కాళ్ల పారాణి ఆరకముందే... | New bride commit suicide at Chintal | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే...

Published Thu, Nov 28 2013 6:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కాళ్ల పారాణి ఆరకముందే... - Sakshi

కాళ్ల పారాణి ఆరకముందే...

హైదరాబాద్‌: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు విగతజీవిగా మారింది. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలోని చింతల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. మెదక్‌ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన అనురాధ, లక్ష్మణ్‌గౌడ్‌ల కుమార్తె సుహాసిని... చండూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఈ నెల 15న వివాహం జరిగింది. బుధవారమే వీరిద్దరు చింతల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు.

వృత్తిరీత్యా గ్యాస్‌ టెక్నీషియన్‌ అయిన శ్రీనివాస్‌ ఈ ఉదయం గుడికి వెళ్లాడు. తిరిగివచ్చేసరికి సుహాసిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనస్థలానికి వచ్చిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుహాసిని ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే అంతుపట్టడంలేదని పోలీసుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement