చిరు,పవన్‌ల ఎంట్రీ.. అధికార పార్టీలకే నష్టం..! | yaddanapudi ayyanna pantulu says cini stars political entry | Sakshi
Sakshi News home page

చిరు,పవన్‌ల ఎంట్రీ.. అధికార పార్టీలకే నష్టం..!

Feb 20 2018 11:58 AM | Updated on Mar 22 2019 5:33 PM

yaddanapudi ayyanna pantulu says cini stars political entry - Sakshi

చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌

సాక్షి, వైజాగ్‌: సినీ నటుల రాజకీయ ప్రవేశంపై విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి , పవన్‌లు రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని అయ్యన్న పంతులు అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కాలసర్ప దోషం ఉందని ఆయన పేర్కొన్నారు.

                                             యద్ధనపూడి అయ్యన్న పంతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement