండియా కొంపముంచిన రనౌట్.. పాపం హర్మన్! వీడియో వైరల్
తొలి ఐసీసీ టైటిల్ సాధించాలని పట్టుదలతో ప్రోటీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ పరాజాయం పాలైంది. కేప్టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మన అమ్మాయిలు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్య చేధనలో భారత్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగస్ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్ను చేరింది. ఈ క్రమంలో జట్టును గెలిపించే పూర్తి బాధ్యతను కెప్టెన్ హర్మన్ తన భుజాలపై వేసుకుంది. కొంపముంచిన రనౌట్.. అయితే వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ హర్మన్ ఆసీస్ బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ సమయంలో భారత విజయం ఖాయమని అంతా భావించారు. ఇక్కడే భారత్ను దురదృష్టం వెంటాడింది. ఆనూహ్య రీతిలో హర్మన్ (34 బంతుల్లో 52) రనౌట్గా వెనుదిరిగింది. భారత ఇన్నింగ్స్ 15 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ భారీ షాట్ ఆడింది. అయితే బంతిని ఆసీస్ ఫీల్డర్ గార్డనర్ అద్భుతంగా బౌండరీ లైన్ దగ్గర అడ్డుకుంది. ఈ క్రమంలో కౌర్, రిచా తొలి పరుగు పూర్తి చేసుకుని రెండో రన్కు ప్రయత్నించారు. అయితే రెండో రన్కు వెళ్లేటప్పుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న హర్మన్ వేగంగా పరిగెత్తలేకపోయింది. క్రీజ్కు కొద్ది దూరంలో బ్యాట్ మైదానంలో దిగబడినట్లు అయిపోవడంతో.. వెంటనే వికెట్ కీపర్ హీలీ స్టంప్స్ను గిరాటేసింది. దీంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగిపోయింది. ఇక జ్వరంతో బాధపడుతూనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్! Tough luck Team India. #HarmanpreetKaur & #JemimahRodrigues looked like taking the game away but the Aussies fought back brilliantly & in the end India have fallen short. Harmanpreet’s runout was the turning point & India will be disappointed to miss out on the finals. #INDWvAUSW pic.twitter.com/RY06QHDrE0 — VVS Laxman (@VVSLaxman281) February 23, 2023 Heartbreak💔💔💔 pic.twitter.com/W5uBYHci3q — Abhishek Sandikar (@Elonmast23) February 23, 2023 చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్! -
హర్మన్, జెమీమా పోరాటం వృథా.. సెమీస్లో టీమిండియా ఓటమి
2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్... 2018 టి20 వరల్డ్కప్ సెమీఫైనల్... 2020 టి20 వరల్డ్కప్ ఫైనల్... 2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్... గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు వేదన మిగుల్చుతున్న నాకౌట్ మ్యాచ్ల పరాజయాల జాబితాలో మరొకటి చేరింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో పోరులో చివరి వరకు పోరాడినా మన జట్టుకు ఓటమి తప్పలేదు. తాజా టి20 వరల్డ్కప్లో మన జట్టు ప్రస్థానం సెమీస్కే పరిమితమైంది. రెండు మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు గెలుపు ఆశలు రేపినా... గెలుపు గీత దాటలేక జట్టు నిరాశగా నిష్క్రమించింది. కేప్టౌన్: మహిళల టి20 ప్రపంచకప్లో భారత జట్టు ఆట ముగిసింది. గత టోర్నీ రన్నరప్ అయిన భారత్ ఈసారి సెమీఫైనల్లో ఆసీస్కే తలవంచింది. గురువారం ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా 5 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), మెగ్ లానింగ్ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లీ గార్డ్నర్ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆసీస్ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్కు ఇది ఏడో ఫైనల్ కాగా, నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు తలపడుతుంది. లానింగ్ జోరు... ఆ్రస్టేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ (26 బంతుల్లో 25; 3 ఫోర్లు), మూనీ శుభారంభం అందించారు. రేణుక వేసిన తొలి బంతినే హీలీ ఫోర్గా మలచడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి వికెట్కు 52 పరుగులు (45 బంతుల్లో) జోడించిన అనంతరం రాధా యాదవ్ బౌలింగ్లో హీలీ స్టంపౌట్ అయింది. అనంతరం మూనీ, లానింగ్ కలిసి జట్టును నడిపించారు. భారత ఫీల్డర్లు వదిలేసిన రెండు క్యాచ్లు కూడా వీరికి కలిసొచ్చాయి. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆసీస్ 69 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆ్రస్టేలియా జోరు పెంచింది. శిఖా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మూనీ అదే ఓవర్లో వెనుదిరిగినా... స్నేహ్ రాణా ఓవర్లో లానింగ్, రాధ ఓవర్లో గార్డ్నర్ రెండేసి ఫోర్లు కొట్టారు. చివర్లో ఐదు బంతుల వ్యవధిలో భారత్ 2 కీలక వికెట్లు తీసినా... రేణుక వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్లు, 1 ఫోర్తో 20 పరుగులు రాబట్టి లానింగ్ ఘనంగా ముగించింది. చివరి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 103 పరుగులు సాధించగా... ఇందులో ఆఖరి 5 ఓవర్లలో వచి్చన 59 పరుగులు ఉన్నాయి. కీలక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. 4 ఓవర్లు ముగిసేలోపే 28 పరుగులకు టాప్–3 బ్యాటర్లు షఫాలీ (9), స్మృతి మంధాన (2), యస్తిక భాటియా (4) పెవిలియన్ చేరారు. ఈ దశలో జెమీమా, హర్మన్ భాగస్వామ్యం గెలుపుపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి ధాటిగా ఆడారు. వీరి దూకుడుకు ఆసీస్ బౌలర్లు కొద్దిసేపు అచేతనంగా మారిపోయారు. అయితే ఇదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించి జెమీమా వెనుదిరిగింది. నాలుగో వికెట్కు వీరిద్దరు 41 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. మరోవైపు హర్మన్ మాత్రం తగ్గకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయింది. 36, 37 పరుగుల వద్ద కీపర్ హీలీ తన క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన హర్మన్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే కీలక దశలో హర్మన్ రనౌట్ కావడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. చివర్లో రిచా (14), దీప్తి శర్మ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడినా విజయానికి అది సరిపోలేదు. హర్మన్ రనౌట్తో... మ్యాచ్కు కొద్దిసేపు క్రితం వరకు కూడా జ్వరం కారణంగా ఆడలేని స్థితిలో ఉన్న కెప్టెన్ హర్మన్ పట్టుదలగా బరిలోకి దిగింది. మెరుపు బ్యాటింగ్తో విజయానికి చేరువగా తెచ్చిం ది. విజయం కోసం 33 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రెండో పరుగుకు ప్రయత్నిస్తూ క్రీజ్లో చేరే సమయంలో బ్యాట్ పిచ్లో ఇరుక్కుపోవడంతో హర్మన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగింది. దాంతో ఆట ఆసీస్ వైపు మొగ్గింది. ఆ క్యాచ్లు పట్టి ఉంటే... ఫీల్డింగ్లో వదిలేసిన రెండు క్యాచ్లు భారత్ను నష్టపరిచాయి. లానింగ్ 1 వద్ద ఇచ్చిన క్యాచ్ను కీపర్ రిచా, 32 వద్ద మూనీ క్యాచ్ను షఫాలీ వర్మ వదిలేశారు. వీటి నష్టం ఏకంగా 70 పరుగులు! వీటిని పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (స్టంప్డ్) రిచా (బి) రాధ 25; మూనీ (సి) షఫాలీ (బి) శిఖా 54; లానింగ్ (నాటౌట్) 49; గార్డ్నర్ (బి) దీప్తి 31; హారిస్ (బి) శిఖా 7; ఎలీస్ పెర్రీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–52, 2–88, 3–141, 4–148. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–41–0, దీప్తి శర్మ 4–0–30–1, శిఖా పాండే 4–0–32–2, రాధ యాదవ్ 4–0–35–1, స్నేహ్ రాణా 4–0–33–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) షుట్ 9; స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 2; యస్తిక (రనౌట్) 4; జెమీమా (సి) హీలీ (బి) బ్రౌన్ 43; హర్మన్ప్రీత్ (రనౌట్) 52; రిచా (సి) తాలియా (బి) బ్రౌన్ 14; దీప్తి (నాటౌట్) 20; స్నేహ్ రాణా (బి) జొనాసెన్ 11; రాధ (సి) పెర్రీ (బి) గార్డ్నర్ 0; శిఖా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–11, 2– 15, 3–28, 4–97, 5–133, 6–135, 7–157, 8– 162. బౌలింగ్: యాష్లీ గార్డ్నర్ 4–0–37–2, షుట్ 4–0–34–1, డార్సీ బ్రౌన్ 4–0–18–2, ఎలీస్ పెర్రీ 1–0–14–0, జొనాసెన్ 3–0–22–1, వేర్హామ్ 3–0–29–0, తాలియా మెక్గ్రాత్ 1–0–13–0. -
పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రనౌట్గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ కీలక సమయంలో రనౌట్గా వెనుదిరిగింది. ఆమె ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఫైనల్కు చేరడం ఇది వరుసగా 7వసారి కావడం గమనార్హం. చదవండి: T20WC: ఆసీస్ బ్యాటర్పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్ -
ఆసీస్ బ్యాటర్పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా రైజింగ్ స్టార్ షఫాలీ వర్మ తన సహానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ బెత్ మూనీపై కోపంతో షఫాలీ ఊగిపోయింది. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్లో.. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ మూనీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను షఫాలీ వర్మ జారవిడిచింది. అనంతరం 12 ఓవర్లో శిఖాపాండే బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా మూనీ షాట్ ఆడింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షఫాలీ ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో షాఫాలీ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మూనీ వైపు వేలు చూపిస్తూ వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో షఫాలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: PSL 2023: పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్ Aggression of Shafali Verma. #INDWvsAUSW #ShafaliVerma pic.twitter.com/msTWcMrAx5 — Naveen Sharma (@iamnaveenn100) February 23, 2023 -
రెండో సెమీస్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా ‘ఢీ’
మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ లో సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు అదరగొట్టింది. గ్రూప్–1 చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో బంగ్లాదేశ్ను ఓడించింది. దాంతో గ్రూప్–1లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్తో దక్షిణాఫ్రికా (0.738) సెమీస్ చేరగా... న్యూజిలాండ్ (0.138), శ్రీలంక (–1.460) ఇంటిముఖం పట్టాయి. దక్షిణాఫ్రికాతో పోరులో మొదట బంగ్లాదేశ్ 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వర్డ్ ( 66 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), తజి్మన్ బ్రిట్స్ (50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీ లతో అదరగొట్టారు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
మహిళల టీ20 వరల్డ్కప్.. సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడబోతున్నారంటే..?
8వ మహిళల టీ20 వరల్డ్కప్ చివరి దశకు చేరింది. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ ఆస్ట్రేలియా.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్లో గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్.. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్టౌన్లో జరుగనున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్కప్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క ఓటమిని మూటగట్టుకుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత విండీస్, ఐర్లాండ్ జట్లను ఓడించారు. మిగతా జట్ల విషయానికొస్తే.. సెమీస్లో భారత్ ప్రత్యర్ధి ఆసీస్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికా) విజయం సాధించగా.. గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్ కూడా 4కు నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అజేయ జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. సఫారీ టీమ్.. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, 2 అపజయాలు మూటగట్టుకుంది. మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8వ ఎడిషన్ కొనసాగుతుంది. 2009లో జరిగిన తొలి ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా నిలువగా.. 2010, 2012, 2014 ఎడిషన్లలో ఆసీస్ విజేతగా నిలిచి హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. మధ్యలో 2016లో వెస్టిండీస్ జగజ్జేతగా నిలువగా.. ఆ తర్వాత 2018, 2020 ఎడిషన్లలో ఆసీస్ వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్కప్లో విజయం సాధిస్తే ఆసీస్ డబుల్ హ్యాట్రిక్ నమోదు చేస్తుంది. 2020 ఎడిషన్లో భారత్.. ఫైనల్కు చేరి ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా!
మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. టీ20 వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో ఇంగ్లండ్ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లీష్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లే, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్లు ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. ఇక 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. చదవండి: IND vs AUS: దినేష్ కార్తీక్ ముందే పసిగట్టాడా? ఆసీస్ కుప్పకూలుతుందని.. A stunning performance with the bat! 💪 We become the first team to pass 200 at a Women's T20 World Cup! 🔥🔥🔥 Scorecard: https://t.co/TeqEjKWEy2#ENGvPAK | #T20WorldCup pic.twitter.com/9iDMegt112 — England Cricket (@englandcricket) February 21, 2023 -
దర్జాగా సెమీస్కు...
కెబేహ (దక్షిణాఫ్రికా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా, ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో నేరుగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచింది. టి20 కెరీర్లో స్మతికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. స్మృతి మూడుసార్లు ఇచ్చిన క్యాచ్లను ఐర్లాండ్ ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. షఫాలీ వర్మ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో తొలి వికెట్కు 62 పరుగులు జోడించిన స్మృతి... హర్మన్ప్రీత్ (20 బంతుల్లో 13)తో రెండో వికెట్కు 52 పరుగులు జత చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. ఈ టోర్నీలో ఐర్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ఈ గెలుపుతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్–2లో రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, గ్రూప్–1 టాపర్ ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. పాకిస్తాన్తో నేడు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో ఇప్పటికే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రన్రేట్ పరంగా భారత్ (0.253) కంటే ఇంగ్లండ్ (1.776) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోయినా గ్రూప్–2లో ఆ జట్టే ‘టాప్’లో నిలుస్తుంది. గ్రూప్–2 టాపర్ హోదాలో ఇంగ్లండ్ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్–1లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. గ్రూప్–1లో న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకొని 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్తో చివరి మ్యాచ్ ఆడనున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాయి. ఈ దశలో న్యూజిలాండ్, శ్రీలంకకంటే మెరుగైన రన్రేట్ ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంటుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అమీ హంటర్ (బి) లౌరా డెలానీ 24; స్మృతి మంధాన (సి) గ్యాబీ లూయిస్ (బి) ఒర్లా ప్రెండర్గాస్ట్ 87; హర్మన్ప్రీత్ కౌర్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) లౌరా డెలానీ 13; రిచా ఘోష్ (సి) గ్యాబీ లూయిస్ (బి) లౌరా డెలానీ 0; జెమీమా రోడ్రిగ్స్ (స్టంప్డ్) వాల్డ్రోన్ (బి) కెల్లీ 19; దీప్తి శర్మ (సి) డెంప్సీ (బి) ప్రెండర్గాస్ట్ 0; పూజా వస్త్రకర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–62, 2–114, 3–115, 4–143, 5–143, 6–155. బౌలింగ్: ఒర్లా ప్రెండర్గాస్ట్ 4–0–22–2, డెంప్సీ 3–0–27–0, కెల్లీ 4–0–28–1, లెహ్ పాల్ 3–0–27–0, కారా ముర్రే 2–0–16–0, లౌరా డెలానీ 4–0–33–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: అమీ హంటర్ (రనౌట్) 1; గ్యాబీ లూయిస్ (నాటౌట్) 32; ప్రెండర్గాస్ట్ (బి) రేణుక సింగ్ 0; లౌరా డెలానీ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 54. వికెట్ల పతనం: 1–1, 2–1. బౌలింగ్: రేణుక 2–0–10–1, శిఖా పాండే 2.2–0 –14–0, దీప్తి 1–0–11–0, రాజేశ్వరి 1–0–5–0. -
ఐర్లాండ్పై విజయం.. సెమీస్లో అడుగుపెట్టిన భారత్
ఐర్లాండ్పై విజయం.. సెమీస్లో అడుగుపెట్టిన భారత్ టీ20 ప్రపంచకప్-2023 సెమీఫైనల్లో భారత మహిళల జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన భారత్..సెమీస్కు అర్హత సాధించింది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ను విజేతగా నిర్ణయించారు. కాగా టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్కు చేరడం వరుసగా ఇది మూడో సారి. ►భారత్ -ఐర్లాండ్ మధ్య జరుగుతున్నకీలక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ స్కోర్: 54/2 వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ►6 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో గాబీ లూయిస్(27), డెలానీ(13) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అమీ హంటర్ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరగా.. ప్రెండర్గాస్ట్ను రేణుక సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. అదరగొట్టిన స్మృతి మంధాన.. ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ ఐర్లాండ్తో జరగుతున్న కీలక మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 143 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 87 పరుగులు చేసిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన..ఓర్లా ప్రెండర్గాస్ట్ బౌలింగ్లో ఔటయ్యంది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన లారా డెలానీ బౌలింగ్లో నాలుగో బంతికి హర్మన్ప్రీత్ కౌర్(13) పెవిలియన్కు చేరగా.. ఆరో బంతికి రిచా ఘోష్ డకౌట్గా ఔటయ్యంది. క్రీజులో క్రీజులో మంధాన(69)తో పాటు జెమీమా రోడ్రిగ్స్(11) పరుగులతో ఉంది. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ ఐర్లాండ్తో మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ను స్మృతి అందుకుంది. 14 ఓవర్లు ముగిసే భారత్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మంధాన(53)తో పాటు హర్మన్ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 62 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. లారా డెలానీ బౌలింగ్లో పెవిలియన్కే చేరింది. క్రీజులో స్మృతి మంధాన,హర్మన్ప్రీత్ కౌర్ ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 63/1 ► పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(27), షఫాలీ వర్మ(13) పరుగులతో ఉన్నారు. ►3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(5) పరుగులతో ఉన్నారు. ►మహిళల టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్తో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక భారత్ కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. రాధాయాదవ్ స్థానంలో దేవిక వైద్య తుది జట్టులోకి వచ్చింది. కాగా ఈ మెగా టోర్నీల్లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించాలంటే ఐర్లాండ్పై కచ్చితంగా విజయం సాధించాలి. తుది జట్లు: ఐర్లాండ్: అమీ హంటర్, గాబీ లూయిస్, ఓర్లా ప్రెండర్గాస్ట్, ఐమర్ రిచర్డ్సన్, లూయిస్ లిటిల్, లారా డెలానీ(కెప్టెన్), అర్లీన్ కెల్లీ, మేరీ వాల్డ్రాన్(వికెట్ కీపర్), లేహ్ పాల్, కారా ముర్రే, జార్జినా డెంప్సే భారత్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ చదవండి: IND vs AUS: కమిన్స్లా టీమిండియా లేదంటే పాకిస్తాన్ కెప్టెన్ చేసి ఉంటేనా.. వెంటనే! -
పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా ఓడిపోయింది. అది కూడా మహిళల టి20 వరల్డ్కప్లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్లు తలా ఒక వికెట్ తీశారు. పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్లో ఒక వికెట్తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం' -
Womens T20 World Cup 2023: రేణుక, స్మృతి మెరుపులు వృథా
కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147. బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119. బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0. -
సూపర్ స్మృతి మంధాన.. సిక్సర్తో ఫిఫ్టీ
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో స్మృతి మంధాన సూపర్ ఫిఫ్టీతో ఆకట్టుకుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్మృతి సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా స్మతి కెరీర్లో ఇది 21వ అర్థశతకం. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే గ్లెన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బ్రంట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా వుమెన్స్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో హర్మస్ సేన ఒత్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్ ఆఖరి వరకు ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రేణుకా సింగ్ కొత్త చరిత్ర .. టీమిండియా తొలి పేసర్గా
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం గ్రూప్-బిలో ఇంగ్లండ్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రేణుకా సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. టి20 వరల్డ్కప్లో తరపున ఐదు వికెట్ల హాల్ అందుకున్న తొలి భారత మహిళా పేసర్గా రికార్డులకెక్కింది. అంతేకాదు వరల్డ్కప్లో రేణుకా కెరీర్ బెస్ట్ ప్రదర్శన అందుకుంది. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది. తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకున్న రేణుకా చివరి ఓవర్లో మరో రెండు వికెట్లను పడగొట్టింది. డంక్లీ, వ్యాట్, అలిస్ క్యాప్సీ, అమీ జోన్స్, బ్రంట్ల రూపంలో రేణుకా ఐదు వికెట్ల మార్క్ను అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. Renuka Singh Thakur today: - First Indian pacer to take five-wicket in T20 WC. - Best bowling figure by an Indian in T20 WC. pic.twitter.com/YH8CAtaCNh — Johns. (@CricCrazyJohns) February 18, 2023 చదవండి: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
రిచా ఘోష్ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్ సేన ఓటమి
రిచా ఘోష్ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్ సేన ఓటమి మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా వుమెన్స్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మస్ సేన ఒత్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. 15 ఓవర్లలో టీమిండియా 93/3 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వుమెన్స్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మంధాన 45, రిచా ఘోష్ 17 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి 58 పరుగులు కావాలి. జెమీమా రోడ్రిగ్స్(13) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన భారత్ జెమీమా రోడ్రిగ్స్(13 పరుగులు) రూపంలో భారత మహిళల జట్టు రెండో వికెట్ కోల్పోయింది. సారా గ్లెన్ బౌలింగ్లో బ్రంట్కు క్యాచ్ ఇచ్చి రోడ్రిగ్స్ వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా వుమెన్స్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. టార్గెట్ 152.. 5 ఓవర్లలో భారత్ స్కోరు 36/1 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. స్మృతి మంధాన 23, జేమీమా రోడ్రిగ్స్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ వర్మ 8 పరుగులు చేసి బెల్ బౌలింగ్లో వెనుదిరిగింది. ఐదు వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత టార్గెట్ 152 మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా గ్రూప్-బిలో ఇంగ్లండ్.. టీమిండియా వుమెన్స్ ముందు 152 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగింది. ఆరంభంలో తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ కెప్టెన్ హెథర్నైట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్లో 28 పరుగులు చేసిన నైట్ షపాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 72/3 ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ కోలుకుంది. 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. బ్రంట్ 35, హెథర్నైట్ 23 పరుగులతో ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ భారత మహిళా బౌలర్ రేణుకా సింగ్ చెలరేగుతుంది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ వుమెన్స్ను చావుదెబ్బ కొట్టింది తాజాగా డంక్లీ(10 పరుగులు)ని రేణుకా సింగ్ క్లీన్బౌల్డ్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వుమెన్స్ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. అదిరిన ఆరంభం.. రెండు వికెట్లు డౌన్ ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత మహిళల జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న భారత్కు పేసర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే రేణుకా సింగ్.. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత తన రెండో ఓవర్లో క్యాప్సీని క్లీన్బౌల్డ్ చేసిన రేణుకా సింగ్ రెండో వికెట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా.. మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా ఇవాళ మూడో లీగ్ మ్యాచ్లో పటిష్టమైన ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఏంచుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందాయి. ఇక భారత్ జట్టు ఒక మార్పు చేసింది. దేవికా స్థానంలో శిఖా పాండే తుది జట్టులోకి వచ్చింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఇంగ్లండ్ మహిళలు తుదిజట్టు: సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్ ఇంగ్లండ్తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్తో మ్యాచ్ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. -
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయం.. శ్రీలంకను చిత్తు చేసిన కంగారూలు
గెబెర్హా: మహిళల టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా లంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగు లకే పరిమితమైంది. హర్షిత (34)దే అత్యధిక స్కోరు. అనంతరం ఆసీస్ 15.5 ఓవర్లలో వికెట్ కో ల్పోకుండా 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (43 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (53 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ -
స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఎలిస్సే పెర్రీ వేసిన బంతిని చమేరీ ఆటపట్టు లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాలని ప్రయత్నించింది. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్లో ఉన్న గ్రేస్ హారిస్ తన కుడివైపునకు కొన్ని గజాల దూరం పరిగెత్తి డైవ్ చేసి బంతిని అందుకుంది. ఆమె అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా మాత్రం ఉండలేం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక హారిస్ స్టన్నింగ్ క్యాచ్తో మాత్రమే కాదు బౌలింగ్లోనూ అదరగొట్టింది. మూడు ఓవర్లు వేసిన గ్రేస్ హారిస్ ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వుమెన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మాదవి 34 పరుగులు చేయగా.. విశ్మి గుణరత్నే 24 పరుగులు చేసింది. ఆసీస్ వెటరన్ పేసర్ మేఘన్ స్కాట్ నాలుగు వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 15.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ను చేధించింది. బెత్ మూనీ 56 నాటౌట్, అలీసా హేలీ 54 నాటౌట్ ఆసీస్ను గెలిపించారు. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. That's unreal from Grace Harris, what a catch #T20WorldCup pic.twitter.com/AkJRxZYzdf — Ricky Mangidis (@rickm18) February 16, 2023 చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న! -
రికార్డుల్లోకెక్కిన పాక్ బ్యాటర్.. తొలి క్రికెటర్గా..!
మహిళల టీ20 వరల్డ్కప్-2023లో పాక్ బ్యాటర్ మునీబా అలీ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున తొలి శతకం బాదిన మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. అలాగే ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీ సాధించిన ఏడో మహిళా క్రికెటర్గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మహిళల టీ20 వరల్డ్కప్ ఎడిషన్లలో డియాండ్ర డొట్టిన్, మెగ్ లాన్నింగ్, హర్మన్ప్రీత్ కౌర్, హీథర్ నైట్, లిజెల్ లీ సెంచరీ సాధించగా.. ప్రస్తుత వరల్డ్కప్లో శతక్కొట్టడం ద్వారా మునీబా వీరి సరసన చేరింది. ఈ మ్యాచ్కు ముందు వరకు కనీసం హాఫ్సెంచరీ కూడా చేయని మునీబా ఏకంగా శతకాన్నే బాది ఔరా అనిపించింది. ప్రస్తుత వరల్డ్కప్లో మునీబా సాధించిన సెంచరీనే తొలి సెంచరీ కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మునీబా సెంచరీ (68 బంతుల్లో 102; 14 ఫోర్లు) సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్ ప్రస్తుత వరల్డ్కప్లో రెండో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. మునీబాతో పాటు నిదా దార్ (33) రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెన్ 2, లియా పాల్ ఓ వికెట్ పడగొట్టారు. 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 16.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి 70 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ బౌలర్లలో నష్రా సంధూ 4 వికెట్లతో చెలరేగగా.. సాదియా ఇక్బాల్, నిదా దార్ తలో 2 వికెట్లు, ఫాతిమా సనా, టుబా హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఓర్లా (31), ఎయిమర్ రిచర్డ్సన్ (28), గాబీ లివిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. వరల్డ్కప్లో ఇవాల్టి (ఫిబ్రవరి 16) మ్యాచ్లో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. -
టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్తో
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీన్ క్రిక్ఈన్ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు ఈఎస్పీన్ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్కు తెలుసు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. చదవండి: T20 WC: ప్రపంచకప్లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్పై ఘన విజయం -
తీవ్ర గాయం.. స్ట్రెచర్పై వెస్టిండీస్ ప్లేయర్
వెస్టిండీస్ మహిళా సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఓవర్ ఆఖరి బంతిని హర్మన్ప్రీత్ కౌర్ షార్ట్ఫైన్ దిశగా ఆడింది. షార్ట్ఫైన్లోనే ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలు బెణికినట్లయింది. దీంతో మైదానంలో కూలబడింది. టేలర్ పైకి లేవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే మెడికల్ సిబ్బంది స్ట్రెచర్పై ఆమెను గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్కు ఇది రెండో పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్గా -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్గా
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టి20 క్రికెట్లో చరిత్ర సృష్టించింది. టీమిండియా తరపున అటు పురుషుల క్రికెట్లో.. ఇటు మహిళల క్రికెట్లో టి20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డులకెక్కింది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో ఆరీ ఫ్లెచర్ను ఔట్ చేయడం ద్వారా దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. ఓవరాల్గా దీప్తి శర్మ 89 టి20 మ్యాచ్ల్లో వంద వికెట్ల మార్క్ను అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్గానూ చరిత్రకెక్కింది. టీమిండియా మహిళా వెటరన్ లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచ్ల్లో 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. టి20 క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టి20 క్రికెట్లో సీనియర్ వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ 125 వికెట్లు(117 మ్యాచ్లు) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్ నిదాదార్(121 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ (120 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా మెన్స్ క్రికెటర్లలో యజ్వేంద్ర చహల్ 91 వికెట్లతో(75 మ్యాచ్లు) వంద వికెట్లకు చేరువగా ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లు(87 మ్యాచ్లు) రెండో స్థానంలో ఉన్నాడు. పురుషుల టి20 క్రికెట్లో వంద వికెట్ల మార్క్ను ఐదుగురు మాత్రమే అందుకున్నారు. టిమ్ సౌథీ 134 వికెట్లు(107 మ్యాచ్లు), షకీబ్ అల్ హసన్ 128 వికెట్లు(109 మ్యాచ్లు), రషీద్ ఖాన్ 122 వికెట్లు(74 మ్యాచ్లు), ఇష్ సోదీ 114 వికెట్లు( 91 మ్యాచ్లు), లసిత్ మలింగ 107 వికెట్లు( 84 మ్యాచ్లు) ఉన్నారు. 🚨Milestone Alert 🚨 A special TON for @Deepti_Sharma06 as she becomes #TeamIndia's leading wicket-taker in T20Is (in women's cricket) 👏 👏 Follow the match ▶️ https://t.co/rm4GUZIzSX #T20WorldCup | #INDvWI pic.twitter.com/7GDz93fgEH — BCCI Women (@BCCIWomen) February 15, 2023 చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్తో.. -
వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్తో..
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో భారత స్టార్ స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్తో మెరిసింది. వేలి గాయం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు దూరంగా ఉన్న మంధాన విండీస్తో మ్యాచ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 75 పరుగులతో విండీస్ పటిష్టంగా కనిపించింది. ఈ దశలో దీప్తి శర్మ బౌలింగ్కు వచ్చింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని క్యాంప్బెల్లె రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్కు తాకడంతో స్లిప్లో పడింది. అయితే ఇక్కడే మంధాన తన మెరుపు ఫీల్డింగ్ను ప్రదర్శించింది. క్యాంప్బెల్లె ఆడిన బంతి కాస్త ముందుకు పడడంతో మంధాన డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. దీంతో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన స్మృతి మంధాన పేరు స్టేడియంలో మార్మోగిపోయింది. -
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్కు ఇది రెండో పరాజయం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా ► సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(30 పరుగులు), రిచా ఘోష్(22 పరుగులు) ఇన్నింగ్స్ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సి ఉంది. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 44/3 ► 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక్క పరుగుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే షఫాలీ వర్మ(28 పరుగులు) మూడో వికెట్గా వెనుదిరిగింది. టీమిండియా వుమెన్స్ టార్గెట్ 119 పరుగులు ► టీమిండియా వుమెన్స్తో మ్యాచ్లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్ ► చినెలి హెన్రీ(2) రనౌట్ కావడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ► ఒక్క ఓవర్లోనే వెస్టిండీస్ రెండు వికెట్లను కోల్పోయింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలుత 30 పరుగులు చేసిన క్యాంప్బెల్లె స్మృతి మంధాన అద్భుత క్యాచ్కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి 42 పరుగులు చేసిన టేలర్ ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో వెస్టిండీస్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లలో వెస్టిండీస్ 53/1 ► తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయినప్పటికి వెస్టిండీస్ తన ఇన్నింగ్స్ను నిలకడగా కొనసాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. స్టెఫాని టేలర్ 28, క్యాంప్బెల్లె 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో విండీస్ స్కోరు 15/1 ► 4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసిది. టేలర్ 3, క్యాంప్బెల్లే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ► వెస్టిండీస్తో మ్యాచ్లో పూజా వస్త్రాకర్ టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ హేలీ మాథ్యూస్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. విండీస్ జట్టు ప్రస్తుతం వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న వెస్టిండీస్ వుమెన్స్ ► మహిళల టి20 వరల్డ్కప్లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ ఇండియా వుమెన్స్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్లో విజయం దక్కింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ వెస్టిండీస్ మహిళల తుదిజట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), స్టాఫానీ టేలర్, షెమైన్ కాంప్బెల్లె, షబికా గజ్నాబి, చినెల్లే హెన్రీ, చెడియన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షామిలియా కన్నెల్, రషదా విలియమ్స్ (వికెట్ కీపర్), కరిష్మా రామ్హారక్, షకేరా సెల్మాన్ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించిన భారత్.. వెస్టీండీస్తో మ్యాచ్లో అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ వుమెన్స్తో మ్యాచ్లో విండీస్ ఓటమిపాలైంది. ఇక పాక్తో మ్యాచ్కు వేలిగాయంతో దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విండీస్తో మ్యాచ్కు తిరిగిరావడం బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్లో భారత జట్టు వెస్టిండీస్తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ, వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్లో ఉండటంతో భారత టాపార్డర్కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్, రిచా ఘోష్లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. -
'నా కూతురికి డబ్బు విలువ తెలియదు'
టీమిండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న మహిళల టి20 వరల్డ్కప్లో బిజీగా ఉంది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో పూజా వస్త్రాకర్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా పడగొట్టింది. ఇవాళ గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్తో తలపడనుంది. ఇటీవలే తొలిసారి జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలోనూ పూజాకు మంచి ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి 90 లక్షలకు పూజాను కొనుగోలు చేసింది. కాగా పూజా వస్త్రాకర్ టి20 వరల్డ్కప్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లడానికి ముందు తండ్రి బంధన్ రామ్కు రూ. 15 లక్షల విలువైన కారును గిఫ్ట్గా ఇచ్చింది. కూతురు గిఫ్ట్ను చూసి సంతోషపడాల్సిన తండ్రి ఆశ్చర్యంగా నిరాశకు గురయ్యాడు. ''నా కూతురు అనవసరంగా డబ్బులు వృథా చేస్తుందంటూ'' బంధన్ రామ్ పేర్కొనడం ఆసక్తిని కలిగించింది. పూజా వస్త్రాకర్ తండ్రి బంధన్ రామ్ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బంధన్ రామ్ చాలా విషయాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ''పూజా వస్త్రాకర్ తన నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నా కూతురు టీమిండియాకు ఆడుతుందని నేను ఊహించలేదు. కానీ పట్టుదలతో తను అనుకున్నది సాధించి ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయం. పూజా చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి డబ్బులు అడిగిన ప్రతీసారి తనను సరదాగా ఎగతాళి చేసేవాడిని. చదువుకోకుండా అనవసరంగా క్రికెట్పై డబ్బులు ఖర్చు చేయిస్తున్నావు అంటూ కోప్పడేవాడిని. అయితే నా మాటలను సంతోషంగా స్వీకరించే పూజా ఎప్పుడు ఒక మాట అంటుండేది..'' చూడు నాన్న.. ఏదో ఒకరోజు కచ్చితంగా దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తాను''. అయితే పూజా దగ్గర ఒక బలహీనత ఉంది.. అదే డబ్బులు వృథా చేయడం. ఈ మధ్యనే వద్దని చెప్పినా కూడా రూ. 15 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది. బిడ్డ ప్రయోజకురాలు అయ్యిందంటే నాకు సంతోషమే. కానీ ఇలా అనవసరపు ఖర్చు నాకు నచ్చదు. అందుకే డబ్ల్యూపీఎల్ వేలం ద్వారా వచ్చిన రూ.1.90 కోట్లను దాచుకోవడానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. ఇలా అయినా నా కూతురు అనవసర ఖర్చు తగ్గించుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పూజా వస్త్రాకర్ బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. జట్టు తరపున 2 టెస్టుల్లో ఐదు వికెట్లు తీసింది. ఇక 26 వన్డేల్లో 816 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు, 44 టి20ల్లో 257 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టింది. చదవండి: Shoaib Akhtar: అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు! -
ఇండియా-పాకిస్తాన్ వరల్డ్కప్ మ్యాచ్లో ఘోర తప్పిదం
మహిళల టీ20 వరల్డ్కప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన కీలక సమరంలో జరగరాని ఓ ఘోర తప్పిదం జరిగిపోయింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్లో యువ ఫీల్డ్ అంపైర్ లారెన్ అగెన్బ్యాగ్ ఓ ఘోర తప్పిదం చేసింది. పాక్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించే క్రమంలో నిదా దార్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో లారెన్ 6 కాకుండా 7 బంతులు వేయించింది. ఏడవ బంతికి జెమీమా రోడ్రిగెస్ బౌండరీ బాదింది. దీని వల్ల టీమిండియాకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ, పాక్ మాత్రం తమకు నష్టం వాటిల్లిందని వాపోతుంది. భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగెస్ (38 బంతుల్లో 53 నాటౌట్), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్) మరో 6 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించారు. ఒకవేళ అదనంగా వేసిన ఏడవ బంతిని క్యాన్సిల్ చేసి, పరుగులు (ఫోర్) మైనస్ చేసినప్పటికీ టీమిండియా ఈజీగా విక్టరీ సాధించేది. చేతిలో 7 వికెట్లు, క్రీజ్లో ఉన్న బ్యాటర్లు అప్పటికే జోరుమీద ఉండటాన్ని బట్టి చూస్తే ఆఖరి ఓవర్ తొలి బంతికే టీమిండియా విజయం సాధించేది. ఏదిఏమైనప్పటికీ ఇలాంటి తప్పిదాలు జరగడం మాత్రం విచారకరం. చేయని తప్పుకు టీమిండియాను నిందించడం మాత్రం సరికాదు. పాక్ అభిమానులు విషయం తెలిసి కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. ఏదో ఆఖరి బంతికి తాము ఓడామన్న రేంజ్లో వారు ఫీలవుతున్నారు. ఈ తప్పిదం జరగకపోయి ఉంటే తాము గెలిచే వాళ్లమని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ విషయంలో టీమిండియా ప్రమేయం ఏమీ లేనప్పటికీ మన సివంగులపై నోరు పారేసుకుంటున్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే దానికి టీమిండియాను బాధ్యుల్ని చేయడం సమంజసం కాదని భారత అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో భారత జట్టుకు ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. కాగా, టెక్నాలజీ, అనువణువు మానిటరింగ్ ఉన్న నేటి ఆధునిక క్రీడాయుగంలో ఇలాంటి ఘోర తప్పిదం జరగడం నిజంగా విచారకరమని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
T20 WC 2023: పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించిన హర్మన్ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. భారత్ వర్సెస్ పాక్ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్టౌన్లో జరిగిన మూడో మ్యాచ్లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అదరగొట్టిన జెమీమా- రిచా మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వికెట్ కీపర్ రిచా ఘోష్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ఇదే అత్యధిక ఛేదన జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్కప్ మ్యాచ్లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్కిది ఐదో విజయం. వాట్ ఏ విన్ ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు. చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్ను హస్తగతం చేసుకున్న సన్రైజర్స్ ధర్మశాల టెస్టు వైజాగ్లో? View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు
గత మెగా టోర్నీ రన్నరప్ భారత్... ఈ టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పనిపట్టి శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి నుంచి క్లిష్టమైన లక్ష్యమే ఎదురైనా... కీలకమైన ఈ మ్యాచ్కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన గాయంతో గైర్హాజరైనా... టాపార్డర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో భారత మహిళలు చక్కని విజయం సాధించారు. కేప్టౌన్: భారత్ మహిళల జట్టు ముందున్న లక్ష్యం 150. కానీ 93 పరుగుల వద్ద 14వ ఓవర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (16; 2 ఫోర్లు) అవుటైంది. 16వ ఓవర్లో రిచా ఘోష్ను ఎల్బీగా అంపైర్ ప్రకటించింది. భారత్ రివ్యూకెళ్లింది. స్కోరేమో 109/3. విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రివ్యూలో బంతి రిచా గ్లౌజ్ను తాకినట్లు తేలడంతో బతికిపోయింది. అక్కడి నుంచి టీమిండియా ఆట మారిపోయింది. కాస్త కఠినమైన సమీకరణాన్ని జెమీమా–రిచా జోడీ 19వ ఓవర్లోనే ముగించింది. దాంతో టి20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పాకిస్తాన్ 12.1 ఓవర్లలో 68 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దశలో కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్లో భారత్కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ఓవరాల్గా టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్కిది ఐదో విజయం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) గెలిపించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 15న వెస్టిండీస్తో ఆడుతుంది. గెలిపించిన జెమీమా ఓపెనింగ్లో షఫాలీ వర్మ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గానే ఆడినప్పటికీ... యస్తిక భాటియా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. క్రీజులోకి జెమీమా రాగా భారీ షాట్లపై గురిపెట్టిన షఫాలీ... సిద్రా అమీన్ చక్కని క్యాచ్కు పెవిలియన్ చేరింది. రెండు బౌండరీలతో ఊపు మీదున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ను నష్రా సంధు బోల్తా కొట్టించింది. దీంతో రిచా ఘోష్ క్రీజులోకి రాగా... 15వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కలిసొచ్చిన రివ్యూతో రిచా, మరోవైపు జెమీమా బౌండరీలతో జట్టు విజయాన్ని సులువు చేశారు. జెమీమా బౌండరీతో భారత విజయాన్ని ఖరారు చేసింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: మునీబా (స్టంప్డ్) రిచా (బి) రాధ 12; జవేరియా (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తి 8; బిస్మా మారూఫ్ (నాటౌట్) 68; నిదా దార్ (సి) రిచా (బి) పూజ 0; సిద్రా అమీన్ (సి) రిచా (బి) రాధ 11; అయేషా (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–43, 4–68. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, దీప్తి శర్మ 4–0–39–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–31–0, రాధా యాదవ్ 4–0–21–2, పూజ 4–0–30–1, షఫాలీ వర్మ 1–0–3–0. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (సి) ఫాతిమా (బి) సాదియా 17; షఫాలీ (సి) సిద్రా (బి) నష్రా సంధు 33; జెమీమా (నాటౌట్) 53; హర్మన్ప్రీత్ (సి) బిస్మా (బి) నష్రా సంధు 16; రిచా ఘోష్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–38, 2–65, 3–93. బౌలింగ్: ఫాతిమా 4–0–42–0, సాదియా 4–0–25–1, ఐమన్ 3–0–33–0, నిదా దార్ 4–0–36–0, నష్రా సంధు 4–0–15–2. -
పాక్ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్కప్లో బోణీ విక్టరీ
పాక్ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్కప్లో బోణీ విక్టరీ మహిళల టీ20 వరల్డ్కప్లో టీమిండియా బోణీ విక్టరీ నమోదు చేసింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్.. తమ తొలి మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ మారూఫ్ (68 నాటౌట్), అయేషా నసీం (43 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. షెఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగెస్ (53 నాటౌట్), రిచా ఘోష్ (31 నాటౌట్) చెలరేగడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 93 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్లో మారూఫ్కు క్యాచ్ ఇచ్చి హర్మన్ కౌర్ (16) ఔటైంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/3. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 65 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్లో అమీన్కు క్యాచ్ ఇచ్చి షెఫాలీ వర్మ (33) ఔటైంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 67/2. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్.. 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్లో ఫాతిమా సనాకు క్యాచ్ ఇచ్చి యస్తికా భాటియా (17) ఔటైంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/1. విజృంభించిన అయేషా నసీం.. సత్తా చాటిన బిస్మా మారూఫ్ కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అయేషా నసీం (23 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. తిప్పేసిన రాధా యాదవ్.. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ రాధా యాదవ్ మాయాజాలం ధాటికి పాకిస్తాన్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12.1వ ఓవర్లో రాధా బౌలింగ్లో రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి అమీన్ (11) ఔటైంది. 15 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/4గా ఉంది. ఫైర్ మీదున్న టీమిండియా బౌలర్లు, 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ టీమిండియా బౌలర్లు ఫైర్ మీదున్నారు. దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీయడంతో పాక్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వస్త్రాకర్ బౌలింగ్లో రిచాకు క్యాచ్ ఇచ్చి నిదా దార్ (0) డకౌటైంది. 8 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 46/3. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్లో రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ చేయడంతో మునీబా అలీ (12) పెవిలియన్ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/2గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్లో హర్మన్కు క్యాచ్ ఇచ్చి జవేరియా ఖాన్ (8) ఔటైంది. 4.4 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 31/1గా ఉంది. బిస్మా మారూఫ్ (18), మునీబా అలీ (5) క్రీజ్లో ఉన్నారు. ICC Womens T20 WC 2023 IND VS PAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. స్మృతి స్థానంలో హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చిందని, ఈ మ్యాచ్కు శిఖా పాండే దూరంగా ఉందని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ అనంతరం వెల్లడించారు. పాక్ జట్టులో సైతం ఓ కీలక ప్లేయర్ మ్యాచ్కు దూరమైంది. డయానా బేగ్ ఇవాల్టి మ్యాచ్ ఆడటం లేదని పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ తెలిపింది. తుది జట్లు: భారత్: షెఫాలీ వర్మ, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగెస్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ పాకిస్తాన్: జవేరియా ఖాన్, మునీబా అలీ (వికెట్కీపర్), బిస్మా మారూఫ్ (కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఎయిమన్ అన్వర్, సష్రా సంధూ, సాదియా ఇక్బాల్ -
76 పరుగులకే ఆలౌట్.. న్యూజిలాండ్పై ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం పార్ల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 76 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం బంగ్లాదేశ్ తలపడనుండగా.. న్యూజిలాండ్ సోమవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: T20 World Cup: పాక్తో పోరుకు భారత్ ‘సై’ -
పాక్తో పోరుకు భారత్ ‘సై’
కేప్టౌన్: టి20 ప్రపంచకప్ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి. తొలి మ్యాచ్కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్ప్రీత్ మిడిలార్డర్లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్పై భారత్కు విజయం సులువవుతుంది. -
బోణీ కొట్టిన శ్రీలంక.. దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ
మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక బోణీ కొట్టింది. కేప్టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగల్గింది. సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరచగా.. రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు. అర్ధ సెంచరీతో చెలరేగిన ఆటపట్టు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు గుణరత్నే 35 పరుగులతో రాణించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. చదవండి: T20 WC: పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
ధనాధన్ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్ప్రీత్ సేన ఈసారైనా...!
కేప్టౌన్: నేటి నుంచి ఐసీసీ టి20 ప్రపంచకప్ రూపంలో మరో ‘షో’కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మెగా ఈవెంట్లలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. 2020లో ఈ జగజ్జేత చేతిలో మెల్బోర్న్ వేదికపై జరిగిన ఫైనల్లో ఓడిన భారత్ కూడా పొట్టి ప్రపంచకప్పై గట్టి ఆశలే పెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ (సెమీస్)కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ 23న, రెండో సెమీస్ 24న జరుగుతాయి. 26న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. ముందుగా శుక్రవారం టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. భారత్ 12న జరిగే తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్లు కూడా 6.30కే మొదలవుతాయి. ‘స్టార్స్పోర్ట్స్’లో మ్యాచ్లు ప్రసారమవుతాయి. గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్. గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్. మన మహిళల షెడ్యూల్ ఇదే ఫిబ్రవరి 12 భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15 భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫిబ్రవరి 18 భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఫిబ్రవరి 20 భారత్ వర్సెస్ ఐర్లాండ్ -
T20 Cricket: టీమిండియాకు తొలి ఓటమి.. ఆస్ట్రేలియా ఘన విజయం
ICC Womens T20 WC Warm Up Matches 2023: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లు ఇవాల్టి (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై న్యూజిలాండ్ (32 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్లో ఐర్లాండ్పై శ్రీలంక (2 పరుగుల తేడాతో), మూడో మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ (18 పరుగుల తేడాతో), నాలుగో మ్యాచ్లో టీమిండియాపై ఆస్ట్రేలియా (44 పరుగులు), ఐదో మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ (6 వికెట్ల తేడాతో) విజయాలు సాధించాయి. వార్మప్ మ్యాచే కదా అని తేలిగ్గా తీసుకున్న భారత్.. ప్రతిష్టాత్మక వరల్డ్కప్ జర్నీని ఓటమితో ప్రారంభించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత బౌలర్లు శిఖా పాండే (3-0-9-2), పూజా వస్త్రాకర్ (3-0-16-2), రాధా యాదవ్ (3-0-22-2), గైక్వాడ్ (3-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (28), ఆష్లే గార్డనర్ (22) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో వేర్హామ్ (32 నాటౌట్), జొనాస్సెన్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 130 పరుగులు సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ (3.1-0-17-4), ఆష్లే గార్డనర్ (3-0-16-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. కిమ్ గార్త్, ఎలైస్ పెర్రీ, జెస్ జొనాస్సెన్ తలో వికెట్ తీసి టీమిండియాకు ప్యాకప్ చెప్పారు. భారత ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఇన్నింగ్స్లో హర్లీన్ డియోల్ (12), దీప్తి శర్మ (19 నాటౌట్), అంజలీ శ్రావణి (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భారత ఇన్నింగ్స్లో ఎక్స్ట్రా పరుగులే (18) రెండో అత్యధికం కావడం విశేషం. భారత్ తమ తదుపరి వార్మప్ మ్యాచ్లో ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్తో తలపడనుంది. -
Womens T20 World Cup: వేలంపై కాదు... పాక్తో సమరంపైనే దృష్టి
కేప్టౌన్: మహిళల టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగే సమరంపైనే తాము దృష్టి పెట్టామని, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం నిర్వహించే వేలంపై ఆలోచించడం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. దక్షిణాఫ్రికా గడ్డపై అండర్–19 అమ్మాయిల జట్టు సాధించిన వరల్డ్కప్ స్ఫూర్తితో తమ ప్రపంచకప్ వేట సాగుతుందని చెప్పింది. మెగా ఈవెంట్లో హర్మన్ సేన 12న జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్లో తలపడుతుంది. మరుసటి రోజే ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం జట్టు కెప్టెన్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్పే అన్నింటికంటే ముఖ్యమైంది. దాని తర్వాతే ఏదైనా..! ఐసీసీ మెగా ఈవెంట్పైనే మేం దృష్టి సారించాం. మిగతావి ఎప్పుడూ ఉండేవే. ఓ క్రికెటర్గా ఏది ప్రధానమో ఏది అప్రధానమో నాకు బాగా తెలుసు. దేనిపై దృష్టి సారించాలో కూడా తెలుసు. గత నెల షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్–19 మహిళల జట్టు సాధించిన వరల్డ్కప్ను మేమంతా చూశాం. జూనియర్ టీమ్ స్ఫూర్తితో మేం కూడా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అని వివరించింది. అలాగే దేశంలో జరిగే మహిళల లీగ్లతో జాతీయ జట్లకు చాలా మేలు జరుగుతుందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరుగుతున్న లీగ్లతో ఆ జట్లు ఏ స్థాయిలో ఉన్నాయో... అలాగే డబ్ల్యూపీఎల్తో మన జాతీయ జట్టు, అమ్మాయిలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని, నాణ్యమైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని భారత కెప్టెన్ తెలిపింది. వేలం ఇబ్బందికరమే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సారథులు ప్రపంచకప్ సమయంలోనే క్రికెటర్ల వేలం జరగనుండటం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. ‘కొందరు క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోతారు. మరికొందరేమో మిగిలిపోతారు. ఇంకొందరికి ఎక్కువ ధర, కొందరికి తక్కువ ధర లభిస్తుంది. ఇది క్రికెటర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అని న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ పేర్కొంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ ‘నిజంగా ఇది (వేలం) ఇబ్బందికర పరిణామమే. ప్రపంచకప్లో ఆడేందుకు వచ్చిన అమ్మాయిలను తప్పకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు జీర్ణించుకుంటారు. ఇంకొందరు జీర్జించుకోలేరు. ఇది కాస్త ఆటపై ప్రభావం చూపుతుంది’ తెలిపింది. -
W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్లోనే పాక్తో భారత్ ఢీ
Womens T20 World Cup 2023 Full Schedule: దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి షూరూ కానుంది. ఆ తొలి మ్యాచ్లో కేప్ టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్లోనే పాక్తో ఢీ ఇక భారత్ తమ తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 12న కేప్ టౌన్ వేదికగా జరగనుంది. వరల్డ్ కప్లో భారత్ షెడ్యూల్.. ఫిబ్రవరి 12న భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫిబ్రవరి 18న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్కు భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే. రిజర్వ్లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే 10 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 11 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక -పార్ల్) 11 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, రాత్రి 10.30 ( వేదిక పార్ల్) 12 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30( వేదిక కేప్టౌన్) 13 ఫిబ్రవరి- బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 13 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30( వేదిక- పార్ల్) 14 ఫిబ్రవరి- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా) 15 ఫిబ్రవరి- భారత్ వర్సెస్ వెస్టిండీస్, సాయంత్రం 6.30( వేదిక -కేప్టౌన్) 15 ఫిబ్రవరి- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 16 ఫిబ్రవరి- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 17 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, సాయంత్రం 6.30( వేదిక కేప్టౌన్) 17 ఫిబ్రవరి- వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 18 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 18 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, రాత్రి 10.30 (వేదిక-గ్కేబెర్హా) 19 ఫిబ్రవరి- న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, రాత్రి 10.30 ( వేదిక పార్ల్) 20 ఫిబ్రవరి- ఐర్లాండ్ వర్సెస్ భారత్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 21 ఫిబ్రవరి- ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్, సాయంత్రం 6.30 (వేదిక-గ్కేబెర్హా) 21 ఫిబ్రవరి- దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి 10.30 (వేదిక-కేప్ టౌన్) 23- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-1, సాయంత్రం 6.30( వేదిక -కేప్టౌన్) 24- ఫిబ్రవరి- సెమీ ఫైనల్-2, సాయంత్రం 6.30( వేదిక -కేప్టౌన్) 26- ఫిబ్రవరి- ఫైనల్, సాయంత్రం 6.30( వేదిక -కేప్టౌన్) చదవండి: 'ఉమ్రాన్కు అంత సీన్ లేదు.. పాక్లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్కప్లో టీమిండియా సంచలన ప్రదర్శనలతో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో నియామ్ హోలాండ్ (10), ర్యానా మెక్డొనాల్డ్ గే (19), అలెక్సా స్టోన్హౌస్ (11), సోఫీ స్మేల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కూడా ఆరంభంలోనే తడబడుతుంది. 3.4 ఓవర్లలోనే భారత జట్టు ఫామ్లో ఉన్న ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 27/2గా ఉంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా చరిత్ర సృష్టించేనా..?
ICC Under 19 Womens T20 World Cup 2023: సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొట్టతొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్,ఇంగ్లండ్ జట్టు తుది సమరానికి అర్హత సాధించాయి. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను, భారత్.. న్యూజిలాండ్ను సెమీస్లో మట్టికరిపించి ఫైనల్కు చేరాయి. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జనవరి 29) సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. టోర్నీలో భారత, ఇంగ్లండ్ జట్ల ప్రస్థానాన్ని గమనిస్తే.. ఇరు జట్లు పోటాపోటీగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, తుది సమరానికి అర్హత సాధించాయి. గ్రూప్ దశలో ఇరు జట్లు ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించి, సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. ఈ దశలోనూ ఇరు జట్లు గ్రూప్ టాపర్లుగా నిలిచి సెమీస్కు చేరుకున్నాయి. సెమీస్లో యువ భారత జట్టు న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఇంగ్లండ్ అతికష్టం మీద ఆసీస్ను 3 పరుగుల తేడాతో ఓడించింది. ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. టీమిండియా ఓపెనర్లు శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో 1 (శ్వేత, 6 మ్యాచ్ల్లో 146 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 292 పరుగులు), 4 (షెఫాలీ, 6 మ్యాచ్ల్లో ఒకఅర్ధసెంచరీ సాయంతో 157 పరుగులు) స్థానాల్లో నిలిచారు. బౌలింగ్లోనూ భారత లెగ్ స్పిన్నర్ పర్షవి చోప్రా అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ అమ్మాయి 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. మరో స్పిన్నర్ మన్నత్ కశ్యప్ కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఈ అమ్మాయి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టింది. -
Under-19 Womens T20 World Cup 2023: ఫైనల్ సమరానికి సిద్ధం
పొచెఫ్స్ట్రూమ్: మహిళల క్రికెట్లో ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత జట్టు ఆ ఘనతకు అడుగు దూరంలో ఉంది. సీనియర్ అమ్మాయిల జట్టు మూడు ప్రపంచకప్ (రెండు వన్డే, ఒకటి టి20) ఫైనల్లో ఆడినా... రన్నరప్గానే సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ జూనియర్ జట్టు ఫైనల్ విజయంతో వస్తే... భారత మహిళల క్రికెట్ ప్రగతి మరో దశకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం ఇంగ్లండ్తో అమీతుమీకి సిద్ధమైంది. శనివారమే పుట్టినరోజు జరుపుకున్న షఫాలీకి వున్న అంతర్జాతీయ అనుభవం, జట్టు ఈ టోర్నీలో కనబరిచిన ప్రదర్శనను బట్టి చూస్తే భారతే ఫేవరెట్గా కనిపిస్తోంది. పైగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన షఫాలీ తన నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చితే ఆమె ఖాతాలో అరుదైన రికార్డు చేరుతుంది. సెమీఫైనల్లో షఫాలీ సేన న్యూజిలాండ్పై అలవోక విజయం సాధించింది. మొదట బౌలర్లు, తర్వాత బ్యాటర్లు కివీస్ అమ్మాయిలపై ఆధిపత్యం చలాయించారు. ఫైనల్లోనూ ఇదే పట్టుదల కనబరిస్తే ప్రపంచకప్ చేతికందుతుంది. మరో వైపు సెమీస్లో హోరాహోరీ సమరంలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడంతో ఇంగ్లండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత జట్టుకు తగిన పోటీ ఇవ్వగల సత్తా ఇంగ్లండ్కు ఉంది. నేడు హాకీ ప్రపంచకప్ ఫైనల్ ► జర్మనీ X బెల్జియం ► రా.గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం ► సా.గం.5.15 నుంచి ‘ఫ్యాన్కోడ్’ యాప్లో ప్రసారం -
మహిళల టి20 వరల్డ్కప్: కివీస్పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
తిప్పేసిన స్పిన్నర్లు.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
Under 19 Womens T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో విజేతగా నిలిచిన భారత్.. సూపర్ సిక్స్లో తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, మరుసటి మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుని శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. A thumping win for India as they move up in the Super 6 table 😍 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝: https://t.co/b2qCbfrjIX pic.twitter.com/PD9U2zJ59t — ICC (@ICC) January 22, 2023 ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు పర్శవి చోప్రా (4-1-5-4), మన్నత్ కశ్యప్ (4-1-16-2), అర్చనా దేవీ (4-0-15-1) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి లంకేయులను తిప్పేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్శవి, మన్నత్, అర్చనాతో పాటు టిటాస్ సాధు (3-0-10-1) ఓ వికెట్ పడగొట్టగా.. సోనమ్ యాదవ్ (3-0-7-0), షెఫాలీ వర్మ (2-0-6-0) వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్ చేశారు. A solid bowling performance from India led by Parshavi Chopra's economical spell 🙌 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 https://t.co/b2qCbfrjIX pic.twitter.com/oRj6gKtDXz — ICC (@ICC) January 22, 2023 అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (13), రిచా ఘోష్ (4) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. -
టీమిండియాకు తొలి ఓటమి
ICC U19 Womens T20 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2023లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జనవరి 21) ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలై, సెమీస్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలగా, ఆసీస్ 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. భారత ఇన్నింగ్స్లో శ్వేత సెహ్రావత్ (21) టాప్ స్కోరర్గా నిలువగా.. హ్రిషిత బసు (14), టిటాస్ సాధు (14)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో సియన్నా జింజర్ 3 వికెట్లు పడగొట్టగా.. మిల్లీ ఇల్లింగ్వర్త్, మ్యాగీ క్లార్క్ తలో 2 వికెట్లు, కెప్టెన్ రైస్ మెక్కెన్నా, ఎల్లా హేవర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో క్లెయిర్ మూర్ (25), ఆమీ స్మిత్ (26) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో టిటాస్ సంధూ, అర్చనా దేవీ, సోనమ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, రువాండ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరుకుంటాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో రేపు (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది. కాగా, మహిళ అండర్-19 విభాగంలో టీ20 వరల్డ్కప్ జరగడం ఇదే తొలిసారి. -
హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు
హైదరాబాద్ టీనేజ్ క్రికెటర్ సొప్పదండి యషశ్రీకి అండర్–19 టి20 ప్రపంచకప్లో ఆడే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. అయితే భారత జట్టుకు ఎంపికైన హర్లీ గాలా గాయంతో టోర్నీకి దూరమైంది. దీంతో మెగా టోర్నీ సన్నాహక సిరీస్ ఆడేందుకు వెళ్లి అక్కడే ఉన్న యషశ్రీతో ఆమె స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు. యషశ్రీ ఎంపికను ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ టోర్నీలో నేడు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్తో తలపడుతుంది. చదవండి: India open 2023: సింధు ఇంటికి... సైనా ముందుకు -
టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. యూఏఈపై భారీ విజయం
ICC U19 Women T20 WC 2023: తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఖంగుతినిపించిన భారత అమ్మాయిలు.. ఇవాళ (జనవరి 16) యూఏఈతో జరిగిన మ్యాచ్లో 122 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఫలితంగా 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచారు. యూఏఈతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్ల) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (5 బంతుల్లో 11; 2 ఫోర్లు) భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా.. సోనియా మెంధియా 2 పరుగులతో నాటౌట్గా నిలిచింది. యూఏఈ బౌలర్లలో ఇందుజ నందకుమార్, మహిక గౌర్, సమైరా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు షబ్నమ్ (1/21), టిటాస్ సాధు (1/14), మన్నత్ కశ్యప్ (1/14), పర్శవి చోప్రా (1/13) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులకు మాత్రమే పరిమితమైంది. యూఏఈ ఇన్నింగ్స్లో లావణ్య కెనీ (24), తీర్థ సతీష్ (16), మహిక గౌర్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ భారత ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో (జనవరి 18) స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది. -
Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2023కు ఐర్లాండ్ అర్హత సాధించింది. జింబాబ్వే మహిళలలో హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్-1లో ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్(28), రెబెక్కా స్టోకెల్(26) పరుగులతో రాణించారు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 133 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ, జేన్ మాగైర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్సన్, ముర్రీ తలా వికెట్ సాధించారు. మరోవైపు సెమీఫైనల్-2లో థాయిలాండ్ మహిళలలపై విజయం సాధించిన బంగ్లాదేశ్ కూడా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు ఆర్హత సాధించింది. ఇక ఆదివారం అబూ దాబీ వేదికగా జరగనున్న ఫైనల్లో ఐర్లాండ్- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. కాగా ఫైనల్కు చేరిన రెండు జట్లు కూడా టీ20 ప్రపంచకప్-2023లో అడుగుపెట్టనున్నాయి. చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్ -
త్వరలోనే ‘మహిళల ఐపీఎల్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు. ‘మహిళల క్రికెట్కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు. 2022లో ఐపీఎల్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు. -
ఎటూ తేల్చలేదు
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఎటూ తేల్చలేకపోయింది. ప్రపంచకప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. టి20 ప్రపంచకప్తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్ కప్లను షెడ్యూల్ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది. కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పింది. ‘ప్రస్తుతం ఉన్న స్థితిలో క్రికెట్కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో క్రికెటర్లతో పాటు ఇందులో భాగస్వాములుగా ఉండే అనేక మందిని పరిగణలోకి తీసుకోవాలి. ఇంత కీలక అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఒకేసారి ఉంటుంది. కాబట్టి సభ్యులు, ప్రసారకర్తలు, ప్రభుత్వాలు, ఆటగాళ్లు అందరితో చర్చించిన తర్వాతే దానిని ప్రకటిస్తాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని స్పష్టం చేశారు. మరోవైపు ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ కోసం పన్నుల మినహాయింపునకు సంబంధించిన తమ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి డిసెంబర్ 2020 వరకు గడువు పొడిగించినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది. మహిళల ముక్కోణపు టోర్నీకి ఈసీబీ ప్రయత్నాలు సెప్టెంబర్లో అంతర్జాతీయ మహిళా క్రికెట్ను పునరుద్ధరించేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రయత్నిస్తోంది. మహిళల ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోన్న ఈసీబీ... ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి, క్రికెట్ దక్షిణాఫ్రికాలతో సమాలోచనలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహిళల అంతర్జాతీయ పోటీలు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ అన్నారు. -
90 లక్షలు!
దుబాయ్: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ను భారత్లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. ఐఎస్ఎల్కు పెరిగిన వీక్షకులు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్ఎల్ (2019–20) సీజన్ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా ఈ సీజన్ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్స్టార్, జియో టీవీ డిజిటల్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్సీను కోల్కతా ఓడించింది. -
హ్యాట్రిక్పై భారత్ గురి
మెల్బోర్న్: టోర్నీ మొదలైన రోజే నాలుగుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత మహిళలు... అదే జోరుతో బంగ్లాదేశ్నూ చిత్తు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్పై కన్నేసిన హర్మన్ప్రీత్ సేన అందరికంటే ముందుగా సెమీస్ చేరాలని తహతహలాడుతోంది. మహిళల టి20 ప్రపంచకప్లో గ్రూప్ ‘ఎ’లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్తో తలపడనుంది. గత రెండు మ్యాచ్ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్లోనూ, అటు బౌలింగ్లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి... టాపార్డర్ బ్యాట్స్మన్ జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారత ఇన్నింగ్స్కు బలంకాగా... బౌలింగ్లో పూనమ్ యాదవ్ తన స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్ హర్మన్ప్రీత్ నుంచే ఇంకా అవసరమైన మెరుపులు రాలేదు. బహుశా కివీస్తో నేడు జరిగే మ్యాచ్లో ఆ లోటు తీర్చుకునే అవకాశముందేమో చూడాలి. జ్వరంతో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్కు దూరమైన డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టులోకి రావడం భారత బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసింది. మిడిలార్డర్లో దీప్తి శర్మతో పాటు వేద కృష్ణమూర్తి మెరుపులు మెరిపించగలరు. స్పిన్నర్ పూనమ్తో పాటు పేసర్ శిఖా పాండే వెటరన్ స్టార్ జులన్ గోస్వామి లేని లోటును సమర్థంగా భర్తీ చేస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో భారత విజయానికి బౌలింగ్ దళం ఎంతగానో దోహదపడింది. ఇక కివీస్ విషయానికొస్తే... భారత్పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. గత మూడు ముఖాముఖి పోటీల్లో న్యూజిలాండే గెలిచింది. కెప్టెన్, ఆల్రౌండర్ సోఫీ డివైన్, సుజీ బేట్స్... బౌలింగ్లో లియా తహుహు, అమెలియా కెర్ జట్టుకు ప్రధాన బలం కాగా... ఫామ్లో ఉన్న భారత్ను కివీస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. -
మరో విజయమే లక్ష్యంగా...
ప్రపంచ కప్ వేటలో భారత మహిళల జట్టు మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన భారత్... నేడు బంగ్లాదేశ్తో తలపడనుంది. రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే మనదే పైచేయిగా కనిపిస్తున్నా... ఆదమరిస్తే మాత్రం 2018 ఆసియా కప్ ఫైనల్ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. బౌలింగ్లో భారత్ బలంగా కనిపిస్తున్నా బ్యాటింగ్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫామ్ కలవరపెడుతోంది. వీటిని అధిగమించి నేటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే తర్వాత జరిగే కీలకమైన మ్యాచ్లో న్యూజిలాండ్ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. పెర్త్: పూనమ్ యాదవ్ మ్యాజిక్ స్పెల్తో టి20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు ఆసియా కప్ చాంపియన్ బంగ్లాదేశ్ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనున్న హర్మన్ సేన నాకౌట్కు మరింత చేరువ అవ్వడంతోపాటు గత ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన మూడు వికెట్ల పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సల్మా ఖాతూన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ ఫార్మాట్లో భారత్పై ఆడిన చివరి రెండు మ్యాచ్ల్లోనూ బంగ్లాదేశ్ గెలవడం వారికి కలిసొచ్చే అంశం. నేడు జరిగే మరో మ్యాచ్లో శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతుంది. హర్మన్పైనే దృష్టి... స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నా... గత కొంతకాలంగా స్మృతి మాత్రమే నిలకడ చూపుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో షఫాలీ 15 బంతుల్లో 29 పరుగులు సాధించినా... తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్ కెరీర్ ఆరంభంలో ఆడినంత దూకుడును ప్రస్తుతం ప్రదర్శించలేకపోతుంది. ముఖ్యంగా ఫినిషర్గా పేరున్న హర్మన్ప్రీత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తన చివరి ఐదు ఇన్నింగ్స్లలో 75 స్ట్రయిక్ రేట్తో 78 పరుగులు మాత్రమే చేసింది. దాంతో భారత్కు మంచి ఆరంభం లభిస్తున్నా... డెత్ ఓవర్లలో ధనాధన్ ఫినిష్ లభించడంలేదు. దీప్తి శర్మ నిలకడ ప్రదర్శిస్తున్నా వికెట్ల మధ్య పరుగెత్తడంలో మరింత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే బౌన్సీ వికెట్గా పిలువబడే ‘వాకా’ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో పేసర్ శిఖా పాండే మరోసారి కీలకం కానుంది. ఈమెతో పాటు పూనమ్ యాదవ్ మరోసారి చెలరేగితే భారత్కు విజయం అంత కష్టమేమీ కాదు. మరోవైపు సల్మా ఖాతూన్, ఫర్జానా హక్, జహనర ఆలమ్లతో కూడిన బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయలేం. భారత్పై గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే ఉద్దేశంతో బంగ్లా బరిలో దిగనుంది. ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 11 టి20లు జరిగాయి. భారత్ తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది. రెండింటిలో బంగ్లాదేశ్ నెగ్గింది. -
నారీ... ధనాధన్ భేరి
మహిళల క్రికెట్కు మళ్లీ ప్రపంచ కప్ కళ వచ్చింది. ఏడాది పాటు ఎన్ని టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లు జరిగినా ఆకర్షణలో విశ్వ సమరం తర్వాతే ఏదైనా! పొట్టి ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆస్ట్రేలియా నుంచి ఆటలో తప్పటడగులు వేస్తున్న థాయ్లాండ్ వరకు 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టి20 ప్రపంచ కప్లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల బ్యాట్ల నుంచి గర్జనలు ఖాయం. టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. ఒకసారి వెస్టిండీస్ మహిళలు గెలుపు కిరీటం దక్కించుకోగా, మొదటి టోర్నీలో చాంపియన్ అయిన ఇంగ్లండ్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మన భారత్ మాత్రం మూడుసార్లు సెమీఫైనల్ దశలోనే ఆగిపోయింది. ప్రతీసారి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా టైటిల్ మాత్రం న్యూజిలాండ్కు అందని ద్రాక్షే అయింది. ఈసారి కూడా సొంత గడ్డపై లేడీ కంగారూలు ఫేవరెట్లు అనడంలో సందేహం లేదు. పురుషుల క్రికెట్కు ఏమాత్రం తగ్గని రీతిలో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న జరిగే ఫైనల్లో తుది విజేత ఎవరో వేచి చూడాలి. 2009: తొలి టి20 ప్రపంచ కప్ జరిగిన ఏడాది. పురుషులతో పాటు వరుసగా నాలుగు టోర్నీలు జరిగాయి. 2018లో మాత్రం పురుషుల వరల్డ్ కప్ జరగకపోగా, మహిళల ఈవెంట్ను విడిగా నిర్వహించారు. ఈసారి ఇదే ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలోనే పురుషుల ప్రపంచ కప్ ఉన్నా... మహిళల టోర్నీ ప్రత్యేకత నిలబెట్టేందుకు, ప్రేక్షకుల, ప్రసారకర్తల దృష్టి మళ్లకుండా ఉండేందుకు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐసీసీ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసింది. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ ఆశలు! విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్ కప్లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్ డబ్ల్యూవీ రామన్ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఫామ్ ప్రకారం చూస్తే 2019 నుంచి భారత్ 10 టి20లు మ్యాచ్లు గెలిచి మరో 10 ఓడింది. ఇది కాస్త నిలకడలేమిని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఇది కనిపించింది. 2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్వుమన్గా నిలిచింది. 42 ఇన్నింగ్స్లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్ రేట్ కూడా దాదాపు 130 ఉంది. బిగ్బాష్ లీగ్లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్ హర్మన్ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్కు బ్యాటింగ్లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్లో ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్ బౌలింగ్లో శిఖా పాండే ఓవరాల్ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్ బలగంపై కూడా భారత్ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు. అంచనా... జట్టు కూర్పు, ఫామ్, కీలక ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే కనీసం ఫైనల్ చేరాల్సిందే. అంతకంటే తక్కువ ఫలితాన్ని సాధిస్తే అది ఏ రకమైన ఘనతా అనిపించుకోదు. ఇంతకంటే మెరుగైన అవకాశం కూడా మళ్లీ రాకపోవచ్చు. ఇక తుది పోరులో కూడా గెలవగలిగితే చరిత్ర సృష్టించినట్లే. జట్టు వివరాలు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా, పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డి. ఎవరికెంత ప్రైజ్మనీ... విజేత: 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) రన్నరప్: 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 59 లక్షలు) సెమీఫైనల్స్లో ఓడిన రెండు జట్లకు: 2 లక్షల 10 వేల డాలర్ల చొప్పున (రూ. కోటీ 50 లక్షలు) గ్రూప్ మ్యాచ్లో ఒక్కో విజయానికి: 15 వేల డాలర్ల చొప్పున (రూ. 10 లక్షల 77 వేలు) గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆరు జట్లకు: 30 వేల డాలర్ల చొప్పున (రూ. 21 లక్షల 54 వేలు) ►టోర్నీలో భారత్ మూడు సార్లు 2009, 2010, 2018లలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. ►వరుసగా ఏడో వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న అమ్మాయిలు 9 జట్లలో కలిపి 14 మంది ఉన్నారు. థాయ్లాండ్కు మాత్రం ఇదే తొలి వరల్డ్ కప్. ►ఫైనల్ జరిగే మెల్బోర్న్ ఎంసీజీ మైదానం సామర్థ్యం. తుది పోరుకు స్టేడియం నిండితే ఒక అంతర్జాతీయ మహిళల మ్యాచ్కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదవుతుంది. అమెరికాలోని రోజ్బౌల్లో జరిగిన 1999 మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్కు 90, 185 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టీవీ అంపైర్ ‘నోబాల్స్’ను పర్యవేక్షించనున్న తొలి ఐసీసీ టోర్నీ ఇదే గత విజేతలు 2009: ఇంగ్లండ్ 2010, 2012, 2014, 2018: ఆస్ట్రేలియా 2016: వెస్టిండీస్ -
మా బలం... సానుకూల దృక్పథం
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్లో ఎంతటి జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టే సత్తా భారత్కు ఉందని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. సానుకూల దృక్పథమే తమ జట్టు బలమని, నాలుగుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు జట్టు సిద్ధంగా ఉందని చెప్పింది. శుక్రవారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో భారత్... ఆతిథ్య ఆసీస్తో తలపడనుంది. ‘మా మైండ్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నంతవరకు ఏ జట్టు ఎదురైనా బెంగలేదు. ఎంతటి మేటి జట్టునైనా కంగుతినిపించగలం. స్లో వికెట్ స్టేడియాలు మాకు బాగా అనుకూలిస్తాయి. సిడ్నీ షోగ్రౌండ్ కూడా స్లో ట్రాకే. ఇది మాకు బాగా సరిపోతుంది’ అని హర్మన్ తెలిపింది. భారతీయులంతా క్రికెట్ అభిమానులే కావడంతో ఉత్సాహపరిచే ప్రేక్షకుల మధ్య తప్పకుండా శుభారంభం చేస్తామని చెప్పింది. తొలి మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది. మహిళల బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్మన్కు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది జట్టుకు ఉపయోగపడుతుంది. -
హర్మన్ప్రీత్ నాయకత్వంలోనే...
ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు స్టార్ క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన భారత జట్టులో బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్కు తొలిసారి స్థానం లభించింది. హైదరాబాద్కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. విండీస్ ఆతిథ్యమిచి్చన 2018 టి20 ప్రపంచకప్లోనూ అరుంధతి రెడ్డి భారత్కు ప్రాతినిధ్యం వహించింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ తొలి వరల్డ్ కప్ ఆడనుంది. ఇటీవల జరిగిన చాలెంజర్ టోర్నీలో రిచా ఘోష్ బ్యాటింగ్తో ఆకట్టుకోవడంతో సెలక్టర్లు ఆమెను తొలిసారి జాతీయ జట్టులో ఎంపిక చేశారు. ప్రపంచకప్కు ముందు ఆ్రస్టేలియాలోనే జరిగే మూడు దేశాల టోర్నీలో పాల్గొనే జట్టులో 16వ సభ్యురాలిగా నుజత్ పరీ్వన్ను చేర్చారు. టి20 ప్రపంచకప్కు భారత మహిళల టి20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన (వైస్ కెపె్టన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి. -
ప్రపంచ కప్ జట్టు కోసం...
గువాహటి: సరిగ్గా సంవత్సరం తర్వాత మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనుంది. అయితే ఆలోగా భారత జట్టు ఆడబోయే పరిమిత టి20 మ్యాచ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి పెట్టాల్సిన స్థితి నెలకొంది. కాబట్టి వచ్చే ఏడాదిలోగా ప్రతీ టి20 టోర్నీ భారత్కు సన్నాహకంలాంటిదే. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు టి20 మ్యాచ్ల సిరీస్కు భారత్ సన్నద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య మ్యాచ్కు ఇక్కడి బర్సపర స్టేడియం వేదిక కానుంది. దీనికి ముందు ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను 2–1తో గెలుచుకున్న భారత్ ఉత్సాహంగా కనిపిస్తోంది. అయితే టి20 ఫార్మాట్లో మన జట్టు అంత బలమైనదేమీ కాదు. ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై 0–3తో భారత్ చిత్తయింది. ఈ నేపథ్యంలో మన జట్టు బలాన్ని పరీక్షించుకునేందుకు ఇది సరైన సిరీస్ కానుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయం కారణంగా దూరం కావడంతో స్మృతి మంధాన తొలిసారి కెప్టెన్గా వ్యవహరించబోతోంది. ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉన్న స్మృతి నాయకురాలిగా కూడా తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ సిరీస్ తర్వాత తన టి20 కెరీర్ భవిష్యత్తును నిర్ణయించుకోనున్న వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడం కూడా జట్టుకు ఎంతో అవసరం. న్యూజిలాండ్తో తొలి రెండు మ్యాచ్లు ఆడని మిథాలీ చివరి మ్యాచ్లో బరిలోకి దిగినా జట్టును గెలిపించలేకపోయింది. టి20 ప్రపంచకప్లో విఫలమైన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన వేద కృష్ణమూర్తి పునరాగమనం చేస్తోంది. ఆమె ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఐదుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్న జట్టులో పేసర్గా శిఖా పాండే ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. కొత్త ప్లేయర్లలో హర్లీన్ డియోల్, భారతి ఫుల్మాలి, కోమల్ తమ ప్రతిభను ప్రదర్శించాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ హీతెర్ నైట్, బీమంట్, బ్రంట్, ష్రబ్సోల్, వ్యాట్లకు పొట్టి ఫార్మాట్లో మంచి అనుభవం ఉంది. వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఆ జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. -
హర్మన్ప్రీత్ కౌర్ @ 3
దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టి20 ఫార్మాట్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకులో నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన తాజా జాబితాలో ఆమె (633 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకుంది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (607 పాయింట్లు) ఏకంగా 9 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంకు అందుకోగా, ఓపెనర్ స్మృతి మంధాన (567 పాయింట్లు) ఏడు స్థానాలు అధిగమించి 10వ స్థానానికి చేరుకుంది. వెటరన్ మిథాలీరాజ్ 9వ ర్యాంకులో ఉంది. జట్ల విభాగంలో ఆస్ట్రేలియా (283 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. సిడ్నీ థండర్స్తోనే హర్మన్ప్రీత్ మహిళల బిగ్బాష్ టీ20 లీగ్ (బీబీఎల్)లో హర్మన్ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. ఈ లీగ్ రెండో సీజన్లో హర్మన్ 12 ఇన్నింగ్స్లాడి 59.20 సగటుతో 296 పరుగులు చేసింది. 117 స్ట్రయిక్ రేట్ నమోదు చేసింది. భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హోబర్ట్ హరికేన్స్తో జతకట్టింది. గతంలో ఈ ఓపెనింగ్ బ్యాట్స్మన్ బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడింది. ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య నాలుగో సీజన్ మహిళల బీబీఎల్ డిసెంబర్ 1 నుంచి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
ఆ ఇద్దరూ నన్ను అవమానించారు: మిథాలీ
ముంబై : మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆరోపించారు. తమ అధికారం అడ్డం పెట్టుకొని తనను తొక్కేయడానికి ప్రయత్నించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హర్మన్సేన దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మిథాలీని బెంచ్కు పరిమితం చేస్తూ.. జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్ నెగ్గడానికి బంగారం లాంటి అవకాశం ఉన్న తరుణంలో కోచ్తో పాటు జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న వివాదస్పద నిర్ణయం తనను నిరాశ పర్చిందని మిథాలీ పేర్కొంది. ‘నాకు వ్యతిరేకంగా డయానా తన అధికారాన్ని ఉపయోగించింది. నా 20 ఏళ్ల క్రికెట్ కెరీర్లో తొలి సారి నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురయ్యాను. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలనుకున్న కొందరు నా దేశానికి నేను చేసిన సేవలకు విలువనిస్తున్నారా అని ఆలోచించాల్సి వచ్చింది. నేను క్రికెట్ ఆడకుండా కొంతమంది కుట్రపన్నారు. నేను ఈ విషయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది. దేశం కోసం ప్రపంచకప్ గెలవాలనుకున్నా. కానీ మేం ఓ బంగారంలాంటి అవకాశం కోల్పోయాం. నాకు డయానా ఎడుల్జీ అంటే చాలా గౌరవం. ఆమె నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను కలలో కూడా ఉహించలేదు. నన్ను రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడాన్ని ఆమె మీడియాలో సమర్థించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కోచ్ పవార్ అయితే నెట్స్లో ఇతరులు బ్యాటింగ్ చేస్తుంటే అక్కడే నిలబడి చూసేవారు. నేను బ్యాట్ పట్టుకోగానే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఆయనతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ముఖం చాటేసేవాడు. అది నాకు చాలా అవమానకరంగా ఉండేది. అయినా నేనెప్పుడు నా ప్రశాంతతను కోల్పోలేదు.’ అని మిథాలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సోమవారం బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, మేనేజర్ తృప్తి భట్టాచార్యలు వేర్వేరుగా సమావేశమై ఈ వివాదంపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
మిథాలీ వీడ్కోలు పలకనుందా?
ముంబై : మహిళా క్రికెట్లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్లో ఈ హైదరాబాదీ స్టార్ బ్యాటర్కు తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు భగ్గుమన్నారు. అయితే ఈ అవమానాన్ని మిథాలీ తట్టుకోలేకపోతుందని, టీ20 క్రికెట్కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి మిథాలీ ఈ ప్రపంచకప్ టోర్నీలో అద్భుతంగా రాణించింది. రెండు మ్యాచ్ల్లో అర్థశతకాలతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్కు గాయం కారణంగా ఆమెకు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లోను ఆమెను ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్లో భారత మహిళలు మిథాలీని పక్కన పెట్టినందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక సెమీస్ మ్యాచ్లో చోటు దక్కకపోవడంతో మిథాలీ చాలా బాధపడిందని ఆమె వ్యక్తి గత కోచ్ మీడియాకు తెలిపారు. సెమీఫైనల్ రోజు ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఆమె ఆడటం లేదని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే మిథాలీ నోట వీడ్కోలు మాట రాలేదు కానీ.. ఈ టోర్నీ ముందు ఆమె ఇదే తన చివరి టీ20 వరల్డ్కప్ అని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచకప్ విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న ఆమెకు ఘోర అవమానం జరగడంతో తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో 51.17 సగటులో అత్యధికంగా 6550 పరుగుల చేసింది. గత 20 ఏళ్లుగా భారత మహిళా క్రికెట్లో రాణిస్తున్న ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎందరో క్రికెట్ వైపు అడుగులేస్తున్నారు. అలాంటి మిథాలీకి ఈ తరహా అవమానం జరగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. -
నేడు మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్
తొలి ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ ఒక వైపు... ఆ తర్వాత వరుసగా మూడు సార్లు టైటిల్ గెలుచుకొని గత టోర్నీలో రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియా మరో వైపు... మహిళల టి20 ప్రపంచ కప్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థిపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుందా లేక గతంలో రెండు సార్లు ఫైనల్లోనే తమను ఓడించిన కంగారూలపై ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 టి20లు జరిగాయి. వీటిలో ఇంగ్లండ్ 17, ఆస్ట్రేలియా 13 గెలవగా, ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
అది సమష్టి నిర్ణయమట!
ముంబై: మహిళల టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో సెమీఫైనల్ మ్యాచ్కు సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ను తీసుకోకపోవడాన్ని సెలెక్టర్ సుధా షా సహా జట్టు మేనేజ్మెంట్ సమష్టి నిర్ణయంగా మేనేజర్ తృప్తి భట్టాచార్య తన నివేదికలో పేర్కొంది. ఆస్ట్రేలియా–వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో పిచ్ స్పందించిన తీరు చూశాక... అదనపు బౌలర్ ఉంటేనే ప్రయోజనమని వారు భావించారని వివరించింది. ఈ నివేదిక ప్రకారం అసలేం జరిగిందంటే... భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ముగిశాక, ఇంగ్లండ్తో మ్యాచ్కు జట్టు ఎంపికకు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కోచ్ రమేష్ పొవార్, సెలెక్టర్ సుధా షా సమావేశమయ్యారు. మొదటి సెమీఫైనల్లో పిచ్ స్పందించిన తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా లీగ్ దశలో ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టులో మార్పులు అవసరం లేదని కోచ్ అభిప్రాయపడ్డారు. హర్మన్, స్మృతి సైతం సరే అన్నారు. అదనపు బౌలర్ అవసరాన్ని సుధా షాకు వివరించారు. దీనిపై ఏమీ మాట్లాడకుండానే ఆమె అంగీకరించారు. మరోవైపు సెమీస్లో తనను ఆడించడం లేదని తెలిశాక మిథాలీ తీవ్ర నిరుత్సాహంతో పాటు చెప్పలేనంత వేదనకు గురైందని ఆమె వ్యక్తిగత కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తి వెల్లడించారు. రాత్రి మిథాలీతో తాను ఫోన్లో మాట్లాడానని... మ్యాచ్కు మానసికం గా, శారీరకంగా సంసిద్ధమైనట్లు తెలిపిందని వివరించారు. ఓపెనర్గా కాకపోయినా మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉందని చెప్పిందన్నారు. జట్టు కారణాలు ఏవైనా... భారత అభిమానిగా మిథాలీని డగౌట్లో చూడాల్సి రావడం తనను బాధకు గురిచేసిందని సహచర క్రీడాకారిణి జులన్ గోస్వామి పేర్కొంది. -
మిథాలీ చాలా బాధపడింది: వ్యక్తిగత కోచ్
నార్త్ సాండ్ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళలు చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ కీలక మ్యాచ్కు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను బెంచ్కు పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు అభిమానులు.. ఇటు క్రికెట్ విశ్లేషకులు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పవార్లపై మండిపడుతున్నారు. అనుభవజ్ఞరాలైన, మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్ను బెంచ్కు పరిమితం చేసి తగినమూల్యం చెల్లించుకున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుది జట్టులో చోటు దక్కకపోవడంపై మిథాలీ కూడా చాలా బాధపడిందని ఆమె వ్యక్తిగత కోచ్ పీఎస్ఆర్ మూర్తి తెలిపారు. ఓ స్పోర్ట్స్ చానెల్తో మాట్లాడుతూ.. ‘మోకాలి గాయంతో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు దూరమైన మిథాలీ.. సెమీఫైనల్కు శారీరకంగా, మానసికంగా సిద్దమైంది. కానీ ఆమెకు జట్టులో చోటు లేదన్న విషయం కూడా మ్యాచ్కు కొద్ది గంటల ముందు వార్మప్ సెషన్ అనంతరమే తెలిసింది. దీంతో ఆమె చాలా బాధపడింది. మ్యాచ్ ముందు రోజు రాత్రి ఆమెను మానసికంగా సిద్దం చేశా. మిడిలార్డర్లో ఆడించే అవకాశం ఉన్నట్లు హింట్ రావడంతో.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు ఆస్వాదించమని చెప్పాను. కానీ కోచ్, కెప్టెన్లు ఆమెను తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. మ్యాచ్ అనంతరం జట్టు కూర్పుపై పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడటం బాధేసింది. ఆట కోసం ఎంతో చేసిన ఓ ప్లేయర్ పట్ల ఇలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదు. మిథాలీ ఈ టోర్నీలోని రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అలాంటి ఆమె అనుభవం సెమీస్ మ్యాచ్లో తప్పక ఉపయోగపడేది.’ అని అభిప్రాయపడ్డారు. ఇక మిథాలీ మేనేజర్ సైతం హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా అనర్హురాలని, మాటలు మార్చడం, అబద్దాలు చెప్పడం ఆమెకు అలవాటని మండిపడుతూ ట్వీట్ చేసింది. ఇక ఈ వ్యవహారంతో బీసీసీఐ మహిళల క్రికెట్లో రాజకీయాలు వెలుగు చూశాయి. మిథాలీ, హర్మన్ల మధ్య గొడవలున్నాయని స్పష్టం అవుతోంది. -
ఆసీస్ ప్రతీకారం
నార్త్సౌండ్: అదరగొట్టే ఆటతో ఆస్ట్రేలియా మహిళల జట్టు టి20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి సెమీ ఫైనల్లో... డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ను ఆ జట్టు 71 పరుగుల తేడాతో సునాయాసంగా ఓడించింది. తద్వారా రెండేళ్ల క్రితం ప్రపంచ కప్ ఫైనల్లో కరీబియన్ల చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. లీగ్ దశను అజేయంగా ముగించి, సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్గా అంచనాలున్న విండీస్... కీలక సమయంలో చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగగా, కెప్టెన్ మెగాన్ లానింగ్ (39 బంతుల్లో 31; 2 ఫోర్లు) అండగా నిలిచింది. చివర్లో రాచెల్ హేన్స్ (15 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేసింది. ఛేదనలో ఎలైస్ పెర్రీ (2/2), కిమ్మిన్స్ (2/17), గార్డ్నర్ (2/15) ధాటికి వెస్టిండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (28 బంతుల్లో 16; 1 ఫోర్) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 17.3 ఓవర్లలో 71 పరుగులకే ఆలౌటైంది. ►ఆస్ట్రేలియా మహిళలు వరుసగా ఐదోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్ చేరారు. 2010, 2012, 2014లలో విజేతలుగా నిలిచిన ఆ జట్టు 2016 ఫైనల్లో విండీస్ చేతిలో ఓడింది. -
మిథాలీని పక్కనపెట్టి...
ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టును మార్చదల్చుకోలేదు. కాబట్టే మిథాలీని తీసుకోలేదు. ఏం చేసినా జట్టు కోసమే’... అత్యంత సీనియర్ బ్యాట్స్మన్ను తప్పించడంపై ఇదీ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వివరణ! ఆమె మాటల్లో ఒకింత అసహనం, కూసింత అహంకారం కూడా కనిపించాయి. ఆసీస్తో మ్యాచ్కు ముందు భారత జట్టు 2009నుంచి ఆరు టి20 ప్రపంచకప్లలో కలిపి 24 మ్యాచ్లు ఆడితే అన్నింటిలో మిథాలీ రాజ్ బరిలోకి దిగింది. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లో ఆమెకు అవకాశం ఇవ్వకుండా కెప్టెన్ చెబుతున్న కారణం ఆశ్చర్యపరిచేదే. రెండు ఇన్నింగ్స్లు ఆడితే రెండు అర్ధసెంచరీలతో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మిథాలీ విలువను గుర్తించకపోవడం విచారకరం. నిజంగా చెప్పాలంటే మిథాలీ అవసరం ఈ మ్యాచ్లో అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. నెమ్మదైన పిచ్, భారీ షాట్లకు అవకాశం లేదు, స్పిన్ను సమర్థంగా ఎదుర్కొంటూ తెలివిగా సింగిల్స్ ద్వారానే ఎక్కువగా పరుగులు రాబట్టాల్సిన స్థితి. ఈ పాత్రను మాజీ కెప్టెన్ కంటే ఎవరూ సమర్థంగా పోషించలేరు. తమ జట్టును గెలిపించడంలో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జోన్స్, స్కివర్ ఆడిన తీరు చూస్తే మిథాలీ ఉంటే బాగుండేదని కచ్చితంగా అనిపిస్తుంది. తనతో పాటు స్మృతి, జెమీమా భారీ షాట్లతో చెలరేగితే చాలు విజయం సాధ్యమని నమ్మిన హర్మన్... కాస్త నెమ్మదిగా ఆడే మిథాలీ శైలి సరిపోదని భావించినట్లుంది. భారత్ తమ నాలుగు లీగ్ మ్యాచ్లను ప్రొవిడెన్స్లో ఆడి భారీ స్కోర్లు చేసింది. దానికి పూర్తి భిన్నంగా ఉన్న పిచ్పై చేతులెత్తేసింది. ఇక్కడ ఎలా ఆడాలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా షాట్లు ఊపి ఔటైన హర్మన్, వేద, అనూజ పరాజయాన్ని ఆహ్వానించారు. ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్–4 మాత్రమే బ్యాటింగ్లో రాణించారు. ఐదో స్థానంనుంచి చివరి వరకు ఏ ఒక్కరినీ నమ్మలేని స్థితి. సెమీస్తో కలిపి ఐదు ఇన్నింగ్స్లలో 24 పరుగులు మాత్రమే చేసిన వేద కృష్ణమూర్తి ఘోరంగా విఫలమైంది. హర్మన్ ఓపెనర్గా నమ్మిన తాన్యా 3 ఇన్నింగ్స్లలో కలిపి చేసింది 22 పరుగులు. ఇలాంటి స్థితిలో ఒక ప్రధాన బ్యాట్స్మన్ను బౌలర్ కోసం త్యాగం చేయడం ఆత్మహత్యాసదృశం. అద్భుతమైన స్ట్రయిక్ రేట్ లేకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలకుండా నిలువరించగల సత్తా హైదరాబాదీకి ఉంది. ఒక దశలో 89/2తో ఉన్న జట్టు 112 పరుగులకే ఆలౌట్ కావడం చూస్తే చివరి వరుస ప్లేయర్లతో కలిసి మిథాలీ అదనపు పరుగులు జోడిస్తే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదేమో. ప్రాధాన్యత లేని గత మ్యాచ్లో మోకాలి గాయంతో ముందు జాగ్రత్తగా మిథాలీ విశ్రాంతి తీసుకుంది. ఆమె స్థానంలో వచ్చిన స్పిన్నర్ అనూజను ఈ మ్యాచ్లోనూ కొనసాగించారు. దీప్తి, రాధ, పూనమ్, హేమలత రూపంలో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉండగా ఐదో స్పిన్నర్ను తీసుకోవడంలో అర్థం లేదు. ఆమె కోసం మిథాలీని పక్కన పెట్టడంతో ఒక బ్యాట్స్మెన్ లోటు స్పష్టంగా కనిపించింది. 3.1 ఓవర్లలో 27 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన అనూజ బ్యాటింగ్లో తొలి బంతికే వెనుదిరిగింది. సెమీస్లో జెమీమాను కూడా ఆరో స్పిన్నర్గా వాడారు. టీమ్లో ఉన్న ఏకైక పేసర్ అరుంధతి రెడ్డితో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం కెప్టెన్సీ లోపాలను చూపించింది! పిచ్ను బట్టి గెలుపు కోసం పూర్తిగా స్పిన్నే జట్టు నమ్ముకుంటే ఆ పేసర్నైనా పక్కన పెట్టాల్సింది. మొత్తంగా పేలవమైన ఆటతో పాటు తప్పుడు వ్యూహాలతో హర్మన్ బృందం మంచి అవకాశం కోల్పోయింది. వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడినా సగర్వంగా తిరిగొచ్చిన టీమిండియాకు స్వయంకృతంతో దక్కిన ఈ పరాజయం మాత్రం చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు. ‘మిథాలీని తప్పించాలనే మా నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కొన్నిసార్లు వ్యూహాలు ఫలిస్తాయి. మరికొన్ని సార్లు తారుమారవుతాయి. ఏం చేసినా జట్టు కోసమే. టోర్నీలో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. కనీసం 140 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండేది. మాది ఇంకా యువ జట్టే. మానసికంగా బలంగా ఉంటూ ఒత్తిడిలో ఎలా ఆడాలో ఇక ముందు నేర్చుకుంటాం’ – హర్మన్ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ – సాక్షి, క్రీడా విభాగం -
మిథాలీనే పక్కన పెడతారా?
నార్త్ సాండ్ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలతో అభిమానులను ఊరించిన హర్మన్ సేన.. సెమీస్లో కనీస పోరాట పటిమప్రదర్శించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీమ్మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఈ కీలక మ్యాచ్కు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను పక్కనబెట్టడంపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మిథాలీని బెంచ్కు పరిమితం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చెత్త కెప్టెన్సీతోనే మ్యాచ్ చేజారిందని హర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హర్మన్ దూకుడులో కోహ్లిని మించిపోయింది పో.. మిథాలీని పక్కనబెట్టడం అత్యంత చెత్త నిర్ణయం’ అని.. కనీసం ఈ మ్యాచ్ చూసైనా సీనియర్ క్రికెటర్ల అవసరం ఏంటో గుర్తించాలని కామెంట్ చేస్తున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు : హర్మన్ మిథాలీని బెంచ్కు పరిమితం చేయడంపై మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ స్పందిస్తూ.. తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ‘ కొన్ని సార్లు మా వ్యూహం ఫలిస్తోంది. మరికొన్ని సార్లు విఫలమవుతోంది. దీనికి పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మా మహిళల ఆట పట్ల గర్వపడుతున్నాను. యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం. కొన్ని సార్లు పిచ్ వికెట్ను బట్టి ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేం విధించిన టార్గెట్ను చేధించడం కూడా అంత సులవు కాదు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మేం మ్యాచ్ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. యువజట్టుగా మేం మానసికంగా ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టిపెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం.’ అని హర్మన్ప్రీత్ అభిప్రాయపడ్డారు. This decision was my out of mind...I don't understand how u dropped a experience player in big match #harmanpreetkaur ..MENS team learn from these mistakes..MSD is key player for WC 2019... — Indian (@Tejas_ms_) November 23, 2018 No place for @M_Raj03 in playing X1 in a knockout match a much needed thing for England women A huge mistake made by@BCCIWomen 🏏 Mithali Râj is best option in all ⚟ formats I still support our Indian women team.#ENGvIND #WT20 #WWT20 #MithaliRaj #Harman #harmanpreetkaur — hafiz9665 (@hafizqasmi1) November 23, 2018 #INDvENG #harmanpreetkaur #MithaliRaj Harmanpreet is far better than kohli in terms of arrogance Dropping mithali to get a winning combination varae va WHAT A DECISION — Navin kumar (@RCNavin) November 23, 2018 శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీస్లో హర్మన్సేన ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో సెంచరీలతో చెలరేగిన భారత బ్యాట్స్వుమెన్ అసలు మ్యాచ్లో చేతులెత్తేశారు. స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లు తప్పా అందరూ నిరాశపరిచారు. దీంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్ అమీ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. -
8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం
-
టీ20 ప్రపంచకప్: హర్మన్ సేన కథ ముగిసింది!
మళ్లీ అదే తడబాటు.. అదే పొరబాటు.. అప్పుడు.. ఇప్పుడు బ్యాటింగ్ వైఫల్యమే.. భారత మహిళల చిరకాల కోరిక తీరకుండా చేసింది. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించి.. ఊరించిన హర్మన్ సేన సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో చతికిలపడింది. నాడు 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ ముందు బోల్తాపడ్డ భారత మహిళలు.. నేడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో చేతులెత్తేశారు. నార్త్ సాండ్(అంటిగ్వా) : ఇంగ్లండ్తో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్వుమెన్స్లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లవే టాప్ స్కోర్ సాధించారు. హార్డ్ హిట్టర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక ఈ మ్యాచ్కు సీనియర్ క్రికెటర్, హైదరబాద్ స్టార్ మిథాలీ రాజ్ దూరం కావడం కూడా భారత్ను దెబ్బతీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. అమీ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్.. ఆసీస్ను ఢీకొట్టనుంది. (చదవండి: మహిళా టీ20 ప్రపంచకప్: ఫైనల్లో ఆసీస్) -
మహిళా టీ20 ప్రపంచకప్: ఫైనల్లో ఆసీస్
నార్త్ సాండ్ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి ఆతిథ్య వెస్టిండీస్తో జరిగిన తొలి సెమీస్లో ఆసీస్ 71 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. అలీసా హీలీ (46), లానింగ్ (31), రాచెల్ హెనెస్ (25 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన విండీస్ మహిళలు కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేక 71 పరుగులకే చాప చుట్టేశారు. దీంతో ఆసీస్ ఘనవిజయంతో ఫైనల్లో అడుగెట్టింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. -
కాచుకో ఇంగ్లండ్!
నార్త్ సాండ్ (అంటిగ్వా): వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు భారత మహిళల జట్టుకు సరైన అవకాశం. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గతేడాది జూన్లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆ ఓటమి అనంతరం రాటుదేలిన టీమిండియా ఇంటాబయటా వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యే సెమీస్లో ఇంగ్లండ్ను చిత్తుచేసి తొలిసారి టి20 ప్రపంచకప్ ఫైనల్కు చేరాలని హర్మన్ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్ చేరగా... ఇంగ్లండ్ మాత్రం కిందామీద పడుతూ ఇక్కడి వరకు వచ్చింది. ఆ ఇద్దరే బలంగా... టోర్నీ తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో పటిష్ట న్యూజిలాండ్పై టీమిండియా గెలిచింది. ఆ తర్వాత బాదే బాధ్యతను వెటరన్ మిథాలీ రాజ్ తీసుకుంది. వరుస అర్ధసెంచరీలతో పాకిస్తాన్, ఐర్లాండ్ల పనిపట్టింది. చివరిలీగ్ మ్యాచ్లో స్మృతి మంధాన, హర్మన్ విజృంభించడంతో టోర్నీ ఫేవరెట్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇప్పటివరకు 167 పరుగులతో హర్మన్ టోర్నీలో టాప్ స్కోరర్గా నిలవగా... స్మృతి 144 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. టాపార్డర్లో యువ జెమీమా రోడ్రిగ్స్ కూడా కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంది. వీరంతా ఇదే ప్రదర్శనను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్లో దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తాన్యా భాటియా కూడా తలా ఓ చేయివేస్తే టీమిండియాకు తిరుగుండదు. నలుగురు స్పిన్నర్లతో భారత బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. స్పిన్ చతుష్టయం సత్తా చాటుతుండటంతో కోచ్ రమేశ్ పవార్ ఏకైక పేసర్ వ్యూహాన్నే అనుసరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్రత్యర్థి భరతం పడుతుండగా... ఆమెకు రాధ, దీప్తి, హేమలత చక్కటి సహకారం అందిస్తున్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఇంగ్లండ్ సెమీస్లోనైనా జోరు కనబర్చాలని చూస్తోంది. కెప్టెన్ హీథర్ నైట్, వ్యాట్, బ్యూమౌంట్, స్కీవర్, అమీ జోన్స్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. పేసర్లు స్కీవర్, ష్రబ్సోల్ మంచి ఫామ్లో ఉండటం సానుకూలాంశం. భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్కంటే ముందు గురువారం అర్ధరాత్రి గం.1.20 నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. ► ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు 13 టి20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. మూడింటిలో భారత్ గెలుపొందగా... పది మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ► శుక్రవారం ఉదయం గం. 5.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్
గ్రాస్ఐలెట్ (సెయింట్ లూసియా): మహిళల టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ నెల 23న శుక్రవారం జరిగే రెండో సెమీస్లో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఇంగ్లండ్తో తలపడనుంది. ఆదివారం అర్ధరాత్రి వెస్టిండీస్తో జరిగిన లీగ్ మ్యాచ్లో పరాజయం పాలైన ఇంగ్లండ్... గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ ‘బి’ టాపర్ భారత్ను ఆ జట్టు ఎదుర్కోనుంది. దీనికి కొద్ది గంటల ముందు జరిగే తొలి సెమీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఢీ కొంటాయి. అజేయంగా విండీస్.. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డిండ్రా డాటిన్ (2/21) ధాటికి తొలుత ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. సోఫియా డంక్లీ (35) టాప్ స్కోరర్. ఛేదనలో తడబడినప్ప టికీ, డాటిన్ (46), షిమైన్ కాంప్బెల్ (45) రాణించడంతో విండీస్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలుపొందింది. -
పప్పులో కాలేసిన పాక్ ఫ్యాన్స్!
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చేసిన ఓ ట్వీట్ విషయంలో పాకిస్తాన్ అభిమానులు పప్పులో కాలేశారు. ఆ ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకొని ఐసీసీపై మండిపడ్డారు. చివరకు ఆ ట్వీట్పై ఐసీసీ క్లారిటీ ఇవ్వడంతో తమ తప్పును గుర్తించారు. మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా ఐసీసీ.. సెమీస్కు చేరే జట్లకు సంబంధించి ట్విటర్ వేదికగా ఓ క్వశ్చన్ పోల్ నిర్వహించింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను ప్రస్తావిస్తూ.. ఏయే జట్లు తలపడాలనుకుంటున్నారని అభిమానులను ప్రశ్నించింది. అయితే ఈ పోల్లో ఐసీసీ WT20 హ్యాష్ ట్యాగ్ జత చేయడంతో పాక్ అభిమానులు పురుషుల వరల్డ్ టీ20 అని పొరపాటు పడ్డారు. ఈ పోల్లో టీ20ల్లో నెం1 జట్టు అయిన పాక్ లేకపోవడం ఏంటని మండిపడ్డారు. ‘ఐసీసీ ఓ గుడ్డిది.. చెవిటిది.. దానికి కనీసం నెం1 జట్టు ఏంటిదో కూడా తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లతో ఖంగుతిన్న ఐసీసీ.. మహిళా టీ20 ప్రపంచకప్లో పాక్ మహిళలు గ్రూప్ స్టేజ్ దాటలేదని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. Who do you think will contest the @WorldT20 Final? 🤔 #WT20 — ICC (@ICC) November 18, 2018 ICC IS BLIND AND DEAF I THINK. DOESNT KNOW THE NO 1 team — Kash (@westtrenduk) November 19, 2018 The absolute state of these mentions! 😂 Pakistan didn't get out of the #WT20 group stage guys 🙃 — ICC (@ICC) November 19, 2018 -
మహిళా టీ20 ప్రపంచకప్: భారత్ ప్రత్యర్థి ఇంగ్లండ్
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళలు సెమీస్లో ఇంగ్లండ్ను ఢీకొట్టనున్నారు. లీగ్ మ్యాచ్ల్లో వరుస విజయాలతో సత్తాచాటిన హర్మన్ సేన గ్రూప్-బి టాపర్గా సెమీస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం విండీస్.. డాటిన్ (46),క్యాంప్బెల్లె (45)ల ఇన్నింగ్స్తో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ గెలుపుతో విండీస్ సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా.. భారత్, ఇంగ్లండ్ను ఢీ కొట్టనుంది. ఇదే ఇంగ్లండ్తో 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళలు ఒత్తిడిని అధిగమించలేక తృటిలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి సెమీస్లో ఇంగ్లండ్ను ఢీకొట్టబోతున్న హర్మన్ సేన అలాంటి తప్పిదాలు పునరావృతం చేయవద్దని భావిస్తోంది. ఇక భారత మహిళల్లో హర్మన్, మంధాన, మిథాలీ రాజ్లు బ్యాట్తో రాణిస్తుండగా.. స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తిశర్మలు బౌలింగ్లో రాణిస్తున్నారు. ఈ సారి ఎలాగైన టైటిల్ నెగ్గాలనే కసితో భారత మహిళలు బరిలోకి దిగుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సెమీస్ పోరు జరుగనుంది. -
అరంగేట్రంలోనే అదరగొట్టే క్యాచ్ !
ప్రొవిడెన్స్ (గయానా) : అరంగేట్ర మ్యాచ్లోనే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అద్భుత క్యాచ్తో అదరగొట్టింది. మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా శనివారం భారత మహిళలతో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన టేలో వ్రియోమెంక్.. అదిరిపోయే క్యాచ్తో ఔరా అనిపించింది. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఆసీస్ స్పిన్నర్ ఆశ్లీగ్ గార్డనర్ వేసిన బంతిని వేదా కృష్ణమూర్తి బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే ఇది గ్యాప్ షాట్గా భావించిన అందరూ ఖచ్చితంగా ఫోర్ అనుకున్నారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న టేలో వ్రియోమెంక్ చిరుత పులిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకుంది. ఈ అద్భుత ఫీట్తో మైదానంలోని ఆటగాళ్లు.. అభిమానులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. వేదాకృష్ణ మూర్తి (3) అయితే తను ఔటయ్యానా? లేదా? అనే సందిగ్ధంలో మైదానం వీడింది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోను ఐసీసీ ‘ ఇది టీ20ల్లో అరంగేట్రం చేసిన టేలో వ్రియోమెంక్ సంబంధించిన ప్రత్యేకత.. ఇదో అద్భుత క్యాచ్’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్లు)లు చెలరేగడంతో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్బీ టాప్లో నిలిచిన హర్మన్ సేన.. గురువారం సెమీస్లో వెస్టిండీస్ లేక ఇంగ్లండ్తో తలపడనుంది. This was just a little bit special from @TaylaVlaeminck on her T20I debut - an absolute stunner of a catch! 🙌#WT20 #WatchThis pic.twitter.com/iFe6oV4Dxe — ICC (@ICC) November 18, 2018 -
ఆ జాబితాలో మిథాలి తర్వాత మంధాననే
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్లో మహిళా క్రికెటర్లు అదరగొడుతున్నారు. వరుసగా నాలుగో విజయం సాధించి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, సీనియర్ మిథాలీ రాజ్లు అద్భుత ఇన్నింగ్స్లతో విజయాలందించగా.. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టచ్లోకి వచ్చింది. తొలి మూడు మ్యాచ్ల్లో 2, 26, 33లతో నిరాశ పర్చిన మంధాన ఆసీస్తో 55 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 83 పరుగులతో విజృంభించింది. ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో భారత్ పటిష్టమైన ఆసీస్పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మంధాన ఈ మ్యాచ్లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. భారత మహిళా టీ20 క్రికెటర్లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో క్రికెటర్గా రికార్డు సృష్టించింది. 49 ఇన్నింగ్స్ల్లో మంధాన ఈ ఫీట్ సాధించగా.. మిథాలీ రాజ్ 44 ఇన్నింగ్స్ల్లో 2014ల్లోనే ఈ రికార్డు నమోదు చేసింది. ఇక భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ (2283), హర్మన్ ప్రీత్ (1870) తర్వాత మంధానానే వెయ్యి పరుగులు పూర్తిచేసింది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్లో మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. ఇదే టోర్నీలో న్యూజిలాండ్పై 33 బంతుల్లో హర్మన్ప్రీత్ సాధించిన ఈ ఫీట్ను అధిగమించింది. -
అర్థం చేసుకున్నందుకు సంతోషం : మిథాలీ
ప్రావిడెన్స్ : క్రికెట్లోని పరిస్థితులను అర్థం చేసుకున్నందుకు సంతోషకరమని టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ట్వీట్ చేసింది. గురువారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ హైదరాబాదీ గర్ల్ హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అ6యితే టీ20 ఫార్మాట్కు ఆమె పనికి రాదని, చాలా నెమ్మదిగా ఆడే మిథాలీని టీ20ల నుంచి పక్కకు పెట్టాలని కామెంట్ చేసిన అభిమానులే.. తాజా మ్యాచ్లో ఆమె ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘క్రికెట్లో స్లో వికెట్, కఠిన పరిస్థితులను అభిమానులు అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్లో కూడా మంచి పరిస్థితులుంటాయని అనుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. You are a LEGEND... Many Congratulations 👏👏👏👏 pic.twitter.com/4oAXBttY4Q — Harsh Vardhan Bolia (@bolia_harsh) November 16, 2018 బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించని పిచ్పై మిథాలీ నిలకడగా ఆడుతూ 4 ఫోర్ల సాయంతో 56 బంతుల్లో 51 పరుగులు చేసింది. ఈ కీలక ఇన్నింగ్స్కు తోడు స్పిన్నర్లు రాణించడంతో భారత్, ఐర్లాండ్పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. గప్టిల్ను అధిగమించిన మిథాలీ... మిథాలీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటికే రోహిత్ను అధిగమించి భారత తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత క్రికెటర్గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శనతో.. పురుషుల జట్టులో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గఫ్తిల్(2271)ను అధిగమించింది. 85 టీ20 మ్యాచ్ల్లో ఈ హైదరాబాదీ బ్యాట్స్వుమెన్ 37.43 సగటుతో 2,283 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 4వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ బేట్స్ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ప్లేయర్ టేలర్ (2691), ఇంగ్లండ్ క్రికెటర్ ఎడ్వర్డ్స్(2605), మిథాలీ కన్నా ముందున్నారు. -
భారత మహిళల జట్టు హ్యాట్రిక్ విజయం
-
ఇది సరిపోదు: హర్మన్ ప్రీత్
ప్రావిడెన్స్ : సెమీస్కెళ్లడం సంతోషంగా ఉందని, కానీ టైటిల్ నెగ్గాలంటే ఇంకా మెరుగవ్వాలని భారత మహిళా సారథి హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం ఐర్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్లో హర్మన్సేన 52 పరుగులతో గెలిచి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘ సెమీస్కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. కానీ మేం చాలా మెరుగవ్వాలి. ఈ పొట్టి క్రికెట్లో ఒక్కోసారి ప్రధాన బౌలర్లు విఫలమైనప్పుడు.. ఇతరులు ఆ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నేను జెమ్మీ (జెమీమా రోడ్రిగ్స్) బౌలింగ్ చేశాం. మేం టైటిల్ నెగ్గాలంటే మా ఫీల్డింగ్ ఇంకా చురుకుగా ఉండాలి. ఈ రోజు మా ప్రణాళికబద్దంగా మా బ్యాటింగ్, బౌలింగ్ కొనసాగలేదు. వీటిని మెరుగుపరుచుకొని బరిలోకి దిగుతాం’ అని పేర్కొంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిథాలీ రాజ్ (56 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు స్మృతి మంధాన (29 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. కింబర్లీ గార్త్ (2/22) కట్టడి చేసింది. ఛేదనలో రాధ యాదవ్ (3/25), దీప్తి శర్మ (2/15) పొదుపైన బౌలింగ్తో ఐర్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. ఇసొబెల్ జాయ్సే (33) టాప్ స్కోరర్. ఇక మిథాలీకి ఈ టోర్నీలో ఇది రెండో హాఫ్ సెంచరీకావడం విశేషం. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన మిథాలీ చదవండి: హర్మన్ హరికేన్ చూశారా? -
బ్యాట్ ఝుళిపించి.. గెలిపించిన లెస్బియన్ జంట!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్లో కని విని ఎరగని రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య గత సోమవారం జరిగిన మ్యాచ్లో ఓ లెస్బియన్ జంట అద్భుత ప్రదర్శనతో తమ జట్టును గెలిపించింది. ఇలా ఓ లెస్బియన్ జంట బ్యాట్తో రాణించడం క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్, ఆల్రౌండర్ మరిజాన్ కాప్లు ఈ ఏడాది జూలైలో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోవడం వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దీంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. తాజాగా టీ20 ప్రపంచకప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఈ లెస్బియన్ జంట మూడో వికెట్కు 67 పరుగులు జత చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్లోనే ఈ ఇద్దరు టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళలు 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సఫారి మహిళల్లో డేన్ వాన్ నికెర్క్ (33 నాటౌట్), మరిజాన్ కాప్(38)ల లెస్బియన్ జంట రాణించడంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్కు చెందిన అమీ సాటర్వైట్ను సహచరి లియా తహుహు పెళ్లాడింది. -
రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన మిథాలీ
ముంబై: భారత్ తరపున టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది. పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల కన్నా ఆమెవే అత్యధిక పరుగులు కావడం విశేషం. మహిళా టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మిథాలీ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తరపున రోహిత్ చేసిన (2,203) పరుగులను మిథాలీ అధిగమించింది. 84 టీ20 మ్యాచ్ల్లో ఈ హైదరాబాదీ బ్యాట్స్వుమెన్ 37.20 సగటుతో 2,232 పరుగులు చేసింది. ఇక టీ20ల్లో కోహ్లి 2,102 పరుగులతో రోహిత్ తరువాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: రోహిత్ను ఊరిస్తున్న టీ20 రికార్డు) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ బేట్స్ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ప్లేయర్ టేలర్ (2691), ఇంగ్లండ్ క్రికెటర్ ఎడ్వర్డ్స్(2605), ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్ లానింగ్ (2,241) మిథాలీ కన్నా ముందు స్థానంలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్, పాక్పై గెలిచి దూకుడు మీదున్న భారత మహిళా జట్టు తదుపరి మ్యాచ్ను గురువారం ఐర్లాండ్తో ఆడనుంది. పురుష క్రికెటర్లకు ఏ మాత్రం తగ్గకుండా భారత మహిళా క్రికెటర్లు బ్యాట్ ఝులిపిస్తున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీతో చెలరేగగా.. సీనియర్ బ్యాట్స్వుమెన్ మిథాలీ హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చింది. ఇక హార్డ్ హిట్టర్ మంధాన మెరిస్తె హర్మన్ సేనకు తిరుగుండదు. (చదవండి: అమ్మాయిలు అదుర్స్ ) -
ఆసీస్కు రెండో గెలుపు
ప్రొవిడెన్స్ (గయానా): మహిళల టి20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై జయభేరి మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్... కంగారూ బౌలర్లు ఎలీసా పెర్రీ (2/12), జార్జియా వారెహమ్ (0/8), సోఫీ మొలినెక్స్ (0/18) కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. కింబర్లీ గార్త్ (24) టాప్ స్కోరర్. ఛేదనలో ఓపెనర్ అలీసా హీలీ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ఆసీస్ 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసి గెలుపొందింది. -
పాక్తో మ్యాచ్ : టాస్ గెలిచిన భారత్
గయనా : విమెన్స్ టీ-20 ప్రపంచ కప్లో భాగంగా పాకిస్తాన్తో జరగునున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో అద్బుతమైన విజయంతో ఊపుమీద ఉన్న భారత్.. దాయది దేశమైన పాకిస్తాన్పై కూడా అదే దూకుడు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. పాక్ కూడా పటిష్టమైన జట్టే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో దూకుడైన ఆటతో చెలరేగిన హర్మన్ అదే ఫామ్ను కొనసాగించాలని భారత టీం భావిస్తోంది. భారత జట్టు : హర్మత్ ప్రీత్కౌర్ (కెప్టెన్), భాటియా, మంధనా, రోడ్రిగ్సి, హేమలత, వేధా కృష్ణమూర్తి, మిథాల్ రాజ్, దీప్తి శర్మ, రాధ యాదవ్, అరుంధతి రాయ్, పూనయ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు : జవారియా ఖాన్ (కెప్టెన్), నిధా ఖాన్, ఉస్మానియా సోహేల్, అయేషా జాఫర్, బీస్మాన్ మారూఫ్, నిదా డార్, అలియా రిజా, డయానా, నవాజ్, అనాయ్ అమీ కౌర్ పవర్! -
హర్మన్ హరికేన్ చూశారా?
ప్రొవిడెన్స్ (గయానా): ఏమి ఆ బ్యాటింగ్... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం తప్పక వస్తోంది. పవర్ గేమ్కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్ షాట్లతో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించింది. న్యూజిలాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో మహిళల టీ20 క్రికెట్లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. దీంతో శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో భారత్ 34 పరుగులతో గెలిచి బోణి కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత విజయం సులువైంది. హర్మన్ ఇన్నింగ్స్ను కొనియాడుతూ ఐసీసీ తన సిక్స్ర్లకు సంబంధిచి వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. భారత్ తదుపరి మ్యాచ్ను ఆదివారం పాకిస్తాన్తో తలపడనుంది. Harmanpreet Kaur got the @WorldT20 off to a RAPID start with a sensational display of hitting in Guyana. Here are her biggest and best shots, delivered by @Oppo #FlashCharge. pic.twitter.com/KOSrNbDGOJ — ICC (@ICC) November 10, 2018 -
అంతా సింగిల్ డిజిట్.. 46కే ప్యాకప్!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. విండీస్ బౌలర్ దియాంద్రా డాటిన్(5/6) దాటికి బంగ్లా బ్యాట్స్ఉమెన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లా 46 పరుగులకే కుప్పకూలడంతో విండీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్ఉమెన్లో ఫర్గానా హక్ (8) పరుగులే అత్యధికం కావడం విశేషం. చదవండి: జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్ హర్మన్ హరికేన్ -
జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్
ప్రొవిడెన్స్ (గయానా): మహిళల టీ20 ప్రపంచకప్లో హరికేన్ తుఫాన్లా విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జస్ట్ ఇది ఆరంభం మాత్రమే అంటోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: హర్మన్ హరికేన్) ఈ మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘చాలా ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. మేం ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలి. జట్టుగా కూడా మేం ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నేను క్రీజులో సెట్టైతే.. షాట్స్ ఆడగలను. జెమీమా అద్భుతంగా ఆడింది. ఎవరైనా హిట్టింగ్ చేస్తే.. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఆ బాధ్యతను జెమీమా తీసుకుంది. ఈ క్రెడిట్ అంతా ఆమెదే. జెమీమా చాలా మెచ్యూర్. ఇక బౌలింగ్ విభాగంలో మేం కొంత మెరుగవ్వాలి. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో మా బౌలింగ్ చాలా పుంజుకోవాలి.’అని అభిప్రాయపడింది. (చదవండి: కౌర్ పవర్! ) హెడ్కోచ్ రమేశ్ పవార్ పూర్తిగా తమ ఆలోచనా విధానాన్ని మార్చేసాడని, ఇది తమకెంతో ఉపయోగపడిందని, ఆయన తమ జట్టులో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ తమ జట్టుకు కీలకమని, తొలి ఆరు ఓవర్లలో ఆమె అంతగా పరుగులు చేయలేదని, ఆ తరువాత బ్యాటింగ్ చేస్తే ఆమె రాణించగలదని హర్మన్ అభిప్రాయపడింది. హర్మన్-జెమీమా నాలుగో వికెట్కు అత్యధికంగా 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ హర్మన్ బౌండరీలతో బిజీగా ఉండగా.. జెమీమా స్ట్రైక్ రోటెట్ చేసింది. ఇదే హర్మన్ ఆకట్టుకుంది. దీంతో జెమీమాను ఆకాశానికెత్తింది. (చదవండి: హర్మన్ సేన ఏం చేస్తుందో?) -
అమ్మాయిలు... అదరగొట్టేందుకు...
మహిళల క్రికెట్లో మళ్లీ పరుగుల పండగొచ్చింది... కరీబియన్ దీవుల్లో ధమాకాకు రంగం సిద్ధమైంది... పది దేశాల ప్రాతినిధ్యంతో శుక్రవారం నుంచే టి20 ప్రపంచ కప్.పదహారు రోజుల పాటు మహా సంగ్రామం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపుతుందా? పెద్దన్న ఆస్ట్రేలియా అదరగొ డుతుందా? వన్డే జగజ్జేత ఇంగ్లండ్ సంచలనం రేపుతుందా? కివీస్ ఈసారైనా కొల్లగొడుతుందా? టీమిండియా తడాఖా చూపుతుందా? ఇంతకూ ధనాధన్ ఆటలో దశ తిరిగేదెవరిది? ప్రొవిడెన్స్ (గయానా) మహిళల క్రికెట్లో వన్డే ప్రపంచ సమరం ముగిసిన 15 నెలలకే పొట్టి ఫార్మాట్లో జగజ్జేత స్థానానికి అమీతుమి. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే ఈ టోర్నీకి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరో ప్రపంచ కప్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత తమ దీవుల్లో జరుగనున్న పోరులో కరీబియన్లు డిఫెండింగ్ చాంపియన్గా అడుగిడుతుండటం విశేషం. గతంలో ఏ జట్టు సాధించని ఘనత ఇది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను 2016లో సంచలనాత్మక రీతిలో ఓడించి తొలిసారిగా ఒడిసిపట్టిన ట్రోఫీని సొంతగడ్డపై నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ విజేత’ హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మిగిలినవాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రమాదకరమైనవి. ఆ ఐదారే... పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్లను మాత్రమే సెమీఫైనల్ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు.దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రభావ వంతంగా లేదు. పాకిస్తాన్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్లను ద్వితీయ శ్రేణి వాటిగానే పరిగణిస్తున్నారు. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్ స్థానానికి వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే, ధనాధన్ ఆటలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి... ఏ జట్టునూ కచ్చితమైన ఫేవరెట్గా చెప్పలేని పరిస్థితి. గ్రూప్ నుంచి రెండేసి జట్లు... జట్లను ‘ఎ’, ‘బి’ గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ లెక్కన లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. విజేతకు 2 పాయింట్లు, మ్యాచ్ టై, లేదా రద్దయితే ఒక పాయింట్ ఇస్తారు. పట్టికలో 1, 2లో స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
టి20 ప్రపంచకప్కు అరుంధతి రెడ్డి
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్కు చెందిన మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్లో అరంగేట్రం చేసి మెరుగ్గా రాణించడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. వెస్టిండీస్ వేదికగా నవంబర్ 9 నుంచి 24 వరకు ఐసీసీ మహిళల టి20 వరల్డ్కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఇప్పటికే జట్టులో సీనియర్ హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ ఉండగా... ఇప్పుడు తాజాగా మరో హైదరాబాదీ అరుంధతికి తొలిసారి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. ఇదే గ్రూప్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్లో భారత్ నవంబర్ 9న న్యూజిలాండ్తో, 11న పాక్తో, 15న ఐర్లాండ్తో, 17న ఆస్ట్రేలియాతో తలపడనుంది. మ్యాచ్లు గయానా స్టేడియంలో జరుగనున్నాయి. భారత మహిళల టి20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనూజ పాటిల్, ఏక్తా బిష్త్, హేమలత, మాన్సి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి. -
భారత్ తొలి పోరు న్యూజిలాండ్తో
దుబాయ్: వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నవంబర్ 9 నుంచి 24 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు తమ తొలి పోరులో న్యూజిలాండ్తో తలపడనుంది. టోర్నీ ఆరంభరోజే ఈ మ్యాచ్ జరుగుతుంది. అదే రోజు ఆతిథ్య విండీస్... క్వాలిఫయర్–1తో, పాకిస్తాన్తో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్... 11న పాక్తో, 15న క్వాలిఫయర్–2తో, 17న ఆస్ట్రేలియాతో ఆడనుంది. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్తో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, క్వాలిఫయర్–1 జట్లు ఉన్నాయి. పది జట్లు తలపడే ఈ టోర్నీలో 8 శాశ్వత సభ్యదేశాలతో పాటు వచ్చే నెలలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా మరో రెండు జట్లకు అవకాశమిచ్చారు. తొలిసారిగా టి20 ప్రపంచకప్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని వినియోగించనున్నారు. -
‘హ్యాట్రిక్’పై ఆసీస్ గురి
మధ్యాహ్నం. గం. 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం ఇంగ్లండ్తో ఫైనల్ నేడు మహిళల టి20 ప్రపంచకప్ సాక్షి, ఢాకా: మహిళల టి20 ప్రపంచకప్లో ఇప్పటివరకూ జరిగిన మూడు టోర్నీల్లో... ఒకసారి ఇంగ్లండ్ గెలిస్తే... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. మహిళల విభాగంలో ఈ రెండు జట్లదే ఆధిపత్యం. మరోసారి కూడా ఈ రెండు జట్లే తమ సత్తాను నిరూపించుకుంటూ ఫైనల్కు చేరాయి. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా... 2009 విజేత ఇంగ్లండ్తో తలపడుతుంది. ఈసారి కూడా గెలిస్తే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. -
2016 ప్రపంచ కప్కు భారత మహిళలు క్వాలిఫై
ప్లే ఆఫ్ మ్యాచ్లో పాక్పై గెలుపు సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్లో భారత్కు ఐదోస్థానం దక్కింది. సెమీస్ చేరడంలో విఫలమైన మిథాలీ సేన బుధవారం పాకిస్థాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వచ్చే టి20 ప్రపంచకప్కు భారత్ నేరుగా అర్హత సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (43 బంతుల్లో 39; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, స్మృతి మందన (22 బంతుల్లో 22; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మహిళలు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేయగలిగారు. నాహిదా ఖాన్ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు), నిదా దార్ (13 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడినా తమ జట్టును గెలిపించలేకపోయారు. సోనియా దబీర్ (3/14) మూడు వికెట్లతో పాక్ టాప్ ఆర్డర్ను కూల్చగా, పూనమ్ యాదవ్ (2/25), స్రవంతి నాయుడు (2/12)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి న్యూజిలాండ్ కూడా 2016 ప్రపంచకప్కు క్వాలిఫై అయింది. -
రాణించిన మిథాలీ
చివరి మ్యాచ్లో విండీస్పై భారత్ గెలుపు మహిళల టి20 ప్రపంచ కప్ సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్ను భారత జట్టు విజయంతో ముగించింది. చెత్త ఆటతో సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన భారత్.. గ్రూప్‘బి’ చివరి లీగ్లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఈ గ్రూప్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్, డాట్టిన్ అర్ధసెంచరీ (57)తో 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (52 బంతుల్లో 56; 7 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ (52 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బుధవారం జరిగే 2016 టి20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ మ్యాచ్ల్లో పాకిస్థాన్తో భారత్; శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడతాయి.