
బాబు విత్తనాలేవీ మొలకలెత్తలేదు!!
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తాను వేసిన విత్తనాలన్నీ రాజశేఖరరెడ్డి హయాం నాటికి మొలకలెత్తాయని, ఆ ఫలాల వల్లే ఆయన పాలనలో అభివృద్ధి రేటు నమోదైందని చంద్రబాబు చెప్పారన్నారు.
అయితే తొమ్మిది సంవత్సరాల పాటు చంద్రబాబు వరుసపెట్టి విత్తనాలు వేస్తూనే ఉన్నా.. ఒక్కటి కూడా మొలకెత్తలేదని, తర్వాత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి మొలకలెత్తాయని, అది ఎందుకో అందరికీ తెలుసని చురకలు వేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా తదితరులు 'చంద్రబాబు హయాం అంతా కరువే' అంటూ బల్లలు చరిచారు.