రాజధాని భూసేకరణపై నిరసనలు | dharna against land pooling at crda office at vijayawada | Sakshi
Sakshi News home page

రాజధాని భూసేకరణపై నిరసనలు

Published Fri, Aug 21 2015 11:49 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

రాజధాని భూసేకరణపై నిరసనలు

విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సాగు భూములను ఆక్రమించుకోవటం ఆపేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నాజరిగింది. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద వివిధ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఆందోళన నిర్వహించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే భూములను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందంటూ ఈ సందర్భంగా పూలు, కూరగాయలతో ప్రదర్శన జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబూరావు, వివిధ రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement