క్వారంటైన్‌లో కోడికూర ఇవ్వలేదని.. | Man Attack ASHA Workers For Not Serving Chicken In Karnataka Quarantine Centre | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌లో కోడికూర ఇవ్వలేదని..

Published Sun, May 24 2020 12:35 PM | Last Updated on Sun, May 24 2020 12:35 PM

Man Attack ASHA Workers For Not Serving Chicken In Karnataka Quarantine Centre - Sakshi

బాధితురాలు రేణుక

పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.

యశవంతపుర : పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. మహారాష్ట్ర నుంచి కలబురిగి జిల్లాకు వచ్చిన వారికి అళంద కిణ్ణి అబ్బాస్‌ గ్రామంలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేప కూరతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. ఇందుకు సమాధానంగా ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు. దీంతో కోపానికి గురైన ఆ వ్యక్తి రేణుకపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement